శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఒక్క క్షణం ..ఏమిటి రుణబంధాలు?

>> Friday, February 27, 2009

రావల్ఫిండి లో ఒక సైనికాదిపతి ఉండేవాడు . ఒకసారి కాబూల్ లో తిరుగుబాటుదారులను అణచివేయుటకు ప్రభువు అతనిని కాబూల్ పంపెను. ఆటను అక్కడకు చేరేసరికి యుద్దము తీవ్రముగా సాగుతున్నది. ఫిరంగులు మ్రోగుతున్నాయి .పరిస్థితిని పూర్తిగా అర్ధము చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండగానే అతడెక్కిన గుర్రము ఎంతప్రయత్నించినా ఆగక శత్రువులవైపు పరిగెట్టినది. దళాధిపతి దానిని ఆపుటకు విశ్వప్రయత్నం చేసినా వీలుగాక గుర్రముతో బాటు శత్రువుల మధ్యకు చేరి అసువులు బాశాడు.
ఆకాలం లో సైనిక దళములకు కొందరు వర్తకులే కాంట్రాక్ట్ పద్దతిలో భోజనపదార్ధాలను సరఫరా చేస్తుండేవారు. ఈ దళాదిపతికి కూడా ఒక వర్తకుని వద్ద ఖాతా వున్నది. తనకు కుటుంబసభ్యులు లేనందున ఆయన తన ధనమును కూడా ఆవర్తకునివద్దనే దాచుకునేవాడు. ఆతను మరణించగానే అతని వస్తువులను అతని బంధువర్గం తీసుకున్నారు. కాని వర్తకుని వద్దవుంచిన రెండువేల రూపాయలు గురించి ఎవ్వరికి తెలియనందున,అవి తనకు దక్కినందుకు వర్తకు
డెంతో సంతోషించాడు.
కాంట్రాక్ట్ కాలం అయి పోగానే ఆవర్తకుడు తన స్వగ్రామము సహన్ పూర్ కు వెళ్లి అక్కడొక దుకాణం తెరుచుకుని గడుపుతున్నాడు. ఇలా దాదుపు ఇరువది సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి అతని మితృడొకరు తనస్నేహితులతో కలసి హరిద్వార్ వెళుతూ మార్గ మాధ్యమం లో సహన్ పూర్ కు వచ్చాడు. దానికి వర్తకుడు సంతోషించి వారిని ఈరాత్రికి తమ ఆతిథ్యం స్వీకరించి ఈరోజుకు వుండమని కోరాడు . దానికి వారు అంగీకరించారు.

వర్తకుడు వారికొరకు విందు ఏర్పాటు చేశాడు. అందరు తృప్తిగా భోజనం చేస్తున్న సమయం లో లోపలనుండి వారికి ఏడుపులు వినిపించినవి. .ఆ జాలి ఏడ్పులెవరివో ఎమ్దుకేడుస్తున్నారో తెలపమని కోరారు. .అదా! ఏమియు లేదు మీరు కానివ్వండి. అని వర్తకుడు దాటవేయాలని చూసాడు. కాని ఆదుఃఖానికి కారణం ఏమిటో తెలుపాలని వారు పదేపదే అడిగినమీదట చెప్పక తప్పలేదు. సరే! వినండి ,ఆయేడుస్తున్నది నాకోడలు. కొన్ని రోజుల క్రితం నా కుమారుడు మరణించాడు ,అతని మృత్యువు కారణం గా ఆమెకు ఆ దుఃఖము సహజమేకదా ! అన్నాడు .
దానికి వారు విచారం వ్యక్తము చేసినారు . కాని కుమారుడు మరణించినా ఆవర్తకుడు నిర్వికారముగా వుండి ఇలా అతిథి మర్యాదలు ,విందులు చేస్తూ ఎలా వుండగలుగుతున్నారని అడిగారు . ఎంతో ఆశ్చర్యంగావున్నది అని అన్నారు.
ఓమిత్రులారా! ఇరువది ఎళ్ల క్రితం నేను కాబూల్ లో సైనికులకు కాంట్రాక్ట్ గా వస్తువుల సరఫరా చేసేపని చేసి తరువాత స్వగ్రామం వచ్చి పెళ్లి చేసుకున్నాను ఆతరువాత రెండేళ్ళకు మాకొక కుమారుడు పుట్టాడు . వానిని పెంచి పెద్దవాడిని చేసి పెండ్లి చేసితిమి. కాని కొన్నిరోజులకే జబ్బుచేసి నది .అనేకమందికి చూపి వైద్యం చేపిమ్చితిని. వారు ఎన్నో మందులు వాడినా ఫలితం లేదు. వాడు కోలుకునేట్లు కనపడలేదు.
వైద్యులచే కుదరకుండుట తో రాజవైద్యులనుండి భూతవైద్యుల వైపు మల్లినది నాదృష్టి. కుమారుని బ్రతికించమని ఒక మహమ్మదీయ మతాచార్యుని వేడుకుంటిని. అతడువచ్చి ఏ వో మంత్రాలు చదివాడు. మంత్రజపం పూర్తికాగానే నావద్దనున్న రెండున్నర రూపాయలు ఆయన కిచ్చితిని.
నేను ఆవిధముగా చేయుటచూచి నాకుమారుడు నవ్వెను. పిల్లవాని నవ్వు చూస్తూ తనమంత్రం ఫలించినదని ఆమతాచార్యుడు అనెను. త్వరలోనే ఆపిల్లవాని ఆరోగ్యం బాగావుటుందని,తానుత్వరలో వస్తానని చెప్పి వెళ్ళాడు.
అతను వెళ్ళిన తరువాత , నేను నాయనా ! ఎలా వున్నది? అని నాకుమారుని అడిగితిని. నాకు సంపూర్ణ ఆరోగ్యముగా నున్నది అని అన్నాడు నాకుమారుడు. వాని మాటలు నాకర్ధము కాక సంపూర్ణ ఆరోగ్యమనగా నేమి అని అడిగితిని. దానికి వాడిట్లనెను.
ఇరువది ఏండ్ల క్రితం నేను దాచియుమ్చమని నీకు రెండువేల రూప్యముల నిచ్చితిని .అంతలో కాబూల్ లో తిరుగుబాటును అణచేందుకు వెళ్లి ,అక్కడ అసువులు బాసితిని. ఆ డబ్బు నీవద్దనే వున్నందున దానిని తీర్చుకొనుటకై నీకు కుమారునిగా జన్మించితిని. అనెను.
అంతే కాదు నీవుచేసిన సేవలతో నారుణము తీరినది . చివరి సారిగా నీవు మతాచార్యునకిచ్చిన రెండున్నరరూపాయలతో మిగిలన రుణముకూడా తీరిపోయినది. ప్రస్తుతము నాకు భార్యగానున్నస్త్రి నన్ను యుద్దరంగములోనికి లాక్కొనివెల్లిన నా గుర్రమే. ఎంతలాగినను వినక నన్ను శత్రువుల మధ్యకుతీసుకుని వెళ్ళినది.
వారు మమ్మిద్దరిని చంపిరి. పూర్వజన్మలో నన్ను చంపించినవిధముగా ఇప్పుడు నేను మరణించిన పిదప ఆమె కూడా బాధనొందవలసి యున్నది.దీనితో మాయిద్దరి ఋణము కూడా తీరిపోతుంది ని చెప్పి వాడు కన్ను మూసెను.
కధను ముగించి వర్తకుడిట్లనెను. దళాధిపతి మరణించినాడు. ఆయన స్వారి చేసిన గుర్రము ఇప్పుడు భార్యరూపములో ఏడ్చుచ్చున్నది. .నేనిప్పుడు ఎవరి కోసము వేదన చెందవలెను? కావున దయచేసి భోజనము చేయండి అని వేడుకొనెను.
అందరూమరలా భోజనములు ప్రారంభించగా ఆవర్తకుడిట్లనెను ,కుటుంబ సభ్యులు ,బంధువులు మిత్రులు మున్నగువారు తమ కర్మాను సారంగా కలియుచుంటారని,వారి వారి రుణాలు తీరిపోగానే ఎక్కడి వారక్కడ విడిపోతారని సద్గురువులు చెబుతుంటారు. .

Read more...

దౌర్భల్యం

>> Thursday, February 26, 2009


ప్రతి మతము వారూ ,తమ మతమే విశ్వ జనీనమని వాదిస్తారు. విశ్వజనీన మతమెన్నటికి కలగదని నా భావం .ఒకవేళ అలాంటి మతం వుంటే ,అది మన సనాతన మతం ఒక్కటే నని చెప్పటానికి కొంత వీలుంది. మరేమతానికి అటువంటి అవకాశమూ లేదు. .ఎందుకంటే ,తక్కిన మతాలన్నీ ఎవరో ఒక పురుషునిమీదగానీ,పురుషుల మీదగానీ ఆధారపడి పుట్టాయి . అవన్నీ ,చారిత్రక పురుషుడని ఆ మతస్తులు చెప్పే ఒకానొక పురుషుని జీవితం చుట్టూ అల్లబడ్డాయి. వారు ఏది తమమతానికి బలమని భావిస్తున్నారో అదే దాని దౌర్భల్యం . ఎందుకంటే ! ఆపురుషుని గూర్చిన చారిత్రకత సత్యమ కాదని మిరు రుజువు చేశారో, ఆమాట నిర్మాణమంతా నేలగూలిపోతుంది. ఈ గొప్ప గొప్ప మాట నిర్మాతల జివితాంశాలలో సగమైనా చారిత్రకంగా సత్యం కావని రుజువైనది. తక్కిన సగం సంశయగ్రస్తమై ఊగులాడుతోంది . అందువల్ల ఆమతకర్తల పలుకులే ఆధారంగా గల మాట ధర్మాలన్నీ రూపుమాసి,గాలిలో కలసిపోతున్నాయి.

_ స్వామి వివేకానంద

Read more...

హరోంహర మహాదేవ

>> Monday, February 23, 2009


హరోంహర మహాదేవ

తండ్రీ! సాగించు నీ భక్తరక్షాపాలన
పాలించు మామనోన్మండల మాహాసామ్రాజ్యాలను

ప్రసాదించు నిదివ్య నామ మహిమామృతాన్ని మాఎల్లరకు

Read more...

హరహర మహా దేవ శంభో .

హరహర మాహా దేవ శంభో .
పరమేశ్వరుని అనుగ్రహం మీఎల్లరకు కలగాలని ఆభోళాశంకరుని భక్తవశంకరుని ప్రార్ధిస్తూ
.......దుర్గేశ్వర

Read more...

నమశ్శివాయ గేయామృతము

>> Friday, February 20, 2009



పరమశివుడు పరమదయాళువు . స్తుతిస్తే ఆయన సులభంగావశమయ్యే భక్తవశంకరుడు. యనను స్తుతించే సాహిత్యము కోకొల్లలు.అందునా మనతెలుగులో ఆయనను పొగిడే పాటలలో నమశ్శివగేయామృతము మనసును పరవశింపజేసే భాషతోను ,భావముతోను నిండి ఆబోళాశంకరుని మనసు కరగజేస్తుంది. దివ్య నామాల గానామృతాన్ని మీతో పంచుకోవాలనే ఈప్రయత్నము.రండి కలసి గానము చేద్దాము మనసార .

ఓంనమశ్శివాయ నమశ్శివాయ ,నమశ్శివాయ ఓం నమశ్శివాయ.

నమశ్శివాయని నామనమందున నభినుతిజేసెద ననుకడతేర్చు మా //ఓం నమశ్శివాయ//
నమశ్శివాయను మంత్రము నానా,నరకములను తెగదృంచునయా //ఓం నమశ్శివాయ//
అతిదీనులమై అనుదినమును నిను,మదిలోదలతుముబ్రోవుమయా //ఓం నమ //
పతితపావన పన్నగధారణ,పాలనజేయవె దయామయా // ఓం నమ //
ఎంతని వేడుద పంతమునాపై సుంతయుదయరాదేలనయా //ఓం నమ//
శంభోహరహర మహదేవా నీశరణములేగతియంటినయా //ఓంనమ//
అండాపిండ బ్రహ్మాండములంతట,నిండినజ్యోతివి నీవేనయా //ఓం నమ//
ఆదియు మధ్యయు అంతము తెలియని ఆనందామృత తత్వమయా //ఓం నమ//
ఇంద్రుడాదిగా సకలసురులకును ఇష్టదైవమగు మూర్తివయా //ఓం నమ//
౧౦ ఈశ్వర నామొర నాలకింపవే శాశ్వత గుణగణ సత్యాననా //ఓం నమ//
౧౧ ఉరగవిభూషణ నీదగునామము మరువగ జాలర మానసమున //ఓం నమ//
౧౨ ఋతువులు మాసము లెన్నో గడచెను,వెతలు తీర్చవెటుబోదునయా //ఓమ్ నమ//
౧౩ ఊరడించి నను గావకయుండిన ఓపజాలగతి నీవేనయా //ఓం నమ//
౧౪ఎందుకు నీదయరాదు పరాత్పర ,మందుడనని కడు కోపమా //ఓం నమ//
౧౫ ఏమియుదెలియని దీనులమైతిమి పామరముడిపియు పాలింపవే //ఓం నమ//

౧౬ ఐక్యస్వరూపము దెలిపినజాలుర,ఆనందాంబుధి మునుగుదురా //ఓంనమః//
౧౭ ఒకటిరెండు మూడక్షరములలో ,సకలంబునకును సాక్షివయా //ఓంనమః//
౧౮ ఓంకారాత్మకమయమగు బ్ర్హహ్మము ,నొందెడు మూలము దెలుపుమయా //ఓంనమః//
౧౯ఔరాఏటికి నీదయరాదుర,అంతకఠినమా హరాహరా //ఓంనమః//
౨౦అంతయు నీవైయుండగవేరే,చింతలు నాకిక ఏలనయా //ఓంనమః//
౨౧ ఆలకింపుమిక నాదగుమనవిని,అరమరసేయకాఅదిదేవ //ఓంనమః//
౨౨ అహర్నిశంబునునీదగుమంత్రము,ననుసంధింపగజేయుమయా //ఓంనమః//
౨౩కమలసంభవాద్యమరగణావన కంజలోచనా భవమోచన //ఓంనమః//
౨౪ఖగవాహనప్రియ కరుణాసాగర ,కంతుమదాప హరాహర //ఓంనమః//
౨౫ఘనమౌ నీదగు కీర్తినివినినే,మనమున నమ్మితి బ్రోవుమయా //ఓంనమః//
౨౬జ్ఞాతృ జ్ఞానజ్ఞేయము లొకటై,గాంచిన నీదయ గల్గునయా //ఓంనమః//
౨౭చదువుల లోపల చదువై వెలసిన,సారముగ్రోలిన జాలునయా / /ఓంనమః//
౨౮జననమరణములు బొరయినిపదవికి,సాక్షిమాత్రుడవు నీవేనయా //ఓంనమః//
౨౯ఝమ్మనుప్రణవనాదములోపల ,గ్రమ్మినవెన్నెల కాంతివయా //ఓంనమః//
౩౦ టక్కరి జగమున మాయకు లోబడి,చిక్కితి నిన్నెటుగాంతునయా //ఓంనమః//
౩౧డబ్బుకొరకు నిను చేరలేదయా ,మబ్బుదొలంగెడు మార్గమేదయా //ఓంనమః//
౩౨ ఢంకాది మహానాదానందా,సంకటముల తొలగింపుమయా //ఓంనమః//
౩౩ తలచితలచి వేసారితి నీదయ,కలుగదాయె నిక నేమిసేతు //ఓంనమః//
౩౪ తారక యోగము దారినెరింగిన ధన్యులు నీదయగాంతురయా //ఓంనమః//
౩౫ దరిజేరుట ఇక ఎన్నడుతండ్రీ,తాపమయనిక తాళజాల //ఓంనమః//
౩౬ దారుణమగు నీసంసారాంబుధి,తీరము జేరగ జాలనయా //ఓంనమః//
౩౭ దుఃఖముదొలగెడు మార్గము నామది,తోపగజేయర దురితహరా //ఓంనమః//
౩౮ దండము దండము నీపాదములకు ,భండనభీమా భవహరహర //ఓంనమః//
౪౦ నరకస్వర్గము లాదిద్వంద్వముల,బొరయని తత్వమెస్థిరమయ్యా //ఓంనమః//
౪౧ నానారూపములందియు దేనిని,నంటకవెలిగెద నద్భుతముగ //ఓంనమః//
౪౨ నిజముగ నినుమది నెరిగినదాసులు,నిఖిలమెరింగినవారయ్యా //ఓంనమః//
౪౩ నీవేకర్తవు నీవేభర్తవు,నీవేహర్తవు నీవేనయా //ఓంనమః//
౪౪ నీవే యజుడవు,నీవే విష్ణువు నీవేహరుడవు నిరుపమగుణ //ఓంనమః//
౪౫ నీకంటే పరదైవము లేదుర ,నిన్నేగొలచెద నిర్ధ్వంద్వా //ఓంనమః//
౪౬ నేను నీవెవడు ద్వైతము తొలగిన ,నీవే నేనైయుందునయా //ఓంనమః//
౪౭ నీవే నేనై నెగడిన తదుపరి ,నేమియుతెలుపగ జాలనయా //ఓంనమః//
౪౮ అన్ని మతంబుల కాదిమూలమిది ,కన్న జన్మమిక సున్నయ్యా //ఓంనమః//
౪౯ ఆనందము దివ్యానందము బ్రహ్మనందముపరమానందము //ఓంనమః//
౫౦ పలుమరుమది నినుగొలచెడు ఘనులకు కలిగెడుభాగ్యమి దేనయా //ఓంనమః//




[ మిగతాది రేపు ]

Read more...

మహాశివరాత్రి పూజలకు గోత్రనామాలు పంపండి.

>> Wednesday, February 18, 2009


పరమశివుడు పరమదయాళువు.ఆయన నామముమృత్యుంజయము.ఆయనకు ఇష్టమైన మహాశివరాత్రి రోజున ఆయనను అర్చించడమే మహాపుణ్యమును ప్రసాదిస్తుంది.అనంత సుఖసంతోషాలను కలుగజేస్తుంది. మహాశివరాత్రి రోజు న పీఠములో రామలింగేశ్వరస్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకములు అర్చనలు జరుగుతాయి.పరమశివుని పావన నామము ఏకాహముగా జపించబడుతుంది. భక్తవరులు తమ గోత్రనామాలను పంపితె వారి తరపున,వారికుటుంబ సభ్యులకొరకు ప్రార్ధనలు జరుగుతాయి. వారితరపున అర్చన జరుపబడుతుంది. మీరు మీ గోత్రనామాలను పంపతము తో బాటు మీమిత్రులందరికి విషయాన్ని తెలియజేయండి. దొరికిన ప్రసాదాన్నైనా పదిమందితో కలసి పంచుకోవడము ఇక్కడ పీఠములో సేవావిధానము.

Read more...

హెచ్చరికలొస్తున్నా పట్టించుకోవటం లేదు

>> Tuesday, February 17, 2009

తనతండ్రి చేయాలనుకున్న అనేకపనులు చేయకుండానే అంటే చేయాలనుకున్నవి,పూర్తిచేయకుండానే చనిపోయాడు.అది చూసిన అతని కుమారునికి చావంటే భయం కలిగినది.దాంతో చావును జయించాలనే కోరిక కలిగినది. యముడికోసం తపస్సు ప్రారంభించాడు.తీవ్రమయిన అతని తపస్సుకు మెచ్చి యమధర్మరాజు ప్రత్యక్షమయి ఏవరం కావాలో కోరుకోమన్నాడు.

"నాకు చావు రాని వరం ఇవ్వు స్వామి"

పుట్టాకగిట్టకతప్పదు .చావులేనివరం ఎవరూ ఇవ్వలేరు ,నిరాకరించాడు యముడు.
ఎలామరి.మానాన్నలా నేను చేయాల్సిన పనులు పూర్తి చేయకుండా చావటం నాకిష్టములేదు.చెప్పాడతను.

నీమరణానికి ముందుగా నిన్ను నాలుగుసార్లు హెచ్చరిస్తా ,చేయాల్సిన పనులన్ని త్వరగా చేసుకో ,కావాలంటే ఆవరం ఇస్తాను అన్నాడు యముడు.

సరే,గుడ్డిలో మెల్ల అదన్నా ఇవ్వండి.అంగీకరించాడతను.

ఆతర్వాత యముడు అతనికి మరెన్నాడూ కనపడలేదు. కానీ అతనిని తీసుకు వెళ్లటానికి యమభటులొచ్చారొకరోజు.

ఇదన్యాయం!వెళ్ళి మీప్రభువునడగండి నన్ను మరణానికి ముందు నాలుగు సార్లు హెచ్చరిస్తానన్నాడాయన.ఆవరం ఏమైనదో కనుక్కుని నన్ను తీసుకు వెల్లండి. అభ్యంతరం చెప్పాడతను.

ఇందులో ఎలాంటి అన్యాయం లేదు. మాప్రభువు నిన్ను నాలుగుసార్లు హెచ్చ్రరించానని చెప్పారు మాతో కావాలంటే నీ అనుమానము మాతోవచ్చి ఆయననే అడుగు.అన్నారు వారు.

నువ్వు నన్ను ఒక్కసారికూడా హెచ్చరించలేదు.అన్యాంగా నన్ను తెప్పించావు,నిష్టూరమాడాడాతను.

నీకు మాటిచ్చిన ప్రకారమే నాలుగుసార్లు హెచ్చరికలు పంపానయ్యా ,అన్నాడు యముడు.

ఎప్పుడు చెప్పావు? ప్రశ్నించాడు.

నీజుట్టు తెల్లబడటం నామొదటి హెచ్చరిక.నీపళ్ళు వదులవటం ఊడటం మొదలు పెట్టినది నారెండవహెచ్చరిక

నీకంటి చూపు మందగించటమే నా మూడవ హెచ్చరిక

నీవంటి మీద చర్మం మడతలు రావటము ఆఖరి హెచ్చరిక ,జవాబు చెప్పాడాయన.

ఈ హెచ్చరికలు ప్రతివారికీ పంపుతూనే వున్నాడు యమధర్మరాజు అందరికి.రంగులేసి మనసును మభ్యపెట్టుకోవటము కాకుండా మనము చేయవలసిన మంచిపనులను త్వరగా చేయాలి. చేయాల్సిన అసలు పని భగవంతుని చేరుకునే ప్రయత్నము త్వరగా చేయాలి.లేకుంటే సమయము ఆగదు మనకోసము.



Read more...

హెచ్చరికలొస్తున్నా పట్టించుకోవటం లేదు

తనతండ్రి చేయాలనుకున్న అనేకపనులు చేయకుండానే అంటే చేయాలనుకున్నవి,పూర్తిచేయకుండానే చనిపోయాడు.అది చూసిన అతని కుమారునికి చావంటే భయం కలిగినది.దాంతో చావును జయించాలనే కోరిక కలిగినది. యముడికోసం తపస్సు ప్రారంభించాడు.తీవ్రమయిన అతని తపస్సుకు మెచ్చి యమధర్మరాజు ప్రత్యక్షమయి ఏవరం కావాలో కోరుకోమన్నాడు.

"నాకు చావు రాని వరం ఇవ్వు స్వామి"

పుట్టాకగిట్టకతప్పదు .చావులేనివరం ఎవరూ ఇవ్వలేరు ,నిరాకరించాడు యముడు.
ఎలామరి.మానాన్నలా నేను చేయాల్సిన పనులు పూర్తి చేయకుండా చావటం నాకిష్టములేదు.చెప్పాడతను.

నీమరణానికి ముందుగా నిన్ను నాలుగుసార్లు హెచ్చరిస్తా ,చేయాల్సిన పనులన్ని త్వరగా చేసుకో ,కావాలంటే ఆవరం ఇస్తాను అన్నాడు యముడు.

సరే,గుడ్డిలో మెల్ల అదన్నా ఇవ్వండి.అంగీకరించాడతను.

ఆతర్వాత యముడు అతనికి మరెన్నాడూ కనపడలేదు. కానీ అతనిని తీసుకు వెళ్లటానికి యమభటులొచ్చారొకరోజు.

ఇదన్యాయం!వెళ్ళి మీప్రభువునడగండి నన్ను మరణానికి ముందు నాలుగు సార్లు హెచ్చరిస్తానన్నాడాయన.ఆవరం ఏమైనదో కనుక్కుని నన్ను తీసుకు వెల్లండి. అభ్యంతరం చెప్పాడతను.

ఇందులో ఎలాంటి అన్యాయం లేదు. మాప్రభువు నిన్ను నాలుగుసార్లు హెచ్చ్రరించానని చెప్పారు మాతో కావాలంటే నీ అనుమానము మాతోవచ్చి ఆయననే అడుగు.అన్నారు వారు.

నువ్వు నన్ను ఒక్కసారికూడా హెచ్చరించలేదు.అన్యాంగా నన్ను తెప్పించావు,నిష్టూరమాడాడాతను.

నీకు మాటిచ్చిన ప్రకారమే నాలుగుసార్లు హెచ్చరికలు పంపానయ్యా ,అన్నాడు యముడు.

ఎప్పుడు చెప్పావు? ప్రశ్నించాడు.

నీజుట్టు తెల్లబడటం నామొదటి హెచ్చరిక.నీపళ్ళు వదులవటం ఊడటం మొదలు పెట్టినది నారెండవహెచ్చరిక

నీకంటి చూపు మందగించటమే నా మూడవ హెచ్చరిక

నీవంటి మీద చర్మం మడతలు రావటము ఆఖరి హెచ్చరిక ,జవాబు చెప్పాడాయన.

ఈ హెచ్చరికలు ప్రతివారికీ పంపుతూనే వున్నాడు యమధర్మరాజు అందరికి.రంగులేసి మనసును మభ్యపెట్టుకోవటము కాకుండా మనము చేయవలసిన మంచిపనులను త్వరగా చేయాలి. చేయాల్సిన అసలు పని భగవంతుని చేరుకునే ప్రయత్నము త్వరగా చేయాలి.లేకుంటే సమయము ఆగదు మనకోసము.

Read more...

జ్యోతిష్యవిద్య భయ పెట్ట టానికి కాదు భయం తీర్చడానికి

>> Saturday, February 14, 2009


జ్యోతిషశాస్త్ర విజ్ఞానమును మనకిచ్చిన మహర్షుల ఉద్దేశ్యము భవిష్యత్తును చూచి భయపడి పారిపోవటానికో దుఖి:స్తూ కృషించడానికి కాదు. భయంకరమైన నది లాంటి సంసారము లో ఈదే జీవులు ఇక్కడసుడిగుండాలున్నాయో,ఎక్కడ భయంకర కాలసర్పాలున్నాయో,ఏప్రాంతములో ఏసమయానికి మిమ్మల్నిమింగాలనిమొసల్లు కాచుకుని వుంటాయో తెలియజేయటము.తెలియటము ద్వారా భయపడటము కాక జాగ్రత్తలు తీసుకుని ఆప్రమాదాలనుంచి లేక ఇబ్బందులనుంచి తెలివిగా తప్పుకుని సాగిపోవటమే వారు కరుణతో మనకందించిన ఈవిద్య లక్ష్యము. ఈ ప్రయాణము ఆపుదామన్నా ఆగేది కాదు,దాని సమయము పూర్తయినదాకా.కనుక నదిని ఈది దాటటము ప్రమాదకరము,కష్టతరము.కాని నదిని ఈదక తప్పదు. మొండిగా ఈదుతానిని దిగి కొందరు అలసి సొలసి ఈదితే,ఈలోపలకొందరు అంతమయ్యేదికూడా మధ్యలో జరుగుతుంది.

తెలివి అదృష్టవంతుడు ఒక చెక్కనో దుంగనో ఆధారము చేసుకుని ఈదుతూ తన శ్రమను కొద్దిగా తగ్గించుకుంటాడు.తెలివి కలవాడు ఒక పడవను తయారు చేసుకుని దానిని నడుపుకుంటూ ప్రమాదాలు దాటుకుంటూ వెళతాడు. భగవన్నామము అను ఓడను ఎక్కిన వాడు పూర్ణవిశ్వాసముతో నిశ్చితముగా ,హాయిగా ,విశ్రాంతిగా ,సునాయాసముగా ఈనదిని తరిస్తాడు.

ఈఈ ప్రమాదాలు ,గండాల గుండాలు ఎక్కడున్నాయో ప్రయాణముళో ఏసమయానికి మీకెదురవుతాయో తెలియజేసే స్పష్టమైన మ్యాపు జ్యోతిష్యము మనకిస్తుంది. దానిని చూసి భయపడి ప్రయాణము చేసినంతసేపు ఏడవడము కాదు.వివరాలు తెలిసాయికదా అన్న ధైర్యముతో సాగాలి.

ఆవిద్యను కూడా మనకిచ్చారా మహానుభావులు. అసలు మనిషి జీవిత విధానము ఈ ప్రకృతి లో ఏశక్తులు నియంత్రిస్తున్నాయో పరిశోధించి దర్శించి వాటి పరిష్కార మార్గాలను కూడా ఇచ్చారు.ఇంకా ఈప్రాకృతికశక్తులన్నీ ఏదివ్యచైతన్యముద్వారా నియమాత్మకముగా నడపబడుతున్నాయో ఆ పరాశక్తి ని ఆశ్రయిస్తే ,ఆశక్తితో మమేకమైతే ఇక సృష్టిలో ఎవరికీ భయపడవలసిన అవసరము లేదనే సత్యాన్నివారు కరుణతో మనకు బోధించారు. ఈపుణ్యభూమిలో మాత్రమే లభించినది ఈదివ్య విద్య.

ఇక మనకు ఈమధ్య ఆరోగ్య సృహ బాగాపెరిగినది. వ్యాధి రాకముందే అనేక రకాల వైద్య పరీక్షలు చేపించుకుంటున్నాము.అక్కద అన్ని పరీక్షలు చేసి వైద్యులు నాయనా ! నువ్వు ఈనూనెలు ఎక్కువ వాడితే నీకు గుండెపోటు రావచ్చు.నీ శరీరములో ఫలానా పదార్ధము ఎక్కువవుతున్నది దీనిద్వారా ఫలానా వ్యాధి వచ్చేఅవకాశమున్నది అని హెచ్చరిస్తే మనమేమి చేస్తాము. ఏడుస్తూ నాకావ్యాధి వచ్చేస్తున్నది అని తిండితిప్పలు మాని కూర్చుంటామా? లేదే! దానికి తగు జాగ్రత్తలు తీసుకుని రాబోయేప్రమాదాలనుంచి తప్పించుకుంటాము. ఎందుకండీ ఏపరీక్షలు లేనిపోనిది వల్లు చెప్పాక బాధపడాలి అని ఆపరీక్షలజోలి కెల్లకపోవటము మన ఇష్టాఇష్టాలకు సంబంధించినది. ఎక్కడో ఒక చోట కొందరు దుర్మార్గులైన వైద్యులు లేని రోగలక్షణాలను చెప్పి దోచుకునేవారుండవచ్చు,అంతమాత్రాన అది వైద్య విద్యకు సంబంధించిన లోపము కాదుకదా?

ఇక్కడ ఇంత ఉపోద్ఘాతము చెప్పేదెందుకంటే ఈమధ్య ఏదో ఉడతాభక్తిగా నేను చేస్తున్న ప్రయత్నానికి స్పందించి చాలామంది మిత్రులు అనేకవిషయాలపై నామీద నమ్మకముంచి నన్ను తమ ఆత్మీయునిగా భావించి తమ కుటుంబసభ్యులకు కూడా తెలుపని విష్యాలు నాకు తెలుపుతూ సమస్యకు కారణాలు పరిష్కారాలు సూచించమని వ్రాస్తున్నారు.ముందుగా నాపై ఇంతనమ్మకముంచిన నావారందరికి ధన్యవాదములు.
ఇక జ్యోతిష్యశాస్త్ర ఆధారముతో వారి సమస్యలకు మూలాలను తెలుసుకుని.నాకు గురువులు ప్రసాదించిన భగవన్నామమనే సంజీవనిని నాకోసమేగాక వారికి కూడా అందిస్తున్నాను. ఆకలైన వారు కోసము వంటచేసుకునితినాలి.ఓపిక లేనప్పుడో,లేక చేతకానప్పుడో మనమేదో వండి పెడతాము కానీ తిని ఆకలి తీర్చుకోవలసిన పని వారికేసాద్యము,వారే ఆపనిచేయాలి. కాదులే మాస్టారూ ,తినే ఓపిక లేదు మీరేతిని పెట్టండి అనే సోమరి పోతులకు మనమేమీ చేయలేము.ఆతినే స్థితి కూడా లేనివారి కోసమైతే ఏదో ఒక" సెలైన్ "ఓపిక తెచ్చేందుకు కట్టడానికి సాధ్యమవుతుంది కాని పూర్తి శక్తిని పొందాలంటే తిరిగి ఆజీవి తన ఆహారాన్ని తానే తినాలి.ఇదీ నాకు తెలిసిన మార్గము .

నాకు సమయము తక్కువగా వుండటము ,విశ్లేషణలో పలువురి పరిశీలన లో ఎక్కడలోపాలున్నా బయటపడతాయనే ఉద్దేశ్యము తో ముందుగా మీరు ఎవరన్నాజ్యోతిష్యవేత్తలను కలుసుకుని మీజాతకము పరిశీలించి ప్రస్తుత స్థితిని తెలపమని కోరుతున్నాను. ఇక్కడ బ్లాగులలో వున్న కొంతమంది నిష్ణాతులైన జ్యోతిష్యవేత్తలకు పంపమని వారి చిరునామాలిస్తున్నాను ఈమధ్య.వారిలో కొందరు నామమాత్ర దక్షిణతో వారి జాతక వివరాలు వ్రాసి పెడుతున్నారు. భగవంతుని దయవలన నాకు చేతయిన నోటి మాటగా చెప్పిన భగవత్సెవా క్రియలు అనుసరించి చాలామంచి ఫలితాలు వచ్చాయని చెబుతున్న వారివలన నాకు సంతోషమవుతున్నది.నేప్రారంభించిన పని వలన వీళ్లకన్నా మేలు జరుగుతున్నదని.అయితే భక్తివారిది,శక్తి ఆపరమాత్మది. ఇందులో నాప్రమేయమేమీ లేదు. ఇది నిజం.

ఇక వీరిలో ఒకరిద్దరు ఈ జాతక వివరాలు చూసి తాము నిసృహ చెందామని వ్రాస్తున్నారు. వారి కోసమే ఇదంతావ్రాయటము. వివరాలు తెలిశాక సంతోషించలికాని బాధపడటమెందుకు. వైద్యులు విశ్లేషణచేశాక అనేక రోగలక్షనాలతో వాటి నివారణకు పలు ఔషదాలు సూచించవచ్చు అది వారి ధర్మము. కాని కాంప్లెక్శ్ ఔషధము లాంటిది భగవన్నామము .ఆదివ్యౌషధాన్ని సేవించినవారికి తిరుగులేదు.అద్బుతాలు జరుగుతాయి. ఇవి నేను ఎవరో చెబితేవిని,చదివి చెప్పే మాటలు కాదు నాజీవితమును ఒక ఆధ్యాత్మిక ప్రయోగశాలగా మలచుకొని సాధించిన[ఇక్కడఅమాటతప్పలేదు,అవి భగవంతుడు ప్రసాదించినవే] ఫలితాల ద్వారా మీకు చెప్పగలుగుతున్నాను. కనుక మీరు తీవ్రముగా శ్రమించండి. ఎలా అంటే అమెరికా ఎల్లాలంటే అనుమతి పత్రాలకోసము రోజులతరబడి లైన్లో నిలబడి ప్రయత్నిస్తారే అలా! ఒకరు మీరు చెప్పిన విధముగా 108 ఒకే ఆసనములో హనుమాన చాలీసా చేయలేకపోయానండీ నావల్ల కాలేదు .నాస్థితి ఇలావున్నదని వదలి వేసేలా మాట్లాడారు.ఇక్కడేమి జరిగినది.ఆలోచించండి. అది పనిలా భావించారు.అందువలన విసుగొచ్చినది. అదే మనకి ఇష్ట మయిన దానికోసమయితే ఎంతశ్రమకైనా బాధపడము.ఔనా?కాదా?

ఒక్కటి నిజం నమ్మండి ,భగవన్నామము,గురువు, ,మంత్రము,వైద్యము విశ్వాసాన్ననుసరించి మాత్రమే ఫలితాలనిస్తాయి. ఇది ఎవరికోసమో మనము చేయటము లేదు.అన్నింటికన్నా ఆనందదాయకమైన భగవంతుని సాన్నిహిత్యానికి అర్హతపొందుతున్నమన్న సృహ రావాలి .ఏదో మొక్కుబడిగా పనిచెస్తే లాభం లేదు. కబీర్ దాస్ గారన్నట్లు చేతిలో జపమాల గిరగిరా తిరుగుతోంది,దానికన్నా వేగంగా మనసు ప్రపంచాన్ని చుట్టివస్తున్నది అన్నట్లుగా వుంటె ఫలితం శూన్యము. ఇక వెర్రోడో మొర్రోడో చెప్పిన వానిపైన పూర్ణవిశ్వాసముంచాలి ,చెప్పిన విషయము పట్ల నమ్మకముండాలి.ఏదో ఒక రాయి విసిరితే తప్పేమున్నది అనేలా సాగకూడదు సాధన.
నెను దీనిద్వారా తప్పనిసరిగా సాధించగలననే నమ్మకము భగవశక్తి పట్ల విశ్వాసముముఖ్యము.మీకిందకంటె నేనేమి చెప్పలేను.శుభం భూయాత్.

Read more...

e-తెలుగు కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల..మా తల్లీ కన్నీరుపెడుతోందో....

>> Thursday, February 12, 2009

నిన్న నాకొక మిత్రుడు చాట్ లో కలశాడు.ఆయన వ్యక్తపరచిన అభిప్ర్రయాలను మీముందుంచటము నా బాధ్యత అని తలచి ఇక్కడవుంచుతున్నాను.ఇది నిజమో కాదో తేల్చాల్సిన అవసరము మనకున్నది.నన్ను అనవసరముగా నిందించవద్దు.వినదగు నెవ్వరు చెప్పిన అన్నారు కదా పెద్దలు.చదవండి ఆలోచించండి.నిజమేదో తేల్చండి.
*******************************************************************************************
మిత్రుడు: నమస్తే దుర్గేశ్వరగారూ,బ్లాగులలో చెలరేగుతున్న అలజడులను గురించి మీరు వ్రాసిన పోస్ట్ చదివాను.
నేను : ధన్యవాదములు
మిత్రుడు: మీ వైపుననుంచి మీ ఆలోచనలననుసరించి వ్రాసినది కాదనను గానీ,అసలు కారణము గమనించటము లేదనిపిస్తున్నది.
నేను : ఏదో తెలియక వచ్చిన విబేధమేకదండీ! సర్దుకుంటాయి లే .కాలం అన్ని గాయాలను మాన్పుతుంది.
మిత్రుడు: ఇది ఖచ్చితముగా కావాలని వ్యూహాత్మకంగా పన్నుతున్న కుట్రండి.
నేను : ఇందులో కుట్రలకు తావెక్కడున్నదండీ? ఎవరాస్తులు ఎవరికొస్తాయి.ఎవరిసొమ్ము ఎవరికి దక్కుతుంది కుట్రలవల్ల?అలాంటి పని ఎవరి కవసరము
మిత్రుడు: అక్కడే దారి తప్పుతున్నారు.
నేను : అదేమిటి అలా అన్నారు?
మిత్రుడు: నేనుదాదాపు తెలుగు బ్లాగులు మొదలెట్టిన కాడనుండి చూస్తున్నానండి.వ్రాయటము లేదుగాని.నేను గమనించిన విషయాలు మీకర్ధము కావాలంటే నేనడిగేవాటికి సమాధానము చెప్పండి.మీరెప్పుడు వచ్చారు ఇక్కడకు?

నేను : దాదాపు ఎనిమిది నెలలు పూర్తికావస్తున్నది.
మిత్రుడు: అప్పటికి అంతర్జాలములో వ్రాస్తున్నవారు వెయ్యి లోపే.ప్రారంభములో వేళ్లమీద లెక్కపెట్టేటంతమంది మాత్రమే.ఉండేవారు.
ఇప్పటి పరిస్థితి చూశారా గణనీయముగా పెరుగుతున్నారు.తెలుగు బ్లాగర్లు.మీరెలా వచ్చారు ఇక్కడకు?
నేను : నేను తెలుగు దినపత్రికలో చూశాను,ఆతర్వాత ప్రయత్నించి వచ్చి కొంతమంది బ్లాగ్ మిత్రులసహకారము ,జ్యోతిలాంటివారి సాంకేతిక సహాయముతో ఇక్కడ వ్రాస్తున్నాను.
మిత్రుడు: అంటే ప్రచారము ఎక్కువవుతున్నకొద్దీ ,తెలుగు బ్లాగులు జనాలను ఆకర్శిస్తున్నాయి ,బ్లాగర్ల సంఖ్య పెరుగుతున్నది.అవునుకదా?
నేను: అవును.
మిత్రుడు: మరి పెరగటము వలన ప్రయోజనమేమిటి?
నేను : అదృశ్యమవబోతున్న భాషల లిశ్ట్ నుంచి తెలుగును కాపాడుకునే ఒకానొక ప్రయత్నము ఇది.దీని మూలముగా మాతృభాష పట్ల అభిమానము కలవాల్లు అంతా ఒకచోట కలసుకుని తమ అభిప్రాయాలను పంచుకుని తగుప్రయత్నాలు చేయవచ్చు.
మితృడు : అలా చేయటము వలన సంస్కృతీ సంపదలను కాపాడుకునే అవకాశమున్నది కదా?
నేను : అవునండీ
మిత్రూడు: మరి సంస్కృతీ ధ్వంసము చేయాలని ప్రయతనము చేసే శక్తులకు ఇది కంటగింపుకదా?
నేను : కావచ్చు. కానీ ఈచిన్నప్రయత్న మొకటే సంస్కృతులను కాపాడుతుందా?
మిత్రుడు: ఇందులో మరొక విశేషమున్నది. గతములో ఏ సాఫ్ట్వేర్ రంగానికి చెందినవారో మాత్రమే ఇక్కడకొచ్చేవారు. ఈరోజు ఉపాధ్యాయులవద్దనుండి ,వివిధవృత్తులవారు ఇక్కడ ప్రవేశిస్తున్నారు. అంటే మధ్యతరగతి మేధావి వర్గమంతా ఇక్కడ సమీకరించబడుతున్నది. భాష అనేఅంతస్సూత్రము ఇక్కడ వారి ఆలోచనలను ఒకటి చేస్తున్నది.ఇంకా ఆలోచించండి.
నేను : అవును ప్రతివారికీ తమ ఆలోచనలను వ్రాసి ప్రచురించి ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవాలనే కోరిక ఇక్కడతీరుతుంది.
ప్రస్తుతము ఫిఫ్త్ ఎస్టేట్ ప్రాధాన్యము పెరుగుతున్నది.ప్రజలే వివిధ అంశాలపై పత్రికలు పోషించవలసిన పాత్రను పోషించే వ్యవస్త రూపుదిద్దుకుంటున్నది.దాని లో ఒకరూపమే బ్లాగులు కూడా.
మిత్రుడు: ఇక్కడేవున్నది కీలకమంతా.ఏఉద్యమానికైనా మధ్యతరగతి మూలకారణముగా కనిపిస్తుంది చరిత్రపరిశీలిస్తే. ఇక్కడ భాషా సంరక్షణ కొరకు ప్రారంభించిన ఈవుద్యమము త్వరలోనే విశ్వరూపము ధరిస్తుంది. సాంకేతిక విజ్ఞానము అందరికీ అందుబాటులో వస్తున్నదివేగముగా. దానితో ఈసమీకరణ పెద్దదయి భావ వినిమయము జరిగి తమభాషను,సంస్ఖృతులను పరిరక్షించు కోవాలనే వాంఛ తీవ్రమయి నప్పుడు అది సంస్కృతీ పరిరక్షణ ఉధ్యమాలు పుట్టటానికి కూడా కారణము కావచ్చు . ముఖ్యముగా యువత జాగృతము కావచ్చు , సంస్కృతీ పరిరక్షణ ఉద్యమాల పట్ల ఆకర్షితులవవచ్చు కూడా భవిష్యత్తులో .కనుక ఈభాషలను, సంస్కృతులను ధ్వంసము చేయాలని అనేకవ్యూహాలను అమలు చేస్తున్న శక్తులకిది రుచించదు. కాబట్టి వాళ్లద్రుష్టి దీనిని మొగ్గలోనే తుంచాలని ఇటు మల్లవచ్చు కదా? గ్రంథాలయ ఉద్యమము నిజామురాజ్యాన్ని మట్టి గరపటానికి కారణమైనది కదా?
నేను : ఆలోచించవలసినదే.
మిత్రుడు: కనుకనే మొగ్గలో తుంచటానికి వాళ్లకున్న ఆయుధము విభజించు పాలించు[ధ్వంసముచేయి అని అనుకోవచ్చు] అనే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లున్నది కదా.
నేను : ఎలాగంటారూ?
మిత్రుడు: ఇప్పుడు కొంతమంది భాషపట్ల అభిమానము కానివ్వండి ,లేక వాళ్ల అభిప్రాయాలు సమాజానికి తెలియ నివ్వటానికి కానివ్వండి తమ వంతు కృషిచేసి ఇక్కడ ప్రచారాలద్వారా ,కూడలి లాంటి వేదికలను ఏర్పరచటము ద్వారా విజయవంతముగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.ఏదో ఒక ఆధారముంటేనేకదా ముందుకు సాగేది.కనుక ఆ ఆధారాలను దెబ్బకొట్టి బలహీనపరచటము లేదా ఈ వుద్యమానికి దూరంగా పరిగెత్తేలా చేయటము ఈ వ్యూహం.
నేను : కావచ్చు.దీనిని మీపరిశీలనలో ఎలా ధృవీకరించుకున్నారు?
మిత్రుడు : మీకు తెలియదు. మీరు రాకముందు దేశభక్తి యుతమైన ,దైవభక్తి యుతమైన బ్లాగులను ఎవరన్నా ప్రారంభిస్తే వారిని అవహేళన చేసి,రకరకాల వ్యాఖ్యానాలతో ఉక్కిరి బిక్కిరి చేసి ముప్పుతిప్పలు పెట్టెవారు కొందరు. కొందరు ఏమిటీ పీడ అని తమ బ్లాగులను మూసి వేశారు కూడా. తాడేపల్లి వారు,మీలాంటి మొండివారుమాత్రమేవారిని ఎదిరించినిలబడి ఆథ్యాత్మిక బ్లాగులను నిలబడి నడుపుతున్నారు.
నేను : ఇది మరీ ముఖస్తుతిలాగుందండీ
మిత్రుడు: నాకా అవసరము లేదండీ. ఇంకావినండి.ఇప్పుడు సహజముగా సున్నిత మనస్కులైన ఆడవారిని రెచ్చ్గగొట్టి వారిస్పందనలు రాగానే సాకుగా చూపుతూ వారి మానసిక స్థితి దెబ్బతినే దాడి చేస్తున్నారు. తద్వారా తెలుగు రచనల పట్లవుత్సాహమున్న స్త్రీలను ఈవైపుకు రాకుండాచేసే దుర్మార్గమైన వ్యూహమిది. ఆతరువాత బ్లాగు లోకములోనున్న ప్రముఖ బ్లాగర్లనందరినీ ఒక గ్రూపని ప్రచారము చేయటము ద్వారా వారిలో పరస్పర అనుమానాలు, కొత్తగావచ్చేవారికి వీరిపై భావన కలిగించి .చవుకబారు రచనలతో దీనిని నింపి,ఏమిటీ చండాలము అని బయటనుండి వచ్చేవారు గేటుదగ్గరనుండే వెనుతిరగటము చేయాలనేది ఉద్దేశ్యము.ఆతరువాత మాకెందుకీ గోల అని తమస్వంతఖర్చులతో అంతర్జాలములో తెలుగు ప్రచారానికి పాటుపడుతున్నవారంతా ఒక్కొక్కరుగా వెనుదిరిగేలా చెయ్యటము వ్యూహములో తరువాత దశలు.
నేను : నేను ఒకేసారి చూశానండీ .తెలుగు కోసము తపన పడుతున్న బ్లాగర్ లను హైదరాబాదులో.ఏ స్వార్ధము లేకుండా వాళ్ళు చేస్తున్న సేవ అభినందనీయము.
మిత్రుడు : వాళ్లలో e-తెలుగు గా ఏర్పడి మాత్రుభాషను ప్రచారము చేయాలని అనుకుంటున్నవారిలో ఎవరికన్నా ఏదైనా ప్రతిఫలమొస్తుందా? లేక ఈబ్లాగర్లతరపున ఏదయినా ఎమ్మెల్సీ సీటు ఇస్తారా? లేదు కదా? వీవెన్,శ్రీధర్ లాంటి వారు తమ సాంకేతిక నైపుణ్యమునుపయోగించి ఇక్కడ వెచ్చించే సమయంలో బయట వేల రూపాయలు సంపాదించుకోగలరు. కాని వాళ్ళకు ఏమిలాభమొస్తున్నదని ఈపని చేస్తున్నారు. కేవలము ఆత్మసంతృప్తి . వాళ్ళిద్దరని కాదు.నేననేది ఈరోజు భాషను బ్రతికించుకోవాలని అంతర్జాలములో తెలుగు వెలుగులను పెంచాలని పట్టుదలతో కృషి చేస్తున్న వారంతా రాబోయేతరానికి ఆదర్శపాత్రులే.వాళ్ళు ఈరోజు చేస్తున్నపని వాళ్లకోసము కాదు .తెలుగు జాతి భాషా సంస్కృతులని కాపాడు కోవటానికొరకే.

నేను: అవునండీ .వాళ్లలో తక్కువమందిని చూశాను.చదువరి,చావాకిరన్,మురళీ ,అనిల్. చాలామంది గురించి చదివాను, విన్నాను,సుజాత జ్యొతి,అరుణ ,దూర్వాసులగారు ,భవదీయుడు,కత్తిమహేష్, విహారి,వంశీ.యోగి ,శ్రీకాంత్ఇలా చాలామంది తెలుగును బ్రతికించుకోవాలని పాటుపడుతున్నారని కృషిచేస్తున్నారని.నాలాంటి వారు వాళ్లకృషిని కేవలము ఉపయోగించుకుంటున్నామని కూడా అంగీకరిస్తున్నాను.

మిత్రుడు : మరి ఇలావున్నవారిని మానసికముగా హింసలు పెట్టడము ద్వారా ఈపనినుండి పక్కకు వెళ్ళేలా చేయటము ద్వారా ఈఉద్యమాన్ని నిర్వీర్య పరచవచ్చు కదా?
నేను : ఆపని ఎవరు చేస్తున్నారని మీభావన
మిత్రుడు: నన్ను అడుగుతారేమి .ఆశక్తులకు చెందిన ఏజంట్లు అన్ని చోట్లా వ్యాపిస్తారు. ఇక్కడకూడా కాదంటారా?
నేను : ఏమో..కావచ్చు. మరొకటి కూడా జరగొచ్చు. మనవాళ్ళే కొందరు ఈ వ్యూహములో వాళ్లవుచ్చులో చిక్కుకుని ఏజంట్లుగా కనపడవచ్చుకదా?
మిత్రుడు : నిజం .ఆశక్తు లెప్పుడూ ప్రత్యక్షముగా తెరమీదకు రావు. భారతదేశచరిత్రలో మనవాళ్లతో బ్రిటీషవారి తరపున పోరాడినది కూడా మనవాళ్ళే సైనికులుగా .ఎటు చచ్చినా వాళ్లకే లాభం

నేను: హతవిధీ! చరిత్ర పునరావృతమవుతుందా?
మిత్రుడు : భలేవారే !వాళ్ళు వ్యూహాన్నెప్పుడు ముగించారు.ధశలవారీగా అమలు పరుస్తూనే వున్నారు.
నేను : కాలం మారినది. మనవాళ్ళు ఇంకా అంత అమాయకంగా వాళ్లచేతులలో వుండరు.నిజం గ్రహించి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తారు. వాళ్ల వ్యూహములో చిక్కి అశువులు బాసే అభిమన్యులేకాదు ఎన్ని పద్మవ్యూహాలనైనా ఛేదించగల సవ్యసాచులు మన బ్లాగుగుంపులలో నున్న యోధులు.ఆపై కురువృధ్ధులు,గురువృధ్ధులు వుండనే వున్నారు ప్రతివ్యూహరచనలను చేయటానికి.

మాతెలుగుతల్లికీ మల్లె పూదండ మాకన్న తల్లికీ మంగళారతులూ.
-----------------------------------------------

Read more...

కల్యాణవైభవము [వీడియో ]

>> Wednesday, February 11, 2009

ఐదవ తేదిన పీఠములో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ,మరియు రామలింగేశ్వర ,దుర్గాదేవి వారాలకు వివాహము వైభవముగా జరిగినది. హైదరాబాద్ నుంచివచ్చిన బాలగంగాధర తిలక్ దంపతులు అమ్మవారి తరపున వచ్చి కన్యాదానము చేశారు . వీడియోలన్నీ ఒకేసారి ఇక్కడ వుంచాలంటే నా సిస్టం సహకరించలేదు . ఒక్కొక్కటిగా ఉమ్చుతాను.
http://www.youtube.com/watch?v=gcNuZemG-య



Read more...

బ్లాగువివాదాన్నిలా పరిశీలించండి .. నా అనుభవాలతో పోల్చిచూసి

>> Tuesday, February 10, 2009

ఈమధ్య బ్లాగులోకంలో ఏవో గొడవలు జరుగుతున్నాయని తెలిసినది. వివరాలు తెలియకున్నా పర్నశాలబ్లాగులో మరొకచోట వివాదాన్ని వదిలేయమని కామెంట్ చేశాను. అసలు విషయము పరిశీలించమని మిత్రులు ఇచ్చిన లింక్ చూశాక అందులో నాపేరు కూడా ఉదహరించిన తరువాత నా అభిప్రాయాన్ని కూడా చెబితే ఈ మంటనార్పటానికి ఒక చెంబునీళ్ళు పోసినట్లవుతుందేమోనని ఇదివ్రాస్తున్నాను. అంతేకాని ఆరిపోతున్న మంటను మరల కెలకటానికో,బ్లాగు సందర్శకులను పెంచుకోవటానికో కాదని మనవి.
*******************************************************************************************
ఆసలు మనకు సంబంధము లేని వారివల్ల ఒక్కొక్కసారి మనకు మనస్తాపం కలుగుతుంది.వారితో వాదనలు చెలరేగటము వలన.ఇతరులతో వాదనలెప్పుడూ మనప్రయత్నము ఎంతో కొంత లేకుండా రావుకదా! ఆప్రయత్నము మనము సున్నితముగా చేసినా అవతలి వారి వ్యక్తిగత సంస్కారాలననుసరించి ప్రతి చర్యలు కనపడతాయి. ఇవన్నీ కేవలము ఇప్పటికిప్పుడు మాత్రమే పుట్టినవి కావు.వీటికి మూలాలు గతములో మనద్వారా జరిగిన పొరపాట్లవలనతయారయిఉంటాయని నాకైతే వ్యక్తి గతముగా అనుభవంలో కి తెచ్చి పాఠాలు చెబుతుంది ఆ జగన్మాత.అటువంటి రెండు సంఘటనలను మీముందుంచుతాను.

*******************************************************************************************
నేను డిగ్రీ ఫైనలియర్ లో వుండగనే ఉదయం పత్రికలో మా మండల విలేఖరిగా పని చేసేవాడిని. ఆసమయము లో జరిగిన ఘటన ఇది.
మావూరి లో ప్రాచీనమైన వేణుగోపాల,రామలింగేశ్వరస్వాములవారి ఆలయాలు వున్నాయి. ఆరెండు ఆలయాలకు దాదాపు రెండువందల ఎకరాల సుక్షేత్రమయిన భూమి వున్నది. కాని ప్రభుత్వం నియమించిన దేవాదాయ శాఖ పనితీరు మనకు తెలిసినదే కదా?అప్పుడు పని చేస్తున్న ఈ.వో .గుండాలు మింగేరకం. ఏనాడూ దీపారాధన ఖర్చులకు కూడా ఇవ్వడు. అర్చకులు పాపం చాలీ చాలని జీతాలతో అంతకంటే మరో మార్గం లేక ఎలానో మమ అనిపిస్తుంటారు. మనసొమ్ము కాదు కదా అనే భావతోను,ధర్మ నిస్ట లేని గ్రామస్తులు ఎవరికి వారే అలాచేయటము లేదు ఇలా చేయటము లేదనేవారేగాని నిలదీయటానికి కలసి రారు. పాపం సంజీవరెడ్డి గారని వాళ్ల అన్నదమ్ములు మేము చందాలు వసూలు చేసి మహాశివరాత్రి లాంటి పండుగలు కూడా జరుపాల్సి వచ్చేది.
ఒక సంవత్సరము మహాశివరాత్రి కన్నా ఖర్చు పెట్టి ఉత్సవము జరిపించమని ఈవోను కోరిన సంజీవరెడ్డి వాళ్లతో బజారులోనే నేనివ్వను మీదిక్కున్న చోట చెప్పుకోమని అతను నిర్లక్ష్యము గా మాట్లాడటము తో వాళ్ళు బాధపడి సాయంత్రము నాదగ్గర కొచ్చి ఇలా జరిగినదల్లుడూ అని తమ ఆవేదన చెప్పుకున్నారు. నాకు తీవ్రమయిన ఆవేశము వచ్చినది. మామా! మనకెందుకులే అని ఊరుకోవటము కూడా పాపము.వీడి తలపొగరు దించాల్సినదే అని ఊరిలో కొందరిని కలసి చైతన్యపరచాము.దుస్థితి లోనున్న ఆలయ ఫోటోలతో సహా వార్త వ్రాశాను. వానికి వత్తిడి మొదలయినది. కాని లంచాలకు మరిగిన ఆశాఖ అధికారులు నెలరోజులైనా ఏ చర్య చేపట్టకుండా అతనిని రక్షిస్తున్నారు.
ఇలా కాదని .పోస్ట్ కార్డులు కొని రోజుకు ఒక పదిమంది చేత ఇతని అవినీతి గురించి పై అధికారులకు ఉత్తరాలు వ్రాపించాము ఒక ఉద్యమములా. ఇదే సమయము లో కలెక్టర్ కు,ఇతర అధికారులకు ఫిర్యాదులు పంపాము. వరుసగా దాడి జరగటము తో అతని పని ఉక్కిరి బిక్కిరైనది. అధి కారులు విచారణ జరపక తప్పలేదు.నన్ను ఎంతో మంది చేత ప్రలోభాలు పెట్టి బెదిరించినా లొంగే రకము కాదని తెలిసి అతనేమీ చేయలేకపోయాడు.ఈదుర్గేశ్వరగాడు తగాదాకైనా తన్ను లాటకైనా సై అంటే సై అనే రకమని వచ్చినవాల్లు అతనికి చెప్పారు. ఎవరన్నా అతనిని సమర్ధిస్తున్నారని తెలిస్తే వార్త వ్రాయటము,ఉత్తరాలు పంపటము వరుసగా జరిగాయి. ఇక అతని సస్పెండుకు రంగమసిద్దమయినది.
ఒక రోజు అనుకోకుండా వినుకొండ శివయ్య స్తూపము సెంటర్ లో ఎదురు పడ్డాము.అప్పటికే వానికి పిచ్చెక్కినట్లయినది స్థితి.సహనం కోల్పోయి అదివాని సొంతవూరు అన్న దొమ్మ పొగరు తో నన్ను నిలేసి తగాదా వేసుకున్నాడు. నీయబ్బసొమ్మేమన్నా తిన్నానా అని వాడు.నీ యమ్మమొగుడు సొమ్మనుకున్నవురా?అని నేను .మాటలు తూలాయి.ఇంకా దిగజారాయి మాటలు.చేతులు కలిసాయి అప్పట్లో తన్నులాటలన్నా ,తగాదాలన్నా ఉత్సాహము,కాలేజీ వయస్సుకదా! ఇంతలో అక్కడే వున్న సి .పి.ఐ. ఆఫీసునుంచి వచ్చిన నాయకులు నాకుతెలిసినవారు ఇద్దరిని వారించి ఆఫీసులోకి తీసుకెళ్లారు.నన్ను ఏడిపిస్తున్నాడండి, అని అతను వాళ్లముందు ఏడ్చాడు.నేను కూడా వివరించాను అసలు సంగతి.వాల్లేదో సర్ది పంపించారు.ఇద్దరినీ

ఇక ఇంటి కొచ్చాను.మనసులో కల్లోలము.వాడుతూలిన మాటలే జ్ఞాపకం వస్తున్నాయి.దానితో కోపము వాన్నే మీ చేయలెకపోయాననే బాధ.ఇప్పటికిప్పుడు వెళ్ళి తన్నాలి అనే కసి. ఇలా నామనసు కల్లోలమయినది. సాయంత్రం అన్నం కూడా సహించలేదు. అలా ఆలో చిస్తూ పనుకున్నాను.మానాన్నగారు వాళ్లకు చెప్పలేదు. ఏమిటిది?నాకెందుకీ అవమానము? నేనే మన్నా స్వలాభము కోసము చేశనా? భగవంతుని కొరకేకదా? మరి నాకెందు కీ అవమానము? మనసు లోంచి బాధ తన్నుకు వస్తున్నది నిదరలేదు. అలా బాధ పడుతూ ఉండగా అర్ధరాత్రి దాటిన తరువాత .ఇంతబాధ పడుతున్నావే? ఇదేవిధముగా నువ్వు మాటలు తూలినప్పుడు ఇతరులెవరికీ బాధ కలగలేదా? అనే మాటలు వినిపించాయి మనసులోంచి.అరే!ఎవరంటున్నదని ? పరిశీలించుకుంటే అమ్మ జగన్మాత నవ్వుతూ ప్రశ్నిస్తున్నట్లు కళ్ళు మూస్తే కనపడుతున్నది. అవునా! ఆలోచన వెనక్కు వెళ్ళింది.......గతం లోకి..

నేను ఇంటర్మీడియెట్ చదివేటప్పుడే నాస్నేహితుడు శ్రీరామనేని హనుమంత రావు చదువు మానుకుని చిన్న పాఠశాల ప్రారంభించాడు నూజండ్లలో అప్పటికే అక్కడ ఒక రాజకీయ నాయకుని అండదండతో ఎక్కడనుంచో వచ్చిన ఒకతను పాఠశాల నడుపుకుంటున్నాడు.వీళ్ళిద్దరికీ పోటీ. మావాడి పాఠశాలకొచ్చిన పిల్లలను కూడా ఇళ్లవెంట తిరిగి కొద్దిమంది అతని అనుకూలమయిన వారి చేత చెప్పించి తిరిగి తన పాఠశాలకు తీసుకెళుతున్నాడు.అంతే కాక మావాడి గురించి వాడికేమొచ్చు చదువని ఎగతాళి గా మాట్లాడటము. చివరకు కమ్మవాళ్ళు ఎక్కువగా వున్న ఆగ్రామములో మావాడికి వాళ్లవర్గం పిల్లలను కూడా నిలుపుకోవటము కష్టమయి పోయినది. వాడు నాదగ్గరకొచ్చి బాధపదుతున్నాడు. ఇలా మంచి పద్దతి కాదు ఎవరి కొచ్చేవాళ్ళు వాళ్ల కొస్తారు మరలా తీసుకెళ్లటము మంచిపద్దతి గాదని ఒకసారి అతనికి నూజండ్లలో సౌమ్యముగా చెప్పాను.కాని అతను లెక్కచేయలేదు. పరిస్థితి మారలేదు మావాడి ఏడుపాగలేదు. ఒకసారి వినుకొండ ముళ్లమూరు బస్టాండ్ లో దొరికాడు నాకు అతను.వళ్ళు కొవ్వెక్కిన వయసది.ఆవేశము పొగరుబోతుతనము నిండివున్న నాకు యుక్తా యుక్తాలు తెలియలేదు. ఏరా! మావూర్లకొచ్చి మావాడి కేఎదురు నిలబడి వాడిని వేధిస్తావా?నాకొ... ఇక్కడతన్నితే దిక్కెవరా నీకు? అంటూ వాని చొక్క పట్టుకుని కొట్టబోయాను .పాపం అతను గజగజా వణుకుతూ..లేదండి. నేను మరలా మీవాడి కొచ్చిన పిల్లలను తీసుకెళ్లనండి అని ..బతిమిలాడాడు.నువ్వనుకుంటూన్నావేమో నేను నూజండ్లలో తన్నినా దిక్కులేదు నీకు జాగ్రత్త అని బెదిరించి పంపాను. [చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నాను].
ఇప్పుడు చెప్పు అకారణముగా అతనిని నువ్వు కొట్టబోతే,ధూషించితే అతను ఎంత బాధపడి వుంటాడు? నాకు ఇతనికి వ్యక్తిగతముగా ఎలాంటి శతృత్వములేదు.ఐనా నన్నెందు కిలా ఇతను అవమాన పరచాడని అతను ఎంతవేదన పొందాడో తెలుసా? ఆవేదనే నీకిప్పుడు అనుభవమయినది ,అని అమ్మవారు చెబుతున్నారని అనిపించినది.

అంతే! మనస్సు లో బాధ ఎగిరి పోయింది.అమ్మా నన్ను చేసిన పాపాన్నుంచి విముక్తము చెశావా? అని నమస్కరించుకుని ప్రశాంతముగా నిదురపోయాను.

రెండవది
------
ఒకసారి గుడి గోడదగ్గర ఒక కుక్క గుంతలు చేసి పనుకున్నది.దానిని తోలితే పోయేదానికి ఒకరాయి తీసుకుని విసిరాను. ఆరాయి కాలుకు తగిలి విరిగినదేమో పాపమా కుక్క కుయ్యో కుయ్యో మంటూ ఏడుస్తూ దూరంగా పరిగెత్తి చాలాసేపు అరుస్తూవున్నది .మనసు చివుక్కు మన్నది.
ఇది జరిగిన నెలకే వినుకొండ నుండి వస్తున్న నాకు నాభార్యకు యాక్సిడేంట్లోదెబ్బలు తగిలాయి. నా ఎడమకాలు మాత్రమే మెలిక పడి ఫటక్ అన్న శబ్దమ్ వచ్చినది. పాదములో ఎముకలు చిట్లాయి .భరించరాని వేదన, వెనుక వస్తున్న బస్ ఆపి మమ్మల్ని ఎక్కించుకుని ఇంటికి తెచ్చారు. నూజండ్లలో వున్న నాటువైద్యుడు కట్లు కట్తాడు[ఈయన ఎముకలవైఅద్యం లో ఆరి తేరినవాడు] .రాత్రల్లా బాధలోవున్ననాకు ,తళుక్కున మనసులో మెరుపు మెరిసినట్లయి., ఏరా! కుక్కను అకారణముగా హింసించినప్పుడు తెలియలేదా ఈబాధ ? అని అమ్మవారు అన్నట్లనిపించింది.చేతులెత్తి నమస్కరించాను అమ్మా! నీవు నేర్పు తున్న పాఠాలు నాకెప్పుడూ గుర్తుండేలా చేయి అని. తరువాత నెలరోజులు ఆబాధను ఆనందము గా అనుభవించాను. నాఖర్మ ఫలితము ధ్వంసమవుతున్నందుకు.

*******************************************************************************************
ఇప్పుడు చెప్పండి. ఏకారణము లేకుండానే మనకు ఇతరుల మాటలతో బాధ కలుగుతుందా? కలుగదు ఇవి మనఖర్మ ఫలితాలు.మనమెప్పుడో సిద్దంచెసి పెట్టుకున్న దోషఫలితాలు.ఇప్పుడు అనుభవానికొస్తున్నాయి.వాటి పరిపక్వసమయము వచ్చినది కనుక. కనుక వున్నవాటిని మోయలేక ఛస్తుంటే మరలా ఇతరులను ధూషించటము ద్వార మరింత పాపాన్ని మూటగట్టుకుని కోరి కష్టాలు తెచ్చుకోవటమెందుకు. మన పొరపాట్లవల్ల ఒక తప్పుదొరలితే వాటి ని నివారించుకోవటము పోయి మాటల తూటాలు పేల్చుకుని .ఇతరులను బాధపెట్టి మనం బాధపడాలా? మనకు నచ్చని వారిగురించి వాల్లతోనే డైరక్ట్ గా మాట్లాడక వేరేచోట కామెంట్లు చేయటము ఒకరి పొరపాటైతే. అక్కా అన్న సంబోధిస్తూనే అసభ్యంగా వ్రాయటము ఎంత పాపము?.

జరిగిన పొరపాటు జరిగినది. ఇరువైపులా వున్నవాళ్ళు మేధావులేగాని మామూలు వారు కాదే?.కనుక మనమేధస్సునుపయోగించి లోకానికి మేలు జరిగేలా వ్యవహరిద్దాము.ఇది నామనవి బ్లాగర్ లందరికీ. తప్పు చేయనివారు ఎవరూవుండరు.దానిని దిద్దుకునే సామర్ధ్యం ఉండి కూడా ఉపయోగించుకోకుంటే మానవులుగా మనకు గుర్తింపేమున్నది. అటు జ్యోతి గారు ,సుజాత ,అరుణగార్లు నాకక్క చెల్లెల్లే.ఇటు కాగడాశర్మగారూ,ధూములుధాములు చెసే వాళ్ళు నాకన్నదమ్ములే ఏతావాతా జరుగుతున్న నష్టము మనకుటుంబానికే .దయచేసి ప్రేమతో గెలవండి.ఎదుటివారిని. అబ్బా! నీకనుభవమైతే ఏమి చేస్తావని ప్రశ్నించకండి. నన్ను తిడుతూ వ్రాసిన వ్యాఖ్యలను కూడా ఇదే పద్దతి లో ఎదుర్కొన్నాను ,నా పాతటపాలలో. అలాగని నేనేమీ స్థితప్రజ్ఞుడినో,మహాత్మున్నోకాను.మామూలు మనిషిని మీకంటే చదువులో జ్ఞానములోకూడాచిన్నవాడిని.దయచేసి వివాదానికి స్వస్తి పలుకుతూ మెయిల్ లద్వారా ఒకరికొకరు మాట్లాడుకుని ప్రశాంత స్థితికి రండి. మీకు నచ్చితే నామనవి. లేదా నన్ను తిట్టడమే మీకు సంతృప్తి నిస్తే అలాగేకానివ్వండి. నా దోషాలను పంచుకుని నన్ను విముక్తున్ని చేస్తున్న ఆత్మీయులుగానే భావిస్తాను మిమ్మల్ని.

తమసోమా జ్యోతిర్గమయ
.....................

Read more...

ఎంతనోము నోచినాము మేమనీ...మేము మనిషికన్న అంతోఇంతో నయమనీ..

>> Sunday, February 8, 2009

ఎంత నోము నోచినాము మేమనీ...
మేము మనిషికన్న అంతో ఇంతో నయమనీ..
పెదవివిప్పి పలికినవీ కొన్నీ తమ మదిలోని మాటలనీ..

వెదురులన్నవీ.. తాము తనువు వంచి రామ ధనసు లైనామనీ....
పక్షులన్నవీ ..ఆపడతిజాడ ముందుగ మేం తెలిపినామనీ
ఇవయన్నీ అదుగుతున్నవీ... మీరేమి చేసినారనీ
మనుషులుగా మీరేమి చేసినారనీ.. //ఎంత//

పడవలన్నవీ ఆరాముని మేం గంగను దాటించినామనీ
పాదుకలన్నవీ ..పదునాలుగేండ్లు రాజ్యము మేమేలినామనీ
ఇవయన్నీ అడుగుతున్నవీ
మీరేమి చేసినారనీ...
మనుషులుగా మీరేమి చేసినారనీ..... //ఎంత//

కోతులన్నవీ కొం..డంతసాయము అందించినామనీ
వుడతలన్నవీ ...ఆవారధిలో ఇసుకను మేం రాల్పినామనీ

ఇవయన్నీ అడుగుతున్నవీ మీరేమి చేసినారనీ
మనుషులుగా మీరేమి చేసినారని... //ఎంత//


సృష్టి లో సకలజీవరాశి భగవంతుని సేవలో ఏదోవొక పని చేసి పాలు పంచుకుంటున్నది.
మరి మానవ జన్మ నెత్తినందుకు మీరేమిచేశారని మనలను ప్రశ్నిస్తే ఈగీతము లో లాగా ఏమని చెప్పాలి మనము.ఎలా సమర్ధించుకోవాలి మానవజాతి?


.ఎంతనోము నోచినాము మేమనీ...మేము మనిషికన్న అంతోఇంతో నయమనీ..

Read more...

ఈ బ్లాగ్ వీక్షకులకొక విజ్ఞప్తి

>> Saturday, February 7, 2009

ఈ బ్లాగ్ వీక్షకులకొక విజ్ఞప్తి

శ్రీవేంకటే శ్వర జగన్మాత పీఠం దాసులుగా సనాతన సాంప్రదాయాలను, విజ్ఞానాన్ని పదిమందికి మరొకసారి గుర్తుకు తెచ్చి దాని ఫలితాలను కలసి పంచుకోవాలనే ప్రయత్నములో భాగముగా ఈ బ్లాగును ప్రారంభించాము. భగవత్ ప్రేరణతో సాగుతున్న ఈ ప్రయత్నము విజయవంతమయి భగవద్భక్తుల సేవలో దిగ్విజయముగా సాగుతున్నది. ఎంతో మంది తామెదుర్కొంటున్న సమస్యలను ఆత్మీయతతో మాకు తెలియపరచటం,వాటి పరిష్కారానికి మహాత్ములందించిన భగవదుపాసనా మార్గాల లో సూచనలు ఇవ్వటము జరుగుతున్నది .భక్తి పూరిత హృదయాలతో వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు ,సత్ఫలితాలనిచ్చి వారికి ఎంతో మేలు జరిగినదని వారు తెలియజేస్తున్నారు. వారి వారి సమస్యలు పరిష్కారమవుతున్నాయని సంతోషము వ్యక్తము చేస్తున్నారు.దీనికి కారణము మహర్షులు ప్రసాదించిన ఆ మహత్తర నామముల మహిమ ,మీయొక్క భక్తి మాత్రమే కారణము అని వినమ్రమము గా మనవి చేసుకుంటున్నాము.
భగవంతు డిచ్చిన ఈ అవకాశమును వినియోగించుకుని భగవద్ భక్తులకొరకు ఇక్కడ పూజాదికములు జరపటము మా అదృష్టముగా నమ్ముతున్నాము.

" ఇక ప్రస్తుతము చాలామంది తమ జాతకఫలితాలు ఎలా వున్నాయని తమకెప్పుడు మంచి ఫలితాలు రానున్నాయని ,ఇలా
రకరకాలుగా తమ జన్మతేదీలను చూసి చెప్పమని పంపుతున్నారు."

మీ అందరికీ ఒక మనవి. మేము ఇక్కద భగవత్ సేవకు నియమింపబడ్ద దాసులము. మేము జాతకాదులను పరిశీలించి చెప్పే పని చేయలేము. ఆసమయము మాకు లేదు. బాధలు ,కష్టాలతో తల్లడిల్లుతున్న వారికొరకు భగవంతుని ప్రార్ధించి వారికొరకు పూజలు హోమాదులను జరపటమే చేయగలుగుతాము అదీ ఎవరినీ యాచించక ,వారంతట వారుగా భక్తులు సమర్పించే ద్రవ్యాలతో.అదికూడా మేము సూచించిన విధముగా భక్తితోభగవంతుని ఆశ్రయించగలవారి కోసమే.

ఐతే సమస్యా పరిష్కారాలలో జాతకఫలిత వివరాలు చాలా సహాయపడతాయి. కాని వాటిని విశ్లేషించి చూడగలిగే సమయము మాకు లేకున్నది.అందుకు తగిన పరిశ్రమకూడా మాకు లేదు. కాని ఎంతో ఆశతో మన జ్యోతిషవిజ్ఞానాన్ని నమ్మి ఆశతో తెలుసుకోవాలని వచ్చే వారిని నిరాశ పరచలేకున్నాము. ఇక్కడ తెలుగు బ్లాగర్ లలో ఎంతో మంది ఉద్దండులైన జ్యోతిషవేత్తలున్నారు. వారిని సహాయ పడమని అడిగాము. తాడెపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు,సత్యశర్మగారు,శ్రీపతి శర్మగారు లాంటి వారు న్నారు ఇక్కడ.ఐతే వారికున్న పనుల వత్తిడివలన అందరూ సహాయాన్ని అందించలేకపోయినా కొందరు ఉదారముగా నామ మాత్రము దక్షిణతీసుకుని జాతక పరిశీలన జరిపి వివరించటానికి ముందుకొచ్చారు. సమస్యలతో మా సహాయాన్ని కోరేవారు మాకు తెలియ జేస్తే ,అందుబాటులో వున్న ఆ జ్యోతిషవేత్తల అడ్రస్ లనిస్తాము వారికి మీ వివరాలు పంపి జాతక పరిశీలన జరిపించుకుని మాకు పంపితే మాకు చేతనైన విఢముగా భగవద్ సేవ ద్వారా వారికి సహాయపడటానికి సిద్దముగా నున్నాము.

దయచేసి మా పరిస్థితిని అర్ధము చేసుకోగలరు. ధన్యావాదములు మీఅందరికీ.భగవత్ సేవలో

భక్తజన పాద దాసుడు
దుర్గేశ్వర

Read more...

ఆనందమానందమాయనే .......

>> Friday, February 6, 2009


ఆనంద మానందమాయనే.. మా చిన్నారి పెళ్ళికూతురాయనే అని భక్తులు అమ్మవారిని పొగుడుతూ వుండగా జగములనేలే ఆతల్లి పరమేశ్వరుని పాణిని చేపట్టినది. శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం వార్షిక వుత్సవముల సందర్భముగా గురువారం రోజున పీఠములో నెలకొని వున్న దుర్గాదేవికి ,రామలింగేశ్వర స్వామి వారితో ను ,శ్రీవారికి శ్రీదేవి,భూదేవి లతో వైభవోపేతముగా వివాహములు జరిగాయి.యధాప్రకారం మాసంకల్పము లేకుండానే వివాహము మేము జరుపుతామని ముందుకొచ్చిన భక్తులు స్వామివారి తరపున ,అమ్మవార్ల తరపున పెద్దలుగా వ్యవహరించి వివాహాలను తమ స్వంతబిడ్దలకు చేసిన భవనతో జరిపి తన్మయులయ్యారు. ఎక్కడో అమెరికాలో ఉన్న అమ్మాయి ఫణిచందన తన తల్లిదండ్రులు బాలగంగాధరతిలక్ దంపతులను ను పంపి అమ్మవారి తల్లిదండ్రిగా వ్యవహరింపజేసినది. అమ్మవారితో ఏజన్మలో సంబంధమోవాళ్ళు హైదరాబాద నుండి ఎంతోశ్రమకోర్చి ఎక్కడున్నదో తెలియనిఈ చోటు కొచ్చి భక్తిభావనతో పరమేశ్వరునకు కన్యాదానం చేసి ఆనందపులకితులయ్యారు.నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్ఆర్వో శ్రీనివాస మూర్తి దంపతులు రామలింగేశ్వర స్వామి వారి తరపున తల్లిదండ్రులుగా పాల్గొన్నారు. ఎంతో కాలంగా వివాహము సమస్యగా వున్న వినుకొండకు చెందిన ఒక అమ్మాయి మొన్న నవరాత్రులలో ఇక్కడ చేసిన సేవకు ఫలితామా అన్నట్లు ఇదేరోజు సంబంధం కుదిరి మాట్లాడుకోవలని వచ్చిన వరుని తరపువారిని ఇంటివద్ద కూర్చోబెట్టి ముందు అమ్మదర్శనానికివెళ్ళివస్తామని చెప్పి వచ్చి అమ్మ ఆశీర్వాదము తీసుకుని వెళ్ళటము అమ్మ మహిమకు,వారి భక్తికి నిదర్శనముగా నిలచినది.

ఇక శ్రీవారి తరపున వాస్తు సిద్దాంతి కాసిరెడ్డిదంపతులు ,శ్రీదేవి తరపున కురిచేడుకు చెందిన శ్రీనివాసరావు దంపతులు తదితరులు పాల్గొని ఆ కొండలరాయని వైభవాన్ని కన్నులారాగాంచి పెళ్ళి జరిపించి తరించారు.వివాహ భోజనాలతో భగవత్ ప్రసాదాలను అందుకున్న భక్తులు తమ ఇష్టదైవాల మహిమలను మనసారా స్మరిస్తూ తిరుగు ప్రయాణమయ్యారు.మేము మాత్రం ఇక్కడ దాసులము గనుక మిగతా పనులు పూర్తి చేయటానికి అలసిన శరీరములతో ,ఆనందమయమయిన మనసులతో పనులు చేస్తూనే వున్నాము......

Read more...

కల్యాణము చూతము రారండి ....[పిల్లలు జరుపుతున్న తల్లిదండ్రి పెళ్లి ]

>> Monday, February 2, 2009



పిల్లలుచేసే తల్లీదండ్రీ పెళ్ళి ఇది.వచ్చి చూడండి.పురుషార్ధములు పొందండి.


ముహూర్తము : మాఘ శుద్ధదశమి [5-2-2009

స్థలము :శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం,రవ్వవరము ,గుంటూరు జిల్లా

వరుడు:
------

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు,ఆదిమధ్యాంతరహితుడు ,పుంసామోహనరూపాయా అని స్తుతించబడే జగన్మోహనాకారుడు శ్రీశ్రీ శ్రీవేంకటేశ్వరస్వామి వారు.

వధువులు :

భక్తజనులను లాలించి పాలించి పోషించే మాయమ్మలు శ్రీశ్రీ అలవేలుమంగమ్మ.పద్మావతి దేవి అమ్మవారలు.

రెండవ జంట
.............

వరుడు :

పరంజ్యోతి స్వరూపుడు,పరమపిత పరమాత్మ పరమేశ్వర వాచ్యుడు శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వరస్వామి వారు.

వధువు :

జగన్మాత ,జగద్రక్షకి,భక్తాభీష్టవరప్రదాయిని శ్రీశ్రీశ్రీ దుర్గాపరమేశ్వరి అమ్మవారు.


ఎల్లలోకాలకు తల్లిదండ్రులైన ఈవధూవరులకు జరిపే కళ్యాణము లోక కళ్యాణకారకము. మనతల్లీదండ్రికి జరిగే ఈ వివాహమునకు మీరెల్లరు తప్పనిసరిగా విచ్చేయవలసినదిగా హృదయపూర్వకముగా ఆహ్వానము పలుకుతున్నాము.

[వివాహానంతరము స్వామివారలకు ఆస్థానము నిర్వహించబడుతున్నది. ఆసమయములో భక్తుల గోత్రనామాలన్నింటిని చెప్పి వారి కోరికలను తీర్చమని నివేదించటము జరుగుతుంది. కనుక మీ గోత్రనామాలను పంపవలసినదిగా కోరు చున్నాము.మీరు మెయిల్ లోను ఉత్తరాలద్వారా పంపే విన్నపాలన్నింటిని ఆస్థానములో స్వామివారి ముందు చదివి విన్నవించటం జరుగుతుంది.వివాహమైన ఆనందసమయాన కొలువుదీరిన ఆపరమాత్మ ముందు భక్తులకొరకు ఈసేవ జరుపుతున్నాము .]

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP