చందోలు శాస్త్రిగారి గూర్చి వారి ప్రత్యక్షశిష్యులు
>> Friday, September 5, 2014
ఫ్రమ్ ఫేస్ బుక్
durgeswara@gmail.com cell 9948235641
తన ఎదుట ఉన్న దైవస్వరూపులైన స్వామివారి పాదాలను పట్టుకొని నమస్కరించి, తనకు సంక్రమించిన భయంకర వ్యాధి నుంచి విముక్తిని ప్రసాదించమని ప్రార్థించాడు. కరుణామయులైన స్వామీజీ గంగానదిలోని మట్టిని తెచ్చి తినమని చెప్పి, తాము స్నానానికి వెళ్లిపోయారు.
ఆ బ్రాహ్మణుడు భక్తిప్రపత్తులతో స్వామి చెప్పినట్లు చేసి, కొద్ది రోజులలోనే రాజయక్ష్మం రోగం నుంచి పూర్తిగా విముక్తుడై దివ్య తేజస్సును పొందాడు. అప్పటినుంచీ అతడు స్వామివారిని సాక్షాత్తు భగవంతునిగానే భావించి సేవ చేయసాగాడు. స్వామివారి పాదధూళిని పరిగ్రహించి, పాదసేవ చేసి, కృతార్థుడయినయితినని భావించేవాడు.
కొన్ని దినాలకు గణపతిస్వామి వేదవ్యాసాశాశ్రం వదిలి, హనుమాన్ ఘాట్లో నివసింపసాగారు. ఒక మహారాష్ట్ర మహిళ ప్రతిరోజు విశ్వనాథుని సేవించటానికి వస్తూ ఉండేది. దిగంబరులైన స్వామిని చూసి తిరస్కార భావంతో తొలగిపోతూ ఉండేది. గణపతిస్వామి వారు మాత్రం ఆమెను పట్టించుకొనేవారు కారు. ఒక రోజు ఆమె విశే్వశ్వరుని పూజ పూర్తిచేసుకొని ఇంటికి తిరిగి వచ్చింది.
ఆ రాత్రి విశ్వనాథుడు ఆమెకు కలలో కనిపించి ‘‘నీవు ఏ కోరికను పొందవలెనని పూజ చేస్తున్నావో అది నాతో నెరవేరదు. ఏ స్వామివారిని నీవు తిరస్కరిస్తున్నావో ఆయనవల్లనే నెరవేరుతుంది’’ అని చెప్పాడు. అది విని ఆమె ఎంతో పశ్చాత్తాపపడి, తన మనస్సులో పరితపించసాగింది. స్వామివారిని అకారణంగా తిరస్కార భావంతో చూసినందుకు ఎంతో తప్పు చేసిట్లు భావించింది. కాని, స్వామివారు ఏమీ అనకపోవటంవలన తనపట్ల ఆయన దయచూపుతారని ఆశించింది.
మరునాడు ప్రొద్దున ఆమె హనుమాన్ ఘాట్కు వెళ్లి, స్వామివారి పాదాలమీదపడి క్షమించమని వేడుకొని- ‘‘నా భర్తకు కడుపులో ఒక పెద్ద పుండు ఉన్నది, దానిని నయము చెయ్యమని ప్రతిరోజు విశ్వనాథుని పూజిస్తున్నాను’’ అని విన్నవించుకొన్నది. ఆమె ప్రార్థనను విన్న స్వామివారు ఆమెకు కొంచెం భస్మం ఇచ్చి, దానిని అతని వక్షస్థలం మీద వ్రాయమని చెప్పారు. గణపతి స్వామివారికి ఆమె భక్తిప్రపత్తులతో నమస్కరించి, ఇంటికి వెళ్లి, వారు చెప్పినట్లు చేసింది. కొద్ది రోజులలోనే ఆమె భర్త పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు.
ఆ తరువాత గణపతిస్వామి హనుమాన్ఘాట్ను వదిలి, దశాశ్వమేధఘాట్వద్ద నివసింపసాగారు. రాంపూర్ నివాసి అయిన శివప్రసాద్ మిశ్రా అనే బ్రాహ్మణుని కుమారుడు పక్షవాతంతో బాధపడుతూ ఉండేవాడు. ఎన్నిమందులు వాడినా అది తగ్గలేదు. ఒకరోజున శివప్రసాద్ మిశ్రా తన కుమారుని తీసుకొని గణపతిస్వామివారిని దర్శించి, ఆ పిల్లవానిని స్వామిపాదాల చెంత ఉంచి, నయం చెయ్యమని ప్రార్థించాడు.
కరుణామయులైన స్వామీజీ ఆ బ్రాహ్మణుని మాటలు విని, ఆ పిల్లవానిని శిరస్సు నుంచి కాళ్లవరకూ చూశారు. ఆ తరువాత అతనిని స్పృశించి ఇంటికి తీసుకొని వెళ్లమని ఆదేశించారు. ఆ బ్రాహ్మణుడు స్వామివారి పాదధూళిని గ్రహించి, ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్లాడు. కొద్దిరోజులకే ఆ బాలుడు పక్షవాతం నుంచి విముక్తుడై ఆరోగ్యవంతుడైనాడు. ఈ విధంగా గణపతి స్వామివారి అసాధారణమైన ప్రతిభ ప్రచారమై నాలుగుదిక్కులా వ్యాపించింది. ఎందరో స్వామివారి వద్దకు వచ్చి, తమ కోర్కెలను తీర్చమని ఎన్నోవిధాల కోరుకునేవారు. అందువలన స్వామివారి పారిమార్థిక జీవనానికి విఘ్నం కలుగసాగింది. అందుకు స్వామీజీ వౌనవ్రతం పాటించడం ప్రారంభించారు. ఎవరితోనూ మాట్లాడేవారుకారు. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, ఒకటిరెండు మాటలు మాత్రం మ్లాడేవారు. ఎవరు ఏది ఇచ్చినా కులగోత్రాలు లెక్కపెట్టక తినేవారు.
కాశీవాసులే కాక, ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారు కూడా, విశ్వనాథుని అన్నపూర్ణను మణికర్ణికను దర్శించినపుడు ఎలాంటి తృప్తిని పొందేవారో, అట్లాగే ఈ మహాత్ముని దర్శించి కూడా ధన్యులమైనామని భావించేవారు.
-స్వామివారి అసలు పేర్లయిన త్రైలింగధరుడు- గణపతిస్వామి వంటివి వారికి తెలియకపోవడంవలన, త్రిలింగ దేశానికి చెందినవాడని తెలుసుకొని, ఆయనను త్రైలింగస్వామి అని పిలువసాగారు.
అన్నపానీయాల విషయం గురించి ఆయన ఏమీ పట్టించుకోకపోవటం వలన ఒకరోజున ఒక దుర్మార్గుడు సున్నం కలిపిన నీటిని ఆయన చేత త్రాగించేడు. స్వామి నిర్వికార చిత్తంతో దానిని త్రాగి, అతని ఎదుటనే మూత్రవిసర్జన చేసి, నీటిని సున్నాన్ని వేరుచేసి చూపించారు.ఆ తరువాత స్వామీజీ యథేచ్చగా తిరుగవచ్చని అనుమతి ఇచ్చాడు. స్వామీజీకి అయిష్టమైన పని ఎవ్వరూ చేయరాదని ఆజ్ఞాపించాడు.
ఒకరోజున ఖాలీస్పురా నివాసి అయిన దేవనారాయణ వాచస్పతి అనే పండితుడు స్వామివారిని భోజనానికి ఇంటికి తీసుకొనివచ్చాడు. భోజనం అయిన తరువాత త్రాగటానికి నీరు కావాలన్నారు స్వామీజీ. నీరు తేవటానికి వాచస్పతి ప్రక్క గదిలోకి వెళ్లాడు. తిరిగి రావడంలో కొంచెం ఆలస్యం అయింది. వాచస్పతి తిరిగి వచ్చేసరికి స్వామీజీ నీళ్లు త్రాగుతూ కన్పించారు. ఆ నీళ్ళు ఆయనకు ఎట్లా వచ్చాయో అర్థం కాలేదు. కాని తాను చేసిన ఆలస్యానికి ఎంతో సిగ్గుపడ్డాడు పండితుడు.
వంగ సంవత్సరం 1195లో ఒక హిందూ స్వతంత్ర రాజు సపరివారంగా కాశీకి వచ్చాడు. గంగానది పట్ల ఆయనకు ప్రగాఢమైన భక్తివిశ్వాసాలు ఉండటంవలన, వారంతా సపరివారంగా నడిచివెళ్లి దశాశ్వమేథ ఘాట్లో స్నానం చేయాలని అనుకొన్నారు. కాని రాణి సామాన్యంగా మరొకరి ముందుకు రావటానికి కాని, అసలు బయటకు రావటానికి కాని ఇష్టపడదు. అందువలన వారున్న ప్రదేశం నుంచి స్నానం చేయదలచిన రేవు వరకూ తెరలు కట్టారు. లోపలికి ఎవ్వరూ రాకుండా తెరలు అమర్చబడినాయి.
నియమిత సమయంలో రాజు- రాణి దాసీలతో కలిసి స్నానానికి వెళ్లారు. స్నానం చేయటానికి ముందు వారికి అక్కడ ఎవ్వరూ కన్పించలేదు. కాని స్నానం చేసి బయటకు వచ్చేసరికి దీర్ఘకాయుడైన ఒక దిగంబర పురుషుడు వారి ఎదుట నిలబడి ఉండటం కన్పించింది. రాణి ఆ దిగంబర పురుషుని చూసి సిగ్గుపడి, దాసీ జనంతో తన నివాస స్థలానికి వెళ్లిపోయింది. అదంతా చూడగానే రాజుకు విపరీతమైన కోపం వచ్చింది.
స్వామీజీని దండించడానికి మహారాజు భటులను పంపించాడు. భటులు అక్కడికి రాగానే, రాజుకు ఒక దివ్యరూపంతో స్వామి కనిపించారు. రాజు స్వామీజీని దండించక ఏవో ప్రశ్నలు వేశాడు. స్వామీజీ సమాధానం చెప్పలేదు. ఆ తరువాత స్వామీజీని పైకి పంపించమని ఆదేశించాడు. రక్షకభటులు స్వామీజీని పైకి తీసుకొని వెళ్ళారు. ‘‘మీరు ఇక్కడికి ఎందుకువచ్చార’’ని రాజు స్వామిని ప్రశ్నించాడు. స్వామి దానికి సమాధానం చెప్పలేదు. ఇదంతావింతగా చూస్తూ ఎందరో అక్కడ చేరారు. అందులో స్వామీజీ మహిమలు తెలిసినవారు కొందరు, ఆ మహానుభావునికి ఏ శిక్షా పడకూడదని మనస్సులో భావిస్తూ ఉన్నారు.
వారి కళ్లవెంట కన్నీరు కారుతున్నా రాజుగారి ఎదుట ఏమీ చెప్పలేక, లోలోపల చాలా దిగులు పడసాగారు. వారు ఒకరితో ఒకరు మెల్లిగా మాట్లాడుకున్నదానినిబట్టి రాజుకు ఆ దిగంబర పురుషుని గొప్పతనం తెలిసింది. స్వామీజీ యథార్థ స్వరూపం తెలుసుకున్న రాజు వారిని వదిలిపెట్టమని ఆజ్ఞాపించారు. అయినా ఇద్దరు ముగ్గురు రాజుగారి అనుయాయులు స్వామివారిని అవమానపరిచిన తరువాతనే విడిచిపెట్టారు.
ఆ రోజు రాత్రి రాజుగారికి నిద్రలో ఒక భయంకర దృశ్యం కనిపించింది. జటాజూటము ధరించి, పులి చర్మం కట్టుకొని, త్రిశూలాన్ని ధరించిన ఒక వ్యక్తి భీషణాకారంతో, కళ్లు ఎఱ్ఱవి చేసి ఈ విధంగా అన్నారు. ‘‘ఓరి దురాచారీ! బుద్ధిహీనుడా! నీవు త్రైలింగస్వామి గొప్పతనాన్ని ప్రత్యక్షంగా అనుభవించి కూడా, ఆయనను అవమానపరిచి పంపించి, నా హృదయానికి చాలా బాధ కలిగించావు. దానికి తగిన శిక్షను నీవు అనుభవించవలసిందే. మూర్ఖుడా! నీవు ఇలాంటి పవిత్ర స్థలంలో ఉండదగిన వ్యక్తివికావు.
త్వరగా నీవు ఈ ప్రదేశాన్ని వదిలివెళ్లు. లేకపోతే నీకు క్షేమం లేదు’’ అని. ఆ భయంకర స్వప్నం కన్న రాజు నిద్రలో పెద్దగా అరిచాడు. ఆ అరుపు విని రాజపరివారమంతా అక్కడికి వచ్చి చూసేసరికి మహారాజు అచేతనంగా పడి ఉన్నాడు. ఆయన కనుగ్రుడ్లు పైపైకిపోతూ ఉండినాయి.అది చూసి గాభరా పడిన పరివారం, కారణం ఏమిటో తెలియక గొడవపడసాగారు. కొద్దిసేపటికి రాజుగారికి తెలివి వచ్చింది. అట్లా పెద్దగా అరవటానికి కారణమేమిటని పరిజనం రాజును ప్రశ్నించారు. కాని మహారాజు ఆ రాత్రి వారికేమీ చెప్పలేదు.
ఈ రోజు వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధనా ఉత్సవం . కాలజ్ఞానమును బోధించి భవిష్యత్ ను ముందుగా తెలిపి మానవజాతి ని మేల్కొమ్మని చెప్పిన మహానుభావుడు . కలి ప్రభావం వలన భూమిపై ఎన్ని అనర్ధాలు సంభవిస్తాయో ఆయన చెప్పిన ప్రతిమాటా సత్యమవుతూ ఉంది . సమాజంలో నెలకొన్న అసమానతలను ఖండించి మతమౌఢ్యాన్ని తెగనాడి సద్గురువై సాధకులకు దారిచూపిన దివ్యజ్యోతి తాతగారు.

ఈరోజు హనుమంతులవారి అనుగ్రహానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం . మనం సంకల్పించుకున్న "హనుమత్ రక్షాయాగము"నకు ముగ్గురు వైష్ణవాచార్యులు మంగళాశాసనములందించారు. అనుకోకుండా ఇలా గురుపరంపర ఆశీర్వచనాలివ్వడం వెనుక స్వామి కరుణ అంతర్లీనంగా ప్రకటితమవుతున్నది
ఈరోజు వినుకొండలో జరిగిన గోదారంగనాథుల కళ్యాణోత్సవానికి హాజరయిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి వారివద్దకు మనకార్యకర్తలు గురుబ్రహ్మాచారి గారు వెళ్ళి యాగనిర్వహణకు వారి ఆశీర్వచనములడిగారు .స్వామివారు ప్రతులను తీసుకుని కళ్యాణమూర్తులైన గోదారంగనాథుల పాదములచెంత ఉంచి అందజేశారు.
ఇక నల్గొండలో రామగిరి శ్రీరామాలయంలో ఉన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జియర్ స్వామి వారివద్దకు మనకార్యకర్తలువెళ్ళి యాగమునకు వారి మంగళాశాసనములు కోరారు . ఆయన వివరములడిగి '' సకలభక్తులకు శుభములను ప్రసాదించు ఈయాగము నకు శ్రీరామచంద్రప్రభువుల అనుగ్రహం సిధ్ధిస్తుందని .శుభకరమవుతుందని ఆశీర్వదించారు.
అటు తాడిపత్రి లో మిత్రులు పారాయణపర్యవేక్షకులగు విజయమోహన్ గారు
పీఠాధిపతులు ,గురుపరంపర ఆశీశ్శులనందుకోవాలని ప్రయత్నిస్తున్న మనకు అనుకోకుండా ముందుగాఏప్రణాళిక లేకుండా రాష్ట్రంలో మూడు ప్రాంతాలనుండి కార్యకర్తలు వారి వద్దకు వెళ్లిరావటం ఆశీశ్శులనందుకోవటం .........మన స్వామి హనుమ అనుగ్రహం కాక మరేమిటి ? రండి ,హనుమత్ రక్షాయాగంలోపాల్గొనటం ద్వారా స్వామిమనరక్షకుడయ్యేలా ప్రార్థనచేద్దాం . జైశ్రీరాం

జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వాములు[శృంగేరీ మహాసంస్థానం] వారు ఈరోజు హనుమద్రక్షాయాగానికి ఆశీర్వచనాలిచ్చారు. మన కార్యకర్త మనోహర్ ఈరోజు శృంగేరి వెళ్ళి అమ్మ శారదాంబకు పూజజరిపి అమ్మ అనుగ్రహం పొందారు.ఆతరువాత చంద్రమౌళీశ్వరుల అభిషేకాలను దర్శించుకుని ఆ తదనంతరం జగద్గురువుల సన్నిధానానికి వెళ్లాడు.
స్వామికి యాగవివరాలు తెలిపి యాగానికి అనుమతి కోరారు . మహాస్వాముల వారు చాలా సంతోషించి లోకకళ్యాణార్ధం జరుగుతున్న ఈ యాగానికి ... మేము ఆశీర్వదిస్తున్నాము చక్కగా జరుగుతుంది అని దీవించారు. అమ్మ అనుగ్రహానికి సంకేతం ఇది. జైశ్రీరాం..జైహనుమాన్
నువ్వు నమ్మకపోయినా సరే !నేనెప్పుడు నావారిని విడిచిపెట్టను అని తన ఉనికిని చూపుతున్న సాయి . విభూధి గావర్షిస్తున్న ఆయన అనుగ్రహం
ఈరోజు మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది . ఇక్కడ బ్లాగులోకంలో ని ఒక సొదరి, దుర్గేశ్వరగారు మీకో విషయం చెప్పాలి అన్నారు. చెప్పండమ్మా అని అడిగాను. మీకు సాయిబాబా మీద నమ్మకముందా అనడిగారావిడ . ఆయ్యో !ఎందుకడుగుతున్నారలా అన్నాను . ఏమీ లేదండి ,ఈరోజు నేను నమ్మలేని నిజాన్ని నాకళ్లతోనే చూసి ఆశ్చర్యపోతున్నాను మీకు వివరంగా చెబుతానంటూ ఆమె ఆనందం ఉద్వేగంతో ఒక దివ్యలీలను నాకు తెలియజేశారు .వారి మాటలలోనే చదవండి .
" ఒక చిన్న సాయిబాబా విగ్రహం తీసుకున్నాము మూడు సంవత్సరాల క్రితం .అదీ పూజకోసమని కాదు మామూలుగా కొన్నామంతే.
ఆ విగ్రహాన్ని నిలబెట్టటానికి వెనుకేదన్నా ఆధారం కావాలి అందుకని వెనుకగా ఆనిచి వుంచాము మందిరంలో. మొన్న ఒక విచిత్రం జరిగింది . మేము వెనుక ఉంచిన విగ్రహం ఎవరూ కదపకుండానే మేము వాడుకునే వీభూధి గడ్ద ముందుకు వచ్చి ఉన్నది. అంతేకాదు .ఆ విగ్రహాన్నుండి విభూధి ఉద్భవిస్తూ ఉంది . మొదట నమ్మలేకపోయాము . కానీ విగ్రహాన్నుండి అలా విభూధి వస్తూనే వున్నది. అక్కడక్కడా ఇలా జరుగుతున్నదని విన్నప్పుడు నేను అంతగా నమ్మేదాన్ని కాదు .నిజమేనంటావా ? అని సందేహించేదాన్ని. కానీ నాకళ్లముందే జరుగుతున్నదాన్ని ఎలా నమ్మకపోవటం. పైగా నాకు ఏదో అలా నమస్కరించుకునే అలవాటేగాని పెద్దగా పూజలు అవీ చేయను. మావారు మాత్రం చక్కగా పూజలు చేసుకుంటారు. మరి బాబా కరుణ మాపై ఎలాకలిగినదో నాకైతే తెలియదు. నేను ఈవిషయాన్ని మాబంధువులకు కొద్దిమందికి మాత్రమే చెప్పాను. బయటవాళ్లకు మీకు మాత్రమే చెబుతున్నాను . అని ఎంతో ఆనందంతో వివరించారావిడ .వారి అభిమనానికి కృతజ్ఞుడను.
అదేరోజు మావారి స్నేహితుడొకాయన మాయింటికొచ్చాడు .ఆయనయొక్క కొడుకూ కోడలు మధ్య నడుస్తున్న వివాదం లో మావారి సలహాకోసం. తన కోడలిని ఎలా వప్పించి ఇంటికి రప్పించాలా అని సతమవుతున్నారు ఆయన. మాఇంట్లో జరుగుతున్న సాయిలీల తెలిసి ఆయన ఆవిభూధిని ఎంతో భక్తిగా తనయింటికి తీసుకెళ్ళాడు. చిత్రంగా పొద్దుటకల్లా కోడలు కోపం వదలి తనంత తానుగా కాపురానికొచ్చిందని ఆయన చెప్పగా విని ఆశ్చర్యపోతున్నామని మరొక లీలను వివరించారావిడ.
ఇక్కడ ఆయన అనుగ్రహం మాకు కలిగింది దానిని పదిమందికీ చెప్పలనుకోవటం లేదు. అనవసర చర్చలు . అని కేవలం మీకు చెప్పాలనే ఉత్సుకతతో వివరిస్తున్నారన్నరావిడ. ఐతే నాకు తెలిసిన దైవలీలను నేను దాచిపెట్టి ఉంచలేను . నాపనే పరమాత్మ లీలలను ఎక్కడున్నా సేకరించి పదిమందితో పంచుకోవటం .కనుక ఆసద్గురువు లీలను, ఆవిడ మెయిల్ ద్వారా ఇందాక పంపిన ఫోటోలను సాయి ప్రసాదంగా భక్తజనులకోసం ఇక్కడుంచుతున్నాను.
ఇంత ప్రత్యక్షం గా కనపడుతున్న లీలలను అబద్దమనే సందేహ జీవుల లో ఎవరి కోసం ఈ తన ఉనికిని ఇలా బహిరంగ పరుస్తున్నాడో ! ఆ సద్గురువునకే ఎరుక .
జయ గురుదత్త .
© Blogger template Sunset by Ourblogtemplates.com 2008
Back to TOP