శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మేలుకుంటున్న హిందువులు

>> Monday, November 22, 2021

మేలుకుంటున్న హిందువులు... #భక్తులు తమ డబ్బును #హుండీలో వేయకుండా ఆలయ #పూజారికి సమర్పిస్తున్న వీడియోను చూడండి. 

విషయం ఏమిటంటే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ #పూజారి తనకు ఇచ్చిన #దక్షిణను జేబులో పెట్టుకుంటుండగా ఓ #పత్రిక వాడు అదేదో నేరం అయినట్టు ఓ  ఫోటో తీసి,  ఓ #వార్త ప్రచురించాడు. దీనికి స్పందించిన #యంత్రాంగం ఆ పూజారికి #నోటీసులు  జారీ చేసింది. హుండీలో వేసే ఉద్దేశ్యం భక్తులకు ఉంటే అందులోనే వేసేవారుగా! 

అయితే ఈ ఘటన హిందువులు #జాగృతమయ్యేందుకు దోహదం చేసింది. ఆ నోటీసులు ఇచ్చిన #DM కి సమాధానంగా భక్తులు క్యూలో నిలబడి హుండీలో బదులు తమ డబ్బులను ఆ పూజారికి సమర్పిస్తూ నేరుగా ఆయన జేబులో పెట్టారు. 

భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను  ప్రభుత్వాలు హిందూ ధర్మ అభ్యున్నతికి  ఖర్చు పెట్టకుండా ఇతర అవసరాలకు వాడుకుంటున్న సంగతి అందరికీ విదితమే. గమనించవలసిన మరో ముఖ్య అంశం ఏమిటంటే గుడిలో వేకువజామునుండి చివరివరకు అన్నీ శాస్ట్రోక్తంగా చేసే పూజారికి ఇచ్చే వేతనం కంటే అర్హులైనా కాకున్నా అర్చకేతర సిబ్బందికి ఇచ్చే జీతాభత్యాలు చాలా ఎక్కువ.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP