శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శనిదోషనివారణకు సింధూరాభిషేకము

>> Tuesday, March 31, 2009




గ్రహచారము బాగుండక బాధపడువారెందరో యుందురు. అందునా ముఖ్యముగా శనిపీడితులెక్కువ .అతడే నిసర్గపాపిగా చాలాకాలము బాధించువాడు.హనుమదారాధకులకు శనిబాధయుండదు.ఒకప్పుడు శని హనుమంతుని పట్టనెంచి అతని కోపమునకు గురియయ్యెను. అదేసమయమున సేతుప్రదక్షిణము చేయుచున్న హనుమంతుడు శనిని తోకతో చుట్టి వెనుక వ్రేలాడుచుండగా ఈడ్చుకొనుచూ సేతుప్రదక్షిణము చేయుటవలన శనికి వళ్ళుహూనమయ్యెను.దేహమంతా పుండ్లుపడి హనుమంతుని శరణువేడెను.అప్పుడు తనభక్తులరాశులందు ప్రవేసించినప్పుడు వారిని బాధింపవలదను శాసించి వదలెనట. ఆదేహబాధ భరింపజాలక శని దేహమంతట తైలము నలదుకొనజొచ్చెను. అందుకే శనితైలాభిషేకము కోరుచుండును.కావున హనుమంతుని సేవించి శనిపీడను నివారించుకొనవచ్చు. ఒక చిన్నప్రక్రియద్వారా.

శనిదోషములు ప్రబలముగా నున్నవారు మంగళవారము రోజు హనుమంతునికి నువ్వులనూనెలో సింధూరము కలిపి అభిషేకము చేయించిన శనిదోషములు పరిహారమగును. కనుక ఇప్పుడు జరుగుతున్న హనుమత్ రక్షాయాగములో పాల్గొని సింధూరాభిషేకములు జరిపించుకొనుట మరింత శుభకరము.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP