శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దౌర్భాగ్యపుబుద్ధులకు దివ్యలోకాలెలా నచ్చుతాయి ?

>> Tuesday, August 28, 2012

 స్వామీ ! ఈ జీవులనుద్దరించడానికి భువిపై అవతరించావు . తమ దర్శనభాగ్యం ప్రత్యక్షంగా పొంది ఈ జీవరాశి అంతా తరించినట్లే .అయినా జీవులన్నీ దుఃఖమయమైన  ఈ జీవితాలను వదలలేకున్నాయి . మీరు అనుగ్రహించి వీటిని దరిచేర్చుకోరాదా ? ఈ జీవుల  శోకమయమైన జీవితాలను చూడలేకున్నాను  అని ప్రార్ధిస్తున్నాడు ఉద్దవుడు ఏకాంతంలో శ్రీ కృష్ణ పరమాత్మను.
సాధువు హృదయం సున్నితం. పరమభక్తుడైన ఉద్దవుని హృదయం జీవరాసులదుస్థితి పట్ల కరుణతో  తల్లడిల్లుతున్నది ..

దానికి  వాటి సాధన తోడవ్వాలి ఉద్దవా ! ఈ దుఃఖాలను దాటాలనే తీవ్రమైన కోరిక కావాలి అన్నారు శ్రీవారు.

తండ్రీ ! సాధనలన్నీ  నీ కరుణ కలగటం కోసం మాత్రమే.  నీవే తలచుకుంటే ఈ సాధనలెందుకు ,ప్రయత్నాలెందుకు ?  కరుణాంతరంగుడవే ! నీవుతలచుకున్న వీటన్నిటినీ నీ నిజధామమునకు తీసుకెళ్ళొచ్చుకదా ? ఈ జీవులన్నింటికీ ముక్తి ప్రసాదించి నీవెంట తీసుకెళ్లటం నీకేమైనా భారమా ? వాపోతున్నాడు ఉద్దవుడు.

 నాకూ తీసుకెళ్లాలనే ఉన్నదయ్యా ! కానీ ఈజీవులన్నీ అలా నావెంట రావటానికి ఒప్పుకోవు అన్నారు పరమాత్మ.

అదేమి ప్రభూ! తమ అనుగ్రహం కోసమే చరాచర జీవులనీ ఎదురుచూస్తుంటాయి .అలాంటప్పుడు మీరే రమ్మంటే ఎందుకాగుతాయి ? మీరే ఏదో వంక చూపాలని చెబుతున్నారు అన్నాడు ఉద్దవుడు.

అదేంకాదు  నేను నిజమే చెబుతాను అన్నారు స్వామి
.
 కావాలంటే నువ్వే అడిగిచూడు .  జన్మలలో కెల్లా జంతుజన్మ అందులోనూ పంది జన్మ అత్యంత హేయమైనది కదా ! అదిగో ఆకనపడుతున్న పందిని అడిగిచూడు వైకుంఠానికి వస్తుందేమో అన్నాడు స్వామి చిరునవ్వులు నవ్వుతూ.

ఉద్దవుడు ఆ పంది దగ్గరకెళ్లాడు

ఓ వరాహమా ! నీ అదృష్టం పండింది. నీకు దివ్యలోకానికెల్లే అవకాశం చిక్కింది . నీవు వైకుంఠమునకు బయలుదేరు అన్నాడు.

అది నింపాదిగా ఎందుకు  ? అనడిగింది

ఈ  దుఃఖమయజీవితాన్ని వదలి  సుఖం పొందటానికి అన్నాడాయన

నాకిక్కడ సుఖంగానే ఉందే ? అన్నదది 

పిచ్చిమొద్దా !ప్రతిజీవి  జరామరణ చక్రాలను దాటుకుని ఆదివ్యలోకానికెళ్ళడమే ముక్తి .అదే అసలైన సౌఖ్యం .అక్కడ చిక్కుతుంది  అసలైన ఆనందం .వివరించాడు ఉద్దవుడు.

 ఏమిటీ ! అక్కడ అంత సుఖంగా ఉంటుందా ?

 ఆ ! సుఖమంటేనే అది  అన్నాడాయన మరలా

మరక్కడ తినటానికి  ఇప్పుడు నేనుతింటున్నంతరుచికరమైన   "మలం" దొరుకుతుందా అక్కడ ? అడిగింది పంది.

ఛీ!ఛీ ! దరిద్రపుగొట్టు మొఖమా . ఇంతనీచపుగొట్టు తిండికాదు దివ్యమైన మధురమైన అమృతమే దొరుకుతుంది అన్నాడు ఉద్దవుడు

ఏమిటీ ! దీనికంటే రుచిగా ఉంటుందా అది ?  అనుమానంగా అడిగింది పంది.

ఛీ! మళ్ళి అదేమాట .అది దివ్యమైన రుచి భూమిపై దొరకదు అన్నాడాయన

పందికి వళ్లు మండిపోయింది. నువ్వొట్టి అబద్దాలకోరువి.  దీనికంటే రుచికరమైన పదార్ధం ఇంకెక్కడా ఉండదు . నీవైకుంఠమూ వద్దు గియ్ కుంఠమూ వద్దు వెళ్లు ... మోసగాడా ! అని ఈసడించుకుని తృప్తిగా మలాన్ని భుజించటంలో నిమగ్నమైనది అది.

ఉద్దవునికి నోటమాటరాలేదు పాపం !

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP