శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రావణమాసం పూజలు ఇలా జరుపుకుందాం

>> Tuesday, July 21, 2020

🙏జైశ్రీమహాదేవ🙏
21-07-2020. నుండి *శ్రావణమాసం* ప్రారంభం.

31-07-2020.
*శ్రీవరలక్ష్మి వ్రతమ్*

03-08-2020.
*శ్రావణ పౌర్ణమి* - (రాఖీ)

11-08-2020.
*శ్రీకృష్ణాష్టమి*

19-08-2020.
*పోలాల అమావాస్య*.

*శ్రావణ మంగళవారములు*
21-07-2020. శుద్ధ పాడ్యమి.

28-07-2020. శుద్ద అష్టమి/నవమి.

04-08-2020. బహుళ పాడ్యమి.

11-08-2020. బహుళ అష్టమి.

18-08-2020. బహుళ చతుర్దశి / అమావాస్య.

*శ్రావణ శుక్రవారములు:--*
24-07-2020. శుద్ధ చవితి.
31-07-2020. శుద్ధ ద్వాదశి.
07-08-2020. బహుళ చవితి.
14-08-2020. బహుళ దశమి/ఏకాదశి.

ముఖ్య అభ్యర్ధన:--
కరోనా వైరస్ కారణం వల్ల - ఈ సంవత్సరం దయచేసి ఎవరూ - ఎవ్వరినీ నోములకి, పేరంటానికి, ఉద్యాపనలకి, ముత్తైదువకి, ముత్తైదువ భోజనాలకి ఇలా వగైరా... వగైరా లకి ఒకరినొకరు పిలుచుకోవద్దని సర్వజన శ్రేయస్సు కోసం *శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం వైపు నుండి అభ్యర్ధించడమైనది.

ఎందుకంటే...
👉వచ్చినవారి కాళ్ళకి పసుపు రాయాలి.
👉కంఠానికి గంధం రాయాలి.
👉నుదుట బొట్టు పెట్టాలి.
👉తాంబూలం వగైరా... ఇవ్వాలి.

👉ఇవి లేకుండా శ్రావణమాసం నోములు వగైరా సాధ్యమా?

👉  *ఈ పనులు ఈ కరోనా రోజుల్లో శ్రేయస్కరమా?*

పేరంటం అయినా, ముత్తైదువ అయినా... ఇలా ఎవరైనా ఈ సంవత్సరానికి అన్నీ మీకు *అమ్మవారు* మాత్రమే.

దయచేసి - సంప్రదాయం అనే *అక్కర* తో అమాయకంగా - ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ *కరోనా వైరస్ వ్యాప్తి కి కారణం అవ్వద్దు*.

👉పుణ్యం కోసం పోయి *కరోనా* (బహుశా) తెచ్చుకోవద్దు.

🙏అన్నీ తానే అయ్యి - ముత్తైదువ గా ఈ సంవత్సరం *అమ్మవారు* స్వయంగా మిమ్మల్ని కటాక్షిస్తోంది. *దానికి సంతోషించండి*
ఇరుగు-పొరుగు, చుట్టూ-పక్క, బంధువులు అంటూ ప్రతీ సంవత్సరం మనం చేసుకుంటున్న హడావుడి వల్ల - నిజానికి *పూజ పై శ్రద్ధ* తగ్గుతోంది అనేది వాస్తవం. కాబట్టి ... ఈ సంవత్సరం అటువంటి హడావుడి-అయోమయం లేకుండా *అమ్మవారు* కరుణిస్తోంది అనే సంతోషం తో పూజలు చేసుకోండి.
*నైవేద్యాలు* మీకు వీలైనట్టే చేసుకోండి.
ఒకవేళ ఏమీ చేసుకోలేకపోయినా - పళ్ళు, కొబ్బరికాయ తో సరిపెట్టుకోండి. తప్పేమీ లేదు.

హెచ్చరిక:--
పూజా సామగ్రి ఏమి తెచ్చుకున్నా.... (పువ్వులతో సహా....) *సర్ఫ్ నీళ్లు* లో కడిగి, మళ్లీ ఉప్పు కలిపిన మాములు నీళ్లలో కడుక్కుని- జాగ్రత్త పెట్టుకోండి.

కొసమెరుపు:- ఇంతలా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే.... వర్ష ఋతువు కాబట్టి - శ్రావణమాసం లో *ఈగలు* ఎక్కువగా ఉండచ్చు. మార్కెట్స్ లో మరీ ఎక్కువగా ఉంటాయి. అవి అనేకమంది ఉమ్మిన  *కఫము-ఉమ్మి* పై వాలి- ఆ తర్వాత పువ్వులతో సహా అన్నిటిపై వాలచ్చు కదా!!
*అర్థమై ఉంటుంది*. అనుకుంటున్నాము.
పైగా శ్రావణ, భాద్రపదాల్లో సాధారణ జలుబు, దగ్గులు అందరికీ వస్తాయి. అందరూ మార్కెట్స్ కి కూడా వస్తారు మరి!!

ఈ శ్రావణమాసం లో
*ముందుజాగ్రత్త పడడం -*
*కుటుంబానికి శ్రేయస్కరం*.

🙏 శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP