శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ధనుర్మాస పూజల విశిష్టత

>> Friday, December 18, 2009

కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్యమీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. దేవతా పూజలకు ధనుర్మాసం విశిష్టమైంది. అందుకే ఈ మాసంలో ధనుర్మాసంలో శుభకార్యాలను పక్కన బెట్టి దేవతలను పూజించాలని పండితులు అంటున్నారు. దేవతలతో పాటు కృష్ణభగవానుడికి ప్రీతికరమైన ఈ ధనుర్మాసం పూర్తిగా ఆ భగవానుడిని స్మరిస్తూ పూజ చేసే వారి అభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. ఇంకా పెళ్లికాని కన్యలు ధనుర్మాసంలోని 30 రోజులు దీక్షతో ఆ దేవదేవుడిని ప్రార్థిస్తే గుణవంతుడైన భర్తను పొందవచ్చునని పురోహితులు చెబుతున్నారు. అందుచేత ఈ మాసం పూర్తిగా విష్ణుమూర్తిని ప్రార్థించి ఆయన అనుగ్రహం పొందుదుము గాక..!

2 వ్యాఖ్యలు:

రాజేశ్వరి నేదునూరి May 11, 2010 at 7:57 AM  

నమస్కారములు.
ధనుర్మాస విశిస్టతను గురించి చక్కగా వివరించారు. అసలు ఆ మాసమంతా కుడా పల్లెసీమల అందాలు " ముంగిట ముగ్గులు ,కొత్త ధాన్యం కొత్త అల్లుళ్ళు గొబ్బితల్లులు బొమ్మల నోములు హరి దాసులు ఇలా ప్రకృతి అందాలతొ ఇంటింటా సంక్రాంతి లక్ష్మి కలకల లాడుతు ఉంటుంది. మంచి ఆర్టికల్ని అందించారు ధన్య వాదములు

Unknown October 9, 2011 at 12:01 AM  

బావుందండి చక్కగా క్లుప్తంగా రాసారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP