శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఉనికి కోసం, అల్పానందం కోసం 'రామాయణం' మీదపడి ఏడ్చే తోడేళ్ళమందకి ఈ పోస్ట్ అంకితం.

>> Tuesday, July 24, 2018

తమ ఉనికి కోసం, అల్పానందం కోసం 'రామాయణం' మీదపడి ఏడ్చే తోడేళ్ళమందకి ఈ పోస్ట్ అంకితం.  రామాయణం కల్పితం జరగలేదు అంటూనే రాముడు శివ ధనుస్సు ఎక్కుపెట్టడం పైన, అరణ్యవాసానికి వెళ్లడం పైన, వాలి సంహారం పైన, సుగ్రీవ, విభీషణ శరణు పైన, రావణ సంహారం పైన, సీతను వదలడం పైన, పేలే ధర్మ వ్యతిరేకులకి ఈ పోస్టు అంకితం.

ఇది చదివినాక మీకు ఇంకా బతికే అర్హత ఉంది అనుకుంటే సిగ్గు,శరం లేకుండా బ్రతికేయొచ్చు. లేదా ఎందులోనైనా దూకి చావండి. మంచివాళ్ళే పోతున్నారు. మీరు చచ్చినంత మాత్రాన భూమికేమి వెలితి కాదు.

'రామాయణము' అంటే రాముని యొక్క ప్రయాణము, రాముడు నడిచిన మార్గము...అనగా రాముడు నడిచిన ధర్మ మార్గము. ఆ ధర్మమార్గం ఏమిటో చూద్దాం.

సీతా స్వయంవరం జరుగుతుంది. రాజులు,చక్రవర్తులు ప్రగల్బాలు పలుకుతూ వచ్చి శివధనస్సుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి భంగపడుతున్నారు. రాముడు ధనుర్బంగం చేయగలడు. సామర్ద్యం ఉంది కదా అని వెంటనే బలప్రదర్శన చేయలేదు. గురువు ఆజ్ఞ్య వచ్చేవరకూ ఆగాడు. పెద్దలు, గురువుల ఎదుట అంత వినయంగా ఉండేవాడు. అలాంటిది మిడి, మిడి జ్ఞ్యానంతో మిడిసిపడి గురువులనే గడ్డిపోచలుగా భావించే అసుర సంతానానికి మాత్రం రాముడు నచ్చలేదు.

రాముడికి పట్టాభిషేకం అని ప్రకటించారు. కాని పరిస్థితులవల్ల వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళకపోతే తండ్రికి అవమానం. తన తండ్రిగారి మర్యాద నిలబెట్టడం కోసం చిరునవ్వుతో రాజవాసాన్ని విడిచి అరణ్యవాసానికి బయలుదేరాడు.

ఆస్తి పంపకాల్లో అర్దరూపాయ్ తక్కువ వస్తే తల్లితండ్రులను లేపేసే పుత్రరత్నాలు ఉన్నారు. మీరు (పైన చెప్పిన తోడేళ్ళ మంద) కూడా ఇదే జాతికి చెంది ఉంటారని నా ప్రగాడ విశ్వాసం. అందుకే తండ్రి మాటకి అంత విలువ ఇచ్చిన రాముడు మీకు నచ్చలేదు.

వనవాసంలో సీతాపహరణం జరిగింది. సీతను అన్వేషిస్తుండగా హనుమ,సుగ్రీవుడు ఎదురయ్యారు. వాలి,సుగ్రీవుల మద్య జరిగిన పోరు తెలుసుకుని రాముడు సుగ్రీవుని పక్షం వహించి అతనికి అండగా నిలిచాడు. వాలి అమిత బలవంతుడు. రాజ్యం, సైన్యం వాలి దగ్గర ఉన్నాయి. రాముడు గనుక స్వార్థంతో ఆలోచించి వాలి పక్షం వహిస్తే వాలే తనకు అన్నిరకాలుగా సహాయం చేయగలడు.

సుగ్రీవుడు ఒంటరివాడు. కాని "ధర్మం" సుగ్రీవుని వైపున ఉంది కనుక బలహీనుడైనా సుగ్రీవునితో స్నేహం చేశాడు. అవసరమైతే శత్రువుల దగ్గరికి వెళ్లి ఎక్కడలేని ప్రేమ ఒలకబోసి తమపని కానిచ్చుకోవడం, తమవాళ్ళే కష్టాల్లో ఉన్నా చూసి చూడనట్టు నటించడం ఇలా స్వార్ధం కోసం రంగులు మార్చే మనస్తత్వం ఉన్న ఊసరవెల్లులకి మరి రాముడు నచ్చలేదు, ఎలా నచ్చుతాడు.

వాలి సంహారం:
రాముడు ఎదురుగా వచ్చి బాణం వేసినా వాలి నేలకూలుతాడు. రామ బాణానికి ఎదురులేదు, తిరుగె లేదు.
మరి వాలికి ఉన్న వరం సంగతి ఏంటి? అది వ్యర్దమవుతుంది. దేవతల వరాలు వ్యర్దమయ్యాయంటే మానవులకి దేవతలపై ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆ ప్రభావం యజ్ఞ్య, యాగాలు పూజాది క్రతువులపై పడుతుంది. లోకంలో అధర్మం ప్రబులుతుంది. తాను వచ్చింది ధర్మాన్ని స్థాపించడానికి కాని అధర్మాన్ని పెంపొందించడానికి కాదు. అందుకే తనకి శక్తి ఉన్నా వాలికి ఉన్న వరాన్ని గౌరవించి చాటుగా బాణం వేశాడు.

ఇంకా వాలి నరుడు కాదు. వానరుడు. క్రూర మృగాలని రాజులు చాటునుండి వేటాడవచ్చు. అది ధర్మ సంబద్దమే.

రావణున్ని ఎదురించి విభీషణుడు రాముడి శరణు వేడాడు. శత్రువుకి సహోదరుడైనా రాముడు అతనికి అభయమిచ్చాడు. లంకకి రాజుని చేస్తానని మాట ఇచ్చాడు. ఐతే రావణుడు లొంగిపోయి సీతను తిరిగి ఇచ్చేస్తే అప్పుడేం చేస్తావని అడగగా అతనికి నా రాజ్యాన్ని ఇస్తానన్నాడు రాముడు.

రామ, రావణ యుద్ధం మొదలయ్యింది. ఒకరోజు రావణుడు రాముని చేతిలో పరాజితుడయ్యాడు. రాముని ఎదురుగా నిస్సహాయంగా కూలబడిపోయాడు. తన భార్యను అపహరించి తనను ఇన్ని రోజులుగా ఎంతో మనోవేదనకి గురి చేసిన రావణుడు తన ఎదురుగా అచేతనంగా ఉన్నాడు. అయినా ధర్మం ప్రకారం అప్పుడు రావణుడితో "నీవు నిరాయుధుడవై ఉన్నావు. శక్తిహీనంగా ఉన్నావు. ఒంటరిగా ఉన్నావు. ఇప్పుడు నిన్ను చంపడం ధర్మం కాదు. నేడు పోయి జీవించి రేపు రా" అన్నాడు.

ఏదో ఒకరకంగా వెన్నుపోటు పోడిచైనా శత్రువుని దెబ్బ తీస్తేచాలు అనుకునే పింజారి వెధవలకి రాముడి ప్రవర్తన నచ్చలేదు, ఎలా నచ్చుతుంది మరి ?

సీత మీద తన ప్రజల్లో అపవాదు ఉందని రాముడికి గూఢచారుల వల్ల తెలిసింది. అపవాదు ఉన్న సీతను వాళ్లకి తాను పాలిస్తున్న ప్రజలకి పట్టపురాణిగా ఉంచడం ధర్మం కాదు. పరిత్యజించాలి. తాను రాజు కాకపోయి ఉంటే అలా చేయాల్సిన అవసరముండదు. చక్రవర్తి అయ్యి ఉండి, పోరాడి రావణ సంహారం చేసి మరీ తెచ్చుకున్న, ప్రాణ సమానమైన భార్యను విడిచిపెట్టడం కన్నా రాజ్యాన్ని త్యజించడం మేలనుకున్నాడు. తన తమ్ములను పిలిచి రాజ్యభారాన్ని స్వీకరించమన్నాడు.

తమ్ముళ్ళు వెంటనే రాముడి పాదాలపై పడ్డారు.."అన్నా నీవు అడిగితే మా ప్రాణాలైనా ఆనందంగా ఇచ్చేస్తాం. కాని నీ స్థానంలో కూర్చునే దుస్సాహసం కలలో కూడా చేయలేమన్నారు".
రాముడు గుండె రాయి చేసుకున్నాడు. తన వల్ల రఘువంశ ప్రతిష్ట మసకబారకూడదనుకున్నాడు. ప్రాణాధికమైన తన భార్యను ధర్మం కోసం మాత్రమే విడిచిపెట్టాడు.

"రామో విగ్రహవాన్ ధర్మః" రాముడు నిలువెత్తు ధర్మస్వరూపం. భూమి ఉన్నంత కాలం రామనామం ఉంటుంది. రామనామం లేనినాడు విశ్వమే ఉండదు.

"శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష" (Thanks to unknown author)

జై శ్రీరాం
జై హింద్
భారత్ మాతా కీ జై. 
By. Gopi krishna garu from watsap

1 వ్యాఖ్యలు:

'''నేస్తం... July 25, 2018 at 5:51 AM  

You always surprises me with your informative posts. Good post again from your pen. Thanks for sharing good information.

Jai Sriram.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP