స్వామి...మహిమ చూసి కూడా...వీళ్ళింకా మారటం లేదు
>> Saturday, March 14, 2026
మొన్న ఒక ఫోన్ వచ్చినది. సార్!నేను .మీ స్టూడెంట్ తిరుపతమ్మను .మీ దగ్గరకొచ్చి మాట్లాడాలి . ఇప్పుడు వస్తున్నాము . నాకుపనిఉంది సంధ్యాహారతి సమయం .ఒకగంట ఆగి రామ్మా అని చెప్పాను. గంట తరువాత తన తమ్ముడిని వెంట బెట్టుకుని వచ్చింది .నమస్తే సార్. వీడు మాతమ్ముడు . అవును కదా! నెలక్రితం మీ అమ్మగారు ..నువ్వు వచ్చారు కదా వీడు ఇంటినుండి వెళ్ళాడు కదా ! ఎప్పుడు వచ్చ్చాడు ? అడిగాను. ఈరోజే ఉదయం వచ్చాడు సార్ ! అమ్మ ఫోన్ చేయగానే మా అత్తగారి ఇంటినుండి వచ్చాను .మీతో మాట్లాడాలని వచ్చాను అన్నది. సంతోషం తల్లీ ! అమ్మను హనుమత్ ప్రదక్షిణాలుచేయమని చెప్పాను కదా చేస్తున్నదా? అడిగాను చేస్తున్నది సార్. ఇంకా ఏడు రోజులు ఉన్నది నలభై రోజులు పూర్తికావటానికి .ఈలోపలే వచ్చాడు . అన్నది సంతోషంగా . నమ్మి ఆశ్రయిస్తే ఆంజనేయస్వామి కరుణ ఇలా ఉంటుంది . అన్నాను. ఆతరువాత నేను చెప్పినదానికి ...వాళ్ళు అడిగినది విని నాకు నవ్వాలో ఏడవాలో ...జాలిపడాలో అర్ధం కాలేదు . విషయం మొత్తం చెబుతాను.ఒక నెల క్రితం వాళ్ళు అమ్మ గారి ని వెంటబెట్టుకుని వచ్చి నది ఈ అమ్మాయి.ఆవిడ తీవ్ర దుఃఖంలో ఉన్నది. తన కొడుకు ఎటో వెళ్ళిపోయాడు. బి.టెక్ చదువుతూ మానివేసి వేరే స్నేహితులతో కలిసి వ్యాపారం మొదలు పెట్టాడు.ఆ వ్యాపారంలో నష్టాలు రావడంతో చెప్పాపెట్టకుండా ఎటో వెళ్ళిపోయాడు. ఏమయ్యా డో? నాని తల్లి కన్నీరుమున్నీరవుతుంది. ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రశ్నలడగటం ..ఫలానా చోట బాగా చెబుతున్నారు అని వింటే అక్కడి వెళ్ళటం ...ఇలా ఉంది పరిస్థితి. ఒక చోట నవగ్రహ పూజలు ఇంకా ఇతరములు ..బాగా నిష్టగా ఉండే వారిచే చేయించమని చెప్పారట. అందుకు వచ్చింది..... తిరుపతమ్మ వాళ్లమ్మ ను తీసుకుని నావద్దకు. సార్ !మేము చదువుకునేప్పటి నుండి చూస్తున్నాము. మీరైతే ఈ పూజలు చేస్తారని అమ్మను తీసుకుని మీవద్ద కు వచ్చాను అన్నది. వాళ్ళు పరిస్థితి చూసి జాలేసిందిు.వాళ్ళ. అమ్మ గారిని ఓదార్చి.... అమ్మా. ఇప్పుడు ఈ పూజలు శాంతులు అంటూ తిరగకండి. మీకొక సులభం మార్గం చెబుతాను. ఇది పూర్వం నుండి మన పెద్దలు ఆచరిస్తున్నదే . నేను అనేక సమస్య లలో ఉన్నవారికిచెప్పగా ఆచరించి వారి సమస్యలు సులభంగా తొలగించుకునే మార్గం. భక్తిగా ఆంజనేయ స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.నలభై రోజుల పాటు నీ బాధ నంతా ఆయనకు చెప్పుకుంటూ తిరుగు. సాటి వాళ్ళకు చెబితే అయ్యో! అంటారు తప్పితే ఇంకేం చేయలేరు. కానీ స్వామి మనసు కరుగుతుంది. ఆయన భక్తులు బాధలు తొలగించడంలో ఆలస్యం చేయడు. అని మార్గం సూచించాను. వాళ్ళు వెళ్ళి మొదలు పెట్టా రు. మొన్న తిరుపతమ్మ వాళ్ళు తమ్మున్ని తీసుకుని వచ్చింది. ఇంకా ఏడురోజుల ముందే వచ్చాడు సార్ మీరు చెప్పిన దానికంటే! అన్నది. శుభం తల్లీ....మీ అమ్మగారి ఆర్తి..భక్తి..ఫలితమిది అని చెప్పి పిల్లవానికి నాలుగు మంచిమాటలు చెప్పాను. జీవితంలో ప్రతి సన్నివేశం లో ఆటుపోట్లను స్వామిని ఆశ్రయించి ఎలా ఎదుర్కోవాలో చెప్పాను.మనసు ను మనం ఆధీనంలో పెట్టుకోలేనప్పుడు స్వామికి శరణాగతులమై ఎలా బయటపడాలి ...... ఇలా. వానికి మానసిక బలం పెంచుకునే విధానాలు చెప్పాను. అంతా విన్నాక సార్ ఆ సిద్ధాంతులు చెప్పీన పూజలు ఎప్పుడు చేయిస్తారు అని అడిగింది తిరుపతమ్మ. నాకు నవ్వాలో...ఏడవాలో అర్థం కాలేదు. నేనేమో....వాళ్లను మానసిక బలవంతులను చేసి భగవంతుని స్వయంగా ఆశ్రయించే మార్గం నేర్పుదామని చూస్తున్నాను. వీల్లేమో పరాధీనత లోనే సౌకర్యం అని భ్రమలో ఉన్నారు. నేను ఎంత చెప్పినా. .....అదే మాట. చూడమ్మా... ఇప్పుడొక నలభై, యాభై వేలు కాగొట్టకుని ఈతంతులన్నీ పూర్తయిన దాకా నీ మనసు చల్లబడదు. నాకుఆపూజలు అవీ సరిగా రావు.వద్ధంటేవినవు.రేపు వీడికి జలుబు చేసినా నన్నే కారణమంటావు.కాబట్టి ఎవరు నీకు ఇవన్నీ చెప్పారో వాళ్ళ దగ్గర కే వెళ్ళు. చెప్పిన వాళ్ళయితేనే శ్రధ్ధగా చేయిస్తారు వాళ్ళచేతనే చేపించు. అని పంపించేసాను. ఇంతే...లోకంలో ఎక్కువమంది తీరు.
Read more...








