ఆదమరచి ప్రమాదంలో పడబోయినా పట్టుకుని కాపాడిన ..హనుమత్ మహిమ ఇది
>> Friday, April 18, 2025
మొన్న గిద్దలూరు నుండి మిత్రులు ....రావు గారు ఫోన్ చేశారు .స్వామీ ! మా బావగారు మీతో ఒకసారి మాట్లాడాలని కోరుతున్నారు. వీలయితే మీ దగ్గరకు వెల్లివద్దాం అని అడుగుతున్నారు. అన్నాడు . ఎందుకు స్వామీ ! అని అడిగాను . ఆయన పెద్ద ఇబ్బంది లో ఉన్నారు . దానికోసం మీ తో మాట్లాడాలని . ఏమైనది అని వివరమడిగాను . మీకు గుర్తున్నదా స్వామీ . పది సంవత్సరాల క్రితం నేను బెంగళూరు దగ్గర లో ఒకస్థలం కొనాలని వెళ్లి అక్కడకు వెళ్ళగానే చాలా ఇబ్బంది కలిగి మీకు ఫోన్ చేస్తే ,మీరు వెంటనే ఆ స్థలం నుండి బయటకు వచ్చెయ్యమని చెప్పారు. నేను తిరిగి వచ్చాను .అక్కడకు నన్ను తీసుకెళ్ళిన మా బావగారు మాత్రం తీవ్రమయిన ఇబ్బందులలో పడ్డాడు అని అన్నాడు. నాకు గుర్తు లేదు విషయం పూర్తిగా చెప్పండి అన్నాను. పది సంవత్సరాల క్రితం మా బావగారు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేసి రిటైరయ్యి వచ్చిన డబ్బులతో బెంగళూరు సమీపంలో స్థలం కొనాలనుకున్నాడు .నన్నుకూడా కొంతస్థలం తీసుకొమ్మని ప్రోత్సహించాడు . అప్పుడు మీరు దీక్షలో ఉన్నారు. నేనుకూడా మీ సూచనలతో దీక్ష సాగిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో భారీగా పెరుగుతుంది ది అనే ఆశతో వెళ్ళాము. ఈయన అంతకుముందే బ్రోకర్లతో మాట్ళాడిఉన్నాడు. సరే నని ఆస్థలం దగ్గరకు వెళ్లి అడుగు పెట్టగానే నాకు కరెంట్ షాక్ కొట్టినట్లు ఒళ్ళు జలదరించి పోయింది. నేను వెంటనే మీకు ఫోన్ చేశాను ,మీరు ఆస్తలంలో ఒక్క నిమిషం కూడా ఉండ వద్దు ,వెంటనే వచ్చేయండి అని చెప్పారు. నాకు శకునం బాగాలేదు. మా మాస్టర్ గారు వద్దంటున్నారు ,నేను తీసుకోలేను అని చెప్పి వచ్చేశాను. కానీ మా బావగారు మాత్రం తనకు రిటైర్ అవగా వచ్చినవి,పెన్షన్ అమ్మిన డబ్బు తోపాటు కూతురికి అల్లుడికి చెప్పి వాళ్ళవి కూడా కొంత డబ్బు తీసుకెళ్ళి స్థలం కొన్నాడు. ఇక్కడ బ్రోకర్లు తిమ్మిని బమ్మిని చేసి వేరే సర్వేనంబర్లతో రిజిస్ట్రేషన్ చేపించారు . ఆవిషయం తరువాత మెల్లగా ఈయనకు తెలిసింది . అక్కడి బ్రోకర్ ఈయనతో మాట్లాడటం మానేశాడు.అప్పటినుండి ఈయన తిరుగుతూ ఉన్నాడు.అక్కడ ఎవరిని ఏమి చేయలేముకదా ఇప్పుడు ఈయన పరిస్థితి దారుణంగా ఉంది .ఇంట్లో కొడుకూ కోడలూ ఈయనను తిట్టనిరోజు లేదు. భార్యతోకూడా గొడవ .ఇప్పుడు అమెరికాలో ఉన్న అల్లుడు మా స్థలమన్నా మాకు చూపెట్టండి లేదా వడ్డీతో సహా నాడబ్బు చెల్లించండి అని వత్తిడి తెస్తున్నాడు. చేతిలో డబ్బుపోయి నానా ఇబ్బందులు పడుతున్నాడు .ఏదైనా మార్గం చూపెడతారేమోనన్న ఆశతో ఆయన మిమ్మలను సంప్రదించాలని అడుగుతున్నాడు అని వివరించాడు. ఆయన స్థితికి బాధ పడ్డాను .కానీ మనచేతులలో ఏముంది. ...రావు గారూ! కర్మ ఫలితాలను ఎవరూ తప్పించలేరు. ఒక్క భగవంతుడు తప్ప. కానీ అన్నీ మాకే తెలుసు అనే అమాయకంతో మనం భగవంతునికంటే మన శక్తి సామర్థ్యాలపై అపార నమ్మకంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఆరోజు మీకు స్వామి పట్ల ఉన్న అపారమైన భక్తి వలన ఆయన మీకు కొన్ని హెచ్చరికలు పంపాడు. ఎవడో నాలాంటి అనామకుని నోటిద్వారా ఇంకొంచెం జాగ్రత్తలు చెప్పించి ఆ సమయంలో మిమ్మల్ని పక్కకు తప్పించాడు. కేవలం తన శక్తి సామర్థ్యాలపై మాత్రమె నమ్మకమున్న వారుమాత్రం కర్మదేవతల లీలలో చిక్కుకు పోయారు. డబ్బులేనిరోజు తనవారికి తనపై ఎంత ప్రేమ ఉంటుందో అనుభవపూర్వకంగా తెలియటానికి కూడా కర్మదేవతలు ఇలా ఫలితాలనిస్తూ ,జీవిత చరమాంకంలోనైనా ఈ బందాలను వదిలి పరమాత్మ వైపు మళ్ళించాలని చూస్తారు . కానీ మనం మాత్రం విపరీతమయిన మమకారం తో ఈ బంధాల లో ఇంకా కూరుకు పోతూ దు:ఖిస్తూ ఉంటాము. ఇది మనలాంటి సామన్యులందరిలోనూ ఉన్నదే . సరే ! ఇప్పుడు బాధపడ్డా చేసేదేమీ లేదు. భగవంతుని పాదాలనుఆశ్రయించటం తప్ప . వీలయితే తిరుమల వెళ్లి వరాహస్వామి సన్నిధిలో ఆయన సమస్యను చెప్పుకుని ఈ సమస్య నుండి బయటపడితే ఎవరివి వాళ్లకు ఇచ్చి మిగతా డబ్బు స్వామి వారి హుండీలో సమర్పిస్తానని ,ఆపై తన జీవితాన్ని భగవంతుని చేరుకునే మార్గంలో కొనసాగిస్తాను అని మొక్కుకోమని చెప్పండి. వెల్లివచ్చాక స్వామి స్తుతి ఒకటి చెబుతాను, అది పారాయణం చేస్తూ ఉండమని చెప్పండి అన్నాను. కానీ ...రావుగారూ ! ఇటువంటి వారిలో ఎక్కువమంది ,,ఎవరో ఒకరు , మీ సమస్యను పరిష్కరించాలంటే పదిలక్షలు తీసుకురండి ,మిరపకాయలతోనో..మిరియాలతోనో మంటరేగేలా యజ్ఞం చేయాలి అని చెబితే ఇంకా అప్పుచేసైనా వెళతారు కానీ ఇలా ం భగవంతుని చరణాలపై భారం వేసి ఆయనను ఆశ్రయించి ఉండండి అంటే వినుకోరు ..అని ముగించాను ఫోన్ కాల్ .
Read more...హనుమత్ రక్షా యాగమునకు మీ గోత్రనామాలు పంపండి
>> Saturday, April 12, 2025
భగవద్బంధూ ! ఈసంవత్సర కాలము భూమిపై పెక్కు ఉత్పాతములు గోచరిస్తున్నాయని శాస్త్రకారులు సూచించు చున్నారు .పలు ఉత్పాతముల,ు ప్రక్రుతి వైపరీత్యములు తోపాటు వ్యక్తిగతముగా కూడా అన్ని రాశులవారికి కూడా కొన్ని ఇబ్బందులు సూచించు చున్నారు. ఇక కలి పురుషుని ప్రభావం ఉండనే ఉన్నది. ఈసమయాన భగవంతుని ఆశ్రయించి ఉండటమే సరైన మార్గము. ఇటువంటి విపత్కర స్థితులలో భక్తజన రక్షణకై హనుమంతుని ఆశ్రయించు మార్గముగా హనుమత్ రక్షా యాగము పేరిట ఒక యజ్ఞ ము ను గత పదహారు సంవత్సరములుగా శ్రీ వెంకటేశ్వర జగన్మాత పీఠము లో నిర్వహించబడుచున్నది . ఈ యాగంలో పాల్గొన్న వేలాదిమంది భక్తులు వారి వారి eeti బాధలను తొలగించుకుని హనుమత్ కృపతో ఇష్టకామ్యములను సిద్ధింపజేసుకునుచున్నారు. అటు వంటి భక్తుల జీవితములలో స్వామి చూపిన లీలలను కొన్ని ఇక్కడ హరిసేవ బ్లాగులో తెలియజేస్తూనే ఉన్నాము. ఈ ఏడాది పదిహేడవ ఆవృతి గా ఉగాది నుండి ప్రారంభమైనది. మే 24 అనగా వైశాఖ బహుళ ద్వాదశి శనివారం నాడు పూర్ణాహుతి జరగనున్నది. ఎప్పటి వలెనే మీ గోత్రనామాదులు పంపి మీరు మీ నివాసమునుండి హనుమాన్ చాలీసా పారాయణము , శ్రీరామ నామ లేఖనము జరిపి ఆ సంఖ్యను మాకు తెలియ పరచ వలెను.మీ తరపున ఆహుతులు ఇవ్వబడతాయి.కోరినవారికి ప్రసాదములు పంపబడతాయి.ప్రత్యక్షముగా యాగములోపాల్గొన దలచిన వారు పూర్ణాహుతి ఇక్కడకు రావచ్చు. ఇందులో పాల్గొనుటకు కేవలం భక్తిగా ఆయన పాదాలను ఆశ్రయించి పారాయణము శ్రీరామ నామ లేఖనము మాత్రమే దక్షిణ గా మేము అడుగుతూ ఉంటున్నాము.సాధారణ నియమాలతో పాల్గొనవచ్చును.మీరు వెంటనే గోత్ర నామాలు పంపి మొదలు పెట్టగలరు. ఇక కొన్ని కఠినతరమైన సమస్యలను అధిగమించుటకు కష్టతరమైన కార్యములు సాధించుటకు కొన్నిప్రత్యేక నియమాలు పాటించుట వలన సాధన శీఘ్రఫలితాలనిస్తుంది.అటువంటి అవసరం ఉన్నవారు మమ్ము సంప్రదిస్తే అవసరమగు సలహాలను ఇచ్చుటకు మా శక్తిమేర ప్రయత్నిస్తాము. ఇది స్వామి వారి అనుగ్రహం మీ పై సంపూర్ణంగా కలగాలని కోరుతూ కలియుగములో సామూహిక సాధన విశేష ఫలితాలనిస్తుంది కనుక అందరము కలసి నడచు శుద్ధ భక్తిమార్గము . జై శ్రీరామ్ భక్తజనదాసుడు దుర్గేశ్వర durgeswara@gmail.com 9948235641 లలో మమ్ములను సంప్రదించవచ్చు. visit ....durgeswara. blogspot.in
Read more...