శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శబరి గిరీశుని నిత్యసేవకుల ఆశీర్వాదాలందాయి యాగానికి

>> Saturday, January 21, 2012


హనుమత్ రక్షాయాగం ప్రారంభించేముందు మహాత్ములు పీఠాధిపతులు,సద్గురువులు,సాధుసంతుల ఆశీర్వాదాలు తీసుకోవాలని చేసిన సంకల్పం స్వామి అనుగ్రహంతో నెరవేరుతున్నది . ఇది స్వామి అనుగ్రహానికి నిదర్శనమే.
ఇప్పుడు ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవస్థానం [శబరిమల] నుండి ఆశీర్వాదాలందాయి. స్వామి ప్రధానార్చకులు శ్రీ మహేశ్వరరు తంత్రి గారికి యాగ వివరాలు తెలుపగా వారు చాలా సంతోషంతో కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని భక్తజనరక్షకులైన స్వామి వారి కృప అందరికీ అందుతుందని ఆశీశ్శులందించారు. ఆ శబరిగిరీశుని నిరంతరం అర్చించే అర్చకస్వాముల దీవెనలంటే ఆ స్వామి దీవెనలే కదా అనిసంతోషం.

స్వామియే శరణమయ్యప్ప .

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP