శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శనిదోషనివారణకు సింధూరాభిషేకము

>> Tuesday, March 31, 2009




గ్రహచారము బాగుండక బాధపడువారెందరో యుందురు. అందునా ముఖ్యముగా శనిపీడితులెక్కువ .అతడే నిసర్గపాపిగా చాలాకాలము బాధించువాడు.హనుమదారాధకులకు శనిబాధయుండదు.ఒకప్పుడు శని హనుమంతుని పట్టనెంచి అతని కోపమునకు గురియయ్యెను. అదేసమయమున సేతుప్రదక్షిణము చేయుచున్న హనుమంతుడు శనిని తోకతో చుట్టి వెనుక వ్రేలాడుచుండగా ఈడ్చుకొనుచూ సేతుప్రదక్షిణము చేయుటవలన శనికి వళ్ళుహూనమయ్యెను.దేహమంతా పుండ్లుపడి హనుమంతుని శరణువేడెను.అప్పుడు తనభక్తులరాశులందు ప్రవేసించినప్పుడు వారిని బాధింపవలదను శాసించి వదలెనట. ఆదేహబాధ భరింపజాలక శని దేహమంతట తైలము నలదుకొనజొచ్చెను. అందుకే శనితైలాభిషేకము కోరుచుండును.కావున హనుమంతుని సేవించి శనిపీడను నివారించుకొనవచ్చు. ఒక చిన్నప్రక్రియద్వారా.

శనిదోషములు ప్రబలముగా నున్నవారు మంగళవారము రోజు హనుమంతునికి నువ్వులనూనెలో సింధూరము కలిపి అభిషేకము చేయించిన శనిదోషములు పరిహారమగును. కనుక ఇప్పుడు జరుగుతున్న హనుమత్ రక్షాయాగములో పాల్గొని సింధూరాభిషేకములు జరిపించుకొనుట మరింత శుభకరము.

Read more...

భక్తితో మోకరిల్లగా తరలివచ్చెను మోదక హస్తుడు

>> Friday, March 27, 2009



భక్తితో మోకరిల్లగా తరలివచ్చెను మోదక హస్తుడు

నేడు మన ప్రార్ధనలాలకింపగా యాగము నిర్విఘ్నముగా పూర్తవుతుందంటూ ,సర్వభక్త జనరక్షణకై తరలివచ్చిన విఘ్ననాయకుడు తొలివేలుపు దరశనమిచ్చెను యాగకుండమున

హనుమత్ రక్షాయాగమును ప్రారంభిస్తూ జరిపిన గణపతి హోమములో స్వామి లీలా స్వరూపము మనలను అనుగ్రహిస్తున్నారనడానికి నిదర్శనము.

Read more...

నూతన సంవత్సర శుభాకాంక్షలు

>> Thursday, March 26, 2009


నూతన సంవత్సరము విరోధి లోనికి ప్రవేశిస్తున్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు.ఈసంవత్సరాన మీకు మీకుటుంబ సభ్యులందరికీ సర్వత్రా జయము,సుఖశాంతులు కలగాలని ప్రతివారి జీవితము ఆనందమయమవ్వాలని కోరుకుంటున్నాను.
మీ గోత్రనామాలు పంపితే ఇక్కడ స్వామివార్లకు అమ్మవారికి జరిగే పూజలలో మీతరపున సేవలు నిర్వహించబడతాయి. ఉగాది రోజునుంచి హనుమజ్జయంతి వరకు జరిగే "హనుమత్ రక్షాయాగము " గణపతి హోమముతో ప్రారంభమవుతుంది. అలాగే అమ్మవారికి [బృందావనేశ్వరి రాధాదేవి దేవికి] వసంతనవరాత్రిపూజలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలలో పాల్గొనేవారందరూ గోత్రనామాలను ఈరాత్రికే చేరేలా పంపగలరు. రేపు ఇక్కడకు వచ్చేతీరిక వుండదు కనుక ముందుగానే ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాము. లోకాస్సమస్తా సుఖినోభవంతు

Read more...

హనుమత్ రక్షాయాగానికి స్వామి అనుమతి వున్నదా? అనుమానాలు తీరిపోయాయి.

>> Sunday, March 22, 2009


హనుమత్ రక్షాయాగానికి స్వామి అనుమతి వున్నదా? అనుమానాలు తీరిపోయాయి.


జగన్మాత హరిహరసమేతముగా అధివసించివున్న "శ్రీవేంకటేశ్వరజగన్మాత పీఠము"నందు కార్యక్రమాలు ప్రారంభమునుంచి ఒక విచిత్రపద్దతి లో జరుగుతున్నాయి.అది అమ్మ అనుగ్రహమని మానమ్మకము. ఏదైనా కార్యక్రమము చేపట్టాలనుకున్నప్పుడు,దాని పూర్తి వివరాలేకాదు,ఆకార్యక్రమానికయ్యే ఖర్చు,దాని సమీకరణ ఎలా ?అని చూసుకుని ప్రకటించి ప్రారం భిస్తారు. కానీ ఇక్కడ మాత్రం చిత్రంగా కార్యక్రమము మనస్సులో కి రావటము,దానిని ప్రకటించి మాపని మేము చేసుకుంటూ వెళ్ళటము జరుగుతున్నది.ఎందుకంటె ఇది భగవత్ సంకల్పమని మేము పూర్ణముగా విశ్వసిస్తుంటాము కనుక .అది మాచిత్తభ్రాంతి కాదు సత్యమని నిరూపిస్తూ గొలుసు కట్టుగా ఎవరో నిర్ణయించినట్లు కార్యక్రమాలు వరుసగా అద్భుతమైన రీతిలో ఎక్కడా కొరతలేకుండా సాగిపోతూవుంటాయి. చేతిలో పైసా లేకుండా చివరకు ప్రతిష్ఠముందు వారం రోజులవరకు అమ్మవారి మూర్తి ఎక్కడున్నదో కూడా తెలియకుండా నే చిత్రాచి చిత్రం గా దాదాపు నాలుగు లక్షలపైగా ఖర్చుతో సాగిన ప్రతిష్ఠాకలాప వివరాలను మీకు ఇంతకుముందే మనవిచేసాను గతములో. అక్కడనుండి అదేపద్దతిలోజరుగుతున్న ఒక్కొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ అలా జరిగి పోతున్నాయి. కనుక ఈ కార్యక్రమాలకు ఖచ్చితముగా భగవదనుగ్రహము, అనుమతి వున్నాయని పరిపూర్ణముగా విశ్వసిస్తున్నాము.పీఠమును స్థాపించిన మాతాతగారువెంకయ్యగారు,మాపరమగురువులు రాధా సఖి ,శ్రీ రాధికాప్రసాద్ మహరాజ్ గారు బోధించేవారు .ఒరే మనం అమ్మదగ్గర బెగ్గర్లుగా వుండకూడదు.బిడ్దలుగా వుండాలి.బిడ్దలుగా వుంటే బిడ్దకుఎప్పుడు ఏమికావాలో చూసుకోవటము తల్లి బాధ్యత అవుతుంది.అలాబ్రతకటం నేర్చుకో,అప్పుడు నీకేమి అవసరమో అవే తరలి వస్తాయి నిజంగా భగవదనుగ్రహంవుంటే అని బోధించేవారు.అందుకే వారంతటవారు ఏదన్నా మేము కూడా ఈసేవలో పాలు పంచుకోమా అని అడిగినదాకా ఎవరినీ ఏదీ అడగకుండా సాగుతున్నాము భగవత్ సేవలో ఇప్పటివరకు.

ఇక ఇప్పుడు రానున్న సంవత్సరములో భక్తులను ప్రమాదాలనుండి కాపాడటము,వారి జాతక దోషాదులను పరిహరించి సర్వత్రా జయాన్ని కలిగించగల హనుమత్ రక్షాయాగాన్ని స్వామి వారు కలిగించిన సంకల్పానుసారముప్రకటించి ప్రయత్నాలు మొదలుపెట్టాము. ఆశ్రయించిన వారికి వజ్రకవచమై కాపాడే హనుమంతుని కృప, సులభసాధనమైన భక్తి మార్గం లో సాధకులకు కలిగేలాచేయటము లక్ష్యము. విధి విధానాలను నిర్ణయించేందుకై పెద్దలను సంప్రదించటానికి వెళ్ళి నప్పుడు దీని ఖర్చు ఎంతవుతుంది? ఎంతమందికి అందజేయగలవు ఈ కార్యక్రమాన్ని? ఎలా సమీకరించగలవు వస్తు సామాగ్రిని?ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించగలిగిన కార్యకర్తలవ్యవస్థ నీకున్నదా? అని వారు ఎంతో అభిమానముతోను మధ్యలో ఇబ్బందిపడతానేమోనని అడిగారు. వారికి నేనొకటే విన్నవించుకున్నాను. స్వామీ! ఈకార్యాన్ని స్వామివారే సంకల్పించి నాకు ఈసేవను అప్పగించారు.దీనిని ఎంతమందికి చేర్చాలో ,ఎలా చేర్చాలో ! ఆయన ఇష్టము. ఖర్చంటారా ,పంచామృతాలు లేనిరోజున నీళ్లతోనే అభిషేకము జరుపుతాను, జపం చేయటానికి పవిత్రహృదయులైన మూడువందలమంది పిల్లలు నాదగ్గర చదువుతున్నారు సిద్దంగావున్నారు వాల్లు.వచ్చిపోయేవాళ్ళకు పరమాన్నం పెట్టలేకపోయినా నాకున్నది పెట్టి పంపగలను. ఇక కార్యకర్తలంటారా స్వామి వారి పరివారమ్ లోకమంతావున్నది వాల్లే వచ్చి చేరతారు.ఎలాజరుగుతుంది అని ఆలోచించటమ్ నాపనికాదు. ఎట్లా చేపించాలో ఆయన ఇష్టము. దానిగురించి ఆలోచించటము లేదు విధివిధానాలలో లోపము రాకుండా నిర్ణయించమని కోరాను. వారంతా ఆశీర్వదించి భక్తిమార్గములో హనుమంతుడు ప్రసన్నుడయ్యేవిధముగా కార్యక్రమాన్ని నిర్ణయించారు.
స్వామి అనుమతి లభించినది. ఇక మాఇంట్లో అలవాటే గనుక కార్యక్రమానికి సిద్దమయ్యరు. ముఖ్యంగా మా అమ్మ్గగారికి పూజా పునస్కారాలకంటె వచ్చినవారికి వండిపెట్టటము ,కడుపునిండా ఆప్యాయంగా వడ్డించటము ఇష్టము.కాబట్టి ఎంత కష్టమైనా పొయ్యిలదగ్గరనిలబడి వంటపనులు చూస్తుంది కనుక ఆవిడ అనుమతి లభించింది.ఇక నా తమ్ముల్లిద్దరు ఏకార్యక్రమానికైనా సిద్దంగావుంటారు ఇబ్బంది లేదు. ఈకార్యక్రమము గూర్చి పైసా ఖర్చు లేకుండా లోకానికందించగల వేదిక ఈ బ్లాగు లోకము.ఎంతోమంది సహృదయులు,భక్తజనులఅందుబాటులోనున్న ఇక్కడనుండే ఈకార్యక్రమాన్ని చేరవేసే ప్రయత్నమునకు శ్రీకారము చుట్టాము. హనుమత్ బంధుకోటి అనూహ్యంగా స్పందిస్తున్నది.
అమెరికానుంచి తోలేటి పవనకుమార్,భాస్కరరామరాజు గార్లు ప్రచారకార్యక్రమాన్ని భుజాలమీదవేసుకుని ఒక లింక్ ఏర్పరచి దానిని బ్లాగర్లు తమబ్లాగులో వుంచేవిధముగా తయారుచేశారు. ఆర్కుట్ లో ఒక కమ్యూనిటీ ని ఏర్పరచారు.చింతా గారు జ్యోతి . లాంటి పెద్దలు సుజాత విజయమోహన్ ,లాంటి భక్తులైనచాలామంది తెలుగుబ్లాగర్లు [అందరిపేర్లు వ్రాయనందుకు మన్నించండి] తమతమ బ్లాగులలో ఈయాగవివరాలను వుంచి ప్రచారము సాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి తిలక్ గారు ఈయాగ వివరాలు మరింతమందికి చేరుద్దాము నేను కరపత్రాలను ప్రచురిస్తాను అని ముందుకు వచ్చారు. నెల్లూరునుండి విశ్వనాధము గారు హనుమాన్ చాలీసా కార్డులను ప్రచురిస్తానని అడిగారు, విజయవాడనుండి శ్రీకాంత్ గారు హనుమంతుని గూర్చి ప్రవచనాలను సేకరించి పంపుతూ తాను ఈకార్యక్రమానికి అనుసంధింపబడ్డారు. మొన్న హైదరాబాద్ లో అనుకోకుండా దూరదర్శన్ కార్యక్రమము కోసము వచ్చిన హనుమత్ భక్తురాలు సుజాత గారు కలసి స్వామివారి కిష్టమయిన తమలపాకుల కొరకు ఖర్చుచేయమని నేనడగకుండానే డబ్బుతీసి ఇచ్చారు,అవీ హనుమంతుని కిష్టమయిన సంఖ్యకావటము చిత్రము.శ్రీధర్ దంపతులు అఖండదీపారాధనకు నూనెను మేముసమర్పిస్తామని చెప్పారు. నిన్న అనుకోకుండా గుంటూరు సి.ఏ. ఓ. దుర్గాప్రసాద్ దంపతులు అమ్మవారి దర్శనానికి వచ్చి ఈకార్యక్రమానికి మాసేవలుకూడా తీసుకోమని కోరారు. వెలుగొండ ప్రాజక్ట్ స్పెషల్ కలెక్టర్ పెంచలరెడ్డిగారు ఈకార్యక్రమములో భాగంగా గ్రామ రక్షణకోసము నిర్వహించే సామూహిక హనుమదాభిషేకాలను తమ స్వగ్రామములో నిర్వహిద్దామని కోరారు. నరసరావు పేట నుండి సత్యన్నారయణ రెడ్దిగారు ,మచిలీపట్టణమ్నుండి కారాశ్రీనివాస్ గారిలాంటి భక్తులు ఈకార్యక్రమానికి పరివారమయ్యేందుకు సిద్దపడుతున్నారు.ఇలా రోజూ హనుమద్ భక్తులు కార్యక్రమములో భాగమయిపోతున్నారు.ఈరోజు అమెరికానుండి కుమార్ గారు అలాగే చెరుకూరి దుర్గాప్రసాద గారూ ఈ యాగానికి ఆర్ధికంగా సహాయపడేందుకు వారంతటవారే ముందుకు వస్తున్నారు.వారందరికీ ఈకార్యక్రమానికి ఏమేమి కావాలో వాటిలో ఏసేవ తమకిష్టమో ఆసేవను వారితరపున ఇక్కడ నిర్వహిస్తామని చెప్పాము.ఎందరో భక్తులు తాము ఈయాగములో సూచించినవిధముగా సాధనలో పాల్పంచుకునేందుకు సంసిద్దతను తెలుపుతూ మెయిల్ , ఫోన్ లలో తెలియజేస్తున్నారు. కొన్ని భక్తసమాజాలు సామూహికముగ జరిపేందుకు తయారవుతున్నారు.

ఇప్పుడు ఖచ్చితముగా ఇదినాభ్రాంతికాదు.ముమ్మాటికీ స్వామివారి అనుమతి వున్నది అని నమ్మకము స్థిరపడుతున్నది. ఆయన కార్యక్రమాన్ని ఆయనే నిర్ణయించుకుని.ఆయన పరివారాని ఆయనే కదిలించుకుని ఆయన కిష్టముగా కార్యక్రమాన్ని ఆయనే నడుపుకుంటూ ,భక్తజనుల పాదధూళితో సమానము కాని నన్ను కూడా ఒక పరికరంగా ఉపయోగించుకుంటున్న ఆభక్తజనరక్షకునికి సాష్టాంగప్రణామాలు అర్పిస్తూ మీతో పాటు ఈసేవలో .......................................

భక్తజనదాసుడు
దుర్గేశ్వర

Read more...

హనుమంతుని గుణగానము .....2

>> Friday, March 20, 2009

ప్రముఖ పౌరాణికులు చాగంటి కోటేశ్వరరావు గారు హనుమంతుని గూర్చి చేసిన ఉపన్యాసములలో హనుమత్ తత్వాన్ని గూర్చిన అద్భుత మైన ప్రసంగాలివి వీటిని మీకోసము అందిస్తున్నాము

రెండవ భాగము


మూడవ భాగము


చివరిభాగము

Read more...

హనుమంతుని గుణగానము ---1

>> Thursday, March 19, 2009

హనుమంతుని మహిమను గూర్చి ప్రముఖ పౌరాణికులు చాగంటి కోటేశ్వరరావు గారు చేసిన ప్రవచనములలో మొదటి భాగమిది.అవధరించండి.

Read more...

ఒక్కొక్క దోహా ఒక్కొక్క కార్యాన్ని సాధిస్తుంది

>> Tuesday, March 17, 2009


హనుమాన్ చాలీసాలో రహస్యాలు.

మహాభక్తుడైన గోస్వామి తులసీదాస్ గారి తపోఫలం గా మానవజాతికందిన చాలీసా లో చాలా రహస్యాలు దాగున్నాయి. ఇందులో ప్రతి దోహా ఒక సంపుటీ కరణ మంత్రము అనవచ్చు. నిష్టతో జపిస్తే ఒక్కొక్కదోహా ఒకప్రత్యేక కార్యములను సాధించి పెట్టటము ,అనుభవపూర్వకంగా, ప్రయోగాత్మకంగానూ చూసి నిరూపించుకున్నాము.ఈమేలు అందరికీ కలిగేందుకై ఆరహస్యాలను మీకు అందజేసుకుంటున్నాము.


1. శ్రీగురుచరణ రజ నిజమన ముకుర సుధారీ
వరుణౌ రఘువర విమల జోయశదాయక ఫలచారీ
[ మనో మాలిన్యలను తొలగించి ,బుద్ధిని పరిశుద్ధ మార్గం లో నడపటానికి ఈచరణాలను పదే పదే పఠించాలి.]

2. బుద్ధి హీన తనుజానికై సుమిరౌ పవన కుమార్
బలబుద్ధి విద్యాదేహు మొహి హరహు కలేశవికార్
[ ఈశ్లోకం లోని ఈచరణాన్ని పదే పదే ధ్యానించటమ్ వలన ,మనస్సు ఏకాగ్రత పెరుగుతుంది.విశేషించి చదువులో వెనుక బడ్డ పిల్లలకు చలా చక్కని ఫలితాలనిస్తుంది. మేము మాపాఠశాలలో ప్రయోగాత్మకంగా చేసి చూశాము.అద్భుత ఫలితాలను.]
3. జయహనుమాన...అనేమొదటి దోహానుండి విద్యావానగుణీఅతి చాతుర అనేదోహావరకు హనుమంతుని పొగుడుతున్నాయి కనుక ఈదోహాలమననం పొగిడితే పెరిగే ఆస్వామికి మనలను ఇష్టులను చేస్తాయి

4. సూక్ష్మరూపధరి సియహిదిఖావా,వికటరూపధరి లంక జరావా
భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజసవారే
{ ఈ దోహా ను జపించటము వలనా అణిమాది సిద్దులు ప్రాప్తిస్తాయని పెద్దల మాట]
5. లాయ సంజీవన లఖన జియాయే...... వద్దనుండి యమకుబేర ....దోహావరకు మిత్రత్వాలను వృద్ది చేసి మనకు గౌరవాభిమానాలను తెచ్చి పెడుతుంది.

6. తుమ్హరె మంత్ర విభీషణమానా లంకేశ్వరభయె సబజగజానా
-యుగసహస్రయోజనపరభానూ,లీల్యోత్సాహి మధురఫలజానూ
[ఈ దోహాను పఠించటము వలన అధికార ప్రాప్తి ప్రమోషన్లు రావటము ,వాటికున్న అడ్డంకులు తొలగటము జరుగుతాయి]
7.ప్రభుముద్రికా మేలి ముఖమాహి
జలధిలాంఘిగయె అసురజనాహి
దుర్గమ కాజ జగతకెజేతె సుగమ అనుగ్రహ తుమహరె తేతె.
[ చాలా కష్ట సాధ్యమయిన కార్యక్రమముల సాధనలో ఈ దోహా శక్తివంతముగా ఫలితమిస్తుంది.]

8.రామదుఆరే తుమరఖవారే హోతవ ఆజ్ఞ బినుపైఠారే
సబసుఖలహఇ తుమ్హారీ శరణా శరణా తుమరక్షక కాహూకోడరణా
[భయాలను తీర్చి,రామాను గ్రహాన్ని కలుగజేస్తుందీ దోహా]
9.ఆపన తేజ సంమ్హారో ఆపై తీనోలోక హాంకతె కాంపై
భూతపిశాచ నికటినహి ఆ వై మహావీర జబనామ సునావై.
[ భూత ప్రేతాది దుష్టశక్తులను అవిపెట్టే బాధలను ధ్వంసము చేస్తుందీ దోహా]

10. నాసై రోగ హరై సబపీరా-జపతనిరంతర హనుమత వీరా
[రోగాలనుండి రక్షించటములో నూ రోగాలను తగ్గించటము లోనూ ఈదోహా సంజీవనిలా పనిచేస్తుంది]
11.సబపర రామ తప్పస్వీరాజా...వద్దనుండి అష్ట సిద్ది నవనిధికేదాతా
[ తాపసుల తపస్సులకు సిద్ధినిస్తుంది]
12. తుమహరె భజన రామకొభావై జన్మజన్మకె దు:ఖబిసరావై
అంతకాల రఘుపతి పురజాయీ ,జహాజన్మి హరి భక్తకహాయీ
[ఈదోహా వలన జన్మ జన్మల చెడుకర్మలు నశించి రామ సాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది.]
13ఔరదేవతా చిత్తనధరయీ...............
[ఈదోహా పఠనము సంకటాలను తొలగించి సుఖశాంతులను ప్రసాదిస్తుంది.]
14. జైజైజై హనుమాన గోసాయీ .కృపాకరో గురుదేవకి నాయీ
{ ఈదోహాను స్మరిస్తుంటే హనుమంతులవారే గురు స్థానములో కూర్చుని మనలను దరిచేరుస్తారు.]
15. జోయహ పఢై హనుమాన చాలీసా నుండి ఫలశ్రుతి లోని పవన తనయ సంకట హరణ వరకు సీతారాములనుహృదయాన నిలుపుకున్న హనుమంతుని కృప మనమీదెప్పుడూ ప్రసరింపజేస్తూ వుంటూంది.]

Read more...

హనుమంతుని ఉపాసన లోప్రత్యేకతేమిటి ?

>> Monday, March 16, 2009


హనుమంతుని ఉపాసన లోప్రత్యేకతేమిటి
--------------------------

బ్రహ్మయే స్వయంగా హనుమంతుని సర్వదేవాంశ సంభూతునిగా సర్వదేవమయునిగా చెప్పి అతనిని పూజించుటచే దేవతలందరూ పూజించినట్లేయనుచు,రాక్షస నివారణకై గ్రామగ్రామములందు హనుమదాలయములు ఏర్పడునని పలికెను.

నామ మహిమ:- బుద్ధి,బలము,కీర్తి,ధైర్యము,నిర్భయత్వము,అరోగత,జాఢ్యములు తొలగుట,వాక్పటుత్వము ,మున్నగునవన్నియు హనుమన్నామస్మరణము వలన కలుగును.
శుభాశుభములన్నింటియందున పవిత్రమగు హనుమన్నామమును భక్తి తత్పరులై పండ్రెండు మారులు తలచిన కార్య సిద్ధియగునని పరాశర మహర్షి చెప్పారు.

హనుమ వాగ్దానము.
-----------

శ్లో// ఐహికేషు చ కార్యేషు -మహాపత్సు చ సర్వదా

నైవ యోజ్యో రామ మంత్ర: కేవల్కం మోక్షసాధక:

ఐహిక సమనుప్రాప్తే మాం స్మరే ద్రామ సేవకం//

అని హనుమంతుడు తానుగా రామ రహస్యోపనిషత్ లో చెప్పి యున్నాడు.వరమెట్లున్ననుఐహికజీవితము ముందు చూచుకొనవలెను కదాయని కలియుగమున కష్టకాలమున ప్రతివారూ కార్యసాధనకోరుకుందురు అట్టివి తననాశ్రయించినచో తానే నెరవేర్తునని హనుమంతుడే చెప్పుకున్నాడు.ఆయన అనుగ్రహమునకు పాత్రులగుటకు ప్రయత్నముచేయుటయే మనవంతు.

ఐహిక ఆముష్మిక విషయాలలో శుభప్రాప్తికి హనుమంతుని ఆశ్రయించటముచాలా తెలివైన పని. ఆయన ధ్యానం సకల ప్రమాదాలనుండి నిస్సంశయంగా కాపాడుతుంది మనలను.

Read more...

హనుమత మహిమా మృతం


Read more...

హనుమాన్ చాలీసా

>> Friday, March 13, 2009


Read more...

కోతి ఉపవాసం ........... [నాకొక పాఠం ]


ఒక కోతి ఒకరోజు స్వామీజీ ఉపన్యాసం విన్నది. దానికి ఉపన్యాసం చాలా నచ్చింది. ఒక పరవదినాన రోజంతా ఉపవాసం చేయాలనుకుంది. జపం చేయటానికి నిశ్చయించుకుంది.పని అంతా పూర్తి చేసుకుంది. కూర్చొని జపం మొదలుపెట్టింది.

ఉన్నాట్టుండి దానికొక సందేహం వచ్చింది .ఈరోజంతాఉపవాసం ఉండి జపం చేస్తుంటే,రేపు నాకు చాలా నీర్సంగా వుంటుందేమో! అప్పుడు మరి చెట్టు నుంచి చెట్టుకు దూకి పళ్ళు కోసుకోగలనా? నీరసం మరీ ఎక్కువైపోతే ! ఎలా? ఏమీ చెయ్యలేనేమో ?
ఈ ఆలోచన వచ్చాక ,కోతి జపం చేయటం ఆపింది. అప్పటికప్పుడు లేచి చెట్టూపుట్టా గాలించి మరుసనాటికి సరిపడే ఆహారాన్ని సేకరించింది. దానిని ఒక మూల భద్రపరచింది.మళ్ళీజపం కొనసాగించింది.
మరికొంత సేపటికి కోతికి ఇంకో ఆలోచనవచ్చింది. "రేపు నీరసం వల్ల నేను నడవలేక పోతేనో? ఆహారం ముందేవుంచుకుని కూడా ఆకలితో అలమతించి పోతాను కాబోలు! ఈ ఆలోచనతో పాపం కోతి ఎంతో బాధపడి పోయింది.
వెంటనే లేచింది. ఆహారాన్ని తన చేతికి అందుబాటులో వుంచుకుంది. మళ్ళీ జపం ఆరంభించింది.
ఆకోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది. "ఒకవేళ నేను మరీ నీరసించి పోయి ఆహారాన్ని అందుకొని నోటిలో కూడా పెటుకోలేక పోతేనో" అంటూ జరగబోయేది ఊహించుకుంది. ఆహారాన్ని నోటిలోనే వుంచుకుని ఉపవాసం చేయాలనుకుంది. ఆవిధంగా అది ఆహారాన్ని నోటిలో పెట్టుకుని జపం చేయబోయింది. కానీ నోటిలో నిండుగా ఆహారం పెట్టుకుని జపం ఎలాచేస్తుంది?
చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది."భోజనం నోట్లో వుంచుకోవడం ఎందుకు?ఇప్పుడైతే ఏమిటి ?రేపైతే ఏమిటి? ఎలాగూ అది నేను తినవలసినదేకదా! అందువల్ల ఈఆహారాన్ని ఇప్పుడే తినేసి కూర్చుని,సుఖం గా జపం చేసుకుంటాను." అనుకుంది. తనకు వచ్చిన ఈ గొప్పాఅలోచనకు ఎంతగానో మురిసి పోయింది. ఆహారం తీసుకుంది.నిద్ర ముంచుకొచ్చింది. స్వామీజీ ఉపన్యాసం మరచిపోయింది. పక్కపరుచుకుంది. హాయిగా నిదురపోయింది.


[ఈరోజు పిల్లలకు ఈకథచెబుతుంటే ,ఎందుకో ఎవరో చర్నాకోలతో కొట్టినట్లు చురుక్కుమన్నది. నాసాధనకూడా ఇంతేనేమో నని.]

Read more...

ఎలా అనగలం జన్మజన్మ బంధాలు లేవని ఇది చూసాక?

>> Wednesday, March 11, 2009



అంతర్జాలం లో ఈ చిత్రాన్ని చూసిన తరువాత కూడా జన్మ జన్మ బంధాలు లేవని అనగలమా?

Read more...

ఆపదలనుదొలగించు ఆంజనేయ దండకం


.



శ్రీ ఆంజనేయదండకం
**************


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్ర్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం భజేవాలగాత్రం భజేహం పవిత్రం ,భజేసూర్య మిత్రం భజేరుద్రరూపం భజే బ్రహ్మ తేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామ సంకీర్తనల్ జేసి నీరూపువర్ణించి,నీమీద నేదండకంబొక్కటింజేయనూహించి,నీమూర్తినిన్ గాంచి .నీసుందరంబెంచి నీదాసానుదాసుండనై రామభక్తుండనై నిన్నునేగొల్చెదన్.నీకటాక్షంబునన్ జూసితే వేడుకల్ జేసితే నామొరాలించితే ,నన్ను రక్షించితే ,అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంత వాడన్ ,దయాశాలివై జూచితే దాతవైబ్రోచితే దగ్గరంబిల్చితే,తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై ,స్వామి కార్యంబునందుండి,శ్రీరామ సౌమిత్రులన్ జూచి వారిన్ విచారించి ,సర్వేశు బూజించి యబ్బానుజుంబంటుగావించి యవ్వాలినిన్ జంపి కాకుస్థతిలకున్ దయాదృష్టివీక్షించి,కిష్కిందకేతెంచి .శ్రీరామ కార్యార్ధివై లంకకేతెంచియున్,లంకినిన్గొట్టియున్,లంకయున్ గాల్చియున్ ,యబ్బూమిజన్ చూచి యానంద ముప్పొంగమాయుంగరంబిచ్చి యారత్నమున్ తెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునిన్జేసి,సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలాదులం గూడియాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై దైత్యులన్దృంచగా,రావణుండంత కాలాగ్నిరుద్రుండునై పోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తిన్ వేసి యాలక్ష్మనున్ మూర్ఛనొందింపగా,నప్పుడే బోయి సంజీవినిన్దెచ్చి సౌమిత్రికిన్నిచ్చిప్రాణంబురక్షింపగా కుంభకర్ణాదివీరాళితోబోరి చెండాడి శ్రీరామ-బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబులానంద మయ్యుండ నవ్వేళలన్ నవ్విభీషణున్ ,వేడుకన్ తోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జేయించి,సీతామహాదేనిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి యయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమై యున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్ సేవించి రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనల్ జేసితే పాపముల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ గల్గు సకలసంపత్తులున్ గల్గునే యోవానరాకార యోభక్తమందార యోపుణ్య సంచార యోవీర! యోశూర! నీవే సమస్తంబు నీవే మహా ఫలమ్ముగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థిరముగా వజ్ర దేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరమ యంచున్ మన:పూతమై ఎప్పుడున్ తప్పకన్ తలతు నాజిహ్వయందుండి నీదీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకితధ్యానివై బ్రహ్మవై,బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల కల్లోల హావీర ! హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూతప్రేతపిశాచ శాకినీ ఢాకినీత్యాది గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలం బడంగొట్టి నీ ముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులం ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాభాసితంబైన నీదివ్యతేజంబునుం జూపి రారోరి నాముద్దు నరసింహ యంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామీ.....నమస్తే సదాబ్రహ్మచారీ ,నమస్తేవాయుపుత్రా నమస్తే నమస్తే నమ:



[మహాశక్తివంతమైనఆంజనేయదండకము నోటికిరాని తెలుగువారు ఉండేవారు కాదు పూర్వం. ఏ ఆపదలొచ్చినా .రోగాదులు భయపెడుతున్నాఈస్తుతి చేసినవెంటనే పొగిడితే పెరిగేస్వామికి ఆనందము కలిగి తనను ఆశ్రయించిన వారిని కాచేవాడు.మహా ప్రభావవంతమయిన ఈ దండకమహిమ అపారము. నిష్టతో ఈదండకమును పఠిస్తేస్వామి సులభంగా ప్రసన్నమవటము భక్తులకు అనుభవమే. నరసింహ నామధేయముగల ఉపాసకులెవరో ఈస్తుతిని స్వామికోసముచేసినారు కనుకనే ఆపరమ భక్తునిసంకల్పతో స్వామి ఈదండకముతో ప్రార్ధించినవారిని కాపాడుతూనే వున్నాడు.]

Read more...

>> Monday, March 9, 2009

యూనిట్ 4

1 ఈక్రింది ఒక పద్యమునకు ప్రతిపదార్ధములు వ్రాయండి.
అ. అటజనికాంచె భూమిసురుడంబరచుంబిశిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠభంగతరంగ మృదంగనిస్స్వన
స్ఫుటనటనానుకూల పరిపుల్ల కలాపకలాపి జాలమున్
గటకచరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్
ఆ. ఇది ప్రళయాగ్నివోలె దెసలెలను గప్పగ విస్ఫులింగముల్
వదలకవాయుసారధ్ఇ జవంబున దానిటువచ్చేనేమిసే
యుదు సుతులార యీబిలమున నొయ్యన పోయిచొరుండు దీనిం
గప్పెద ఘనపాంసుజాలముల భీమశిఖావళిదాకకుండగన్

Read more...

భగవద్భంధువులారా! సమయదానాన్నివ్వండి




భగవద్బంధువులారా ! ఈమహత్తర కార్యానికి మీచేయూతనివ్వండి.


రానున్న విరోధినామ సంవత్సరాన కూడా ప్రమాదాలు ,కల్లోలాలు మనలను కలవర పరచనున్నాయని సూచనలు తెలుస్తున్నాయి. ఈసమయం లో లోకక్షేమం కోరి హనుమత్ రక్షాయాగము ప్రారంభమవుతున్నది. ఈకార్యక్రమానికి భగవత్సేవకులందరూ సహకారాన్ని అదించవలసినదిగా మనవి చేస్తున్నాము.

దీని కోసము మిమ్మల్ని ఆర్ధికంగా సహాయము చెయ్యమని అడగటమ్ లేదు.[ మీకుఇంతకు మునుపే మనవిచేసుకున్నాము ,ఇక్కడ పీఠములో ఎవరినీ యాచించే సాంప్రదాయం లేదు. భగవత్శక్తి ఎవరికి ప్రేరణ కలిగిస్తే వారంతట వారేముందుకొస్తారు కనుక అది సమస్యకాదు.]

మేమడుగుతున్నది సమయదానము. భగవంతుడు ఇచ్చిన 24 గంటల సమయం లో మీకొరకు ,మీకుటుంబం కొరకు 23 1/2 గంటలు ఖర్ఛుపెట్టుకుని ఒక్క అరగంట సమయం ఈ కార్యక్రమానికి ఇవ్వండి. ఆసమయాన్ని మీశక్త్యానుసారం ఎలా వినియోగించాలో మేము సూచిస్తాము.

ఎలా వుపయోగించవచ్చు మీరు దానము చేస్తున్న సమయాన్ని?
--------------------------------------

1 ఈసమయాన్ని మీసాధనకు వుపయోగించవచ్చు.

2. కొద్దిసమయము వెచ్చించి మీకు తెలిసినవారికందరకు దీనిని తెలియజేసి వారిని కూడా సాధనకు ప్రేరేపించవచ్చు.

3 మీరు మీద్వారా ఈకార్యక్రమములో పాల్గొంటున్నవారి గోత్రనామాలను పంపి పూర్ణాహుతి తరువాత పంపే హనుమత్ రక్షలను వారికి ఛేర్చేబాధ్యత స్వీకరించవచ్చు.
4. మీరు ఆథ్యాత్మిక సంస్థలు,సత్సంగాల సభ్యులైతే సామూహికంగా మీ సత్సంగ సభ్యులచే పారాయణ చేపించవచ్చు.
అలాగే హనుమజ్జయంతి నాడు మీసమీపంలో గల హనుమత్ క్షేత్రం,లేక ఆలయం లో పూజ్యఅన్నదానం చిదంబరశాస్త్రిగారిద్వారా సూచించబడుతున్న విధి ననుససరించి అక్కడ హోమము చేపించవచ్చు.
5, అలాగే 108 సార్లు చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
6. మీ స్వంత గ్రామాలలో గ్రామ రక్షణకోసము సామూహికంగా హనుమదభిషేకములు చేపించవచ్చు.[ఈకార్యక్రమాన్ని మేము చేపించిన గ్రామాలలో ఆత్మీయతలకుప్రతిరూపాలైన గ్రామీణులలో రాజకీయంగా ,ఇతర కారణాలవల్ల చెలరేగిన హింస,కక్షలు కార్పణ్యాలు కూడా అణగిపోయి ఆయాగ్రామాలలో శాంతి నెలకొనడం మాఅనుభవపూర్వక ప్రమాణము. ] ఈకార్యక్రమానికి ముందుకు వచ్చేవారికి ఆర్ధికంగా ఎటువంటి భారము కలగకుండా మేము పద్దతిని తెలియజేస్తాము.
అలాగే పట్టణాలలో కూడా అన్ని ఆలయాలలో ఒకేసమయములో ఈకార్యక్రమన్ని జరుపవచ్చుకనుక ఎక్కువమందికి మేలు కలుగుతుంది. అక్కడ వుండే ఆథ్యాత్మిక సంస్థలను కలుపుకుని ఈకార్యక్రమాన్ని జరిపేందుకు మీసహాయన్ని అందించవచ్చు.

7. మీకు అందుబాటులోనున్న అథ్యాత్మిక సంస్థలతో ఈకార్యక్రమ ప్రతినిధులుగా మీరు సంప్రదింపులు జరిపి వారి సహకారాన్ని కోరవచ్చు.
8. ఇక్కడ మీరుగాని మేము గానీ చేస్తున్నది భక్తిమార్గములో దాసజన పోషకుడైన హనుమంతుని సేవేకనుక మీరు ఈసేవలో స్వామి కరుణఅపారంగా పొందవచ్చు.

9. మీలో ఉండే సాధకులు మీసంకల్పాలను లోకక్షేమం కోసము చెప్పుకుని అందుకొరకు మీకు ప్రాప్తించిన ఉపదేశమంత్రసాధనలు చేయవచ్చు.
10. మీలో వున్న సంభాషణా నైపుణ్యాలను ఉపయోగించి పలువురకు సత్సంగాలద్వారా హనుమత్ మహిమలను బోధించి వారిలో ప్రేరణ కలిగించవచ్చు.
11. మీరు ఈకార్యక్రమానికి స్వయంప్రకటిత కార్యకర్తలై పీఠమునకు,సాధకులకు అనుసంధానకర్తలవ్వవచ్చు.[ఇక్కడొక చిన్నమనవి.ఈకార్యక్రమానికికై పీఠముతరపున ఎవరిదగ్గరనుంచి ఆర్ధికంగా సహాయాన్ని యాచించరాదు.]

12. ఈసమయములో రాస్ట్రములో హనుమ్మద్దీక్షలు తిసుకునే స్వాములు వుంతారు కనుక వారిని కలుపుకుని ఈకార్యక్రమానికి విస్తృత రూపాన్నివ్వవచ్చు.

పూజ్యులు అన్నదానం చిదంబరశాస్త్రి గారిలాంతి హనుమదుపాసకులు ,పలువురు బ్లాగ్ మిత్రులు సత్సంగ నిర్వాహకులు తమతమ సహకారాలను అందివ్వదానికి ముందుకొస్తుండటం ,స్వామివారి మహిమకు నిదర్శనం.పలుగ్రామాలనుండి తమగ్రామాలలో ఈకార్యక్రమాలు జరిపేందుకు భక్తులు ఉత్సాహం చూపిస్తున్నారు.
సమయము చాలాతక్కువ ,ఆర్ధికంగా ఎటువంటి అండ లేదు,స్వామి అనుగ్రహమనే కొండతప్ప. కనుక ఈకార్యక్రమాన్ని ముందుకు తీసుకెల్లటం అనే భారాన్ని భక్తులమీదనే మోపటం జరుగుతున్నది.ఇక్కడ ఎవరో చెబితే,ఎవరి అదేశాలతోనో మీరు ఈసేవ చేయటం లేదు అనే విషయాన్ని మనసులో ఉంచుకోవాలి మీరు. ,మనచుట్టుపక్కలవాల్లంతా క్షేమముగావుంటేనే మనము సుఖం గావుండగలము కనుక ,కలియుగములో పెరుగుతున్న పాపాలఫలితంగా ఎదురవుతున్న ఉత్పాతాలనెదుర్కొనే ధర్మవీరులుగా హనుమత్ భక్తులుగా మనందరము ఇందులో కలసి సాగుదాము.

ఈకార్యక్రమము పట్ల ఎటువంటి అనుమానాలున్నా నిర్మొహమాటంగా మమ్మల్ను ప్రశ్నించవచ్చు. మీ సందేహాలని తీర్చుకొవచ్చు.

బ్లాగర్లకొకమనవి
---------
ఈకార్యక్రమాన్ని మరింతమందికి చేర్చేందుకు సహకరిస్తుంది కనుక ఈక్రింది లింకును మీ బ్లాగులో ఉంచిగలిగితే
యాగము పూర్ణాహుతైనదాకా ఉంచవలసినదిగా మనవి.

http://durgeswara.blogspot.com/2009/03/blog-post_02.html">http://www.ramaraju.org/hanuman.png"/>

భక్తజన పాదదాసులు
హనుమత్ రక్షా యాగ నిర్వాహకదాసులు
మరియు

శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం
ప్రధాన సేవకుడు
దుర్గేశ్వర

Read more...

ఇదిగో మీ కష్టాలను నివారించుకునే ఆథ్యాత్మిక ప్రయోగం ..పాల్గొనండి

>> Monday, March 2, 2009


ఒక ఆథ్యాత్మిక ప్రయోగ కార్యక్రమం శ్రీకారం చుట్టుకుంటున్నది.. లోకక్షేమము కోసము నిర్వహిస్తున్నందున దానిని పదిమందికి చేర్చే బాధ్యతను అందరికి పంచటము కోసము మీముందుకు తెస్తున్నాము. ఏదైనా ప్రయోగపూర్వకంగా నిరూపితము కాబడినప్పుడు అది సర్వజనామోదము పొందుతుంది.అందులోనూ స్వయంగా అనుభవపూర్వకంగా నిరూపించుకోగలిగినప్పుడు సందేహాలకు తావుండదు.
మానవుని శక్తి స్థాయిని మించి కష్టాలు ,కడగండ్లు . భౌతిక ,ఆథ్యాత్మిక సంకటాలు కలిగినప్పుడు ,వాటిని దాటటానికి భగవత్శక్తిని ఆశ్రయించి విజయం సాధించే అథ్యాత్మిక ప్రయోగమార్గము భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య. సత్యాన్ని గ్రహించిన మహర్షులు ,మానవజాతికి మహోపకారంచేశారు,పలు ఆథ్యాత్మిక సాధనా మార్గాలను సూచించటమ్ ద్వారా. భౌతిక ఇక్కట్లతో సతమత మయ్యే మనిషిని వాటినుండి బయట పడవేయటము ద్వారావారి మనసుకు శాంతి కలిగి,ఆసక్తి పూరితులై భగవన్మార్గాన పయనించి పరాత్పరుని చేరే సోపాన మార్గమిది.
నాటి మహాపురుషులందించిన మార్గం లోనే" శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠము" "హనుమత్ రక్షా యాగమనే" ఒక ఆథ్యాత్మిక ప్రయోగానికి సన్నద్ధమవుతున్నది. ఈప్రయోగము ద్వారాసాధకులు స్వయంగా భగవంతుని కృపను రుచి చూసి.తమ బాధలను తామే బాపుగోగలమని తెలుసుకుని భగవన్మార్గాన మరింత ముందుకు ప్రయాణము సాగించగలుగుతారనే యోచనతో సాగుతున్నదిది.

ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశ్యము
-------------------------------
విరోధినామ సంవత్సరాన కూడా భూమిపైన పలు ఉత్పాతాలు,ప్రమాదాలు .లోక కల్లోలిత చర్యలు మిక్కుటముగా జరగ నున్నాయని శాస్త్రకారులు హెచ్చరిస్తున్నారు. ఈదశలో భక్తులకు అభయ ప్రదాయకుడైన హనుమంతుని ప్రసన్నం చేసుకొని ఆయన రక్షణ పొందటము ద్వారా ఈ ఉత్పాతాలనుండి అవలీలగా దాటవచ్చని అందరికీ తెలిసినదే. ఏ సాంప్రదాయకులైనా హనుమంతుని రక్షణ లో ఉన్నచో భౌతిక ఆథ్యాత్మిక ఆటంకాలు తేలికగా దాటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ధర్మ బద్ధమైన భక్తుల కోర్కెలను హనుమదుపాసన సహాయం తో తేలికగా నెరవేర్చుకోవచ్చుఅన్నది ప్రయోగాత్మకంగా మేము అనుభవించి ,నిరూపించి చెబుతున్న విషయము. ఈతి బాధలు, రోగాలు ,జాతక దోషాలు,ప్రమాదాలు.మానసిక అశాంతి ,అపజయాలనుండి మిమ్ము మీరు రక్షించుకునే మహత్తర ప్రయోగమిది, ఇందులో పాల్గొనటము ద్వారా మరింతమందికి ఈ యాగ ఫలాన్ని పంచటము ద్వారా భక్తజన పోషకుడైన హనుమంతుని రక్షణలోకి మిమ్మలను చేరుస్తుంది.
ఎలా పాల్గొనాలి ?
-----------------------
జాతి మత కుల లింగ బేధాలు లేకుండా అందరూ పాల్గొనవచ్చు. విరోధినామసంవత్సర చైత్ర శుద్ధ పాఢ్యమి [27-3-2009] నుండి హనుమజ్జయంతి [19-5-2009] వరకు ఈయాగము శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠము లో నిర్వహించబడుతున్నది. దీనిలో పాల్గొనదలచినవారు తమ గోత్రనామాలను పంపటము వలన వారందరి పేర్ల తో ప్రతి నిత్యము ఇక్కడ భక్తరక్షకుడై నిలుచున్న అభయాంజనేయ స్వామి వారికి రుద్రసూక్త ,మన్యుసూక్త ప్రకారము జరిగే అభిషేకాదులు అర్చనలద్వారా ను , ఇరవై ఏడు మంది బ్రహ్మచారులచే చేయబడే హనుమత్ చాలీసా,ఆంజనేయ దండకము ,మంత్రజపముల తో జరిపే సాధనకు,మీసంకల్పాలు అనుసంధింపబడతాయి. [ ఇక్కడ సందేహము వద్దు. ఎక్కడెక్కడో వున్న మనము,ఫోన్లద్వారా,ఇంటర్ నెట్ల ద్వారా ఎలా అనుసంధిన్పబడుతున్నామో,అంతకంటె శక్తివంతమైన మనోసంకల్ప తరంగాలు,దివ్యశక్తిపూరితాలైనటువంటి మంత్రోఛ్ఛారణోత్పాదితాలైన తరంగ ప్రసరణద్వారా ప్రకృతి శక్తులు మనలను అనుసంధింపజేస్తాయి.]
నలభై రోజుల కాల వ్యవధి వుండేలా చూసుకుని మీరు వ్యక్తి గతము గా కాని ,బృందముగా కాని ఇందులో పాల్గొనవచ్చు. మీరున్నచోటునుంచే మీరు ఈ కార్యక్రమములో పాల్గొనవచ్చు. ముందుగా మీరు శుభకరమయిన ముహూర్తమునెన్ను కుని ఆరోజున ఇంటి లోగాని దేవాలయము లోగాని మీరు ఏ కోరికతో ,ఏ కార్యము నెరవేర్చాలన స్వామిని కోరుకుంటున్నారో [అది అథ్యాత్మికమైనదైనా లేక భౌతిక మైనదైనా] దానిని సంకల్పములో చెప్పుకుని ప్రారంభించాలి.

పారాయణ విధానములో సాధన
-------------------

శుభ ముహూర్తము [హనుమజ్జయంతికి ముందునుంచి 40 రోజులకు తగ్గకుండా] నిర్ణయించుకుని
ఆరోజు దీపారాధన పూజ ముగించుకుని ,మీరు ఏధ్యేయముతో పారాయణము చేస్తున్నారో స్వామి ముందు సంకల్పముగా చెప్పుకోవాలి. రోజుకు 11 సార్లు గాని అంతకు మించి గాని పారాయణము చేయాలి.ఒకసారి ఆంజనేయ దండకముచదువు కోవాలి. ముందుగా స్వామివారికి ప్రదక్షిణలు చేయాలి.అవి కూడా మొదలు పెట్టినరోజు ఎన్ని చేస్తారో చివరి రోజువరకు అన్ని చేయాలి. ప్రదక్షిణకు ఆలయానికి వెల్లలేనివారు తులసికోటలోగాని .లేక ఒక శుద్దమయిన ఆసనము ఏర్పాటు చేసుకునీ అందులో స్వామి చిత్ర పటాన్నుంచి గానీ చేయవచ్చు.సింధూరము ధరించాలి. ఆడవాళ్ళు ఐదురోజుల ఇబ్బంది వదలి మరలా మొదలు పెట్టి పూర్తి చేయవచ్చు.

శనివారము ఒక్కపూట భోజననియమము చేయాలి. ఈసమయాన మధ్య మాంసాదులు ,నిషేధము.
బ్రహ్మచర్యదీక్ష
ఏసాధనకైనా అద్భుతముగా తోడ్పాటునందిస్తుంది గమనించగలరు. చివరిరోజున మీకు సమీపములోని హనుమదాలయం లో తమాలార్చన జరిపించుకోవాలి. ముందుగా మీ కుటుంబసభ్యుల గోత్రనామాలు పంపితే ఇక్కడ అన్ని రోజులు మీపేర్లపైన అర్చనాదులు,హోమములో ఆహుతులు సమర్పించబడుతుంటాయి.
ఇక మీకేదయినా గురూపదేశమయిన మంత్రాదులుంటే జపించవచ్చు. లేదా చాలీసాలో ప్రతి దోహా ఒక సంపుటీకరణ మంత్రమే కనుక మీకోర్కెను తీర్చగల దోహాను నిరంతరం జపించవచ్చు. ఏ కార్యసాధనకు ఏదోహాను పఠించాలో మరొక పోస్ట్ లో వ్రాస్తాము. మీరు కోరితే పంపిస్తాము.జయంతికి పీఠములో జరిగే పూర్ణాహుతికి అందరికి ఆహ్వానాలు అందుతాయి.ఇక్కడ సేవాకార్యక్రమాలు అన్ని మీకు తెలియజేయబడతాయి.


దీక్షా విధానములో సాధన
................
శుభముహూర్తాన గురువు చేతగాని ,హనుమదాలయములో తల్లిచేతగాని,అర్చకులచేతగాని మాలాధారణ చేసి ,దీక్ష చేపట్టాలి. అన్ని దీక్షాపద్దతులలో ఉండే నియమాలు ఇక్కడ పాటించాలి. దీనివలన చెడుఖర్మలు త్వరగా ధ్వంస మవుతాయి.

సంకల్పము చెప్పుకుని చాలీసా, దండకములను పారాయణ చేయటము,ప్రదక్షిణలు చేయటము ప్రధానము. చివరన ఏదైనా హనుమత్ క్షేత్రములో విరమణ చేయాలి. పూర్ణాహుతికి పీఠము నకు వచ్చినట్లయితే యాగములో స్వయముగా పాల్గొనవచ్చు.ఇందులో కఠిన నియమములు మన దుష్కర్మలను ధ్వంస మొనరించి శుభాలను చేకూరుస్తాయి.

భక్తితో ఈ పద్దతులలో సాధన చేయువారికి హనుమంతుని రక్షణ లభించి ,సకలప్రమాదాలనుండి,అనారోగ్యపు బాధలనుండి కాపాడబడతారు. విజయము, సిద్ది ,శుభాలను ప్రయోగాత్మకంగా పొంది స్వామి వారి రక్షణ వలయం లో కి రాగలుగుతారు.
బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్
అన్నారు పెద్దలు హనుమంతుని తలచుకుంటేనే ఇవన్నీ కలుగుతాయి. భక్తితో ఈసాధన చేసి చూడండి ఫలితాలను.

భక్తజనుల సేవకై వున్న మేము మీకు ఈసాధనలో తోడుగా వుండి మీకు కలిగే సందేహాలను పెద్దల ద్వారా తీరుస్తూ
మీవెంట నడుస్తాము.

మీకు ఎప్పటి కప్పుడు సందేహాలను తీరుస్తూ పీఠము నుండి సందేశాలు అందుతుంటాయి.

ఈ కార్యక్రమములో గ్రామ పట్టణ ములలో భక్తుల శ్రేయస్సుకై మహాత్ములు ప్రతిష్టించియుండిన మూర్తులకు సామూహిక అభిషేకములు జరుపుటద్వారా ,నూటఎనిమిది చాలీసా పారాయణ కార్యక్రమములను చేపించుటద్వారా హనుమత్ శక్తిని మేల్కొల్పటము జరుగుతుంది. మీ గ్రామాలలో ఆయా కార్యక్రమాలను జరుపుటకు ఆసక్తి కలవారికి విధి విధానాలను, అనుభవజ్ఞులను పంపుటద్వారా పీఠము సహకరిస్తుంది. అయా విషయాలు తరువాత తెలియ జేయబడతాయి.
హనుమత్ జయంతి రోజున పూర్ణాహుతి కార్యక్రమము జరుపబడుతుంది. అన్నదానము జరుగుతుంది. ఈ యజ్ఞ రక్షలను అందరికీ పంపించటం జరుగుతుంది.
ప్రయోగములో మీరు పాల్గొని ఈసాధనా ఫలితాలను స్వయంగా తెలుసుకోగలందులకై మిమ్మలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.ఇందులో పాల్గొని మీరెదుర్కొంటున్న సమస్యలను హనుమత్ కృపతో జయించగలరని ఆకాంక్ష.
చిరునామా
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠము
రవ్వవరము
నూజెండ్ల మండలము
గుంటూరు జిల్లా

ఈ క్రింది లింకును కూడా చూడండి

http://durgeswara.blogspot.com/2009/03/blog-post_09.హ్త్మ్ల్

http://durgeswara.blogspot.com/2009/03/blog-post_17.హ్త్మ్ల్

దండకమునకై చూడండి
http://durgeswara.blogspot.com/2009/03/blog-post_11.హ్త్మ్ల్

చాలీసా కొరకు చూడండి
http://durgeswara.blogspot.com/2009/03/blog-post_467.html


సెల్ ౯౯౪౮౨౩౫౬౪౧


ఉగాది నాడు ప్రారంభించిన గణపతి హోమము
http://durgeswara.blogspot.com/2009/03/blog-post_27.హ్త్మ్ల్ లో చూడండి

Read more...

ఇక్కడున్నందుకెంత ఫీజు చెల్లించాలి మనం ?

>> Sunday, March 1, 2009


సూర్యరశ్మి,చల్లగాలి, వర్షపు నీరు మినహా భూలోకం లో ఏవస్తువూ ఉచితంగా లభించదు. ఏదీ డబ్బుపెట్టి కొనకుండా చేతిలో పడదు. ప్రతి వస్తువు కూ వెల చెల్లించాలి. వేసవిలోనే కాదు ప్రస్తుతము మామూలు సమయము లోకూడా తాగే గుక్కెడు నీరు కూడా డబ్బాలలో కొనుక్కోవాల్సిన పరిస్థితి. పల్లు తోముకునే పుల్లలనుండి బస్తా బొగ్గులదాకా,,కాస్త ఉప్పు కాడనుండి కూల్ డ్రింక్ లదాకా డబ్బులక్కడ పెట్టి మరీ తీసుకోవాలి.రేపిస్తానంటే రేపే వచ్చితీసుకోమంటారు.
ఇంట్లో వున్నందుకు అద్దె ఫోను చేస్తే డబ్బు,కదిలితే డబ్బు ,మెదిలితే డబ్బు చెల్లించితేనే ఏదయినా పొందగలిగేదిమనం. మందు పుచ్చుకున్నందుకేగాక డాక్టర్ తో మాట్లాడినందుకు కూడాడబ్బు చెల్లించాల్సినదే.
అయితే ఒక ఒక దేశ భూభాగం లో నివసిస్తున్నందుకు ,ఆదేశానికి చెందిన భూమిలో పంట పండించుకుంటున్నందుకు.ఆనేలమీద ఇల్లు కట్టుకున్నందుకు,అచటి జలములు త్రాగుతున్నందుకు,ఆచోట మలయమారుతములను అనుభవిస్తున్నందుకు మనమేమి మూల్యం చెల్లిస్తున్నాము? దీనివెల ఎంత అనే సందేహం వస్తుంది కొందరికి.తల్లి బిడ్డను పెంచేందుకు ఖరీదెంత అంటే ఏమి చెప్పగలం? తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డను పెంచి పెద్దచేసినందుకు ఖరీదెంత? రూపయలలో విలువ కట్తలేనిది.అమూల్యమయినది అగు అంశమిది.
ఏది లేకుండా మనము లేమో.అటువంటి మాతృభూమి నుండి మనం పొందుతున్న ప్రయోజనాలకు ఖరీదెంత? ఎంత సొమ్ము చెల్లించాలి మనం? ఏరూపంలో చెల్లించాలా మూల్యాన్ని?అనే విషయాలు పరిగణలోకి తీసుకోవలసిన అవసరము ఉన్నది .

ఇవి వాటంతట అవి వచ్చిన అవకాశాలు.ఉచితంగా లభించేవి.వీటికి మనమేమీ తిరిగి ఇవ్వనవసరం లేదు అని కొందరి ఉద్దేశ్యం.అది పొరపాటు.డాక్టరు మందిచ్చినందుకు కాక అతనితో సంభాషించినందుకు కూడా కన్సల్టేషన్ ఫీజు ఇస్తున్నమనం ,మన ఉనికికి అవకాశ మిచ్చిన భూమికి మనమేమీ చెల్లించనవసరం లేదా?
దేశమంటే మనతో మాట్లాడలేని నేల మాత్రమేకాదు.దేశమంటే మనకు అనుదినమూ కనిపించే సమాజం..ఆసమాజ క్షేమంలోనే నాక్షేమం ఇమిడి వున్నది అనే ఆలోచన,నాకు గల శక్తి సామర్ధ్యాలు,మేధస్సు,ధనము-వీటన్నిటిని నాకొరకేగాక సమాజము కొరకు కూడా వినియోగిస్తాను అనే గ్రహింపు అనుదినమూ మనసులోకి తెచ్చు కోవడమే దేశానికి చెల్లించే ఫీజు.

దేశమును ప్రేమించు మన్నా........................లేకున్న నీమనుగడ సున్నా...

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP