శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పూర్వ జన్మ పాపా లకు ఇప్పుడు పూజలెందుకు చేయాలి

>> Saturday, January 31, 2009

"ఒకరికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు... చెడు మాత్రం చేయవద్దు" అని పెద్దల వచనం.ఇలా అకారణంగా పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో పట్టిపీడిస్తుందన్నారు. అంతేకాదు గత జన్మలో చేసిన ఇటువంటి పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాలని చెప్పారు. అయితే కొందరు మాత్రం గత జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని ప్రశ్నిస్తుంటారు.

దీనికి పెద్దలు ఇలా చెప్పారు... పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ రోగమొస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దానిపని అది చేస్తూ వుంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది.

అలాగే పూర్వ జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో పూర్వ జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి.

పూర్వజన్మ లో చేసిన దోషాలు తీసుకున్న అప్పులాంటివి ,వడ్డితో సహా వాటిని చెల్లించవలసినదే. అందువలనే కొందరికి ఇప్పుడు చేసే పూజలు వ్రతాలు వల్ల వచ్చే పుణ్యము వెంటనే ఫలితానికి రాదు.ఆ ఫలితమంతా పూర్వజన్మ పాపమువల్ల సంక్రమించిన అప్పు క్రిందనే జమచేయబడటము వలన అలా ఆలస్యమవుతుంది.అదితెలియక నేను చేసిన పుణ్యకార్యక్రమాల వల్ల నాకేమి లాభమని విచారిస్తుంటారు అమాయకంగా.కనుక విశ్వాసము కోల్పోక భగవత్ క్రియలు ఇతోధికంగా చేయాలి.

Read more...

అహంకారం బద్దలైంది...మహాత్ములవాణి

>> Thursday, January 29, 2009

గుడిలోకి వెళ్లి కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు మీ అహంకారాన్ని బద్దలుకొట్టినట్లు అనుకోవాలి. దేవుడు కొబ్బరి ఆరగిస్తాడని కాదు. వివేకమనే ఒకే ఒక దెబ్బతో అహంకారం రెండు ముక్కలు చేయడానికి అది సంకేతం.

కొబ్బరికాయపై ఉన్న పీచును తీసి పగులగొట్టినప్పుడే టెంకాయ ఒకే ఒక దెబ్బకు పగులుతుంది. అదేవిధంగా మనిషి తన హృదయం చుట్టూ పీచులా పట్టి ఉన్న కామక్రోధాదులను తొలగించుకోవాలి.

మానవుడు మహా శక్తి సంపన్నుడు. దుర్వాసలన మూలంగా దుర్భలడవుతున్నాడు. మీలో ఉన్న దివ్యశక్తిని గుర్తించి ఉత్తేజం పొందండి. మంచి మాటలు వినండి. మంచి దృశ్యాలు చూడండి. మంచి ఆలోచనలు చేయండి. మంచి పనులు ఆచరించండి. అప్పుడే మీలోని దుష్ట ప్రవృత్తులన్నీ పటాపంచలవుతాయి.

- భగవాన్ సత్యసాయి

Read more...

స్త్రీలను నెలసరిలో దూరంగావుంచటము..చర్చపై నా సమాధానము

>> Tuesday, January 27, 2009

ప్రకృతి కొన్నిధర్మాలను ఏర్పాటు చేసినది. వాటిని అర్ధం చేసుకుని ,సరయిన విధముగా జీవనాన్ని ఎలా సాగించాలో మన మహర్షులు ్ ఆచారాలుగా పొందుపరచారు. వాటిలో ఒకటి నెలసరి రోజులలో స్త్రీలను గృహ కార్యాలనుండి దూరంగావుంచటము.దీని వెనుకున్న కారణాలను తెలుసుకోవటము తరతరాలుగా మనకు పెద్దలనుండి వస్తున్నదే. ఐతే కొత్తతరాలకు ఇది తెలుసుకునే సమయము ఆసక్తి లేకపోవటము అర్ధవిజ్ఞానుల వితండవాదమే నిజమేమోనని నమ్మే పరిస్థితులవల్ల ఇలా మానవునికి మేలు చేసే ఆచారాలు కనుమరుగయ్యే ప్రమాదము కలుగుతుంది కనుక ఇలా కొన్ని చోట్లన్నా చర్చ జరిగినప్పుడు వాస్థవాలు తెలిసి ఈ ఆచారాలు విలువ గమనించు కుంటామనే ఉద్దేశ్యముతోనే ఇక్కడ చర్చ ప్రారంభించాము.చూసినవందలాది మందికి,స్పందించి తమ అభిప్రాయాలు తెలిపిన తాడెపల్లివారికి,ఎవరో అనామకులవారు వారికి,సోదరి మున్ని,జిలేబి,సుజాత పెద్దలు సహృదయులు బొల్లోజు బాబా,శ్రీ గారికి మరియు మాఆవిడ[ఆవిడకూడా తన అభిప్రాయం చెప్పినది గనుక] కు ముందుగా ధన్యవాదములు .
నా పరిశీలనలో విషయాలను కూడా వివరిస్తాను అవధరించండి.
*******************************************************************************************

1 స్త్రీ పురుషునికంటే ఎక్కువ పని చేస్తుంది. కనుక నెలలో నాలుగు రోజులు విశ్రాంతి ఇవ్వాలని ఈ ఆచారం పెట్టినట్లు వ్రాసారు అదీ నిజమే , అలాగే తాడేపల్లి వారి వివరణ సహేతుకమైనదే.
2. ఈమధ్య మహిళా ఖైదీలపై ఒక పరిశీలన జరి పారు. వారి లో ఎక్కువ శాతం నేరస్తులు తామునెలసరి రోజులలో ఉన్నప్పుడే ఈ నేరాలు చేసినట్లు వెల్లడైనది. నెలసరి రోజులలో వుద్రేకము కోపము చికాకు వంటి లక్షణాలు తమలో ఎక్కువగా వుంటాయని వారు వెళ్లడించటమ్ జరిగినది. ఆసమయములో మహిళలకు విశ్రాంతి నివ్వటం మేలనే నేటి మానసికవైద్యుల సలహా గూడా మనపూర్వీకుల వైజ్ఞానిక దృష్టిని తెలుపుతున్నాయి.

3 రెండు సంవత్సరాల క్రితం జరిగిన శాస్త్రజ్ఞుల పరిశోధన గొప్ప రహస్యాన్ని వెళ్లడించింది. మహిళ లో నెలసరి రోజులలో విడుదలయ్యే హార్మోన్ మెనిన్[దీనిపేరు సరిగా గుర్తులేదు కనుక్కుని మరలా పేరుదిద్దుతాను} వలన ఆమె శరీరం చుట్టూ విపరీతముగా బాక్టీరియాలు సూక్ష్మజీవులు వృద్ది పొందుతున్నాయని ,వీనిలో చాలా హానికరమైనవని వారు వెల్లడించారు. అంటే ఇటువంటి వైజ్ఞానిక రహస్యము తెలుసు కనుక మన పెద్దలు వారిని ఇల్లంతా తిరగవద్దని ఒకచోటమాత్రమే వుందాలనే కట్టు బాట్లు పెట్టారు.ఇందువల్ల ఆసూక్ష్మజీవులు అన్ని చోట్లా వ్యాపించకుండా వుండాలనే జాగ్రత్తతో. త్వరగా వీటితాకిడికి గురయ్యే పసిబిడ్డలను కూడా బహిష్టయిన స్త్రీ తాకరాదుఅని,సున్నితమైన పూల మొక్కలను కూడా తాకరాదని నిబంధనలు విధించారు.

4 ఇక వాళ్లకు తామస గుణాన్ని అంటె ఉద్రేకాలను పెంచే కారం ఉప్పు రుచులను తగ్గించి ఆసమయములో సాత్వికమైన తిండి నివ్వటములో ఎంత వైద్య విజ్ఞానము ఇమిడివున్నదో చూశారా! [ఇలా ఐతే మనం ఒప్పుకోము ఏ కార్పోరేట్ గురూజీనో ఇలా తినకూడదు ఉప్పు లేనిది తినాలి అంటే అప్పుడు గౌరవంగా ఆచరిస్తాము.]

5 ఇన్ని వైజ్ఞానిక సూచనలను మనం పైసా ఖర్చుపెట్టకుండా ఇచ్చారు కనుక చాదస్తముగా కొట్టి పారేస్తాము .అదే ఏ కార్పోరేట్ హాస్పటల్ వాల్లో పరీక్షలు జరిపి వచ్చ్న రోగాలు ఈ కారణమేనని చెబితే పేషంట్ లా బుధ్దిగా ఆచరిస్తామేమో.
6 ఇక ఆథ్యాత్మిక విషయాలకొస్తే మనిషిచుట్టూ జీవశక్తివలన ఒక తేజోవలయం వుంటుంది, సాధకులలో ,భగవంతుని ఆశ్రయించిన వారి లో ఈ తేజస్సు ఇంకా ఎక్కువ, అలాగే దైవపూజ జరిగే స్తలాలలో ఈ శక్తి ద్విగుణీకృతమవుతుంది.నెలసరి లోవున్న మహిళలలు ఆప్రాంతములో తిరగటము వలన ఆదివ్యశక్తి క్షీణిస్తుంది. జరగవలసిన మేలు జరుగదు.అంతేకాదు నెలసరి సమయాన సంభోగములో పాల్గొనటము వలన వచ్చే వ్యాధులను ఆయుర్వేదము వివరిస్తున్నది .కనుక వారిని దూరంగా వుంచటము మేలు. ఈ ప్రమాదాలన్నీ గమనించే మనవాళ్ళు ఈ నిబంధనలను విధించారు

మనకు మనపెద్దలు మలవిసర్జనకు వెళ్ళినప్పుడు నీళ్లతో శుభ్రం చేసుకోవాలనే ఆచారం పెట్టారు.మీరుఅనాగరికులు మీకుతెలియదు నాగరికత. మేము చూడు కాగితాలతో తుడుచుకుంటామనే నాగరికులు,వారి భావజాలాలతో ప్రభావితమై మన ఆచారాలను విమర్షిస్తూ ,అసలు మిగతా జీవజాతి మలవిసర్జనతరువాత కడుక్కుంటుందా ? మేము కడుక్కోవలసిన అవసరమేమిటీ మీది మూఢనమ్మకమని వాదించే మేధావివర్గాలను అలానే వర్ధిల్లనివ్వండి.

ఒక్కమనవి వినండి మనపెద్దలు పెట్టిన ఆచారాలన్నీ మానవజీవితానికి ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్నిచ్చేవే వాటిని పాటించటం మనకుమనము చేసుకునే మేలు.అది గమనించండి. వీలుచేసుకుని మన ఆచారాలను మనం పాటిద్దాము మన తరువాత తరానికందిద్దాము తద్వారా మహర్షుల ఆకాంక్షయగు మానవ సౌభాగ్యానికి తోడ్పడదాము.

Read more...

నెలసరి రోజులలో స్త్రీలను దూరంగాఉంచటముపై మీ అభిప్రాయమేమిటి?

>> Monday, January 26, 2009

స్త్రీలకు సహజ సిద్దమయిన నెలసరి రోజులలో ఇంటిలో దూరంగా ఉంచటం మన ఆచారం. దీనిని పాటించాలని పెద్దవాళ్ళు పట్టుబడుతుటే ,ఈతరం వారు చాదస్తం ఈరోజులలో ఏమిటి వెర్రి అని ఈసడిమ్చుకొటున్నారు. సరే కొద్దిమంది పాటిస్తున్నా వాళ్లు చేసేపని వాళ్లకు నిజముగా ఇష్టమై పాటిస్తున్నారో లేక పెద్దవాళ్ళ మాట తీసివెయ్యటమెమ్దుకని పాటిస్తున్నారో తెలియదు. కొందరికి దీనివెనుకేమన్నా రహస్యమున్నదేమో తెలిసివున్నదేమో. ఏతావాతా ఇది పాటిం చాలా అనే సందిగ్దం ఎక్కువమందిలో వున్నది. ఈ ఆచారము పట్ల మీ అభిప్రాయమేమిటో తెలుపవలసినదిగా కోరుతున్నాను

Read more...

సూర్య గ్రహణ సమయాన్ని ఉపయోగించుకొండిలా

>> Sunday, January 25, 2009


ఈనెల ఇరవై ఆరున సూర్యగ్రహణము మకరరాశి శ్రవణా నక్షత్రం లో ఏర్పడుతున్నది.భారత కాలమానం ప్రకారము మ.2-44నుండి సా.4-02వరకు వుంటుంది. ఈగ్రహణప్రభావము వలన దక్షిన భారత దేశానికి అరిష్టం.మకర రాసివారు ,శ్రవణ ,హస్త,రోహిణి నక్ష్త్రములవారు విశేష గ్రహణ శాంతి చేపించుకోవాలి.12 రాశులవారు సామాన్య గ్రహణ శాంటి చేపించుకోవాలని పంచాంగకర్తలు చెబుతున్నారు.


ఇక గ్రహణము విశేషసమయము. ఈ సమయములో చేసే మంత్రజపం నామజపం మామూలు సమయము కంటె ఎన్నోరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. కనుక గురుముఖతా మంత్రోపదేశము వున్నవారు,నామస్మరణ చేసే వారు అలాగే గురుముఖతా మంత్రోపదేశము లేకున్నా పంచాక్షరినిగాని[ఓం నమ: శివాయ ] అష్టాక్షరిని గాని [ఓం నమో నారాయణాయ ] జపించదలచుకున్నవారు అవి జపిస్తే శీఘ్ర ఫలప్రదమవుతాయి.వివిధ వృత్తులలో నున్నవారు ఇంటివద్ద వుండటానికి వీలు లేకున్నా ఆసమయము లో మీరున్న చోటునుండైనా జపము సాగించుకొనవచ్చు.ఈసమయాన్ని వృధా చేసుకొనవద్దని మనవి.

Read more...

"ఘనమౌ నీదగు కీర్తిని వినినే ,మనమున నమ్మితి గావుమయా"

>> Saturday, January 24, 2009




శనిత్రయోదశి,మరియు మాసశివరాత్రి తిథులు రెండూ కలసిన ఈరోజు దేశవిదేశాలనుంచి తమకొరకు పూజ జరపమని కోరుతూ పంపిన వారందరికోసము ఆనందముతో పూజ జరిపించుకున్నాడు ఆభక్తవశంకరుడు శంకరుడు. ఉదయము భక్తుల జాతకములలో నున్న దోషాలను బాపమని నవగ్రహదేవతలకు పూజ,అనంతరం ప్రత్యేకముగా శనీశ్వరులవారికి తైలాభిషేకములు,పూజలు జరిగాయి.

సర్వశుభకరము పరమేశ్వరునికి ప్రీతిదాయకమైన శనిప్రదోషపూజ మాసశివరాత్రికూడా కలసి వచ్చిన ఈ పర్వదినాన రుద్రసూక్తముతో అభిషేకాదులు మారేడు,పుష్పాదులతో ప్రతిభక్తుని పేరున అర్చనలు జరుపబడ్డాయి".ఘనమౌ నీదగు కీర్తిని వినినే ,మనమున నమ్మితి గావుమయా" అని ఆభోళాశంకరుని అందరితరపున ప్రార్ధించి శరణము వేడాము ఆదివ్యశ్రీచరణాలను.నమ్మినవారికెన్నడు నాశము లేదని ప్రకృతి మాత ఆనందముతో పలికినట్లు ఆసమయములో అలౌకికమైన వాతావరణము పులకింపజేసినది ఆసమయాన[.జయజయ శంకర భక్తవశంకర]. స్వామి మీతరపున అందుకున్న పూజల చిత్రాలను కూడా ఇక్కడ వుంచుతున్నాము చూడండి.
జపించండి ఆస్వామికి ప్రీతిపాత్రంగా ’ఓం నమ: శివాయ" అని.

Read more...

ఎందుకోఇలా..ఈవేళ..[చిన్నారిని చూడండి]

>> Friday, January 23, 2009




Read more...

అన్నదానమెలా చేయాలో పెద్దలు చెప్పినది చూద్దాము రండి

>> Thursday, January 22, 2009

దానములలో కెల్లా అన్నదానము గొప్పది. ఎందుకంటే అర్ధిని సంపూర్ణముగా సంతృప్తి పరచగలిగే అవకాశము వున్నది ఇక్కడ మాత్రమే.
నువ్వు ఎన్ని కోట్లరూపాయలు ఎంతెత్తు బంగారము ,ఎన్ని సంపదలను ధారబోసినా చాలు అనే పదము రాదేమోగాని కడుపునిండా అన్నం పెడితే చాలు..చాలు అనితృప్తిపడతారు తీసుకునేవారు. కనుకనే అన్ని పురాణాలలోనూ ఈదానానికి విశేషపుణ్యఫలితము చెప్పబడినది.
అన్నదానము చేసేకాడ ఏ వ్యత్యాసాలు చూడరాదు.ఈవిషయాన్నే తాతగారు[వీరబ్రహ్మేంద్రులవారు] ఒక చక్కని పద్యములో చెబుతారు తమ కాళికాంబశతకములో.
అన్నమయములైనవన్ని జీవంబులు
కూడులేక జీవకోటిలేదు.
కూడుదినెడికాడ కులబేధమేలొకో
కాళికాంబ హంస కాళికాంబ..........అని

. అన్నదానము చెసేటప్పుడు కొందరిని చీదరించుకుని,గొప్పవారిని గౌరవించి సంతర్పనలవలన పుణ్యము లభించదు,అన్నదానానికి అర్హత కేవలము ఆకలి మాత్రమే. కడుపునిండినవానికి నీవి పంచభఖ్శ్యపరమాన్నాలు పెట్టినా లభించని పుణ్యం ఆకొన్నవానికి పచ్చది మెతుకులతోనైనా కదుపునింపినప్పుడు వస్తుంది. మనం చెసే పెళ్ళిల్లు,వ్రతాలు, విందులు వినోదాలలో అన్నదానం ముందుగా మన బంధువులకు ఆహ్వానితులకు చేస్తాము.అలాగే వందరకాల వంటకాలతో దానిని ఖర్చుపెంచి చేసినా చాలావరకు వృధా అవుతుండటము చూస్తుంటాము.దానికి బదులు మామూలు కూరలతో వేలమంది ఆకలి తీర్చొచ్చు ఆరోజు.నిజంగా పుణ్యఫలితం ఇలా లభిస్తుంది. నాకైతే కొన్ని ఆలయాలకూడా [సాయి ఆలయాలు,అయ్యప్ప భజనలు } జరిగేకాద ఒక విచిత్రదృశ్యము కనిపిస్తుంది.ఆకలితో బొచ్చెలు పట్టుకుని బయట జనం ఎదురు చూస్తుంటారు.వారిని చీదరించుకుంటూ,మనం పిలచిన అతిధులను వద్దాన్నా తినమని బలవంతం చేస్తూ వడ్దిస్తుంటారు.ఏమిటీ చిత్రం?.కారణమొక్కటె వీరికి దానము విలువ తెలియకపోవటము . అన్నముతినటాని కొచ్చిన జీవి భగవద్ స్వరూపముగా భావించక ఇక్కడ కూడా భౌతిక మర్యాదలకే ప్రాధాన్యత ఇవ్వటము వలన. అన్నదానము పవిత్రభావనతో కాక సంఘములో మన గౌరవ మర్యాదలను పెంచుకునేందుకు అనే భావనతో చేస్తుండటము వలన.
ఈ పద్దతిని మార్చుకోవాలి మనము. చేసే పనికి సరయిన ప్రతిఫలము రావాలంటే, యాచకున్ని నీఛముగా చూడకూడదు,అతను నీదోషాలను స్వీకరించి నిన్ను చెడు కర్మనుండి విముక్తము చేయటానికొచ్చిన విశిష్ట వ్యక్తి అని గుర్తించాలి.కనుకనే
నీదగ్గరకొచ్చినవారిని కసిరి కొట్టి వట్టి చేతులతో పంపకు,ఒక బెల్లంముక్కైనా పెట్టి పంపు అని సమర్ధసద్గురువులు సాయినాధులు బోధించారు.కడుపు నిండినవాడికి కాదయ్యో!ఆకలితో వున్నవానిపెట్టు...అని అవధూత గొలగమూడివెంకయ్యస్వామివారు హెచ్చరించేవారు భక్తులను. ఆకలి తో తిరిగిపోయే అతిథి ఆగృహస్తు పుణ్యాన్ని తీసుకుని పోతాడని శాస్త్రవచనం. పూర్వం ఎంతదరిద్రములోనున్నా ఆకొని వచ్చినవారిని అన్నంతినిపొమ్మని కొద్దిగా అంబలన్నాపోసి ఆకలి్తీర్చేసాంప్రదాయమ్ గలవారిమి మనము. నేడు అన్నీ వున్నా ఎవరన్నా అన్నం పెట్తమని వేడుకుంటే పొద్దున్నేతీరిందా! అంటూ చీదరించుకునే భావదారిద్ర్యానికి లోనవుతున్నామునేడు.

ఒక్కవిషయము గుర్తుంచుకోవాలి ఈరోజు ధనదాన్యాలతో తులతూగుతున్నవారంతా పూర్వ జన్మలో దానాలాచరించినవారుగా గుర్తించండి.మనకు భగవంతుడు ప్రసాదించినది సాటి జీవులతో పంచుకోకపోతే దొంగతనము చేసి తిన్నదిగా తెలుసుకోండి,
ఈజనమలో అన్నీ వున్నా తినటానికి వీలులేని రోగాలతో బాధపడేవారు పూర్వము అన్ని దానాలు చేసినా ఆన్నదానము చేయనివారని గుర్తించాలంటున్నాయి శాస్త్రాలు .

కనుక అన్నదానము చేద్దాము .సాటిజీవులలో నున్న పరమాత్మను తృప్తి పరుద్దాము.
[ఈనెల ఇక్కడ పీఠములో జరిగే పూజలకు గోత్రనామాలు పంపినవారు అన్నం పొట్లాలు కట్టుకునైనా వెళ్ళి బస్ స్టాండ్ లలో రైల్వేస్టేషన్లలో, ఆకలితో నకనకలాడుతూ వుండే వారికిచ్చి వారి ఆకలి తీర్చండి.ఇక్కడ మీకొరకు మేము చేసే పూజ వేయిరెట్లు శక్తివంతమై మీకు సకలశుభాలను కలుగ జేస్తుంది.]

Read more...

శనిత్రయోదశి పూజకు గోత్రనామాలు పంపండి

>> Monday, January 19, 2009




ఈనెల 24 న శనిత్రయోదశి పర్వదినము వస్తున్నది.విశేషించి ఈరోజు శనీశ్వరునకు తైలాభిషేకము చేపించుటద్వారా జాతకములో శనిదశ ,అంతర్దశలలో శని సంచారములతోను చికాకులు పడుతున్నవారికి దోషములు పరిహారమవుతాయని శాస్త్రవచనము.

అలాగే ఈరోజు శివునకు రుద్రాభిషేకము తో పూజలు జరిపించటము వలన జీవితములో కష్టాలెదుర్కుంటున్నవారు వాటిని తొలగించుకోగల శక్తి పొందుతారు. పరమదయాళువైన ఆస్వామి అనుగ్రహం భక్తులపై వర్షిస్తుంది. ప్రత్యేకముగా ప్రదోషకాలములో శివార్చన అనంతశుభాలను ప్రసాదిస్తుందని పురాణాదులు తెలుపుతున్నాయి. కనుక ఆరోజు ఆభోళాశంకరుని అర్చించండి.

ఇక భక్తజనుల సేవలో భాగంగా" శ్రీవేంకటేశ్వరజగన్మాతపీఠం" ఈపర్వదినాన భక్తులకోసము ఈపూజలు జరుపుతున్నది. భక్తులు తమ గోత్రనామాలు పంపితే వారి కొరకు శనికి తైలాభిషేకము ,రుద్రాభిషేకము ప్రదోషకాలార్చనలలో వారి పేర్లమీద పూజ జరుగుతుంది. ఇందు కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.

1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3 వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4 శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు [నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం] అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5 వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.{జపంచేయటానికి కూడా సమయము వెచ్చించలేనివారి కోసము మేమేమీ చేయలేము}
6 ఆరోజు [కుంటివాళ్ళు,వికలాంగులకు] ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
7ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.

ఇంకా ఏదన్నా అదనపు వివరాలు తెలుసు కోవాలనుకుంటే durgeswara@gmail.com cell 9948235641 లలో సంప్రదించండి.

సూచన:-భక్తిలేని పూజ పత్రిచేటు అన్నారు పెద్దలు కనుక మీకోసము,అలాగే తాము జపము చేయలేని నిస్సహాయస్థితిలోనున్న మీవారి కోసము భక్తితో మంత్రజపము చేయండి.పరమాత్మఅనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. శుభమస్తు.

Read more...

విడిపోయిన భార్యా భర్తలను కలిపిన భక్తాంజనేయుడు.

>> Wednesday, January 14, 2009

నమ్మినవారిని కాపాడటమే దీక్షగా పెట్టుకున్న స్వామి మరొక అద్భుత లీల చూపాడు. ఆనాడు వేరైన సీతారాములను తిరిగి కలిపి వారి హృదయాలలో వేదనతొలగించి భక్తారాజు హనుమంతుడు , మరొకసారి తన మహిమచూపి భక్తరక్షణలో తన నిత్యసత్యమైన ఉనికిని చూపాడు నేడు. విషయాని కొస్తున్నాను.

ఈకాపురాలు కూలనున్నాయి,సలహా చెప్పమని మిమ్మల్ని కోరుతూ ఈనెల ఒకటవతేదీ ఒక పోష్ట్ వ్రాసాను.దీనికి స్పందించి తమ విలువైన సలహాలను కూడా బ్లాగర్లు పంపారు.

నేను వ్రాసిన మూడు కుటుంబాలలో మూడవ కుటుంబానికి చెందిన విచిత్రం ఇది. ఇందులో వున్న భార్యా భర్తలిరువురు విడిపోయి నాలుగు సంవత్సరాలయినది. ఎన్నిసార్లు ఇతను కలుపుకు పోదామన్నా ఆవిడ కలసిరాలేదు. కన్న బిడ్దలదగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలని ఎంత తపించినా సాధయం కాక,తన భార్యకు చేరువకాలేక సతమతమవుతున్న ఈతను ఈమధ్య నాదగ్గరకొచ్చి తన బాధను నాతో చెప్పుకున్నాడు.నెను మానవప్రయత్నాలనేకాదు దైవాన్ని విశ్వసించమని ,హనుమంతుని ఉపాసించమని సలహా చెప్పాను. అతను నిష్టగా చాలీసాపారాయణము, ప్రదక్షిణాలు చేస్తున్నాడీ మధ్య. అయితే మానవప్రయత్నము కూడా చేసి చూద్దామని నాప్రయత్నాలు చేసినా అవి ముందుకు సాగలేదు. అతను కూడా తనప్రయత్నాలు చేసినా ఆవిడనుండి తిరస్కారమే ఎదురైనది. ఈప్రయత్నాలగురించి నేను మొన్నరాసిన పోస్ట్ లో చెప్పాను. ఆమరుసటిరోజు అతను ఫోను చేసి లాభం లేదు మాష్టారూ! తాను అంకెకొచ్చేరకము కాదు.ఇక బిడ్డలకోసము నేను తపనబడి లాభము లేదు. విడాకులే కోరుతున్నది ఆవిడ అని బాధపడి, ఆవిడ ఇష్టం ప్రకారమే విడాకులకు సిద్దమవుతానని చెప్పాడు, నేను వారించి ఇంతకాలం ఓపిక పట్టావు,స్వామిని ఆశ్రయించి నిరాశ పడవద్దు.మిమ్మల్ని విడిపోనివ్వడాయన,నాకా నమ్మకం వున్నది.ఇంకొద్ది కాలం ఆగు.చాలీసా పారాయణం తీవ్రతరం చేయి అని నచ్చచెప్పాను.

ఈరోజు ఉదయాన ఆరుగంటలకే గుడిలో వున్నప్పుడు ఫోన్ వచ్చినది.కోటేస్వరరావునుంచి అని ఇంటిలోనివారు తెచ్చిఇచ్చారు ఫోన్. నేను ఏమిటి అనగానే అతను తలనెప్పి వదిలినది సార్ అన్నాడు. అయ్యో వీల్లేదో విడిపోయినట్లుందే అని నిరాశపడి ఏమైనది అని అడిగాను.స్వామి అనుగ్రహం సార్ మీకే ముందుగా చెబుతున్నాను.రాత్రి మా అత్తగారింటికి వెళ్ళి మాట్లాడాను
ఎప్పుడూ లేనిది కొందరు ఆ అమ్మాయి బంధువులు కూడా వచ్చి తనను మందలించారు నాతో కలిసి వుండటానికి నా భార్య ఒప్పుకున్నది. అని ఆనందంగా చెప్పాదు. హమ్మయ్య...స్వామీ నామాట నిలబెట్టావు....పొరపాటు..పొరపాటు..నీ భక్తజనరక్షదీక్షను నిరూపించుకున్నావని స్వామి వారికి కృతజ్ఞతలను తెలుపుకున్నాను. నన్ను ఈరోజు రమ్మన్నారు సార్ అత్తగారింటికి అన్నీ తీసుకుని అని చెబుతున్నాడు,నామనసుమాత్రం స్వామి వారి భావనతో ఆనందం నిండిపోతున్నది. ఈరోజు కనుమ పండుగ వద్దులే ..అదీగాక మాంసాహారం పెడతారు,నువ్వు చాలీసా పారాయణలో వున్నావు ,రేపు వెళ్లమని చెప్పాను.స్వామి పారాయణము మరింత శ్రద్దతో చేయమని సూచించాను.
ఇక్కడ మానవప్రయత్నాలన్నీ వృధాయైన సమయాన ఆప్రయత్నాలకు భగవంతుని అనుగ్రహాన్ని జోడించినప్పుడు ఎలాశుభాలనిస్తాయో దైవశక్తి మరొకసారి నిరూపించినది.అలా కాదు ఎప్పుడో నుంచి ప్రయత్నాలు ఇప్పటికి ఫలితాని కొచ్చాయని వాదించకండి.ఇప్పటిఫలితమే ఎప్పుడో ఎందుకు రాలేదు అని ఎదురు ప్రశ్నవేస్తే వాదించేవారి వద్ద సమాధానం ఉండదు.కాకుంటే వితండవాదం సాగుతుంది అదివృధా! నమ్మిన వారికి సొమ్ము.నమ్మకుంటే దుమ్ము,అని మహాత్ములు గొలగమూడి వెంకయ్యస్వామివారు బోధించినవిధంగా పెద్దలమాటనమ్ముదాము.భగవంతునిశరణాగతులమై ధర్మబద్ధ జీవితమ్ గడుపుదాము.

జయ సీతాశోకనివారకాయ ,భక్తరక్షాదీక్షాధారిణే , హనుమతే నమ:

ఇంతకు ముందు ఈవిషయమై వ్రాసిన పోస్ట్ చూడటానికి ఇక్కడ చూడండి.
http://durgeswara.blogspot.com/2009/01/blog-post_05.html

Read more...

తిరుమల యాత్ర ఎలాచేయాలి?శ్రీవారి కరుణ కలగాలంటే.?

>> Tuesday, January 13, 2009


తిరుపతి యాత్ర యెలా చేయాలో ,మానాన గారు చెబుతూ ఉండేవారు. చాలామంది పెద్దలు చెప్పినవి కొన్ని విన్నాను.మీతో పంచుకుంటున్నాను.

తిరుమల మామూలు క్షేత్రము కాదు.పరమాత్మ స్వయంభూగా వెలసిన క్షేత్రరాజము.అక్కడ ప్రతి చెట్టు,ప్రతి పుట్ట భగవంతుని ధ్యానిస్తున్న మహర్శులే,అని చెప్పబడుతున్నాయి.ఆఏడుకొండలు సాక్షాత్తూ ఆదిశేషుడేనని పురాణాలు వివరిస్తున్నాయి.
కనుకనే రామానుజులలాంటి సద్గురువులు అక్కడ ఎలా మెలగాలో ఆచరణాత్మకంగా చూపించారు.అన్నమయ్య లాంటి మహానుభావులు అక్కడ నివాసమ్ కోసం తపించి తరించారు. ఇక యాత్ర నెలా చేయాలో పెద్దలు చెప్పినది చూద్దాము.

కొండనెక్కటం అలిపిరి నుంచి మొదలవుతుంది.చెప్పులతో కొండ ఎక్కరాదు. మొదటగా స్వామి వారు భక్తునకు స్వయంగా తన పాదరక్షల కొలతలనివ్వగా ఆభక్తుడు తయారు చెసిన పాద రక్షలు అక్కడ పూజింపబడుతుంటాయి.ఆపాదరక్షలను ముందుగా తలపై వుంచుకుని స్మామివారిని స్మరించు కోవాలి. అక్కద రాజైనా చక్రవర్తియైనా సరే వాళ్ల అహంకారాలు అనిగేలా చెప్పులతో కొట్టబడతారు.దానితో నేనింతవానిని అంతవానిననే అహంకారం అణగిపోతుంది. ఆతరువాత బహుకష్ట సాధ్యమైన ఆ కొండనెక్కుతూ వుంటే[అప్పటిలో ఇంత సౌకర్యాలు లేవులెండి] ఆయాసముతో కళ్ళుతిరుగుతుంటాయి భక్తులు భగవన్నామస్మరణంతో బహుకష్టాలతో చేరుకుంటారు పైకి . దానితో
తమ చెడుఖర్మలు నశించటమేకాదు,తమ శారీరిక బలం ఎంతో దాని పరిమితి ఎంతో తెలిసివస్తుంది.దానితో తమ శరీర బలాన్ని చూసుకుని విర్రవీగే వారికి వాస్తవంఅర్ధమవుతుంది. ఆతరువాత ముఖ్యమయిన పని శిరోముండనమ్ అంటే గుండు చేయించుకోవటం ఒక ముఖ్యమయిన నియమము అందరికీ.ఇది ఆడమగ అందరూ పాటించేవారు పూర్వము,ఆధునికత పేరుతో బాహ్యసౌందర్య పోషణపట్ల శ్రద్ధపెరిగి ఇప్పుడు కొందరు పాటించటమ్ లేదు. కాని దీనివెనుక చాలా పెద్ద ఆధ్యాత్మిక కారణమున్నది. మనిషిని మభ్యపెట్టి మనో వికారాలను కల్పించేది సౌందర్యం.దానికి ఆధారము శిరోజాలు. అవి వున్నప్పుడు ఎక్కడకెళ్ళినా తమ సౌందర్యము పట్ల అతిశయమైన భావన వెన్నంటివస్తూ మనసును కామవికారాలవైపు పరుగుపెట్టిస్తుంది. కనుక ఆవికారాలను తొలగించకపోతే మనసు మాధవుని వైపు మళ్లదు పక్కదోవలగుండా పారి పోవాలని చూస్తుంది. కనుక ఆశిరోజాలను తీసి వేస్తే ప్రతి మానవునికి తమ సహజస్వరూపమేమిటో అర్ధమయిపోతుంది. ఎదుట వున్న జీవులను చూడగానే కామ భావన సమూలంగా నశిస్తుంది. నిర్వికారమైన మనోస్థితి కలుగుతుంది.[గుండు చేపించుకుని మిమ్మల్ని మీరు అద్దములో చూసుకోండి ఒకసారి,ఏవిధమయిన వికారాలు లేక ప్రశాంతమైన స్థితి వస్తుంది. ] అప్పుడు ఆలయ ప్రవేశము చేస్తుంటే మనసంతా ఆ దివ్యస్వరూపాన్ని చూడాలనే తపన తప్ప మరొకటి తలపుకు రాదు. ఆస్థితిలో కోటిసూర్యకాంతుల సమప్రభుడు ఆకొండలరాయుడు మనకు దర్శనమిస్తాడు. ఆతన్మయత్వంతో స్వామిని దర్శించి నప్పుడు తిరుమల యాత్రసఫలమవుతుంది.
ఆతరువాత నిలువుదోపిడీ చేసి మనలను ధనవంతులమనే అహంకారాన్నుంచి రక్షించి ప్రపంచములో ఏజీవైనా నీవొక్కడివే దిక్కు నాకు అనేలా భావన కలగచేస్తాడు స్వామి. ఇలా వెళ్ళి నప్పుడే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించి మనకు శుభాలు కలుగుతాయి.అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన ఆ స్వామి ముందు తమ తుచ్చమైన పలుకుబడులను,ధనాన్ని ప్రదర్శించి చెసే దర్శనముమేలు చేయదు. సరికదా ఆయన ఆగ్రహానికి గురయ్యేలా చేస్తుందని చెప్పవచ్చు.ఆ పవిత్ర క్షేత్రములో అడుగు పెట్టిన ప్రతి భక్తుడు స్వామి వారి పరివారమే. కనుక మన అతితెలివి తోటి సాటి భక్తుల కిబ్బందికలిగేలా మనము దర్శనాదులను చేయరాదు.భక్తులకు చెసే అపచారాన్ని ఆయన అసలు క్షమించడు.అందుకే ఎక్కడెక్కడ మనం చేసిన తప్పులన్నిటికీ కొండమీదకు వెళ్లాక
అనేకరూపాలుగా దోపిడిగా మనకు అనుభవానికొచ్చి మనసు విలవిల లాడుతుంటుంది. మీకు తెలుసోలేదో నిరుపేదలు రోజులతరబడి ఆ గదులలో స్వామి వారి దర్శనానికి వేచివున్నా వారికి శ్రీవారి పట్ల విసుగు కాని,అక్కడ అసౌకర్యాల పట్ల గమనికేవుండదు.కాస్త స్థితి కలిగాక మనమే గంటసేపన్న ఆగలేక అల్లడిపోయి పక్కదారిలో దర్శనమేమన్నా దొరుకుతుందా ని వెతుకుతుంటాము. నేనెప్పుడు తిరుమల వెళ్ళినా ఈవిషయాలను గమనిస్తూ వుంటాను.బుద్ధిహీనతతో నేను వక్రమార్గమ్ లో దర్శనానికి వెళ్ళాలని ఒకసారి ప్రయత్నం చేసినప్పుడు శ్రీవారు నాకొక లీల చూపాడు.అందుకే నేనెప్పుడూ దాసానుదాసునిగా ఒల్లు దగ్గరపెట్టుకుని మసలుకుంటాను శ్రీవారి సన్నిధిలో.

Read more...

సంక్రాంతి శుభాకాంక్షలు

>> Monday, January 12, 2009



భోగిమంటలు సకలపీడలను తొలగించి దారి చూపగా
సంక్రాంతి లక్ష్మి మీ ఇంట అడుగిడి
సకలసంపదలను నింపగా ,
ఆనందోత్సాహలతో కనుమజరుపుకునే
మీకు మీకుటుంబానికి శుభాకాంక్షలు
. ప్రపంచములో నున్న భారతీయులందరికీ
శుభాకాంక్షలు

Read more...

నమో నమో నవయుగ వైతాళికా !

>> Sunday, January 11, 2009


Read more...

చండీయాగం మహిమ


అమ్మ వారి విభవాన్ని మార్కండేయపురాణమ్ లో చాలా విస్తృతంగా వర్ణించారు.ఏడువందల మంత్రాలతో. దానినే దేవీ
సప్తశతి అని వ్యవహరిస్తారు. ఆ సప్తశతిని పారాయణము చేసి ఆ మంత్రాలతో హోమము జరుపుతారు.దానినే చండీయాగము అని అంటారు. అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమవుతుంది కనుక ఆమె అనుగ్రహం కోసము చండీ యాగము చేస్తారు. ఆతల్లి కరుణవల్ల సమస్త దుష్కర్మలు నశించి,జయము సంపదలు,శుభాలు ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా శతృంజయముగా భావిస్తారు. ఈయాగానికి దేవీ వుపాసకులు వుండి చేస్తే ఆమంత్రాలకు బలం ఎక్కువ. ఒక్కరోజు,మూడు రోజులు,తొమ్మిది రోజులుగా చేస్తారు ఈయాగాన్ని.దీనికి అనుబంధంగా గణపతి హోమము,నవగ్రహ హోమములాంటి యాగాలు అనుసంధిస్తారు. యాగ సమయం లో అమ్మకు ప్రీతి పాత్రంగా పూజలు నివేదనులు జరుపుతారు.మీకు దగ్గర పుస్తకాల షాపులో సప్తశతి దొరుకుతుంది,అర్ధసహితంగా చూడండి. ఇక భక్తి పూరితముగా చెస్తేనే ఏ భగవద్ పూజకైనా ఫలితం వుంటుంది.అది గమనించండి.ఖర్చంటారా ఐదువేల నుంచి ఐదు లక్షలదాకా కూడా పడుతుంది పెట్టు కోవాలనుకుంటే.చేసే విధిని బట్టి . అయితే అమ్మ భక్తానుగ్రహ కాతారాం అన్న పేరుగలది. బిడ్ద ఎంతఖర్చుపెట్టాడని కాదు,ఎంత భక్తిగా చేశాడని చూస్తుంది.

ఈ యాగ మహిమ మీరు నమ్మినా నమ్మకున్నా ఒకటి ఇటీవలే జరిగినది చెబుతాను వినండి.
తెలాంగాణా అంశముతో రాజకీయ పోరాటము చేస్తున్న కేసీఆర్ ,మొదట సభలు సమావేశాలు పెట్టి తరువాత అతని పరిస్తితి ఏమిచేయాలో తెలియని స్థితి కెళ్ళినది.కార్యకర్తలకు కూడా వుత్సాహము తగ్గినది.అప్పుడే అతని కాలు కూడా దెబ్బతగిలి నడవలేని స్థితి. రాజకీయంగా శూన్యంగావున్నది భవిష్యత్తు. అప్పుడెవరు సలహా ఇచ్చారో గాని అతను చండీయాగం చేశాడు.నిలబడలేక కుర్చీలో కూర్చునే యాగం లో పాల్గొంటున్న ఫోటోలు మీరు చూసే వుంటారు.యాగం చేసి తెలంగానా తెస్తాడట ! అని వ్యంగ్యంగా పత్రికలలో కార్టూన్లు కూడావచ్చాయి అతనిపై.మామిత్రులు కొందరు పిచ్చాపాటి మాట్లాడుతూ రెచ్చగొట్టెవరకు రెచ్చగొట్టాడు జనాన్ని,ఇకఏమి చేయాలో తెలియటం లేదు.ఇప్పుడిక ఎన్ని యాగాలు చేసినా ఇతనిని జనం నమ్మరు. అని వ్యంగంగనే మాట్లాడారు. నేను వారిని వారించి మీకు తెలియదు.అతని కెవరో పెద్దవారు సాధకుడూ కరక్టయన మార్గాన్ని చూపుతున్నారు. చండీ యాగము మహిమ మీకు తెలియదు ,చూస్తూవుండండి ఏమి జరుగుతుండో అని చెప్పాను.
ఆ యాగమయి పోయిన తరువాత విచిత్రం......
వూరుకున్న వాడు వూరుకోక ఎమ్మెస్ సత్యన్నారాయణ నోరుదూలతో కెసిఆర్ కు చేవలేదు దమ్ముంటే రాజీనామా చేసి పోటీకి రమ్మని సవాల్ విసరటమ్,అమ్మదయతో కలసివచ్చిన అవకాశాన్ని అందుకుని కేసీఆర్ రాజీనామాచెసి బరిలోకి దిగటం,కాంగ్రేస్ వాళ్లకు చావుకొచ్చినంతపనై ఉపఎన్నికలలో తమ సర్వశక్తులను ఒడ్డి పోరాడవలసి రావట,వాళ్ల్ ప్రతిచర్య మహామాయ అనుగ్రహాన ఇతనికి ప్రజలో విపరీత సానుభూతి పెంచి కరీంనగర్ స్థానం లో రెండులక్షల మెజారిటీతో విజయం సాధించటం సినిమాలా జరిగిపోయినది.తెలంగాణాలో తిరుగులేని నాయకునిగా తనస్థానం పెంచుకున్నాడు.
ఇదీ చండీయాగ మహిమ అని వివరిస్తే మావాళ్లంతా అవును నమ్మలేని విధంగా జరిగినదిదని ఆశ్చర్యపోయారు.

[ఇది నేను చండి యాగం గురించి అడిగిన ఒకరికి అంతర్జాలంలో పంపిన వివరణ ]
Delete

Read more...

ఆలయాలలో అవినీతి గురించి అందరూ మాట్లాడేవారే? బాధ్యతగా వ్యవహరిస్తున్నవారెవరు?

>> Saturday, January 10, 2009

ఈమధ్య ఆలయాలలో దోపిడీలెక్కువవుతున్నాయని.దుర్మార్గాలు పెచ్చు పెరుగుతున్నాయని ప్రతివారూ విమర్శలు బాగ చేస్తున్నారు.కానీ ఎవరూ తమవంతు బాధ్యతలను గురించి మాట్లాడటము లేదు.
భగవంతుని పేరుతో దోపిడీ చేస్తున్నారన్నది నిజం.మరి అది తెలిసి మనం కనీసం ఏదైనా ప్రతిఘటన చూపామా? లేదే? ఎందుకని?
అదే మనస్వంత విషయమైతే ఇలానే వదలేసి వెళ్ళి వస్తామా? రాము.ఎందుకని? అదే మన స్వంతవాళ్ల సొమ్మును ఎవరన్నా దోచుకుంటుంటే చూస్తూ వచ్చేస్తామా? లేదు. ఎందుకని? భగవంతుడు మనవాడు అన్న భావం మనకు లేదుకనుక.మనకు కోరికలు తీర్చాలంతవరకే అయన. మనకు ప్రేమకంటే వ్యాపార దృక్పథం మనసులో వున్నదేమో ఆలోచించండి.గొప్ప ఆపదలో వున్నప్పుడు ఆయన కోసం ప్రార్ధించిన మనం ఆస్తానాన్ని పవిత్రంగా వుంచటం కోసం ఏదన్నా ప్రయత్నము చేస్తామా?

అసలు దేవాలయాలంటే ఏమిటో తెలుసుకోండి ముందు. మన చుట్టూ గాలి వుంటుంది ,కానీ దానిని సైకిల్ ట్యూబ్ లోనికి ఎక్కించాలంటే ఎలాకుదురుతుంది. సైకిల్ పంపనే పరికరమ్ వుంటేనే అది సాధ్యమవుతుంది. విశ్వవ్యాపితముగా అణువణువునా విరాజిల్లుతున్న పరమాత్మ శక్తిని మనలోకి ఆహ్వానించుకోవటానికి మహర్షులు సిద్దపరచిన పరికరమే ఆలయం. కొన్ని ప్రత్యేక కొలతలద్వారా ఆలయాన్ని నిర్మించి మంత్రజపముతో పరమాత్మ శక్తిని ఆహ్వానించి జడమైన పదార్ధాల[విగ్రహాలలోకి]ప్రసరింపజేసి చైతన్యవంతమ్ చేసి అక్కడనుండి భక్తులపైకి ఆశక్తి ప్రసరించేలా ప్రార్ధనా పూర్వకంగా సిద్దపరచబడిన శక్తి కేంద్రాలు ఆలయాలు. భక్తులు తమ నిరంతర ప్రార్ధనలద్వారా ఆశక్తిప్రసారాన్ని పెంచుకుంటూ పవిత్ర వాతావరణాన్ని కాపాడుకుంటూ రావలసిన మనస్వంత ఆస్తులివి. భగవంతునికి మనం పూజ చేసినా చేయకున్నా లోటేమీ లేదు ఆయనకు .మనం తలుపుతెరిచినప్పుడు వుండి,కాపాడుతూ తలుపులు వేసి గడియలు పెట్టినప్పుడు కూడా క్షమించి
మనకోసం ప్రేమతో నిలచివున్న ఆపరమాత్మ అనుగ్రహ కేంద్రాలను కాపాడు కోవలసిన బాధ్యత ఎవరిది? కాపాడు కోకుంటే నష్టం ఎవరికి?మనకే.
అది గమనించండి.
కలి యుగాధినేతయిన కలి పురుషుని సంకల్పముతో అతని మాయజాలమ్ భక్తులను మభ్యపరచి భగవంతుని నుండి దూరము చేయటానికి తీవ్రప్రయత్నాలు చేస్తున్నాడు.అవే మీకు కనడుతున్న భౌతిక కారణాలు. ఏదోవిధముగా ఆలయాల పవిత్రతను దూరం చేసి తద్వారా భక్తులకు దైవంపై నమ్మకాన్ని తొలగించేప్రయత్నం ఇది.ఆలయాలను,దైవాన్ని ధర్మాన్ని నిందిస్తూ సాగుతున్న ప్రచారాలుఅన్నీ ఇందులో భాగమే. కనుక భక్తులైన వారు కూడా ఆ మాయకు లోబడి ఇలా ఆలయాలకు వెళ్లాల్సిన పనిలేదు,వాళ్లు ఇలా ,ఇక్కడ అలా అలా అని వూరికే ముచ్చట్లతో పొద్దుపుచ్చితే నష్టం ఎవరికి?

కనుక భగవంతుని పట్ల నిజమైన ప్రేమ వున్నట్లయితే దురాచరాలను ఖండించటం తో మీ బాధ్యతలను నిర్వర్తించండి.ఎప్పుడూ గుడికెళ్ళి స్వామీ నాకిది కావాలి?అదికావాలి అనే బెగ్గర్లలా కాకుండా బిడ్దలుగా మారి భగవంతుని పట్ల ధర్మం పట్ల ,బాధ్యతలను కూడా గుర్తు చేసుకోండి.మనయోగక్షేమాలు చూస్తున్న భగవంతుని పట్ల మన ప్రేమాభిమానాలు ఎలావున్నాయో ఆయనగమనించేలా పోరాడండి.

Read more...

ఆలయ ధర్మాధికారి పదవి కావాలా?జాగ్రత్త....

>> Thursday, January 8, 2009


దేవాలయాలకు ధర్మ కర్తలుగా వుండటానికి అంగీకరించ కండి సాధ్యమైనంతవరకు. ఒకవేళ అంగీకరిస్తే చాలా జాగ్రత్తగా వుండాలి మరి.ఎందుకంటే ................

ధర్మరాజు గారు రాజ్యపాలనలో చాలా సమర్ధవంతముగాను,న్యాయపూరితంగా తన పరిపాలన వుండేలా జాగ్రత్తలు తీసుకునేవారు.
అన్నివేళలా ప్రజలకు అందుబాటులో వుంటూ న్యాయాన్ని చేయాలనే సంకల్పముతో ఆయన తన సభా మంటపానికి ముందు ఒక ధర్మ ఘంటను ఏర్పాటు చేశారు.ఎవరన్నా న్యాయాన్ని కోరుతూ ఫిర్యాదు చేయదలచుకుంటే ఆ ఘంటను దానికున్న తాడును లాగటం ద్వారా మోగించిన పక్షములో ఏసమయములోనైనా రాజు గారు వచ్చి ఆ న్యాయార్ధికి విచారణ జరిపి న్యాయం చేకూరుస్తారు. ఈవిధానంవలన ప్రజలకు చాలా మేలు జరుగుతూ వున్నది.

ఒఅక రొజు ఘంటారావం మోగుతూనే వున్నది. మామూలుగా ఒకటి రెండుసార్లు ఘంటను మోగించి రాజు గారు వచ్చినదాకా వేచివుంటారు ఫిర్యాదీ దారులు. కానీ ఆరోజు ఘంట ఆపకుండా మోగిస్తున్నారెవరో.దానితో రాజుగారు ఘంటను మోగిస్తున్నవారెవరో కనుగొని తనవద్ద ప్రవేశ పెట్టమని సేవకులను పంపారు. తీరా వాళ్లు వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఊరకుక్క ఘంటను లాగుతూ కనిపించింది వాళ్లకు. వాళ్ళు దానిని ఛాయ్..ఛయ్ అని అదిలించబోతే అది మానవ భాషలో నాకు న్యాయం కావాలి రాజుగారు వచ్చినదాకా ఆపను అన్నదట. దానితో చిత్రమనిపించిన భటులు వెళ్ళీ రాజుగారికి విన్నవించారు విషయాన్ని. ఆయన వెంటనే ఆకుక్కను వద్దకు వెళ్ళాడు. ఓ శునకమా! ఏమి నీ బాధ,ఎందుకిలా న్యాయఘంటను మ్రోగిస్తున్నావు?అనిప్రశ్నించాడు. మహా ప్రభూ నన్నొక ధూర్తుడు కొట్టి బాధించాడు అతనిని మీరు శిక్షించవలసినది అని ప్రార్దించినది.నీవేమి చేసితివి ఎందుకు నిన్ను కొట్టినారు అని అడిగాడాయన. అయ్యా! నేనెవరి జోలికెల్లలేదు. నాదారిన నేను నడచి వెళుతుంటే ఏ కారణము లేకుండానే చేతనున్న కర్రతో నన్ను కొట్టాడొక మనిషి సంత లో ఈరోజు అని ఫిర్యాదు చేసినది.నేనేమి చేయక పోయినా నన్ను కొట్టినందుకు అతనిని శిక్షించి తమ రాజ్యములో అన్ని జీవులకు న్యాయం జరుపుతున్నారని నిరూపించుకోవాలి తమరు అన్నది కుక్క.
పాపం అనవసరముగా దీన్ని కొ్ట్టినవారెవరు,వెళ్ళి విచారించి వానిని తీసుకు రమ్మని భటులను పంపారాయన. వాళ్ళు వెళ్ళి ఆ సంత జరిగే ప్రాంతములో విచారణ జరిపి కుక్కను కొట్టినాయనను తీసుకుని వచ్చారు.వచ్చిన వ్యక్తిని ఈకుక్కను నీవు కొట్టావా? అని అడిగారు రాజుగారు.
"కొట్టాను ప్రభూ"
ఎందుకు?
ఊరికినే!
వూరకెందుకు కొట్టావు?

వెళుతుంటే ఈకుక్క కనిపించింది.ఊరికినే నాదగ్గరున్న కర్రతో ఒకటిచ్చాను నడుముపై.కుక్క కనుక.

దేనికి?

దేనికేమున్నది మహారాజా ఇది కుక్క కనుక కొట్టాలనిపించింది. కొట్టాను.ఇది సాధారణమైన విషయమేగా? కుక్కను ఎవరైనా కారణము లేకున్నా తన్నటము ,కొట్టటము లోకములో సహజమేకదా?అతను తన వాదన వినిపించాడు.

రాజు గారికి ధర్మ సంకటము ఎదురైనది.

లోకములో కుక్కను ఏ కారణము లేకున్న అదిలించటము .కర్రతో కొట్టి తరమటము సహజముగా జరుగుతుంటాయి. దాన్నెవరూ పెద్దగా పట్టించుకోరు. పైగా ఇతను నిజముగా చేసినది ఒప్పుకున్నాడు. అందులో లోకసహజమైన విషయానికి తనపై విచారణ జరపటము బాగుండదు. కానీ దెబ్బలు తిని బాధపడుతున్న జీవి న్యాయ మడుగు తున్నది. ఎలా? .ఇలా విచారించుకుని ఆయన ఒక నిర్ణయాని కొచ్చాడు. ఓశునకమా! అతను తాను చేసినపని చెప్పాడు. మామానవ జీవనం లో ఇది పెద్దగా నేరము కాదు. మాకిలాంటి తీర్పు చెప్పవలసిన అవసరము మును పెన్నడు కలుగలేదు. ఒక వేళ నేను ఏతీర్పు చెప్పినా నన్ను మానవునివి గనుక జాతి పక్షపాతం తో తీర్పు చెప్పావని నీవారోపించవచ్చు.కనుక నీవే ఈదోషానికి తగిన శిక్ష ను సూచించు అని దానికే నిర్ణయాన్ని వదలి వేశాడు.

అయితే మహారాజా! ఇతనిని ఒక ఆలయానికి ధర్మాధికారిగా నియమించండి,అని అన్నది.

రాజు గారు, వెంటనున్నవారందరు,విస్తుపోయారు.ఇదేమి ఇలా కోరినదిది. కొట్టాడన్న కోపము ఉంటే అతనికి కఠినమైన దండన విధించమని కోరుకోవాలి కానీ ఈశిక్ష ఏమిటి విచిత్రముగా అని మాట్లాడుకుంటూన్నారు. రాజు గారికి అయోమయముగా వున్నది.
అదేమి? అట్లడిగితివి. ఇలాంటిది శిక్ష ఎలా అవుతుంది అని అడిగారాయన దానిని.
మీకు తెలియదు మహారాజా! ఇది పెద్ద శిక్ష అవుతుంది. దేవాలయ నిర్వహణ లో ఏమాత్రం అజాగ్రత్తగావున్నా చాలా దోషము.అదీకాక దేవును సొమ్ము ఎవరిద్వారానైనా దుర్వినియోగమైనదా,అది ఆబాధ్యులను,దుర్వినియోగము చేసినవారిని ,ఆడబ్బును తీసుకున్నవారిని చాలా కష్టాల పాల్జేస్తుంది.తీరని దు:ఖం అనుభవించేలా చేస్తుంది అన్నది ఆకుక్క.
దానికి ప్రమాణమేమున్నది? అని అడిగాడాయన ఆశ్చర్యంతో.

దానికి నేనే ప్రమాణము. పూర్వ జన్మలో ఒక ఆలయధర్మకర్తనై మొదటిలో జాగ్రత్తగానున్నాను. కాని తరువాత కొంత సొమ్ము దుర్విని యోగానికి కారనమై,మరికొంతదాచుకునే బుద్ధి,స్వార్ధపరత,మొదలైన దుర్గుణాలకు లోనై ఆదోషాల ఫలితంగా ఇదిగో ఇలా కుక్క జన్మ నెత్తాను. ఇలా ప్రతివారి చేతా కారణము లేకున్నా తన్నులు తింటున్నాను.మమ్మల్ని చూస్తే కారణము లేకున్న ఊరికినే మీకు కొట్టాలని తన్నాలని అనిపించటమ్ మా ఖర్మ ఫలితమే. కనుక వీనికి ఇదే సరయిన శిక్ష. ఆలయ ధర్మకర్తా వీడు తప్పులు చేసి నాలా జన్మనెత్తటం ఖాయం. ఇంతకంటే పెద్దశిక్షేమున్నది అని వివరించినది.

కనుక జాగ్రత్త.

Read more...

ఈ కాపురాలు కూలకుండా వుండేందుకు ,మీసలహాలు చెప్పండి,[సమస్యమూలాలను విశ్లేషించండి]

>> Monday, January 5, 2009

నాకు ఇప్పుడు రెండు సంకటాలు ఎదురయ్యాయి. మొత్తం మూడు కుటుంబాల లో దాంపత్యజీవితం ప్రమాదం లో పడినది.ఇందులో ఒకటి భగ్నమయినది ఆల్రెడీ.ఇక రెండు కుటుంబాలు ప్రమాదపు అంచులో వున్నాయి. దీనికి కారణాలను వెదుకుతూ సమస్య పరిష్కారాన్ని ఎన్నిరకాలుగా ఆలోచించినా అన్ని రకాల కారణాలు కన్పడుతూ మరింత సంక్లిష్టంలో పడవేస్తున్నాయి.మూల కారణాన్ని కనుగొనేందుకు నేనుచేస్తున్న ప్రయత్నానికి మీ సహ్హయం కూడాలభిస్తుందేమోనన్న ఆశతో మీముందుకూడావుంచుతున్నాను.

**************************************************************************************
ఒకటి

ఇది నా భార్యతరపున చుట్టాలైన ఒక అబ్బాయి కథ. వానికి రెండుసంవత్స్రాలక్రితం ఒక సంబంధం కుదిరినది. వినుకొండలోనే ఒక సంబంధం. అమ్మాయి నర్స్ గా ఉద్యోగం చేస్తున్నది .ఇదే జిల్లాలో. వాళ్ళు కన్వర్టేడ్ క్రిష్టియన్స్ . సంబంధం మాట్లాడుకున్నాక ముహూర్తాలు పెట్టు కునేటప్పుడు నన్ను రమ్మని పిలచారు. వెళ్ళాను అమ్మయి వాళ్ల ఇంటికి వాళ్ళు కూడా తమ ఇంటి లో వెంకటేస్వర స్వామివారి కాలెండర్లు ,ఫోటోలు తెచ్చి తగిలించారు. మగపెళ్ళివారి ఆచారాలను గౌరవించాలనో లేక మరేమోగాని వాళ్ళ ప్రయత్నాలు వాల్లు చేసుకున్నారు. ఇక నాకెందుకో వీనికి ఈ అమ్మాయి తో ఎక్కువనాల్లు పొసగదు అనిపించింది. ఎందుకంటే వీనికి బుద్ది నిలకడ తక్కువ .కొంగరి చేస్టాలు,మాట్లాడే టప్పుడు నాటకీయఫక్కీలో మాట్లాడటం ఇవి వాని లక్షణాలు. ఏదో కంప్యూటర్ వర్క్ చేస్తూ గుంటూరు లోనే సంపాదిస్తున్నాడు.కానీ వీని నిలకడ లేనితనం ను సరిదిద్దుకుని సంసారం సాగించాలంటే దాన్ని నిలుపుకోవాలంటే ఆడపిల్ల చాలా సమర్ధురాలై ఉండాలి. కాడి గట్టినప్పుడు ఒక ఎద్దు దుడుకుగా లాగినా రెండవది తన సామర్ధ్యం తో నడవగలిగితే మొదటిది తప్పనిసరయి సరిగా నడకకొస్తుంది. ఇదే సంసారజీవితాన్ని లాగే భార్యా భర్తలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు వేరే చెడు అలవాట్లు లేవుగాని వీని ద్ ఆలోచనావిధానము వీని సంసార జీవితాన్ని సవ్యంగా సాగనివ్వదు. అది ఆ అమ్మాయి సర్దుకుని పోయే మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇదే అబ్బాయి వాళ్ళమ్మ అడిగితే చెప్పాను.

పెళ్లయింది .గుంటూరు లొనే కాపురం పెట్టారు, ఒకమ్మాయి పుట్టినది. నేననుకున్న విధముగానే మొదలయినది ఇద్దరి మధ్య గొడవ. నువ్వెంత అంటే నువ్వెంత .నువ్వుసంపాదిస్తే నెను సంపాదించటం లేదా? నీమీద ఆధారపడటం లేదు నేను. ఇలా సాగుతున్నాయి వీళ్ల గొడవలు.దూరమయ్యారు.మధ్యవర్తులు వెళ్ళి వచ్చి వీళ్ళిద్దరిలో ఎవరూ సర్దుకునేవారు లేరు అని తేల్చారు. చివరకు అమితుమీ తేల్చుకోవాలని మొదలు పెట్టారుప్రయత్నాలు .అబ్బాయి వాళ్లమ్మ నన్ను ఒక్కసారి మాట్లాడమని బతి మాలితే అబ్బాయితో మాట్లాడి చూసినప్పుడు వాని లోపాలు అమ్మాయి లోపాలు కనపడ్డాయి.ఇంతకంటే అమ్మాయి తరపున పెద్దవాళ్ల లోపం ఏమిటో అర్ధమయినది. కనీసం పిల్లలకు సమస్యలను ఎదుర్కోవటములో ఆడపిల్లలకివ్వవలసిన శిక్షణ ఇవ్వలేదు. భార్యా భర్తల మధ్య ఉండవలసిన సంబంధాలను బోధించటమ్ లోపించింది వీళ్ల పెంపకంలో. ఇక అబ్బాయి చెడు అలవాట్లు లేకున్నా ,సరయిన శిక్షణ లేదు. నాకు వెంటనే విడాకులిప్పించు వాళ్లతో మాట్లాడి అని అడిగాడు. కలపాలని ప్రయత్నించటం తప్ప విడాకులిప్పించే పాపం నావల్ల కాదని చెప్పి వచ్చేశాను.

ఆతరువాత వాళ్ళు విడాకులు తీసుకున్నారు. ఏమైంది విడాకులిస్తే వీడుకాకుంటే ఇంకొకడు అని అమ్మాయి తరపు వాళ్ళు.ఇదికాకుంటే మరొకటి అని అబ్బాయి వాళ్ళు అనుకున్నారు.

*******************************************************************************************

రెండవ కథ...

నేను పనిచేసే పాఠశాలలో jayakumar అనే ఉపాధ్యాయుడు చేరాడు. అతని మామగారయ్యె చుట్టం డీయివో కార్యాలయం లో పెద్దవుద్యోగి.అతని కూతురు కూడా మామండలములోనే ఉద్యోగమ్ లొ చేరింది. ఇద్దరికి నాలుగు నెలలో పెళ్ళి చేశారు. వినుకొండలో కాపురం .నన్ను బావా అనిపిలుస్తాడు. వాళ్ళుక్రిష్టియన్లు. హిందూ ధర్మాన్ని ఇతిహాసాలను విమర్శిస్తాడు నాతోనే. ఇవి భగవంతునికి మాత్రమే సంబంధించిన విషయాలు కావు. మానవజాతి ప్రవర్తనను శాసించి,నియమాను సారంగానడిపించే ధర్మ సూత్రాలు అని నేను చెప్పటం మామూలయింది. వ్యక్తిగతంగా మనుషులను నేను ఎప్పుడూ ద్వేషించను.కారణం నాకు నాధర్మం నేర్పిన విశ్వాసం "ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యమెప్పుడూ మరుగుకాదు అనేది." కనుక అన్ని మతాలవారూ నాతో స్నేహానికి ఏ అడ్దంకులూ లేకున్నారు.

ఇక ఇతనికి తన భార్య పట్ల ప్రేమ చాలా ఎక్కువ.పేదరికం లోంచి వచ్చినవాడు.ఇక అమ్మాయి నాన్న ఉద్యోగస్తుడు కనుక ఆ అమ్మాయికి కాస్త గర్వం వున్నట్లు కనపడేది. మాతో మాత్రం గౌరవంగానే మాట్లాడేది.
ఇద్దరమ్మాయిలు పుట్టారు.మాయింటి కొచ్చినప్పుడల్లా మా అక్క ఇంతగా చేస్తుంటే నువ్వు కులుకుతున్నావు,అందరూ అలావుండరు.మాఇల్లలో చూడు నువ్వు సంపాదిస్తే,నేనుసంపాదించటం లేదా అన్న ధోరణిలో వుంటాయి వ్యవహారలు అని అంటూ వుంటాడు. ఇతను బయట సాయంత్రం కాలేజీలలో కూడా పనిచేసి కష్టపడిసంపాదిస్తాడు. కొద్ది కొద్దిగా వీళ్ల మధ్య ఆధిపత్యధోరణులతో రాధ్ధాంతాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. వీళ్ల మామ గారు వచ్చినప్పుడల్లా ఇతనిని గదమటము,ఇతనేమొ వాళ్లమామంటే భయంతొ అణగిమణగి ఉండటము ఎలాగో గడచిపోయేది. ఇక ఇతని తల్లిదండ్రులు కూడా ఇతని దగ్గరుండాలని వస్తే పెద్దగొడవ. వాళ్లకు నేను సేవలు చేయాల్సిన అవసరం లేదని ఆమె వాదన. కానీ వాళ్లమ్మగారు పాపం సర్దుకుని తానే అన్ని పనులు చేస్తున్నా వీళ్ళు వుంటే నాకు కుదరదని బెదిరింపులు. పాపమా తల్లిదండ్రులు మానుంచి నీసంసారం లో చిచ్చులెందుకులేయ్యా! అని వాళ్ల సొంతవూరు పొన్నూరు వెళ్ళి పోయారు. మాకప్పుడప్పుడూ ఇంట్లో తన బాధలు చెబుతూవుండేవాడు.దగ్గరకనుక ప్రతిసారీ ఈఅమ్మాయి నరసరావుపేట తన పుట్టింటి కెళ్ళటం .ఈకుర్రాడు పోగానే వాళ్ల అమ్మానానలు పలు మాటలు అనటం,ఇలాజరిగిపోతున్నది.

ట్రాన్స్ఫర్ లొచ్చాయి.అందరం కౌన్సిలింగుకు వెళ్ళాము. ఇక్కడ వుంటే మీ వాళ్ల జోక్యంతో నాకు కుదరదు. మనం పొన్నూరు ప్రాంతానికి కోరుకుందామని ఇతను.వీల్లేదు నరసరావు పేటలోనైతే అన్నిటికి మా నాన్నవాళ్ళు తోడుగావుంటారు.కాబట్టి నరసరావు పేట కోరుకుందాము మావాళ్ల ఇల్లు కూడా వుంది అద్దెకూడా అవసరం లేదని ఆ అమ్మాయి,వాదన.
అక్కడకైతే నేనురాను అని ఇతను నువ్వొచ్చినా రాకున్న నేను నరసరావుపేటకే వెళతానని ఆమె ఇద్దరూ ఎడమొఖమ్ పెడమొఖమ్ గా గుంటూరు కౌన్సిలింగ్ కువచ్చారు. అతను నాదగ్గరకొచ్చి ఇక సహించటం నావల్ల కాదు,నరసరావు పేట లో వాళ్ళింటికి వెళితే నాబతుకు కుక్క బ్రతుకే. నేను తెగతెంపులు చేసుకోవటానికైనా సిద్దమే. ఇలా మా వద్దకు వచ్చి బాధపడ్డాడు. ఇక తప్పక నేను వాల్లకు కొద్దిగా సన్నిహితంగా వుండే మరి ముగ్గురు టీచర్లను పిలచి అక్కడే అందరం కూర్చుని వాళ్లకు సర్ది చెప్పటం మొదలెట్టాము. భార్యా భర్తల మధ్య మరొకరు తలదూర్చవలసిన అవసరం రావటం ఎంత బాధాకరమో ,చెప్పి,కొన్ని మానసంబంధాలు,వాటిపట్ల మన బాధ్యతలు,ఇంతకంటె ముఖ్యంగా మీఇద్దరూ విడిపోతే పిల్లల భవిష్యత్తు ఎలావుంటుందో వాళ్లకు వివరించాను. మీ ఇద్దరి పట్టుదలలకు పిల్లలను బలి చేసే హక్కు మీకెక్కడిదని? అలాంటివాళ్ళు పిల్లలను ఎందుకు కన్నారని? వాళ్ళను కొద్దిగా మందలించి మొత్తానికి ఒక రాజీకి ఒప్పించాము.నన్ను నరసరావుపేటలో వుండేట్లు చేస్తే నాచావు చూస్తావు బావా,నువ్వు అని అతను బాధ పడ్దాడు.ఏమికాదులేవయ్యా సంసారం లోఇవన్నీ సహజమే అని సర్దిచెప్పి సాతులూరు మండలము కోరుకునేటట్లు, నరసరావు పేటలో వేరే చోట ఇళ్ళుతీసుకుని వుండేటట్లు ఒప్పించాను.మూడు సంవత్స్రరాలు కావస్తున్నది. ఈమధ్య నేను పెద్దగా వాళ్ళవిషయం పట్టించుకోలేదు.. నాలుగు నెలల బట్టి అతను ఫోన్ చేస్తున్నాడు. నువ్వు చేసిన పనికి నాకు నిత్యం నరకమయినది.ఆరోజే నేను మావూరు వెళ్ళి పోయివుంటే హాయిగావుండేది. నా పరిస్థితి ఎలావున్నదో నీకుతెలియదు.
మామామ వీడుకాకపోతే ,ఇంకొకన్ని చేస్తాను అంతేకాని వీడుచెప్పినట్లు నువ్వు వినేదేమిటని మా ఆవిడను తన ఇంటిలోనే వుంచాడు .తనకున్న అంగబలంతో నన్ను బెదిరించి కొన్నస్థలాలు అన్నీ ఆ అమ్మాయి పేర వ్రాపించాడు. నన్ను తన ఇంట్లో పడివుండమంటున్నారు.మా అమ్మానాన్న ఊసెత్తవద్దంటూన్నారు,అని దు:ఖపడుతున్నాడు.నువ్వొచ్చి చెప్పమంటున్నాడు.ఏమిచేయాలి.? భార్యా భర్తల మధ్య వుండాల్సినది సమానత్వాలు,సమానబాధ్యతలూనా?ప్రేమాభిమానాలా?అసలు ఇంత కు లోపము ఎక్కడున్నది. స్త్రీధర్మాలను మనసంస్కృతిని బోధించకుండా పెంచిన తల్లిదండ్రుల లోపము లేదా ఇక్కడ.నిన్ననే ఫోన్ చేశాడు మరలా.నేను పొన్నూరు చేరాను.అక్కడ వుండటం నావల్లకాదు. విడాకులకు వాళ్ళు సిద్దమయ్యరు తప్ప నావెంటరావటానికి ఒప్పుకోలేదు మా ఆవిడ.విడాకులు తీసుకుంటాను,అంటున్నాడు. ఆరోజు అంత చెప్పిన పెద్దమనిషివి ,ఈరోజు వెళ్ళి వాల్లను గదిమావా?అని అడుగుతున్నాడు. వెళ్ళి ఏదన్నా మాట్లాడదామన్నా, ఆ అమ్మాయి వింటూన్నదన్న నమ్మకము లేదు. పాపం ఆపిల్లల పరిస్థితేమిటని బాధ కలుగుతున్నది.నేనేమి చేయాలి.భగవాదరాధన రూపములో ఏదన్నా సహాయం చేద్దామంటే ,నన్ను మతమార్పిడికి ప్రయత్నించే నీచుల జాబితాలో లెక్కవేస్తారేమోనని భయం.
*******************************************************************************************
ఇక మూడవ కథ

ఈమధ్య నా దగ్గరకొక వ్యక్తి వస్తున్నాడు. విలేఖరి గాపనిచేస్తున్నాడు దినపత్రికలో .మంచివాడు. ఇతను తన బాధను చెప్పుకొస్తున్నాడు. తన భార్యకు ఉపాధ్యాయురాలిగా జాబ్ వచ్చినది. తెలాంగాణ ప్రాంతం లో నుండి కశ్టపడి వినుకొండకు తీసుకొచ్చాడు.ఆ అమ్మాయి వాళ్ళు కన్వర్టెడ్ క్రిష్టియన్స్ ,వాళ్ల ఆచారాలు వ్యవహారాలు వేరయినా ఇతను సర్దుకుని పోతుండేవాడు. ఇక అమ్మాయి వాళ్ల అమ్మగారికి నాన్నగారికి ఇద్దరూ ఆడపిల్లలవటముతో ఈఅమ్మాయి ఉద్యోగస్తురాలు కూడా అవటముతో.అమ్మాయి తమతోనే వుండాలని అమ్మాయిని తమతోనే వుంచారు. ఇతనికి జాతకప్రభావమో,ఏమోగాని అతను చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యి ఏపనిలోనూస్థిరపడ లేక పోయాడు. మానసికంగా కొద్దిగా డిసప్పాయంట్ అయ్యాడు.కొద్దిగా కలతలు.అమ్మాయి ఉద్యోగం తో నే వాల్ల అమ్మనాన్నల కుటుంబము కూడా గడపాలి. ఇద్దరికీ తగాదాలు .విడిపోయారు ఇద్దరు పిల్లలు తల్లి దగ్గరె వున్నారు. ఇతన్ని ఇంటికి రానీయరు. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాయి ఇంకా గొడవలెందుకు అని ఇతను సర్దుకుని కలవాలనుకుంటున్నా విడాకులిస్తాగాని నిన్ను రానివ్వనని ఆమే పట్టుదల. ఈమధ్య ఇతను నన్ను మాష్టర్ గారూ నాకుటుంబాన్ని నిలబెట్టమని ,మీచేతులతో ఎందరికో సహాయం చేస్తున్నారు, నావిషయం చూడమని బాధ పడుతున్నాడు. ఆమెగురించి కొందరు వుపాధ్యాయమిత్రులను,యూనియన్ నాయకులను విచారించాను ,వాళ్ళంతా ఆమె పెద్దగా తెలివిగలిది కాదండీ , అని తన గురించి వివరాలు చెప్పారు. ఆవిషయం అర్ధమవుతూనేవుంది ,లేకుంటే అమ్మనానలను తన బంధువులను పోషిస్తూ రేపు తన బిడ్దల భవిష్యత్తు ,తన భర్త గురించి ఆలోచించని ఆమె తెలివి తేటలు ఏపాటివో.ఒకసారి పూజచేపిద్దామని రమ్మని అడిగి చూడమన్నాను.పాపం అతను అడిగితే ఆ అమ్మాయి తిక్కలగా మాట్లాడుతున్నదే కాని తన కాపురం సరి చేసుకుందామని ప్రయత్నించేలా లేదు. తనకు భర్తను ,కాపురాన్ని సరిచేసుకోవాలనే భావన లేదు. మన సంస్కృతీ సాంప్రదాయాలను ఆమెకు అందించకుండా పెంచిన తల్లిదండ్రుల పెంపకం ఇలా వున్నది. విడాకులు,,,,విడాకులు ఏమిటీ సంస్కృతి .తీసుకుని ఏమి బావుకుంటారు.? సహనము ప్రేమతో కాపురాలను సరి చేసుకునే స్త్రీలను .ఆ మనస్తత్వం నుండి వేరు చేస్తున్నదెవరు? మగవాళ్లంతా మంచివాళ్లని ఆడవారి మీద తప్పులు మోపటము లేదు నేను. కాని భూదేవంత సహనంతో దారి తప్పిన భర్తలను కూడా పరివర్తనతో దారికి తెచ్చుకోగలైగిన ఈదేశ స్త్రీ మూర్తులు కూడా ఇలా ఎందుకవుతున్నారు? పుట్టిన బిడ్దల కు తగిలే మనోఘాతాలు భవిష్యత్తు లో వాళ్లనేమి చేస్తాయి> ఆలోచిస్తున్నారా? నాకు అయోమయం గావున్నది.ఏమి చేయాలో వాళ్లకు ఎలా చేతనయినంత సహాయం చేసి కాపురాలు ఎలా నిలబెట్తాలో తెలియక. మీలో ఈవిషయాల లో నిష్ణాతులైన మేధావులు వున్నారు.
ఈ సమస్యకు బలైన వాళ్ళు వుండవచ్చు. కొద్ది సేపు సమాన హక్కులు , చట్తాలు జోలికి వెళ్లకుండా ఈపరిణామాలకు అసలు కారణాలు విష్లేషించండి. మీ కుతోచిన పరిష్కారాలు చెప్పండి ,విడదీసే పాపం కాకుండా.ఇవన్నీ స్నేహితులుగా లోకం యొక్క భావాలు ఎలా వున్నాయో వారి ప్రవర్తన పట్ల వాళ్లకు చూపుతా.అదృష్టం బాగుండి ఈప్రయత్నం వల్లనైనా ఒకకుటుంబం విచ్చిన్నం కాకుండా కాపాడగలిగినా ధన్యులమే.[ వ్యక్తుల పేర్లు మార్చాను ]

Read more...

మావూరి దేవుడు ...కొండాగురునాథుడు.

>> Sunday, January 4, 2009


మావూరిలో నున్న ప్రసిద్ద కొండగురునాథ క్షేత్రాన్ని మీకు పరిచయం చేయ బోతున్నాను. మావూరి సమీపములో తాబేలు ఆకారం లో కూర్మగిరి అనే కొండవున్నది. ఆ కొండపైన వెలసిన దేవుని కొండ గురునాథుడు అంటారు. ఆయన దత్తత్రేయునిగా దక్షిణామూర్తిగా కొలవ బడుతున్నాడు.ఎమ్తో ప్రశాంతమైన వాతావరణములో నెలకొన్న ఆక్షేత్రాన్ని చేరుకోగానే ఎవరికైనా మనసు ఈ ప్రపంచ బంధాలనుండి విడివడి ఆధ్యాత్మిక లోకాలలోకి పయనిస్తుంది. అది గురుస్థానమవటమువలన ఇక్కడకు వచ్చిన వారికి ఏ ప్రయత్నం లేకుండానే మనసు ప్రశాంతస్థితి కొస్తుందని గొప్పసాధకులు చెపుతుంటారు. విశేషమేమిటంటే ఇక్కడ మూలవిరాట్ స్థానంలో మూడు వేపమొద్దులు స్థాపించబడి వున్నాయి.

పూర్వం వృక్షాన్ని ఆశ్రయించి తపోదీక్షలో స్వామివారున్నారని తెలియని మేకపాడు గ్రామానికి చెందిన కరణం గారు ఈ వేపచెట్టు పెద్దదిగా వున్నదని తమ కొట్టం నిర్మించటానికి వాసాలు కలపగా సరి పోతుందని భావించి మనుషుల చేత కొట్టించారట. కొట్టె టప్పుడు వృక్షాన్నుంచి పాలు, రక్తం కారినా అవి పెద్దగా పట్టించుకోక కలపను తెచ్చి కొష్టం నిర్మాణం గావించి కప్పు వేసి కూలీలు క్రిందకు దిగగానే ఒక్కసారిగా గప్పున మంటలెగసి మొత్తం కాలి బూడిదైనదట. హాహాకారాలు చేస్తూ వున్న జనం లో ఒకనికి దైవావేశము వచ్చి స్వామి వారు అందులో వున్నవిషయాన్ని గమనించక దోషము చేశారని చెప్పారట. ఆ గ్రామ ప్రజలు కాళ్ళమీదపడి క్షమాపణ వేడుకొనగా దోషపరిహారార్ధం అక్కడమిగిలిన బూడిదలో మూడు మొద్దులు కాలకుండా మిగిలాయని వాటిని తీసుకు వెళ్ళీ చెట్టు కొట్టిన కొండ మీదనే ప్రతిష్టించమని ఆనతినిచ్చారట. వాళ్ళు ఆవిధంగానే ప్రతిష్ట జరిపారట. వేల సంవత్సరాలుగా ఆదారుశిలలు అలా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూనే పూజలందుకుంటున్నాయి. ఈమధ్యకాలం లో మంటపనిర్మాణం చేపట్టినప్పుడు కూడా స్వామి వారి ఆదేశమువలన మూర్తుల తలపై భాగములో ఖాళీ వదలి స్లాబ్ వేయవలసి వచ్చినది.

ఇది చాలా సిద్దక్షేత్రమవటము వలన చాలామంది సాధకులు వచ్చి తమ సాధనలను చేసుకుని వెళుతుంటారు. ఇక్కడ పూజారులుగా కుమ్మర్లు బాధ్యతనిర్వహిస్తుంటారు. మాఘమాసం పౌర్ణమి రోజున తిరుణాళ్ళ వుత్సవం జరుగుతుంది. ఈప్రాంతం లో కోటప్పకొండ తరువాత అంత పెద్ద తిరుణాళ్ల ఇదే. ఆరోజు వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. మనరాష్టంనుంచేకాక కర్ణాటక ప్రాంతమునుండి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. ఈస్వామి పేరు పెట్టుకున్న వారు చాలాచోట్ల గురునాథ,గుర్నాథం, గుర్నాధరావులాంటి పేర్లతో కనపడతారు. ఈ సంవత్స్రరం ఫిబ్రవరి 9 న తిరుణాల్ల జరుగుతుంది. కనుక స్వామి వారిని దర్శించటానికి రావచ్చు. వచ్చే భక్తులు మనపీఠంవద్ద విడిది చేయవచ్చు. పౌర్ణమి రోజున ధ్యానాదులు చేసుకునేవారికి విశిష్ఠమయిన స్థలం.వినుకొండవచ్చి బస్సులో ఇక్కడకు చేరుకోవచ్చు.

Read more...

రాధా మాధవలీల

>> Saturday, January 3, 2009


బృందావనంలో శ్రీకిశోరీవనంలో శ్రీగోవిందదాస్ అనేభక్తుడుండేవాడు. ఆయన గొప్ప విరాగి. ఎవరిని ఏదియు కోరడు. తుదకు మధుకరమును కూడా చేసెడివారు కారు.ఏరూపములో కూడా యాచనకూడదని ఆయన నియమము.ఆయనకుండిన యావదాస్తి ,దుమ్ముతోకూడిన రెండుగ్రంధములు.అవిసదా తనదగ్గరేవుండేవి.అవి.

1.శుకసాంప్రదాయాచార్యులైన శ్రీశ్యామాచరణ్ వ్రాసిన భక్తిసాగర్.
2.శుకసాంప్రదాయకులైన శ్రీరామసఖి రచించిన భక్తి మంజరి.

ఆయన నిత్యము శుధ్ధసహచరి భావంతో యుగళ రూపమును ఉపాసించువాడు.భక్తిరసమంజరిలోని కథలను సదాచింతన చేయుచుండెను. సంసారజీవితము పట్ల విముఖుడై సదాధ్యానమందే యుండెడివాడు. సాధు సేవయనిన ఈయన కెంతో ప్రీతి.ఈయన సాధుసేవకు ముగ్దుడైన శ్రీసరస మాధురీ యను మహాత్ముడు ఈయనను,"సాధుసేవా ధర్మమనెడిఓడ"అనిపేర్కొనుచుండెడివాడు.కానీ సదా ఒక్క విషయమే ఆయనను బాధించుచుండెడిది. యుగళకిషోరీ రూపము ఒక్కసారి స్వప్నములోనైనా దర్శనమిచ్చుటలేదు.నాయపరాధమేమిటి? అమ్మా!కిశోరీ ! నాయపరాధమేమి?నీవైనా నాకు చెప్పరాదా? తల్లీ నన్ను మన్నించి నాకు దర్శనమివ్వరా అని కన్నీరు పెట్టుకొనుచు ప్రార్ధించుండెడివాడు.ఒకరోజు ఈయనవద్దకు వచ్చిన ఒక మహాత్ముని తన వేదనకు కారణమడిగాడు. ఆయన కొంచెఆలోచించి నాయనా! ఎల్లప్పుడు "హేరాధే’యని స్మరించు నీవుఒకసారి వైష్ణవ అపరాధం చేశావు.అది నాతల్లి రాధకు ఇష్టం లేదు.అని చెప్పెను. దానికి అయ్యా నెనెప్పుడూ ఎవరిని నిందించలేదు.నాస్థానమును విడిచి ఎక్కడికి వెళ్ల్లలేదు. నేను యాచనకు కూడా వెళ్లను .నాయీ ప్రవర్తనలో దోషమేమన్నా వున్నదా? అని ప్రశ్నించెను. అప్పుడా మహాత్ముడు గోవిందదాస్ నుచూసి ,కొలది దినములక్రితం కొలద్సి దినములక్రితం ఒకమహాత్ముడు నిన్ను భోజనమునకై తనయాశ్రమమునకున్ పిలచెను.ఆదినము తనగురువుయొక్క స్మారకదినమనిచెప్పినా కొమ్త కఠోరభాషతో తిరస్కరించితివి.ఏ మహాత్మునితో కూడా కఠోరభాషలో మాట్లాడకూడదు. ప్రతి మహాత్ముని హృదయంలోనూ రాధాదేవి నివాసముంటుంది .స్వల్పముగానైనా కఠినత్వమును ఆమె సహించదు.
ఆమహాత్ముని ఆశ్రమునకు వెళ్ళి ఒక్క మెతుకైనా భుజించిన బాగుండెడిది. ఇదియే నీయందలి దోషము.జీవులహృదయాంతర్వర్తియగు దయా స్వరూప రాసియే శ్రీరాధ. ఆమె హృదయము నవనీతము కంటె కూడా కోమలము.ఆతల్లి వాక్కుమధురము,ఆనడక లావణ్యసహితము.ఆమె నేత్రములనుండి అనురాగ కిరణములు సదావర్షించుచుండును.

నీవు వెంటనే ఆ మహాత్ముని కలుసుకుని క్షమాపన కోరుకుని ఆయన ఆశ్రమములో భోజనము స్వీకరించు. అని చెప్పెను.గోవిందదాస్ అట్లే చేసెను.
కొన్నిదినముల తరువాత ఆయన యుగళ కిశోర్ లకు ’భోగ్"తయారు చేయుచుండగా ఒక చిన్నపిల్లవాడు ,ఒక అమ్మాయి వంటయింటి లోకి ప్రవేశించి భోగ్ నందలి రెండు రొట్టెలను ఎత్తుకొని పోవుచుండగా శ్రీగోవిందదాస్ వారి వెంటపడి " అరే పిల్లలూ !ఇంకా భోగ్ కాలేదు. మీరు తీసుకునివెల్లకూడదు.అనివారిస్తూ పరిగెత్తుతున్నాడు.ఆపిల్లలు కిశోరీవనమునందలి యుగళకిషోర్ మందిరమునకు పోవుచుండగా వారిని అనుసరించాడు.అచ్చట మూర్తుల చేతులలో రెండు రొట్టెలు ఉండెను.అదిగాంచిన గోవిందదాస్ మూర్ఛిల్లెను. యుగళకిశోరులే స్వయముగా వచ్చు తమభోగ్ తామే తీసుకుని వెళ్ళిరని తెలుసుకుని ధన్యుడాయెను.గోవింద దాస్ యుగళ కిశోరులనే చింతించుచు తరువాత కొంతకాలమునకు నిత్యలీలలో చేరిపోయెను.

Read more...

ఏకాదశి నాడు ఏమిచేయాలి

>> Friday, January 2, 2009


శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైన ధనుర్మాసం..ఇప్పుడు జరుగుతున్నది . ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి[ముక్కోటి ఏకాదశి ] రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, గోవింద నామస్మరణ చేయడం శుభప్రదం.

"ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద! త్యజనిద్రాం జగత్పతే,
త్వయిసుప్తే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్"

అనే ప్రబోధన మంత్రంతో ప్రార్థన చేసి, శ్రీ మహావిష్ణువును అర్చించి, ఉపవాసముంటే సకల సంపదలు చేరువవుతాయని పురాణాలు చెబుతున్నాయి. లేదా ఏకాదశి రోజున మహాభాగవతంలోని "అంబరీషోపాఖ్యానం" చదివినా, విన్నా మేలు కలుగుతుంది.

Read more...

ఆస్తమా రోగులకు ఈమందు బాగా పనిచేస్తున్నదట ........

ఆస్తమా రోగులకు కాస్తంత ఊరట కలిగించే వార్తే ఇది. అదేంటంటే... ఫంగల్ ఇన్‌ఫెక్షన్ నివారణ మందుతో ఆస్తమా వ్యాధికి కూడా ఉపశమనం లభిస్తుందని మాంచెస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా "సివియర్ ఆస్తమా విత్ ఫంగల్ సెన్సిటైజేషన్ (సాఫ్స్)"తో బాధపడేవారికి ఈ యాంటీ ఫంగల్ మందు బాగా పనిచేస్తున్నాయని వారంటున్నారు.

ఈ విషయమై మాంచెస్టర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డేవిడ్ డెన్నింగ్ మాట్లాడుతూ... అసలు చాలామందికి ఫంగల్ ఎలర్జీల వల్లనే ఆస్తమా వస్తుందని, అందుకే ఈ మందులు బాగా పని చేస్తున్నాయని చెప్పారు. తమ పరిశోధనల్లో భాగంగా ఏడు రకాల ఫంగల్ ఎలర్జీలకు గురై ఆస్తమా వ్యాధిగ్రస్తులైన 58 మందిని ఎంపిక చేసి, రోజుకు రెండుసార్లు ఇట్రాకానజోల్-200 ఎంజీ మాత్రలను ఇచ్చామని ఆయన వివరించారు.

దీంతో 62 శాతం మంది రోగుల్లో ఆస్తమా బాగా తగ్గిపోవడమే గాకుండా... ఆస్తమా వల్ల వచ్చే జలుబు, ఉదయంపూట సంభవించే శ్వాసకోస సమస్యలు కూడా ఆగిపోయాయని డేవిడ్ వెల్లడించారు. ఇకపోతే, పై రోగుల్లో 11 మంది మాత్రం యాంటీ ఫంగల్ మందుల వల్ల ప్రతికూల ప్రభావం కనిపిస్తోందంటూ మధ్యలోనే వాటిని తీసుకోవడం మానేశారని ఆయన తెలిపారు.

అయితే నాలుగు నెలలు గడిచేసరికి వీరికి మళ్లీ ఆస్తమా మొదలైందని డేవిడ్ చెప్పారు. కాగా, ఇట్రాకానజోల్ మందు అన్ని సందర్భాల్లోనూ, అందరికీ ఉపయోగపడక పోవచ్చుగానీ, కొంతమందికి మాత్రం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు.

కాబట్టి, ఆస్తమాతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్న వ్యాధిగ్రస్తులు ఇట్రాకానజోల్ మందును ఓసారి ప్రయత్నించి చూడగలరు. అయితే ముందుగా వైద్యుల పర్యేవేక్షణలో కొన్ని రోజులపాటు దీనిని వాడి.. తగ్గుముఖం పడుతున్నట్లయితే కొనసాగించటం, లేదంటే ఆ మందుకు స్వస్తి చెప్పటం మాత్రం మరచిపోవద్దు.[వెబ్ దునియా నుండి ]

Read more...

ఇప్పుడు గరుడప్రదక్షినాలు

>> Thursday, January 1, 2009

కలియుగంలో వింతలు చోటుచేసుకుంటాయన్న ఆర్యుల మాటలు రోజురోజుకు నిజమౌతున్నాయి. ఇటీవలే ఓ భక్త వరహం సిద్ధాంతం గ్రామంలోని వెంకన్న ఆలయాన్ని రెండు రోజుల పాటు ప్రదక్షిణలు చేసి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ గరుడుడు మరో వింతకు కారణమయ్యాడు.

అసలు విషయమేమిటంటే...? భక్తవరాహం లాగానే విష్ణుమూర్తి వాహనమైన గరుడుడు... హైదరాబాద్ నగరం కందికల్‌గేట్‌లోని చిత్రగుప్త స్వామి దేవాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంపై ప్రదక్షిణలు చేస్తున్నాడట. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ఓ గరుడపక్షి అయ్యప్ప ఆలయంపై ప్రదక్షిణలు చేపట్టింది.

ఈ విషయం తెలుసుకున్న ప్రజలు భారీ ఎత్తున అయ్యప్ప స్వామి దేవాలయానికి విచ్చేశారు. ప్రదక్షిణలు చేసి చేసి అయ్యప్ప స్వామి ముందు వాలిన గరుడకు ప్రజలు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. అనంతరం గరుడపక్షిని ఆకాశంలోకి వదిలినా అది మళ్లీ అయ్యప్ప స్వామి ఆలయం చుట్టే ప్రదక్షిణలు చేస్తోందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.

Read more...

ఇప్పుడు గరుడుని ప్రదక్షణలు మొదలయ్యాయి

కలియుగంలో వింతలు చోటుచేసుకుంటాయన్న ఆర్యుల మాటలు రోజురోజుకు నిజమౌతున్నాయి. ఇటీవలే ఓ భక్త వరహం సిద్ధాంతం గ్రామంలోని వెంకన్న ఆలయాన్ని రెండు రోజుల పాటు ప్రదక్షిణలు చేసి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ గరుడుడు మరో వింతకు కారణమయ్యాడు.

అసలు విషయమేమిటంటే...? భక్తవరాహం లాగానే విష్ణుమూర్తి వాహనమైన గరుడుడు... హైదరాబాద్ నగరం కందికల్‌గేట్‌లోని చిత్రగుప్త స్వామి దేవాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంపై ప్రదక్షిణలు చేస్తున్నాడట. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ఓ గరుడపక్షి అయ్యప్ప ఆలయంపై ప్రదక్షిణలు చేపట్టింది.

ఈ విషయం తెలుసుకున్న ప్రజలు భారీ ఎత్తున అయ్యప్ప స్వామి దేవాలయానికి విచ్చేశారు. ప్రదక్షిణలు చేసి చేసి అయ్యప్ప స్వామి ముందు వాలిన గరుడకు ప్రజలు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. అనంతరం గరుడపక్షిని ఆకాశంలోకి వదిలినా అది మళ్లీ అయ్యప్ప స్వామి ఆలయం చుట్టే ప్రదక్షిణలు చేస్తోందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.

Read more...

వరాహం ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నట్లు? దానికి పూజలు చేయటం ఎంతవరకు సబబు?

ఈమధ్య కాలములో ఒక విచిత్రాన్ని మనమందరం చూస్తున్నాము.ఒక వరాహం ఆలయ ధ్వజస్థంభం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న విషయం అందరికి తెలిసినదే.కలియుగాన మానవులకు దైవ లీలలను గుర్తుచేసే ఇటువంటి సన్ని వేశాలు అప్పుడప్పుడు ఇలా హెచ్చరిస్తూనే ఉంటుంటాయి. సరే నాస్తికులను వదలి వేసినా ఆస్తికుల గుర్తిస్తున్నారు భగవంతుడున్నాడని. ఐతే శాస్త్రీయ విజ్ఞానాన్ని పక్కనబెట్టి ఆ వరాహాన్ని పూజిస్తున్న విషయమే నాకు మింగుడు పడని అంశముగా నున్నది. అసలు ఆజీవి ఆవిధముగా ఎందుకు ప్రవర్తిస్తున్నదో కొద్దిగా మన మహర్షులిచ్చిన శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆలోచిద్దాము.

అనేక జన్మలలో చేసిన పుణ్యఫలితముగా మానవ జన్మ కలుగుతుందని చెబుతాయి శాస్త్రాలు. ఇంత పవిత్రమయిన మానవజన్మనెత్తనా, సవ్యమయిన జీవిన విధానము గడపలేక పోయిన మానవుడు చేసిన దుష్కర్మల ప్రభావాన్ననుసరించి బాధాకరమయిన జీవితాన్నిగడిపేవారు మరలా మానవజన్మ లేక,రకరకాలైన జంతుజన్మలను ఎత్తవలసి వస్తున్నది. ఈ జీవితచక్రపరిభ్రమణములో విలవిల లాడుతున్నా అసలు సంగతి తెలీయనంత మాయ మనలనుకమ్మి మరికొంత చెడుఫలితాలకు లోనయి మరింకా నీచపు జన్మలను ఎత్తవలసి వస్తున్నది. ఐతే ఏ పుణ్యరాసి ఫలితమో ,లేక ఏమహాత్ముని అనుగ్రహమో ,లేక దైవ సంకల్పమో కాస్త ప్రసరించినప్పుడు,ప్రతి జీవికి పూర్వ జన్మజ్ఞానం కలుగుతుంది. [ఇది వున్నదా లేదా అని ప్రశ్నలు వద్దు ఎందు కంటే ,మనకు పుట్టినప్పటి నుంచి జరిగిన అన్ని విషయాలు గుర్తుండవు, కానీ ఒక్కొక్క సారి ఎవరన్నా గుర్తు చేస్తే మరచి పోయినవి కూడా గుర్తుకువస్తాయి. ఇదీ అలాగే] అలా పూర్వజన్మ జ్ఞానం అందరికీ అంతసులభముగా కలుగదు.దానికి పరమాత్మ అనుగ్రహము ఉంటేనే సాధ్యము. మనకు జడభరతుని ఉదంతము తెలుసు. అయన మొదటి జన్మలో తపోవృత్తి లోవుండి కూడా ఒక హరిణము మీద దయతో ,ప్రేమ కలిగి దాని సంరక్షణ విషయమై ఆలోచిస్తూ మరణించి ఫలితముగా జింకగా పుట్టవలసి వచ్చినది. పూర్వజన్మ జ్ఞానమున్నందున తనస్థితికి వగచిన విషయము ఆ కథలో మీరు చదివి ఉంటారు. అలాగే మహాశివభక్తుడయి,నిష్టతో శివ పూజచేసే ఒక మహారాజు ,విహారాదులలో మాత్రము విపరీత కామ,చంచల స్వభావాన్ననుసరించటాన్ని అతని భార్య ప్రశ్నిస్తుంది "శ్రీ గురు చరిత్ర"లో.అప్పుడా రాజు పూర్వజన్మలో కుక్కగావుండి తాను పొందిన అనుభవాలను చెప్పి " ఏమిచెయను రాణీ ఆవిధముగా శివరాత్రి పూజావిధాన్నాని చూసి మరణించిన నాకు ఈ మహారాజ యోగము ,అచంచలమైన శివభక్తి అబ్బాయి. కానీ నా పూర్వకుక్కజన్మ వాసనలవలన నా బుధ్ధి ఇలా ప్రవర్తిస్తున్నదని చెబుతాడు.

అలాగే మేము తొమ్మిదవ తరగతి లో ఉందగా చాలా సంచలనాన్ని కలిగించిన వార్తను చదివాము. శ్రీశైలమ్ ప్రాంతములో పద్మావతి అనే ఎనిమిదేళ్ల అమ్మాయి. పూర్వ జన్మ స్మృతి కలిగి తాను పూర్వజన్మలో తన తాతగారి భార్య[అమ్మమ్మ] నని తనపేరు శేషమ్మ అని,చెప్పటము నమ్మని వాల్లందరి కీ వారితో పూర్వజన్మలో తాను కొన్నిసంఘటలను చెప్పటమే కాక. తన తాతగారితో ప్రత్యేకముగా భార్య భర్తలుగా వున్నప్పుడు వారిద్దరికి మాత్రమే తెలిసిన విషయాలను కూడా చెప్పటము తో అది నిజమని తేలినది.

అలాగే స్వాతి వారపత్రికలో చాలా రోజులక్రితం చూసాను. శ్రీలంకలో ఒక దంపతులు తమ పిల్లవానిని గతంలో బాంబుదాడి లో ఆదేశ అధ్యక్షులు ప్రేమదాస చంపబడిన స్థలానికి తీసుకువచ్చినప్పుడు వాడు పెద్దగా ఏడుస్తూ వణికి పోతూ తాను ప్రేమదాసనని నన్ను ఇలా చంపారని పెద్దగా ఏడుస్తూ చెప్పటం ఆదేశం లో సంచలాన్ని కలిగించింది. వాని పోలికలూ కూడా అచ్చం ఆ చంపబడ్ద అధ్యక్షుని లాగే వున్నాయి.[క్షమించాలి.ఆ అధ్యక్షుని పేరు ప్రేమదాస,లేక జయవర్ధనేనా అన్నది నేను మరచి పోయాను]
వలసినవారు స్వాతి పత్రిక వారిని సంప్రదిస్తే ఆఫోటో దొరకవచ్చు. ఇలా చాలా సంఘటనలు ప్రపంచవ్యాప్తముగా మనము చదువుతున్నాము కనుక పునర్జన్మ లేదు అనేది మొండివాదనే అవుతుంది.

ఇక విషయాని కొస్తాను. ప్రదక్షణలు చేస్తున్న వరాహం కానీ ,లేక మొన్న నెల్లూరు జిల్లాలో గుడిలో ప్రదక్షణలు చేస్తున్నా కోడేదూడ గానీ ,అవి పూర్వ జన్మ జ్ఞానము కలిగిన జీవులుగా చెప్పవచ్చు. వాటి స్థితికి అవి దు:ఖిస్తూ పరమాత్మ సేవతో తరించాలని భావించి ఉండవచ్చు. కనుక పూర్వజన్మలో అనుకున్న పనిని ఈ జన్మలో నైనా చేయాలని భావించి తమ బాధ తాము పడుతున్నాయి. ఐతే మనం ఇప్పుడు చేస్తున్నపని ఏమిటి్? వాటికి దైవత్వాన్ని ఆపాదించి వాటిని పూజించటం,శాస్త్రవిరుద్ధమైన పని. వాటిని దైవాంశగలవాటిగా పూజించటము ద్వారా మరొక దోషము మనము చేస్తున్నామని జనం గ్రహించాలని నాభావన.ఇంతకంటే పవిత్రమైన మానవజన్మను కామక్రోధ,లోభ,మోహాదులతో వృధాచేసుకుంటు న్నమనం జాగ్రత్త పడాలే తప్ప .వాటికి దైవత్వాల నాపాదించి ,మన తప్పులను సరి చేసుకునే అవకాశాన్నుంచి తప్పు కోకూడదు.

ఈ చిత్రాలన్నీ ఎలాజరుగుతాయో ,భవిష్య పురాణాదులు సూచిస్తే,తాతగారు కాలజ్ఞానము లో తేటతెల్లము చేసి వివరించారు. ఐనా సరే మనము పాఠాలు నేర్చుకోవటము లేదు. వారి మాటలు ఆచరణలో కి తెచ్చుకోవటము లేదు.

తమసోమా జ్యోతిర్గమయ
****************

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP