శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శనిత్రయోదశినాడు జరిగే శనిప్రదోష పూజలకు గోత్రనామాలు పంపండి

>> Thursday, August 25, 2011


ఈనెల 27 శనివారం రోజు త్రయోదశి తిథి వస్తున్నందున ఆరోజు శనీశ్వరునికి ఆసాయంత్రం ఈశ్వరునకు ప్రత్యేక అర్చనలు జరుగుతాయి . జాతకంలో శనిగ్రహ దోషాలు ఉండి చిక్కులు చికాకులతో సతమతమవుతున్నవారు శనీశ్వరునికి తైలాభిషేకం చేపించి ఆరాధించటం వలన దోషాలు తొలగుతాయి అని శాస్త్రవచనం
ఇక ఆరోజు ప్రదోష కాలంలో జరిపే శివార్చనవలన అనంతమైన పుణ్యం లభిస్తుందన్నది పురాణప్రాశస్త్యంగలవిషయం. సకల బాధలను తీర్చి కరుణతో కొలచినవారికి కొంగుబంగారమయ్యే శివుని అర్చించటం సర్వదా శుభకరం
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో నవగ్రహమంటపంలో ఆరోజు తైలాభిషేకములు ప్రత్యేక అర్చనలు జరుపబడతాయి. సాయంత్రం పీఠం లో కొలువైయున్న శ్రీరామలింగేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం ప్రత్యేక అర్చనలు నిర్వహింపబడతాయి.
గోత్రనామాలు పంపిన భక్తులతరపున పూజ నిర్వహింపబడుతుంది . పీఠసాంప్రదాయం ప్రకారం ఇక్కడ జరిగే అర్చనలు పూజలకొరకు చెల్లించవలసినది ఏమీ ఉండదు.

[ కానీ శనిదోష నివారణార్ధం జరిపేశనిత్రయోదశి పూజలకుమాత్రం పూజాద్రవ్యాలు మాస్వంతఖర్చుతోనే వాడమని పలువురు కోరుతున్నందున దాని కొరకు పంపే ఆసక్తి ఉన్నవారు సంప్రదిస్తే ఎలాపంపాలో తెలియజేస్తాము.] దీనిని మరోలా భావించవద్దని మనవి.]
durgeswara@gmail.com
9948235641

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP