త్రైలింగస్వామి చరిత్ర 20-25
>> Thursday, May 24, 2012
స్వామివారి అద్భుత శక్తులుచూసి ఆకర్షితుడై, ఆనాటినుంచే ధర్మమార్గంలో
నడవసాగాడు. హిందూ ధర్మప్రాశస్త్యం తెలిసికొని, స్వామివారి సేవకు ప్రతినెలా
ధనం ఇవ్వటానికి నిశ్చయించుకొన్నాడు. ఆ విషయాన్ని మంగళదాస్ ఠాకూర్ ద్వారా
స్వామీజీకి నివేదించుకొన్నాడు. అది విని స్వామివారు ఆగ్రహోదగ్రులై తన
అసమ్మతిని తెలిపారు. కాని స్వామివారు దేహత్యాగం చేసిన తరువాత ఆశ్రమ
నిర్వహణకు ప్రతినెలా పది రూపాయలు తప్పకుండా పంపేవాడు.
త్రైలింగస్వామి భరించరాని చలికాలంలో కూడా చల్లని నీటితో అభ్యంగన స్నానం చేసేవారు. ప్రచండ గ్రీష్మకాలంలో ఎవ్వరూ బయటకు రావటానికి సాహసం చెయ్యని సమయంలో 3, 4 గంటలు గంగ నీటిలోనే మునిగి ఉండేవారు. మరొకసారి నీటి ప్రవాహానికి ఎదురుగా నీటిపైన నడిచి వెళ్లేవారు. నీరు, ఎండ, చలి, అన్నీ ఆయనకు సమానమే! ఎప్పుడూ ఆయన ఒక గొంగళీమీద పడుకుని, మరొక గొంగళిని కప్పుకొనేవారు.
స్వామివారి అద్భుత చర్యలను దర్శించినవారు తమ జన్మ ధన్యమైనదని, సార్థకమైనదని భావించేవారు. జ్ఞానోదయమై హృదయ మాలిన్యం తొలగిపోయి సత్త్వగుణ సంపన్నులయ్యేవారు. స్వామివారిని దర్శించాలని హృదయపూర్వకంగా భావించేవారికే వారి దర్శనం లభించేది. స్వామివారి యోగ్యత తెలియనివారికి, వారిని గూర్చి అపహాస్యం చేసేవారికి, వారి దర్శన భాగ్యమే లభించేది కాదు.
స్వామివారి ఆశ్రమంలో వారి రాతి విగ్రహాలను ప్రతిష్ఠించి, వచ్చిన యాత్రికులు వాటికి పూజలు చేస్తూ ఉండేవారు. మంగళదాస్ ఠాకూర్ ఆశ్రమ సేవలు అందిస్తూ ఉండేవాడు.
ఇక నేను స్వయంగా చూసిన సంఘటనలను వర్ణిస్తాను. అన్ని సంఘటనలనూ వర్ణిస్తే ఇది బృహద్గ్రంధమవుతుంది. కనుక ప్రధాన సంఘటనలనే వివరిస్తాను. వాటిని చదివినవారికి త్రైలింగ స్వామి త్రికాలజ్ఞుడని, నిర్వికారుడని, సదానందుడని, దయాసాగరుడని, జీవన్ముక్తుడని మహాపురుషుడనీ విశదమవుతుంది.
ధర్మాలకు సంబంధించిన వివిధోపన్యాసాలను విని, అనేక ధర్మాలను పరీక్షించి చూచిన తరువాత, నా మనస్సులో ఒక సందేహం కలిగింది. శాస్త్రాల్లో జన్మ జన్మాంతర సిద్ధాంతాలు ప్రతిపాదింపబడినాయి. స్వర్గ నరకాలు, నానాయోని భ్రమణములు, సుఖదుఃఖాలు మొదలైనవి వారు వారు చేసుకొన్న సుకృతులు, దుష్కుృతులవలన కలుగుతూ ఉంటాయని సాధువులు, మహాత్ములు, జ్ఞానులు అయిన మహానుభావులు చెబుతూ ఉంటారు.
ఇదంతా తెలిసి కూడా పునర్జన్మను గురించి మహాపురుషుడైన త్రైలింగస్వామి అభిప్రాయమేమిటో వారిద్వారానే తెలుసుకోవాలని నా మనస్సులో కోరిక కలిగింది. ఒకసారి హరిద్వార్ వరకూ తీర్థయాత్ర చెయ్యాలనుకొన్నాను. అయితే అంతకుముందే కాశీధామం వెళ్లి త్రైలింగ స్వామిని దర్శించి నా సందేహ నివృత్తి చేసుకోవాలని తీవ్రమైన కోరిక కలిగింది. నా సందేహం పండితులవల్ల నివృత్తి అయ్యేది కాదు.
ఎందుకంటే పండితులంతా తార్కికబుద్ధి కలవారు. నా సందేహం తర్కానికి అందేది కాదు. ప్రత్యక్ష ప్రమాణం చూపగలిగినవారు స్వామీజీ ఒక్కరే! కనుక ఎలాగైనా స్వామివారిని దర్శించి నా సంశయం తొలగిపోనంతవరకూ తిరిగి రాకూడదని నిశ్చయించుకొన్నాను. అప్పుడు నేను ముంగేర్ అనే పట్టణంలో ఉన్న ఒక పెద్ద ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. కనుక శలవు లభించకపోతే వెళ్లటం అసంభవం. శలవు దొరికేవరకూ నా మనస్సు చిరాకుగా ఉండింది.
వంగ సంవత్సరం 1287లో నాకు మూడు నెలలు సెలవు దొరికింది. అప్పుడు మాఘ శుద్ధ విదియ నాడు తీర్థయాత్రకు బయల్దేరాను. ముంగేర్
దానిని కనిపెట్టుకొని వున్న రామచంద్ర ముఖోపాధ్యాగారికి చటోపాధ్యాయగారు ఒక ఉత్తరం వ్రాసి ఇచ్చి, నాకు కాశీలో వసతి కల్పించారు. ఆ ఉత్తరంవల్ల నాకెంతో ఉపకారం జరిగింది. రామచంద్ర ముఖోపాధ్యాయ నాకు అన్నిసౌకర్యాలు కలిగించి ఆదరించాడు. మొదట నేను నా తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలు చేశాను. ఆ తరువాత బ్రాహ్మణ భోజనాలు, కుమారీ పూజలు ఆయన సహాయంతోనే పూర్తి చేశాను. ఏడు రోజులపాటు కాశీలోని తీర్థాలన్నింటికీ మేమిద్దరం తిరిగాము.
ఆయన సంతోషంగా నాతోపాటు అన్ని మందిరాలను, దేవతలను చూపించాడు. అక్కడ విశేషాలను ఆయన వర్ణించి చెప్పాడు. మధ్యలో ఆయన పంచగంగాఘాట్లో ఉన్న బిందుమాధవ మందిరాన్ని, మహాత్మా త్రైలింగస్వామి ఆశ్రమాన్ని నాకు చూపించాడు. త్రైలింగస్వామి దివ్యస్వరూపాన్ని చూడగానే నా మనస్సులో అత్యంత భక్తిశ్రద్ధలు జనించాయి. కొంతసేపు అక్కడ ఉండి ఆయనకు నా నమస్కారం చేసుకొని ఇద్దరమూ తిరిగి వచ్చాము. నా మనోభావాలను రామచంద్రగారితో నేను చెప్పలేదు. ఇంటికివచ్చిన తరువాత, త్రైలింగస్వామి గుణగణములను, వారిలోని దివ్యశక్తులను గూర్చి అడిగాను.
వారు విశేషంగా చెప్పకపోగా, ఇట్లా చెప్పారు. ‘‘ఆయనను గురించి అడుగుతున్నారెందుకు? ఆయనకు మంచి- చెడు అనే విచక్షణ లేదు. ఆయనొక పిచ్చివాడు. కులభేదాలు లేవు. ఏది దొరికితే అది తింటాడు. దుకాణాలదగ్గరి వస్తువులను ఏరుకొంటూ ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. దిగంబరంగా తిరుగుతూ ఉంటాడు. భయంకరమైన ఎండాకాలంలో ఇసుక తినె్నలమీద నిద్రిస్తాడు. వణుకు పుట్టించే చలిలో గంగానది నీళ్లలో మునిగి ఉంటాడు. ఒక్కొక్కసారి 2, 3 గంటలపాటు నీటిలోనే ఉంటాడు. ఒక్కొక్కసారి నీటి మీద తేలియాడుతూ కన్పిస్తాడు. అందుచేత ప్రజలాయనను ‘కుంభకయోగి’ అని అంటూ ఉంటారు. అతని వయస్సు ఏడెనిమిది వందల సంవత్సరాలుండవచ్చును. కాని ఎప్పుడూ ఒకేలాగా కన్పిస్తూ ఉంటారు’’ అని చెప్పాడు.
మర్నాడు ఉదయం మణికర్ణికలో స్నానం చేసి, వౌనస్వామియైన మహాత్మా త్రైలింగస్వామి పూజ్యపాదుల దర్శనానికి వెళ్ళాను. వారికి నమస్కరించి ఒక స్తంభాన్ని ఆనుకొని, వారి దివ్య స్వరూపాన్ని చూస్తూ నిలుచుండిపోయాను. పునర్జన్మను గురించి వారిని అడిగి తెలుసుకొని, నా సందేహ నివృత్తి చేసుకోవాలనుకొన్నాను. కాని ఆయన దగ్గరకు వెళ్లి కూర్చోటానికి సాహసించలేకపోయాను. నేను ఏమీ మాట్లాడకముందే స్వామి సంజ్ఞ చేసి నన్ను వెళ్లిపొమ్మన్నారు. మరికొంతసేపు అక్కడే ఉందామనుకొన్నాను. కాని మంగళదాస్ నన్ను తొందరగా వెళ్లిపొమ్మన్నాడు. నేను ఎంతో విచారపడుతూ నానా రకాల ఆలోచనలతో ఇంటికి వెళ్లాను. అదే రోజు మధ్యాహ్నం మళ్లీ ఆశ్రమానికి వెళ్లి నమస్కరించి, ఒక స్తంభానికి ఆనుకొని నిలుచున్నాను. నన్నుచూసి స్వామి ఉదయంలాగానే వెళ్లిపొమ్మని సంజ్ఞ చేశారు. అది చూసి మంగళ్దాస్ నన్ను త్వరగా వెళ్లిపొమ్మన్నాడు. దెబ్బతిన్న హృదయంతో వివశుడై, అప్రసన్న మనస్సుతో ఇంటికి వెళ్లిపోయాను.
మూడో రోజు ప్రొద్దున్న స్నానం చేసి ప్రతిరోజూవలెనే స్వామివారి ఆశ్రమానికి వెళ్లి నమస్కరించి, అదే స్థానంలో నిలబడినాను. ఈవేళకూడా స్వామీజీ పొమ్మని సంజ్ఞ చేశారు. మంగళదాస్ త్వరగా వెళ్లిపొమ్మన్నాడు. అయినా నేను వెళ్లకపోయేసరికి, స్వామీజీ కోపగించి, నన్నక్కడినుంచి తొలగించమని గోసేవకులను ఆజ్ఞాపించారు. వారు నన్ను బలవంతంగా తోసివేశారు. నేను సిగ్గుపడి, అవమానంతో విచారిస్తూ ఇంటికి వచ్చాను. నానారకాలుగా ఆలోచిస్తూ, హతాశుడనైనాను. నా అదృష్టం ఎట్లా ఉన్నదో ఏమో- నేను మాత్రం నా నమ్మకాన్ని విడువలేదు. అత్యంత భయభక్తులతో మళ్లీ మధ్యాహ్నం ఆశ్రమానికి వెళ్లి, యథాపూర్వకం నమస్కరించి, అదే స్థానంలో నిలుచున్నాను. పూర్వంలాగానే నన్నువాళ్లు త్రోసివేశారు. ఎట్లాగైనా అక్కడ కూర్చోటానికి కొంత స్థానం సంపాదించటమే నా ప్రధాన లక్ష్యం.
అందువలన అక్కడ ఉండే సేవకులకు కొంత డబ్బు ఇచ్చి తృప్తిపరిస్తే, వారు అక్కడినుంచి నన్ను తొలగించరని అనుకొన్నాను. అంతేకాక స్వామివారు సంజ్ఞ చేసినా, అక్కడే నిలిచి ఉండాలని, నా అనుమానం తీరిపోయేవరకూ తిరిగి రాకూడదని నిశ్చయించుకొన్నాను.
నాలుగవరోజు ఉదయం మణికర్ణికాఘాట్లో స్నానం చేసి ఆశ్రమానికి చేరుకొని మంగళదాస్ ఠాకూర్ దగ్గరే కూర్చున్నాను. మంగళదాస్ ఠాకూర్కు నాలుగు రూపాయలు, గోసేవకులకు రెండు రూపాయలు సమర్పించుకొని, నన్ను అక్కడినుంచి వెళ్లగొట్టవద్దని చేతులు జోడించి వేడుకున్నాను. వారు తృప్తిపడి అంగీకరించారు. కాని మంగళదాస్ మాత్రం స్వామివారి అనుమతి లేనిదే అక్కడ ఉండటం అసంభవమని, తాము ఏమీ చెయ్యలేమని, స్వామివారి ఆజ్ఞను పాటించక తప్పదని చెప్పాడు. నేను భయపడుతూనే స్వామివారి ముందు స్తంభందగ్గర యథాప్రకారంగా నిలుచున్నాను. కాని కొంచెం ముందుకు వెళ్లి మనసులోని మాటను చెప్పటానికి సాహసించలేకపోయాను. అయితే, బయటకు వెళ్ళగొడతారనే భయం లేకపోవుటవలన నా సంశయాన్ని తీర్చుకోటానికే నిశ్చయించకొన్నాను.
అట్లా నిర్ణయించుకొని కొంచెం ముందుకువెళ్ళాను. అదే సమయంలో కలకత్తానుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు స్వామివారికి నమస్కరించి అక్కడ నిలబడినారు. కొంచెం సేపటికి స్వామివారు వారిని వెళ్లిపొమ్మని సంజ్ఞ చేశారు. వారిద్దరిలో నమ్రస్వభావంగల వ్యక్తి వెళ్లిపోవటానికి సిద్ధమయ్యాడు. కాని, ఉగ్రస్వభావంగల రెండోవ్యక్తి సేవకులతో కోపోద్రేకంతో ‘‘మేము స్వామీజీని దర్శించటానికి వచ్చాము. ఇక్కడే ఉండిపోవటానికి రాలేదు. కొంచెం సేపయినాక మేము ఎట్లాగయినా ఇక్కడినుంచి వెళ్లిపోతాము. మీరెందుకు అనవసరంగా అంత కోపంతో మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు’’ అని అన్నాడు. అది విని స్వామీజీకి కోపం వచ్చి మంగళదాస్కు సంజ్ఞ చేసి, గోసేవకుల ద్వారా అక్కడినుంచి తొందరగా వారిని పంపించి వెయ్యమని చెప్పారు. గోసేవకులు వచ్చి ‘‘స్వామివారి దర్శనమయింది కదా! అనవసరంగా గుమిగూడవద్దు. తొందరగా వెళ్ళిపోం’’డని బలవంతంగా నెట్టివేశారు. వారు ససేమిరా వెళ్లమని పట్టుబట్టారు. అప్పుడు వారిద్దరికీ కొంచెం ఘర్షణ జరిగింది. అది చూసి స్వామివారు అతనిని అక్కడ ఉండమని సంజ్ఞ చేశారు. తరువాత మంగళదాస్ను పిలిచి కాగితం - కలం తెమ్మన్నారు. మంగళదాసు వచ్చిన తరువాత గోడపైన ఉన్న ఒక శ్లోకములోని అక్షరాల మీద చేయి పెట్టి చూపించారు. మంగళదాసు వాటిని వ్రాస్తూ పోయాడు. వ్రాత పూర్తి అయిన తరువాత దానిని చదివి వినిపించమన్నారు. మంగళదాసు ఆ అక్షరాలను కలకత్తా బాబుకు చదివి వినిపించాడు. అందులో నీవు పద్దెనిమిది రూపాయల విలువైన పాదరక్షలను బయట వదిలి నన్ను చూడటానికి వచ్చావు. ఎవరైనా వాటిని ఎత్తుకొనిపోతే ఇంటికి వెళ్ళటం కష్టం కదా! అదీకాక, నీవు మమ్మల్ని చూస్తున్నావా? లేక నీ పాదరక్షలను గురించి ఆలోచిస్తున్నావా? ఏమి ఆలోచిస్తున్నావో నిజం చెప్పు. నీవు కాలం వృధా చెయ్యక నీ పాదరక్షలను తీసుకొని వెళ్లిపో. ఇప్పటివరకూ వాటిని ఎవరూ ఎత్తుకొని పోలేదు. త్వరగా వెళ్లు’’ అని ఉన్నది. ఆ సంఘటన చూసి, అక్కడివారంతా నిశే్చష్టులయ్యారు. అప్పుడు నేను ‘‘నీవు నిజంగా నీ పాదరక్షలను గురించి ఆలోచిస్తున్నావా’’ అని అడిగాను. అది చూశాక నా హృదయం భక్తిరసభరితం అయింది. ఎన్ని కష్టాలు వచ్చినా నేను వచ్చిన పని పూర్తిచేసుకోవాలని నిశ్చయించుకొన్నాను. స్వామివారి మహిమ తెలిశాక కలకత్తా బాబుకు కోపం పోయింది. బుద్ధి వచ్చింది. ఆ తరువాత స్వామివారు సంజ్ఞ చేయగానే మారు మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు.
కొంచెం సేపటికి స్వామివారు నా వైపు తిరిగి వెళ్లిపొమ్మని సంజ్ఞ చేశారు. వెళ్లిపోవద్దనుకున్నాను. కానీ సాహసం చెయ్యలేక ఇంటికి వెళ్లిపోయాను. మళ్లీ మధ్యాహ్నం ఎంతో ఆశతో ఆశ్రమానికి వెళ్లాను.
మళ్లీ అట్లాగే జరిగింది. ఆ విధంగా ప్రతిరోజూ రెండు పూటలా ఆశ్రమానికి వెళ్లి వస్తూనే ఉన్నాను. అట్లా 12 రోజులు గడిచాయి. కనీసం అక్కడ కూర్చోటానికి కూడా అవకాశం లభించలేదు. నేను ఎంతో నిరాశపడ్డాను. నా జీవితం వ్యర్థమనుకొన్నాను. నావంటి దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండడనుకొన్నాను. సత్ఫురుషుల వద్ద కూర్చొనే స్థలం కూడా నాకు లభించటంలేదు. చూడగానే తరిమివేస్తున్నారు. నేనేమి పాపం చేశానో బోధపడలేదు. అదేమి దౌర్భాగ్యమో నాకే తెలియదు. నా దురదృష్టంపట్ల నాకే దుఃఖం కలిగింది.
13వ రోజు ఉదయం మళ్లీ ఆశ్రమానికి వెళ్లి, దుఃఖం ఆపుకోలేక ఏడవటం మొదలుపెట్టాను. నా కళ్లవెంట అశ్రుధారలు ప్రవహింపసాగినాయి. అదిచూసి స్వామివారు నన్ను కూర్చోమని స్వయంగా చెప్పారు. దుఃఖాన్ని ఆపుకోమని సంజ్ఞ చేశారు. స్వామివారి దయార్ద్ర దృష్టి నన్ను మరింత దుఃఖితుని చేసింది. నేను వారి పాదాలను పట్టుకొని వెక్కి వెక్కి ఏడవసాగాను. ప్రాయశ్చిత్తంతో నా మనస్సు పరిశుద్ధమైంది. నా రుూ పరిస్థితిని చూసి స్వామివారు మంగళదాస్ను పిలిచి, ‘ఇవాళ’ అతనిని వెళ్లిపోయి, రేపు ప్రొద్దున రమ్మని’ చెప్పు అని సంజ్ఞ చేశారు. మంగళదాస్ స్వామివారి ఆజ్ఞను నాకు వినిపించారు. దానితో నా మనస్సు కొంచెం కుదుటపడింది. మళ్లీ ఏదో ఆశ నాలో చిగురించింది. నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్లి, ఆ రాత్రి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ గడిపాను.
14వ రోజున గంగాస్నానం చేసి, పరిపూర్ణ ఉత్సాహంతో ఆశ్రమానికి వెళ్లి స్వామివారికి దండ ప్రణామాలు చేసి, వారి పాదధూళిని నా సర్వాంగములకు పూసుకొని, వారి సమీపంలో కూర్చున్నాను. సత్పురుష సాంగత్యంవలన నా మనస్సున ఆవరించిన తెర తొలగిపోయింది. నా శరీరం పవిత్రమైనదే అనే భావం నాకు కలిగింది. ఆ ఆనందాన్ని లోలోపల అనుభవిస్తూ స్వామివారి అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నానను. ఇంతలో స్వామివారు మంగళదాస్కు ఏదో సంజ్ఞ చేశారు. దాని ప్రకారం మంగళదాస్ ఎఱ్ఱ రాతి వంటి ఒక గంధపు చెక్కను, ఒక గినె్నలో నీటిని తెచ్చి అక్కడ పెట్టి, ‘స్వామివారు నిన్ను గంధం తియ్యమన్నారు’ అని చెప్పి వెళ్లిపోయాడు. నేను గంధం తియ్యటం మొదలుపెట్టాను. దాదాపు రెండు జాములు తీశాక స్వామివారు స్వయంగా ఆ మిగిలిన గంధం చెక్కను ఒక రాతి గినె్నలో పెట్టి భోజనానికి వెళ్లమన్నారు. నేను వారి ఆదేశానుసారం భోజనానికి వెళ్లి మళ్లీ ఆశ్రమానికి తిరిగి వచ్చాను. స్వామీజీ నన్నుచూసి, మళ్లీ గంధం తియ్యమని సంజ్ఞ చేశారు. నేను మధ్యాహ్నం వరకూ అట్లాగే తీస్తున్నాను. కొంచెం సేపటికి ఒక బ్రహ్మచారి వచ్చాడు. స్వామివారు నేను తీసిన గంధమును అతనికి ఇచ్చి, దేవనాగరిలిపిలో వ్రాసి ఉన్న ఒక కాగితం కూడా ఇచ్చి ఆ గంధంతో వాకిలి గోడమీద ఏదో వ్రాయమన్నారు. ఆ బ్రహ్మచారి ఏదో వ్రాశాడు. సాయంకాలమయ్యాక, మిగిలిపోయిన గంధం ముక్కను ఒక గినె్నలో పెట్టి ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు. స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఇంటికి వెళ్లిపోయాను.
పదిహేనవ రోజు నియమ ప్రకారం పొద్దునే్న పంచగంగా ఘాట్లో స్నానం చేసి ఆశ్రమం చేరుకొని, స్వామివారి సమీపంలో కూర్చున్నాను. వారు నిన్నటిలాగానే గంధం తియ్యమని సంజ్ఞ చేశారు. అరగదీసి అరగతీసి చేతులు నొప్పి పుట్టడంవలన మెల్లగా అరగదీయసాగాను. అది చూసి స్వామివారు గంభీరంగా ముఖం పెట్టి వేగంగా చెయ్యమని చేతులతో సంజ్ఞ చేసి చెప్పారు. వారి ముఖకవళికలు చూసి వేగంగా అరగతియ్యసాగారు. తరువాత వారు చేసిన సంజ్ఞ ప్రకారం తీసిన గంధాన్ని అక్కడ పెట్టి ఇంటికి వచ్చి భోజనం చేసి రెండు గంటలకు ఆశ్రమం చేరుకొన్నాను. ఈ ప్రకారం నిత్యం నియమిత వేళలో రెండు చేతులతో రెండు పూటల గంధం తీసి తీసి నా చేతులు బలహీనమయ్యాయి. ఆ విధంగా 15 రోజులు గడిచాయి. నా చేతులు, అన్నం కూడా తినలేనంత బలహీనమయ్యాయి.
నా అదృష్టం ఎట్లా ఉంటే అట్లా అవుతుందని మనస్సులో అనుకొన్నాను కాని, పైకి మాత్రం అనలేకపోయాను. రెండు పూటలా నేను గంధం అరగదీస్తూ ఉంటే, ఆ బ్రహ్మచారి ప్రాంగణంలోని గోడలమీద శ్లోకాలు వ్రాసేవాడు. ప్రతిరోజూ నేను తీసిన గంధం అంతా అయిపోతూ ఉండేది. బ్రహ్మచారికి ఏమీ కష్టం లేకపోయినా, నేను మాత్రం అలసిపోయేవాడిని.
ఈ విధంగా 28 రోజులు గడిచిపోయాయి. 29వ రోజు ప్రొద్దునే్న స్నానం చేసి వచ్చి, స్వామివారికి నమస్కరించి వారి సమీపంలో కూర్చున్నాను. ఒకవేళ ఆ రోజు కూడా గంధం తియ్యమంటే నా చేతకాదేమోననిపించింది. నా చేతులు అలసిపోయాయి. ఇవ్వాళ నా పరిస్థితి ఏమిటో అనుకొన్నాను. నేను గంధం తియ్యలేకపోతే, స్వామివారు నన్ను అక్కడినుంచి పంపించివెయ్యవచ్చు. అట్లా జరిగితే నా ఆశలన్నీ మట్టిలో కలిసిపోయినట్లే. ఇన్ని రోజులూ కష్టపడి చేసిన పరిశ్రమ వృధా అని, నా ఆశలకు తిలోదకం వదిలి తిరిగి వెళ్లవలసి వస్తుందే అని నా మనస్సు చాలా వ్యాకులం చెంది ఉండింది. కళ్లనుండి కన్నీళ్లు ధారగా ప్రవహిస్తున్నాయి. కొంచెం సేపటికి స్వామివారు నన్ను చూసి నవ్వారు. నేను దేవనాగరి లిపి చదవగలనో లేదో అని మంగళదాస్ చేత అడిగించారు. నేను చదవగలనని అనగానే స్వామివారు తమ వేదికమీద పరచిన గొంగళి క్రింద నుంచి చెక్కలతో కట్టి వున్న ఒక తాటాకు గ్రంధం తీసి నా చేతికిచ్చారు. దీనిలో ఉన్న శ్లోకాలన్నింటిని బెంగాలీ భాషలోకి అనువదించమని మంగళదాస్ చేత చెప్పించారు. నాకు బంగారం దొరికినంత ఆనందం కలిగింది. అప్పటినుంచీ గంధం అరగదీసే పనికి విముక్తి లభించింది. స్వామివారి కృప లభించినందుకు ఎంతో సంతోషించాను. కలం, కాగితాలు, సిరాబుడ్డి తీసుకొని అనువదించసాగాను. ప్రతి కాగితం కింద నా సంతకం ఉంది. అయిదు రోజులు కష్టపడి ఆ శ్లోకాలను బెంగాలీ భాషలోకి అనువదించాను. స్వామివారు వాటిని చదివి వినిపించమని సంజ్ఞ చేశారు. అన్ని శ్లోకాలు చదవటంపూర్తి అయిన తరువాత, తాటాకు పుస్తకాన్ని చెక్కలతో కట్టేసి గొంగళి క్రింద పెట్టుకొన్నారు.
ఆ తరువాత అక్కడినుంచే మరొక తాటాకు పుస్తకాన్ని తీసి ఇచ్చి ఇదివరకటిలాగానే అందులోని శ్లోకాలను కూడా బెంగాలీ భాషలోనికి అనువదించమని ఆదేశించారు. ఈ తాటాకు పుస్తకం మొదటి దానికన్నా కొంచెం చిన్నది. కనుక మూడు రోజులలో దానిని పూర్తిచేశాను. వాటిని కూడా చదివి వినిపించిన తరువాత, ఆ తాటాకు పుస్తకాన్ని కూడా యథాస్థానంలో గొంగళి క్రింద పెట్టి, నన్ను ఇంటికి వెళ్లి భోజనం చెయ్యమన్నారు.
నేను భోజనం చేసి, ఆశ్రమానికి తిరిగి వచ్చి, స్వామివారి దగ్గర కూర్చున్నాను. వారు నావైపు చూస్తూ పడుకొన్నారు. ఈ రోజున నేను చేయవలసిన పని ఏమీ లేదనిపించింది. స్వామి నా వైపుకు తిరిగి, నన్ను చూస్తూ అట్లాగే పడుకున్నారు. నేను వారి పాదధూళిని తీసి నా శరీరానికి పూసుకొని, వారి పాదసేవ చేయసాగాను. నాకు సాధువుల సేవ చేసే సౌభాగ్యం లభించినందుకు సంతోషపడ్డాను.
స్వామివారు సంధ్యాకాలంలో లేచారు. మరునాడు ప్రాతఃకాలం కాకుండా సాయం సమయాంతరమున రమ్మని నాకు సంజ్ఞ చేశారు. మంగళదాస్ నన్ను ఇంటికి వెళ్లమని సంజ్ఞ చేశారు. నేను ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్లాను. నా కష్టమంతా పటాపంచలైపోయింది. రాత్రి పూర్తయి, దినమంతా గడిచిపోయి, సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని నిరీక్షిస్తూ కాలం గడపసాగాను. రెండవ రోజు సాయంత్రం తొందరగావెళ్లి స్వామీజీని దర్శించాలనే కుతూహలంతో ఆశ్రమానికి వెళ్ళాను. స్వామివారి ఆశ్రమంలో ఉన్న పెద్ద మహదేవమూర్తిని కాళిమాతను దర్శించి, హారతులు తీసుకొని, స్వామివారి దగ్గర కూర్చున్నాను. స్వామీజీ నన్ను ఒక చిన్న గదిలోకి తీసుకొని వెళ్లారు. అందులోకి ఎవ్వరూ రాకూడదని కట్టడి చేశారు. ఆ గదిలో ఒక ఆసనం ఉన్నది. అక్కడ ఒక చిన్నదీపం వెలుగుతున్నది.
స్వామివారు ఆ ఆసనంమీద కూర్చున్నారు. నేను వారి దగ్గర కూర్చున్నాను. భక్తవత్సలుడైన స్వామి, భక్తుల కోరికలను తీర్చటానికి తమ వౌనవ్రతాన్ని వదిలిపెట్టి గంభీరంగా ఇలా అన్నారు. ‘‘నీవు దేనిని మనస్సులో పెట్టుకొని దాని సమాధానం కోసం ఇక్కడికి వచ్చావో దానిని గురించి ఇంత సందేహం ఎందుకు? త్రికాలదర్శులు, ఆత్మతత్త్వజ్ఞులు అయిన దేవర్షులు- మహర్షులు పుణ్యాత్ములు. తపోబలంతో వారు చేసిన సిద్ధాంతాలను గురించి నీవు సందేహపడనక్కరలేదు. వారుచెప్పినది సత్యం.
జీవుడు తాను చేసిన సుకృతులకు- దుష్కృతులకు అనుగుణంగా సుఖదుఃఖాలను అనుభవించటానికి జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అది కూడా సంపూర్ణ సత్యమే. ఈ జన్మల సంగతిని గురించి తెలుసుకోగలవాడు మనిషి ఒక్కడే. కాని దానిని గురించి తెలుసుకోవాలని ఎవరూ ప్రయత్నించకపోవటం ఒకటే దుఃఖాన్ని కలిగించే విషయం. నేను నీతో అంటున్నది వాస్తవం. దానికి ప్రమాణం ఏమిటి? దానిని ఎట్లా విశ్వసించాలి? అని నీవు సందేహించవచ్చు. దానికి సమాధానం చెబుతాను. నీవు నామీది విశ్వాసంతో పునర్జన్మను గురించి తెలుసుకోవాలని ఇన్ని కష్టాలూ అనుభవించావు. పునర్జన్మను గురించి నీకు చక్కగా అర్థమయ్యేటట్లు తప్పక చెబుతాను.
మొదట నేను నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గురించి చెబుతాను. అవి సత్యమే అని నమ్మకం కుదిరిన తరువాత నీవు, పునర్జన్మను గురించి నేను చెప్పిన దానిని నిశ్చయంగా సత్యమని నమ్ముతావు. మానవునికి పునర్జన్మ సంభవించినప్పుడు, అప్పుడు ఈ జీవితంలోని సర్వవిషయాలు జీవాత్మలో నిక్షిప్తమవుతాయి. ఆ జీవాత్మను స్వీకరించిన పరమాత్మ, పునర్జన్మకు కారణమైన జీవాత్మను తిరిగి నిర్మిస్తాడు.
అందుచేత ఈ జన్మలో విద్వాంసుడైన వాడు తరువాతి జన్మలో కూడా విద్వాంసుడై పుడతాడు. ఈ జన్మలో మంచి వాద్యకారుడైతే వచ్చే జన్మలో కూడా మంచి వాద్యకారుడవుతాడు. ఈ జన్మలో మంచి ధార్మికుడైతే వచ్చే జన్మలో కూడా మంచి ధార్మికుడవుతాడు. ఈ జన్మలో దొంగ అయినవాడు వచ్చే జన్మలో దొంగవుతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుని దయామయుడని, సర్వశక్తిమయుడని మనం అనుకోము. భగవంతుడు ఆలోచించినంత గొప్పగా మరెవ్వరూ ఆలోచించరని అందరూ ఒప్పుకొంటారు. ఒకవేళ మరో జన్మ లేకపోతే ఒకరు రాజు- మరొకరు సాధారణ జనుడు; ఒకడు ధనవంతుడు, నిర్ధనుడు, ఒకడు బ్రాహ్మణుడు మరొకడు చండాలుడు, ఒకడు పల్లకీ ఎక్కేవాడు, మరొకడు మోసేవాడు; ఒకడు ఆరోగ్యవంతుడు- మరొకడు రోగి; ఒకడు భాగ్యవంతుడు- మరొకడు నిర్భాగ్యుడు ఎట్లా అవుతారు?
జీవితంలో ఇన్ని భేదాలు ఎందుకు వస్తున్నాయి? ఏ తప్పు చేయని వాడు ఏ శిక్షా అనుభవించనవసరం లేదు. ఈశ్వరుడు మంచి చెడ్డలను గురించి ఆలోచించడా? తాను ఇష్టం వచ్చినట్లు చేస్తాడా? అట్లా ఎప్పుడూ జరగదు. ఈశ్వరునిలాగా ఆలోచన చేసేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఈ మాటను ఎవ్వరూ తెలుసుకోలేరు. అందుచేతనే వారి వారి కర్మఫలాలను అనుసరించి ఇన్ని భేదాలున్నాయి. ఈ జన్మ యొక్క ఆకృతి, వర్ణము, విద్య, బుద్ధి, స్వభావము, కర్మఫలము- ఇవన్నీ అతి సూక్ష్మరూపంలో జీవాత్మలో నిక్షిప్తమై ఉండి, పునర్జన్మకు హేతువులవుతాయి. అందువలననే మనుష్యులు నానారకాల ఆకృతులకు, అవస్థలకు ఒదిగి, సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తారు. అద్దంలో చూసినపుడు ప్రశాంతమైన ముఖం ప్రశాంతంగాను, వికటించిన రూపము వికటంగాను ప్రతిబింబిచినట్లే, ఒక జన్మలోని పరిస్థితులు కూడా మరొక జన్మలో ప్రతిఫలిస్తాయి. అన్యాయము, అసత్కార్యాలు చేస్తే ఆత్మఅథోగతి నొందుతుంది. ధర్మము, సత్కర్మలు చేస్తే ఆత్మ ఉన్నత స్థితని పొందుతుంది. దీనిలో ఏ మాత్రమూ సందేహం లేదు. ఒకవేళ నీవు దొంగతనం చేస్తే నిన్ను ప్రభుత్వం దండిస్తుంది. నీవు ఏ తప్పు చేయకపోతే నిన్ను దండించే అధికారం ఎవరికీ ఉండదు.
త్రైలింగస్వామి భరించరాని చలికాలంలో కూడా చల్లని నీటితో అభ్యంగన స్నానం చేసేవారు. ప్రచండ గ్రీష్మకాలంలో ఎవ్వరూ బయటకు రావటానికి సాహసం చెయ్యని సమయంలో 3, 4 గంటలు గంగ నీటిలోనే మునిగి ఉండేవారు. మరొకసారి నీటి ప్రవాహానికి ఎదురుగా నీటిపైన నడిచి వెళ్లేవారు. నీరు, ఎండ, చలి, అన్నీ ఆయనకు సమానమే! ఎప్పుడూ ఆయన ఒక గొంగళీమీద పడుకుని, మరొక గొంగళిని కప్పుకొనేవారు.
స్వామివారి అద్భుత చర్యలను దర్శించినవారు తమ జన్మ ధన్యమైనదని, సార్థకమైనదని భావించేవారు. జ్ఞానోదయమై హృదయ మాలిన్యం తొలగిపోయి సత్త్వగుణ సంపన్నులయ్యేవారు. స్వామివారిని దర్శించాలని హృదయపూర్వకంగా భావించేవారికే వారి దర్శనం లభించేది. స్వామివారి యోగ్యత తెలియనివారికి, వారిని గూర్చి అపహాస్యం చేసేవారికి, వారి దర్శన భాగ్యమే లభించేది కాదు.
స్వామివారి ఆశ్రమంలో వారి రాతి విగ్రహాలను ప్రతిష్ఠించి, వచ్చిన యాత్రికులు వాటికి పూజలు చేస్తూ ఉండేవారు. మంగళదాస్ ఠాకూర్ ఆశ్రమ సేవలు అందిస్తూ ఉండేవాడు.
ఇక నేను స్వయంగా చూసిన సంఘటనలను వర్ణిస్తాను. అన్ని సంఘటనలనూ వర్ణిస్తే ఇది బృహద్గ్రంధమవుతుంది. కనుక ప్రధాన సంఘటనలనే వివరిస్తాను. వాటిని చదివినవారికి త్రైలింగ స్వామి త్రికాలజ్ఞుడని, నిర్వికారుడని, సదానందుడని, దయాసాగరుడని, జీవన్ముక్తుడని మహాపురుషుడనీ విశదమవుతుంది.
ధర్మాలకు సంబంధించిన వివిధోపన్యాసాలను విని, అనేక ధర్మాలను పరీక్షించి చూచిన తరువాత, నా మనస్సులో ఒక సందేహం కలిగింది. శాస్త్రాల్లో జన్మ జన్మాంతర సిద్ధాంతాలు ప్రతిపాదింపబడినాయి. స్వర్గ నరకాలు, నానాయోని భ్రమణములు, సుఖదుఃఖాలు మొదలైనవి వారు వారు చేసుకొన్న సుకృతులు, దుష్కుృతులవలన కలుగుతూ ఉంటాయని సాధువులు, మహాత్ములు, జ్ఞానులు అయిన మహానుభావులు చెబుతూ ఉంటారు.
ఇదంతా తెలిసి కూడా పునర్జన్మను గురించి మహాపురుషుడైన త్రైలింగస్వామి అభిప్రాయమేమిటో వారిద్వారానే తెలుసుకోవాలని నా మనస్సులో కోరిక కలిగింది. ఒకసారి హరిద్వార్ వరకూ తీర్థయాత్ర చెయ్యాలనుకొన్నాను. అయితే అంతకుముందే కాశీధామం వెళ్లి త్రైలింగ స్వామిని దర్శించి నా సందేహ నివృత్తి చేసుకోవాలని తీవ్రమైన కోరిక కలిగింది. నా సందేహం పండితులవల్ల నివృత్తి అయ్యేది కాదు.
ఎందుకంటే పండితులంతా తార్కికబుద్ధి కలవారు. నా సందేహం తర్కానికి అందేది కాదు. ప్రత్యక్ష ప్రమాణం చూపగలిగినవారు స్వామీజీ ఒక్కరే! కనుక ఎలాగైనా స్వామివారిని దర్శించి నా సంశయం తొలగిపోనంతవరకూ తిరిగి రాకూడదని నిశ్చయించుకొన్నాను. అప్పుడు నేను ముంగేర్ అనే పట్టణంలో ఉన్న ఒక పెద్ద ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. కనుక శలవు లభించకపోతే వెళ్లటం అసంభవం. శలవు దొరికేవరకూ నా మనస్సు చిరాకుగా ఉండింది.
వంగ సంవత్సరం 1287లో నాకు మూడు నెలలు సెలవు దొరికింది. అప్పుడు మాఘ శుద్ధ విదియ నాడు తీర్థయాత్రకు బయల్దేరాను. ముంగేర్
దానిని కనిపెట్టుకొని వున్న రామచంద్ర ముఖోపాధ్యాగారికి చటోపాధ్యాయగారు ఒక ఉత్తరం వ్రాసి ఇచ్చి, నాకు కాశీలో వసతి కల్పించారు. ఆ ఉత్తరంవల్ల నాకెంతో ఉపకారం జరిగింది. రామచంద్ర ముఖోపాధ్యాయ నాకు అన్నిసౌకర్యాలు కలిగించి ఆదరించాడు. మొదట నేను నా తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలు చేశాను. ఆ తరువాత బ్రాహ్మణ భోజనాలు, కుమారీ పూజలు ఆయన సహాయంతోనే పూర్తి చేశాను. ఏడు రోజులపాటు కాశీలోని తీర్థాలన్నింటికీ మేమిద్దరం తిరిగాము.
ఆయన సంతోషంగా నాతోపాటు అన్ని మందిరాలను, దేవతలను చూపించాడు. అక్కడ విశేషాలను ఆయన వర్ణించి చెప్పాడు. మధ్యలో ఆయన పంచగంగాఘాట్లో ఉన్న బిందుమాధవ మందిరాన్ని, మహాత్మా త్రైలింగస్వామి ఆశ్రమాన్ని నాకు చూపించాడు. త్రైలింగస్వామి దివ్యస్వరూపాన్ని చూడగానే నా మనస్సులో అత్యంత భక్తిశ్రద్ధలు జనించాయి. కొంతసేపు అక్కడ ఉండి ఆయనకు నా నమస్కారం చేసుకొని ఇద్దరమూ తిరిగి వచ్చాము. నా మనోభావాలను రామచంద్రగారితో నేను చెప్పలేదు. ఇంటికివచ్చిన తరువాత, త్రైలింగస్వామి గుణగణములను, వారిలోని దివ్యశక్తులను గూర్చి అడిగాను.
వారు విశేషంగా చెప్పకపోగా, ఇట్లా చెప్పారు. ‘‘ఆయనను గురించి అడుగుతున్నారెందుకు? ఆయనకు మంచి- చెడు అనే విచక్షణ లేదు. ఆయనొక పిచ్చివాడు. కులభేదాలు లేవు. ఏది దొరికితే అది తింటాడు. దుకాణాలదగ్గరి వస్తువులను ఏరుకొంటూ ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. దిగంబరంగా తిరుగుతూ ఉంటాడు. భయంకరమైన ఎండాకాలంలో ఇసుక తినె్నలమీద నిద్రిస్తాడు. వణుకు పుట్టించే చలిలో గంగానది నీళ్లలో మునిగి ఉంటాడు. ఒక్కొక్కసారి 2, 3 గంటలపాటు నీటిలోనే ఉంటాడు. ఒక్కొక్కసారి నీటి మీద తేలియాడుతూ కన్పిస్తాడు. అందుచేత ప్రజలాయనను ‘కుంభకయోగి’ అని అంటూ ఉంటారు. అతని వయస్సు ఏడెనిమిది వందల సంవత్సరాలుండవచ్చును. కాని ఎప్పుడూ ఒకేలాగా కన్పిస్తూ ఉంటారు’’ అని చెప్పాడు.
మర్నాడు ఉదయం మణికర్ణికలో స్నానం చేసి, వౌనస్వామియైన మహాత్మా త్రైలింగస్వామి పూజ్యపాదుల దర్శనానికి వెళ్ళాను. వారికి నమస్కరించి ఒక స్తంభాన్ని ఆనుకొని, వారి దివ్య స్వరూపాన్ని చూస్తూ నిలుచుండిపోయాను. పునర్జన్మను గురించి వారిని అడిగి తెలుసుకొని, నా సందేహ నివృత్తి చేసుకోవాలనుకొన్నాను. కాని ఆయన దగ్గరకు వెళ్లి కూర్చోటానికి సాహసించలేకపోయాను. నేను ఏమీ మాట్లాడకముందే స్వామి సంజ్ఞ చేసి నన్ను వెళ్లిపొమ్మన్నారు. మరికొంతసేపు అక్కడే ఉందామనుకొన్నాను. కాని మంగళదాస్ నన్ను తొందరగా వెళ్లిపొమ్మన్నాడు. నేను ఎంతో విచారపడుతూ నానా రకాల ఆలోచనలతో ఇంటికి వెళ్లాను. అదే రోజు మధ్యాహ్నం మళ్లీ ఆశ్రమానికి వెళ్లి నమస్కరించి, ఒక స్తంభానికి ఆనుకొని నిలుచున్నాను. నన్నుచూసి స్వామి ఉదయంలాగానే వెళ్లిపొమ్మని సంజ్ఞ చేశారు. అది చూసి మంగళ్దాస్ నన్ను త్వరగా వెళ్లిపొమ్మన్నాడు. దెబ్బతిన్న హృదయంతో వివశుడై, అప్రసన్న మనస్సుతో ఇంటికి వెళ్లిపోయాను.
మూడో రోజు ప్రొద్దున్న స్నానం చేసి ప్రతిరోజూవలెనే స్వామివారి ఆశ్రమానికి వెళ్లి నమస్కరించి, అదే స్థానంలో నిలబడినాను. ఈవేళకూడా స్వామీజీ పొమ్మని సంజ్ఞ చేశారు. మంగళదాస్ త్వరగా వెళ్లిపొమ్మన్నాడు. అయినా నేను వెళ్లకపోయేసరికి, స్వామీజీ కోపగించి, నన్నక్కడినుంచి తొలగించమని గోసేవకులను ఆజ్ఞాపించారు. వారు నన్ను బలవంతంగా తోసివేశారు. నేను సిగ్గుపడి, అవమానంతో విచారిస్తూ ఇంటికి వచ్చాను. నానారకాలుగా ఆలోచిస్తూ, హతాశుడనైనాను. నా అదృష్టం ఎట్లా ఉన్నదో ఏమో- నేను మాత్రం నా నమ్మకాన్ని విడువలేదు. అత్యంత భయభక్తులతో మళ్లీ మధ్యాహ్నం ఆశ్రమానికి వెళ్లి, యథాపూర్వకం నమస్కరించి, అదే స్థానంలో నిలుచున్నాను. పూర్వంలాగానే నన్నువాళ్లు త్రోసివేశారు. ఎట్లాగైనా అక్కడ కూర్చోటానికి కొంత స్థానం సంపాదించటమే నా ప్రధాన లక్ష్యం.
అందువలన అక్కడ ఉండే సేవకులకు కొంత డబ్బు ఇచ్చి తృప్తిపరిస్తే, వారు అక్కడినుంచి నన్ను తొలగించరని అనుకొన్నాను. అంతేకాక స్వామివారు సంజ్ఞ చేసినా, అక్కడే నిలిచి ఉండాలని, నా అనుమానం తీరిపోయేవరకూ తిరిగి రాకూడదని నిశ్చయించుకొన్నాను.
నాలుగవరోజు ఉదయం మణికర్ణికాఘాట్లో స్నానం చేసి ఆశ్రమానికి చేరుకొని మంగళదాస్ ఠాకూర్ దగ్గరే కూర్చున్నాను. మంగళదాస్ ఠాకూర్కు నాలుగు రూపాయలు, గోసేవకులకు రెండు రూపాయలు సమర్పించుకొని, నన్ను అక్కడినుంచి వెళ్లగొట్టవద్దని చేతులు జోడించి వేడుకున్నాను. వారు తృప్తిపడి అంగీకరించారు. కాని మంగళదాస్ మాత్రం స్వామివారి అనుమతి లేనిదే అక్కడ ఉండటం అసంభవమని, తాము ఏమీ చెయ్యలేమని, స్వామివారి ఆజ్ఞను పాటించక తప్పదని చెప్పాడు. నేను భయపడుతూనే స్వామివారి ముందు స్తంభందగ్గర యథాప్రకారంగా నిలుచున్నాను. కాని కొంచెం ముందుకు వెళ్లి మనసులోని మాటను చెప్పటానికి సాహసించలేకపోయాను. అయితే, బయటకు వెళ్ళగొడతారనే భయం లేకపోవుటవలన నా సంశయాన్ని తీర్చుకోటానికే నిశ్చయించకొన్నాను.
అట్లా నిర్ణయించుకొని కొంచెం ముందుకువెళ్ళాను. అదే సమయంలో కలకత్తానుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు స్వామివారికి నమస్కరించి అక్కడ నిలబడినారు. కొంచెం సేపటికి స్వామివారు వారిని వెళ్లిపొమ్మని సంజ్ఞ చేశారు. వారిద్దరిలో నమ్రస్వభావంగల వ్యక్తి వెళ్లిపోవటానికి సిద్ధమయ్యాడు. కాని, ఉగ్రస్వభావంగల రెండోవ్యక్తి సేవకులతో కోపోద్రేకంతో ‘‘మేము స్వామీజీని దర్శించటానికి వచ్చాము. ఇక్కడే ఉండిపోవటానికి రాలేదు. కొంచెం సేపయినాక మేము ఎట్లాగయినా ఇక్కడినుంచి వెళ్లిపోతాము. మీరెందుకు అనవసరంగా అంత కోపంతో మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు’’ అని అన్నాడు. అది విని స్వామీజీకి కోపం వచ్చి మంగళదాస్కు సంజ్ఞ చేసి, గోసేవకుల ద్వారా అక్కడినుంచి తొందరగా వారిని పంపించి వెయ్యమని చెప్పారు. గోసేవకులు వచ్చి ‘‘స్వామివారి దర్శనమయింది కదా! అనవసరంగా గుమిగూడవద్దు. తొందరగా వెళ్ళిపోం’’డని బలవంతంగా నెట్టివేశారు. వారు ససేమిరా వెళ్లమని పట్టుబట్టారు. అప్పుడు వారిద్దరికీ కొంచెం ఘర్షణ జరిగింది. అది చూసి స్వామివారు అతనిని అక్కడ ఉండమని సంజ్ఞ చేశారు. తరువాత మంగళదాస్ను పిలిచి కాగితం - కలం తెమ్మన్నారు. మంగళదాసు వచ్చిన తరువాత గోడపైన ఉన్న ఒక శ్లోకములోని అక్షరాల మీద చేయి పెట్టి చూపించారు. మంగళదాసు వాటిని వ్రాస్తూ పోయాడు. వ్రాత పూర్తి అయిన తరువాత దానిని చదివి వినిపించమన్నారు. మంగళదాసు ఆ అక్షరాలను కలకత్తా బాబుకు చదివి వినిపించాడు. అందులో నీవు పద్దెనిమిది రూపాయల విలువైన పాదరక్షలను బయట వదిలి నన్ను చూడటానికి వచ్చావు. ఎవరైనా వాటిని ఎత్తుకొనిపోతే ఇంటికి వెళ్ళటం కష్టం కదా! అదీకాక, నీవు మమ్మల్ని చూస్తున్నావా? లేక నీ పాదరక్షలను గురించి ఆలోచిస్తున్నావా? ఏమి ఆలోచిస్తున్నావో నిజం చెప్పు. నీవు కాలం వృధా చెయ్యక నీ పాదరక్షలను తీసుకొని వెళ్లిపో. ఇప్పటివరకూ వాటిని ఎవరూ ఎత్తుకొని పోలేదు. త్వరగా వెళ్లు’’ అని ఉన్నది. ఆ సంఘటన చూసి, అక్కడివారంతా నిశే్చష్టులయ్యారు. అప్పుడు నేను ‘‘నీవు నిజంగా నీ పాదరక్షలను గురించి ఆలోచిస్తున్నావా’’ అని అడిగాను. అది చూశాక నా హృదయం భక్తిరసభరితం అయింది. ఎన్ని కష్టాలు వచ్చినా నేను వచ్చిన పని పూర్తిచేసుకోవాలని నిశ్చయించుకొన్నాను. స్వామివారి మహిమ తెలిశాక కలకత్తా బాబుకు కోపం పోయింది. బుద్ధి వచ్చింది. ఆ తరువాత స్వామివారు సంజ్ఞ చేయగానే మారు మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు.
కొంచెం సేపటికి స్వామివారు నా వైపు తిరిగి వెళ్లిపొమ్మని సంజ్ఞ చేశారు. వెళ్లిపోవద్దనుకున్నాను. కానీ సాహసం చెయ్యలేక ఇంటికి వెళ్లిపోయాను. మళ్లీ మధ్యాహ్నం ఎంతో ఆశతో ఆశ్రమానికి వెళ్లాను.
మళ్లీ అట్లాగే జరిగింది. ఆ విధంగా ప్రతిరోజూ రెండు పూటలా ఆశ్రమానికి వెళ్లి వస్తూనే ఉన్నాను. అట్లా 12 రోజులు గడిచాయి. కనీసం అక్కడ కూర్చోటానికి కూడా అవకాశం లభించలేదు. నేను ఎంతో నిరాశపడ్డాను. నా జీవితం వ్యర్థమనుకొన్నాను. నావంటి దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండడనుకొన్నాను. సత్ఫురుషుల వద్ద కూర్చొనే స్థలం కూడా నాకు లభించటంలేదు. చూడగానే తరిమివేస్తున్నారు. నేనేమి పాపం చేశానో బోధపడలేదు. అదేమి దౌర్భాగ్యమో నాకే తెలియదు. నా దురదృష్టంపట్ల నాకే దుఃఖం కలిగింది.
13వ రోజు ఉదయం మళ్లీ ఆశ్రమానికి వెళ్లి, దుఃఖం ఆపుకోలేక ఏడవటం మొదలుపెట్టాను. నా కళ్లవెంట అశ్రుధారలు ప్రవహింపసాగినాయి. అదిచూసి స్వామివారు నన్ను కూర్చోమని స్వయంగా చెప్పారు. దుఃఖాన్ని ఆపుకోమని సంజ్ఞ చేశారు. స్వామివారి దయార్ద్ర దృష్టి నన్ను మరింత దుఃఖితుని చేసింది. నేను వారి పాదాలను పట్టుకొని వెక్కి వెక్కి ఏడవసాగాను. ప్రాయశ్చిత్తంతో నా మనస్సు పరిశుద్ధమైంది. నా రుూ పరిస్థితిని చూసి స్వామివారు మంగళదాస్ను పిలిచి, ‘ఇవాళ’ అతనిని వెళ్లిపోయి, రేపు ప్రొద్దున రమ్మని’ చెప్పు అని సంజ్ఞ చేశారు. మంగళదాస్ స్వామివారి ఆజ్ఞను నాకు వినిపించారు. దానితో నా మనస్సు కొంచెం కుదుటపడింది. మళ్లీ ఏదో ఆశ నాలో చిగురించింది. నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్లి, ఆ రాత్రి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ గడిపాను.
14వ రోజున గంగాస్నానం చేసి, పరిపూర్ణ ఉత్సాహంతో ఆశ్రమానికి వెళ్లి స్వామివారికి దండ ప్రణామాలు చేసి, వారి పాదధూళిని నా సర్వాంగములకు పూసుకొని, వారి సమీపంలో కూర్చున్నాను. సత్పురుష సాంగత్యంవలన నా మనస్సున ఆవరించిన తెర తొలగిపోయింది. నా శరీరం పవిత్రమైనదే అనే భావం నాకు కలిగింది. ఆ ఆనందాన్ని లోలోపల అనుభవిస్తూ స్వామివారి అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నానను. ఇంతలో స్వామివారు మంగళదాస్కు ఏదో సంజ్ఞ చేశారు. దాని ప్రకారం మంగళదాస్ ఎఱ్ఱ రాతి వంటి ఒక గంధపు చెక్కను, ఒక గినె్నలో నీటిని తెచ్చి అక్కడ పెట్టి, ‘స్వామివారు నిన్ను గంధం తియ్యమన్నారు’ అని చెప్పి వెళ్లిపోయాడు. నేను గంధం తియ్యటం మొదలుపెట్టాను. దాదాపు రెండు జాములు తీశాక స్వామివారు స్వయంగా ఆ మిగిలిన గంధం చెక్కను ఒక రాతి గినె్నలో పెట్టి భోజనానికి వెళ్లమన్నారు. నేను వారి ఆదేశానుసారం భోజనానికి వెళ్లి మళ్లీ ఆశ్రమానికి తిరిగి వచ్చాను. స్వామీజీ నన్నుచూసి, మళ్లీ గంధం తియ్యమని సంజ్ఞ చేశారు. నేను మధ్యాహ్నం వరకూ అట్లాగే తీస్తున్నాను. కొంచెం సేపటికి ఒక బ్రహ్మచారి వచ్చాడు. స్వామివారు నేను తీసిన గంధమును అతనికి ఇచ్చి, దేవనాగరిలిపిలో వ్రాసి ఉన్న ఒక కాగితం కూడా ఇచ్చి ఆ గంధంతో వాకిలి గోడమీద ఏదో వ్రాయమన్నారు. ఆ బ్రహ్మచారి ఏదో వ్రాశాడు. సాయంకాలమయ్యాక, మిగిలిపోయిన గంధం ముక్కను ఒక గినె్నలో పెట్టి ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు. స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఇంటికి వెళ్లిపోయాను.
పదిహేనవ రోజు నియమ ప్రకారం పొద్దునే్న పంచగంగా ఘాట్లో స్నానం చేసి ఆశ్రమం చేరుకొని, స్వామివారి సమీపంలో కూర్చున్నాను. వారు నిన్నటిలాగానే గంధం తియ్యమని సంజ్ఞ చేశారు. అరగదీసి అరగతీసి చేతులు నొప్పి పుట్టడంవలన మెల్లగా అరగదీయసాగాను. అది చూసి స్వామివారు గంభీరంగా ముఖం పెట్టి వేగంగా చెయ్యమని చేతులతో సంజ్ఞ చేసి చెప్పారు. వారి ముఖకవళికలు చూసి వేగంగా అరగతియ్యసాగారు. తరువాత వారు చేసిన సంజ్ఞ ప్రకారం తీసిన గంధాన్ని అక్కడ పెట్టి ఇంటికి వచ్చి భోజనం చేసి రెండు గంటలకు ఆశ్రమం చేరుకొన్నాను. ఈ ప్రకారం నిత్యం నియమిత వేళలో రెండు చేతులతో రెండు పూటల గంధం తీసి తీసి నా చేతులు బలహీనమయ్యాయి. ఆ విధంగా 15 రోజులు గడిచాయి. నా చేతులు, అన్నం కూడా తినలేనంత బలహీనమయ్యాయి.
నా అదృష్టం ఎట్లా ఉంటే అట్లా అవుతుందని మనస్సులో అనుకొన్నాను కాని, పైకి మాత్రం అనలేకపోయాను. రెండు పూటలా నేను గంధం అరగదీస్తూ ఉంటే, ఆ బ్రహ్మచారి ప్రాంగణంలోని గోడలమీద శ్లోకాలు వ్రాసేవాడు. ప్రతిరోజూ నేను తీసిన గంధం అంతా అయిపోతూ ఉండేది. బ్రహ్మచారికి ఏమీ కష్టం లేకపోయినా, నేను మాత్రం అలసిపోయేవాడిని.
ఈ విధంగా 28 రోజులు గడిచిపోయాయి. 29వ రోజు ప్రొద్దునే్న స్నానం చేసి వచ్చి, స్వామివారికి నమస్కరించి వారి సమీపంలో కూర్చున్నాను. ఒకవేళ ఆ రోజు కూడా గంధం తియ్యమంటే నా చేతకాదేమోననిపించింది. నా చేతులు అలసిపోయాయి. ఇవ్వాళ నా పరిస్థితి ఏమిటో అనుకొన్నాను. నేను గంధం తియ్యలేకపోతే, స్వామివారు నన్ను అక్కడినుంచి పంపించివెయ్యవచ్చు. అట్లా జరిగితే నా ఆశలన్నీ మట్టిలో కలిసిపోయినట్లే. ఇన్ని రోజులూ కష్టపడి చేసిన పరిశ్రమ వృధా అని, నా ఆశలకు తిలోదకం వదిలి తిరిగి వెళ్లవలసి వస్తుందే అని నా మనస్సు చాలా వ్యాకులం చెంది ఉండింది. కళ్లనుండి కన్నీళ్లు ధారగా ప్రవహిస్తున్నాయి. కొంచెం సేపటికి స్వామివారు నన్ను చూసి నవ్వారు. నేను దేవనాగరి లిపి చదవగలనో లేదో అని మంగళదాస్ చేత అడిగించారు. నేను చదవగలనని అనగానే స్వామివారు తమ వేదికమీద పరచిన గొంగళి క్రింద నుంచి చెక్కలతో కట్టి వున్న ఒక తాటాకు గ్రంధం తీసి నా చేతికిచ్చారు. దీనిలో ఉన్న శ్లోకాలన్నింటిని బెంగాలీ భాషలోకి అనువదించమని మంగళదాస్ చేత చెప్పించారు. నాకు బంగారం దొరికినంత ఆనందం కలిగింది. అప్పటినుంచీ గంధం అరగదీసే పనికి విముక్తి లభించింది. స్వామివారి కృప లభించినందుకు ఎంతో సంతోషించాను. కలం, కాగితాలు, సిరాబుడ్డి తీసుకొని అనువదించసాగాను. ప్రతి కాగితం కింద నా సంతకం ఉంది. అయిదు రోజులు కష్టపడి ఆ శ్లోకాలను బెంగాలీ భాషలోకి అనువదించాను. స్వామివారు వాటిని చదివి వినిపించమని సంజ్ఞ చేశారు. అన్ని శ్లోకాలు చదవటంపూర్తి అయిన తరువాత, తాటాకు పుస్తకాన్ని చెక్కలతో కట్టేసి గొంగళి క్రింద పెట్టుకొన్నారు.
ఆ తరువాత అక్కడినుంచే మరొక తాటాకు పుస్తకాన్ని తీసి ఇచ్చి ఇదివరకటిలాగానే అందులోని శ్లోకాలను కూడా బెంగాలీ భాషలోనికి అనువదించమని ఆదేశించారు. ఈ తాటాకు పుస్తకం మొదటి దానికన్నా కొంచెం చిన్నది. కనుక మూడు రోజులలో దానిని పూర్తిచేశాను. వాటిని కూడా చదివి వినిపించిన తరువాత, ఆ తాటాకు పుస్తకాన్ని కూడా యథాస్థానంలో గొంగళి క్రింద పెట్టి, నన్ను ఇంటికి వెళ్లి భోజనం చెయ్యమన్నారు.
నేను భోజనం చేసి, ఆశ్రమానికి తిరిగి వచ్చి, స్వామివారి దగ్గర కూర్చున్నాను. వారు నావైపు చూస్తూ పడుకొన్నారు. ఈ రోజున నేను చేయవలసిన పని ఏమీ లేదనిపించింది. స్వామి నా వైపుకు తిరిగి, నన్ను చూస్తూ అట్లాగే పడుకున్నారు. నేను వారి పాదధూళిని తీసి నా శరీరానికి పూసుకొని, వారి పాదసేవ చేయసాగాను. నాకు సాధువుల సేవ చేసే సౌభాగ్యం లభించినందుకు సంతోషపడ్డాను.
స్వామివారు సంధ్యాకాలంలో లేచారు. మరునాడు ప్రాతఃకాలం కాకుండా సాయం సమయాంతరమున రమ్మని నాకు సంజ్ఞ చేశారు. మంగళదాస్ నన్ను ఇంటికి వెళ్లమని సంజ్ఞ చేశారు. నేను ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్లాను. నా కష్టమంతా పటాపంచలైపోయింది. రాత్రి పూర్తయి, దినమంతా గడిచిపోయి, సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని నిరీక్షిస్తూ కాలం గడపసాగాను. రెండవ రోజు సాయంత్రం తొందరగావెళ్లి స్వామీజీని దర్శించాలనే కుతూహలంతో ఆశ్రమానికి వెళ్ళాను. స్వామివారి ఆశ్రమంలో ఉన్న పెద్ద మహదేవమూర్తిని కాళిమాతను దర్శించి, హారతులు తీసుకొని, స్వామివారి దగ్గర కూర్చున్నాను. స్వామీజీ నన్ను ఒక చిన్న గదిలోకి తీసుకొని వెళ్లారు. అందులోకి ఎవ్వరూ రాకూడదని కట్టడి చేశారు. ఆ గదిలో ఒక ఆసనం ఉన్నది. అక్కడ ఒక చిన్నదీపం వెలుగుతున్నది.
స్వామివారు ఆ ఆసనంమీద కూర్చున్నారు. నేను వారి దగ్గర కూర్చున్నాను. భక్తవత్సలుడైన స్వామి, భక్తుల కోరికలను తీర్చటానికి తమ వౌనవ్రతాన్ని వదిలిపెట్టి గంభీరంగా ఇలా అన్నారు. ‘‘నీవు దేనిని మనస్సులో పెట్టుకొని దాని సమాధానం కోసం ఇక్కడికి వచ్చావో దానిని గురించి ఇంత సందేహం ఎందుకు? త్రికాలదర్శులు, ఆత్మతత్త్వజ్ఞులు అయిన దేవర్షులు- మహర్షులు పుణ్యాత్ములు. తపోబలంతో వారు చేసిన సిద్ధాంతాలను గురించి నీవు సందేహపడనక్కరలేదు. వారుచెప్పినది సత్యం.
జీవుడు తాను చేసిన సుకృతులకు- దుష్కృతులకు అనుగుణంగా సుఖదుఃఖాలను అనుభవించటానికి జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అది కూడా సంపూర్ణ సత్యమే. ఈ జన్మల సంగతిని గురించి తెలుసుకోగలవాడు మనిషి ఒక్కడే. కాని దానిని గురించి తెలుసుకోవాలని ఎవరూ ప్రయత్నించకపోవటం ఒకటే దుఃఖాన్ని కలిగించే విషయం. నేను నీతో అంటున్నది వాస్తవం. దానికి ప్రమాణం ఏమిటి? దానిని ఎట్లా విశ్వసించాలి? అని నీవు సందేహించవచ్చు. దానికి సమాధానం చెబుతాను. నీవు నామీది విశ్వాసంతో పునర్జన్మను గురించి తెలుసుకోవాలని ఇన్ని కష్టాలూ అనుభవించావు. పునర్జన్మను గురించి నీకు చక్కగా అర్థమయ్యేటట్లు తప్పక చెబుతాను.
మొదట నేను నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గురించి చెబుతాను. అవి సత్యమే అని నమ్మకం కుదిరిన తరువాత నీవు, పునర్జన్మను గురించి నేను చెప్పిన దానిని నిశ్చయంగా సత్యమని నమ్ముతావు. మానవునికి పునర్జన్మ సంభవించినప్పుడు, అప్పుడు ఈ జీవితంలోని సర్వవిషయాలు జీవాత్మలో నిక్షిప్తమవుతాయి. ఆ జీవాత్మను స్వీకరించిన పరమాత్మ, పునర్జన్మకు కారణమైన జీవాత్మను తిరిగి నిర్మిస్తాడు.
అందుచేత ఈ జన్మలో విద్వాంసుడైన వాడు తరువాతి జన్మలో కూడా విద్వాంసుడై పుడతాడు. ఈ జన్మలో మంచి వాద్యకారుడైతే వచ్చే జన్మలో కూడా మంచి వాద్యకారుడవుతాడు. ఈ జన్మలో మంచి ధార్మికుడైతే వచ్చే జన్మలో కూడా మంచి ధార్మికుడవుతాడు. ఈ జన్మలో దొంగ అయినవాడు వచ్చే జన్మలో దొంగవుతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుని దయామయుడని, సర్వశక్తిమయుడని మనం అనుకోము. భగవంతుడు ఆలోచించినంత గొప్పగా మరెవ్వరూ ఆలోచించరని అందరూ ఒప్పుకొంటారు. ఒకవేళ మరో జన్మ లేకపోతే ఒకరు రాజు- మరొకరు సాధారణ జనుడు; ఒకడు ధనవంతుడు, నిర్ధనుడు, ఒకడు బ్రాహ్మణుడు మరొకడు చండాలుడు, ఒకడు పల్లకీ ఎక్కేవాడు, మరొకడు మోసేవాడు; ఒకడు ఆరోగ్యవంతుడు- మరొకడు రోగి; ఒకడు భాగ్యవంతుడు- మరొకడు నిర్భాగ్యుడు ఎట్లా అవుతారు?
జీవితంలో ఇన్ని భేదాలు ఎందుకు వస్తున్నాయి? ఏ తప్పు చేయని వాడు ఏ శిక్షా అనుభవించనవసరం లేదు. ఈశ్వరుడు మంచి చెడ్డలను గురించి ఆలోచించడా? తాను ఇష్టం వచ్చినట్లు చేస్తాడా? అట్లా ఎప్పుడూ జరగదు. ఈశ్వరునిలాగా ఆలోచన చేసేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఈ మాటను ఎవ్వరూ తెలుసుకోలేరు. అందుచేతనే వారి వారి కర్మఫలాలను అనుసరించి ఇన్ని భేదాలున్నాయి. ఈ జన్మ యొక్క ఆకృతి, వర్ణము, విద్య, బుద్ధి, స్వభావము, కర్మఫలము- ఇవన్నీ అతి సూక్ష్మరూపంలో జీవాత్మలో నిక్షిప్తమై ఉండి, పునర్జన్మకు హేతువులవుతాయి. అందువలననే మనుష్యులు నానారకాల ఆకృతులకు, అవస్థలకు ఒదిగి, సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తారు. అద్దంలో చూసినపుడు ప్రశాంతమైన ముఖం ప్రశాంతంగాను, వికటించిన రూపము వికటంగాను ప్రతిబింబిచినట్లే, ఒక జన్మలోని పరిస్థితులు కూడా మరొక జన్మలో ప్రతిఫలిస్తాయి. అన్యాయము, అసత్కార్యాలు చేస్తే ఆత్మఅథోగతి నొందుతుంది. ధర్మము, సత్కర్మలు చేస్తే ఆత్మ ఉన్నత స్థితని పొందుతుంది. దీనిలో ఏ మాత్రమూ సందేహం లేదు. ఒకవేళ నీవు దొంగతనం చేస్తే నిన్ను ప్రభుత్వం దండిస్తుంది. నీవు ఏ తప్పు చేయకపోతే నిన్ను దండించే అధికారం ఎవరికీ ఉండదు.
0 వ్యాఖ్యలు:
Post a Comment