శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గాయత్రీ మంత్రశక్తి

>> Friday, July 18, 2008

గాంధీగారి హత్య జరిగిన రోజులలో ఒక యువకుడు భగవాన్ రమణ మహర్షులవారి వద్దకు వచ్చి వుగ్రంగా చూస్తూ " గాడ్సే గాంధీని చంపి వినుతికెక్కాడు. నేను నిన్ను చంపి కీర్తి కెక్కుతాను." అని బెదిరించాడు.
చంపు నాయనా నాకీ దేహ బాధ తప్పిపోతుంది. అన్నారు,భగవాన్. అక్కడున్నవాళ్ళు అతన్ని అటకాయించి తోసెయ్యాలని చూసారు. కాని భగవాన్ అతన్ని తనదగ్గరే వుంచుకుని తనతో భోజనానికి తీసుకు వెళ్ళారు. రెండు రోజులాశ్రమమ్లో వుండిపోయాడు.
మూడవరోజు
అతను భగవాన్ వద్దకు వచ్చి నన్ను క్షమించండి. నాకు మతిస్థిమితం వుండటం లేదు. నామతి స్థిమితంగా వుండటానికి ఏదైనా వుపదేశించండి. అన్నాడు.
" గాయత్రిచెయ్యి "అన్నారు భగవాన్.
అలాచేసి కొన్ని నెలలలో తిరిగివచ్చాడు. అతని పిచ్చి అంతా పోయి గొప్పభక్తితో.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP