శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

యజ్ఞజ్వాలలో పరమేశ్వరుని ప్రతిబింబము

>> Friday, October 31, 2008


"O M -N A M A : S H I V A Y A"
(Prabhoo... shaktimman.. Hindurastranga. Bhoota.......)
This is a miracle from Lord Siva temple at Mavelikkara (Alleppey District, Kerala ). About 4 KM west from Mavelikara town is this ancient Lord Siva Temple (Kandiyoor Maha Deva Kshethram).
Recently, a seven day long * Maha Shiva Purana Yagnam* was performed at this temple . On the last night of Yagnam, suddenly the devotees saw an Image (Roopam) of Lord Siva in the Homam fire . Someone has taken a picture at once. if you look at it very carefully, you can find the face and hair (Jada) of Lord Siva ..
Om Nama Sivaya !!!

Read more...

కోటిపంచాక్షరీ జపయజ్ఞ కార్య నిర్వాహక వర్గము

>> Thursday, October 30, 2008


భక్త జన శ్రేయస్సు కోసం నిర్వహిస్తున్న కోటి పంచాక్షరీ మహామంత్రజప యజ్ఞకార్య నిర్వాహక వర్గము.



కార్య నిర్వాహక సంఘ అధ్యక్షులు : శ్రీరామభక్త అభయాంజనేయ స్వామి వారు






పూజ,హోమనిర్వహణ: దుర్గేశ్వరరావు,,అర్చక బృందము ... శ్రీవే0కటేశ్వరజగన్మాతపీఠము రవ్వవరం
----------------------------------------

ఆహ్వాన విభాగం
. . . ........ ..... ........
శ్రీ పెంచలరెడ్డి [ స్పెషల్ కలెక్టర్ ,వెలుగొండప్రాజెక్ట్, ప్రకాశం జిల్లా] రామరాజుభాస్కర్[u.s.a.] దారా మల్లిఖార్జునరావు [ఇన్ చార్జ్ఆంధ్రజ్యోతి ,వినుకొండ], తీగలరవీంద్రబాబు[సి,ఐ,గుంటూరు]బి,శ్రీనివాస్[ వార్త- స్టాఫ్- రిపోర్టర్- ,నెల్లూరు]





అన్నదానం నిర్వహణ విభాగము
------------------

గంగినేని రాధాకృష్ణమూర్తి [ కమ్మవారిపాలెం] తాతా గోపాలకృష్ణమూర్తి [ వినుకొండ] ,గుంటకల ప్రసాద్ [ మునిసిపల్ చైర్మన్ వినుకొండ],పేరం మల్లిఖార్జున రెడ్డి [లక్ష్మీపురం] ,పారెల్ల దాసయ్య [ రవ్వవరం ]
రామరాజు ఉమాశంకర్ [u.s.a].,జడ్చర్ల శ్రీనివాస్[ యు.ఎస్. ఎ] చెరుకూరి దుర్గాప్రసాద్[యుఎస్ ఎ] ఉప్పుటూరి శ్రీనివాస్[యు.ఎస్.ఎ.]
గంగినేని యోగేశ్వరరావు,[నూజండ్ల], ], సూరి,[వినుకొండ] కాలువ రమణారెడ్డి [రెడ్డిపాలెం ] సుబ్బారావు [వినుకొండ] కొప్పురావూరి సుబ్బారావు[నూజండ్ల] తదితరులు



మంత్రజప నిర్వహణ విభాగం
------------------------------
చిలమమకూరు విజయమోహన్ [ సత్సంగబృందం ,తాడిపర్తి ] జ్యోతి వలబోజు [హైదరాబాద్] ఝాన్సీ లక్ష్మీబాయి [సికిందరాబాద్ ]
తెలగంశెట్టి పావని[ శంకర సత్స0గము,వినుకొఁడ ] రాయలు [సత్యసాయిసేవాసమితి,వినుకొండ ] శాంతమ్మగారు[రామాలయ సత్స0గ ,వినుకొండ] సుబ్రమణ్యం [ శివాలయ సత్సంగం ] ప్రకాష్ [ సరస్వతీ శిశుమందిర్ ,వినుకొండ ] బి. జయప్రద [హిందూ పబ్లిక్ స్కూల్ ,రవ్వవరం ] ప్రభాకర్ రెడ్డి ,వి. అప్పాపురఁ వివిధ గ్రామాల సత్సంగముల బృందములు . వ్యక్తిగతముగా జపము
చేయు భక్తులు


వస్తుసేకరణ విభాగం
------------
బి.కృష్ణ[రవ్వవరం] శ్రీనివాస్[కురిచేడు]కాశిరెడ్డి[వాస్తుసిద్దాంతి,నూజండ్ల]బి. మల్లిఖార్జున[గుంటూరు]



ప్రెస్ రిలేషన్విభాగం
---------
వెఁకటరెడ్డి [ఆంధ్రజ్యోతి ] ఎస్.క్.వలి[ సాక్షి,] కోటేశ్వరరావు[ ఆంధ్రప్రభ ] నూజండ్ల మండలం


ఇఁటర్ నెట్ విభాగం
నలమోతు శ్రీధర్ [ హైదరాబాద్ ] గల్లా ఏడుకొఁడలు [రాముడుపాలెం ]


ప్రారంభము: 29 -10 -2008 నుండి 26-11-2008- వరకు
పూర్ణాహుతి: 26-11-2008 మాస శివరాత్రి . భక్త జనులందరూ ఆహ్వానితులే

Read more...

భక్త జన శ్రేయస్సు కోసం నిర్వహిస్తున్న ఈ కోటి పంచాక్షరీ మహామంత్రజప యజ్ఞకార్య నిర్వాహక వర్గము.


పూజ,హోమనిర్వహణ: దుర్గేశ్వరరావు,,అర్చక బృందము ... శ్రీవే0కటేశ్వరజగన్మాతపీఠము రవ్వవరం
----------------------------------------

ఆహ్వాన విభాగం
. . . ........ ..... ........
శ్రీ పెంచలరెడ్డి [ స్పెషల్ కలెక్టర్ ,వెలుగొండప్రాజెక్ట్, ప్రకాశం జిల్లా ] దారా మల్లిఖార్జునరావు [ఇన్ చార్జ్ఆంధ్రజ్యోతి ,వినుకొండ],బి,శ్రీనివాస్
[ వార్త- స్టాఫ్- రిపోర్టర్- ,నెల్లూరు] తీగలరవీంద్రబాబు[సి,ఐ,గుంటూరు]





అన్నదానం నిర్వహణ విభాగము
------------------
రామరాజు భాస్కర్ [ u.s.a.]
గంగినేని రాధాకృష్ణమూర్తి [ కమ్మవారిపాలెం] తాతా గోపాలకృష్ణమూర్తి [ వినుకొండ] ,గుంటకల ప్రసాద్ [ మునిసిపల్ చైర్మన్ వినుకొండ],పేరం మల్లిఖార్జున రెడ్డి [లక్ష్మీపురం] ,పారెల్ల దాసయ్య [ రవ్వవరం ]
రామరాజు ఉమాశంకర్ [u.s.a].,జడ్చర్ల శ్రీనివాస్[ యు.ఎస్. ఎ] చెరుకూరి దుర్గాప్రసాద్[యుఎస్ ఎ] ఉప్పుటూరి శ్రీనివాస్[యు.ఎస్.ఎ.]
గంగినేని యోగేశ్వరరావు,[నూజండ్ల], ], సూరి,[వినుకొండ] కాలువ రమణారెడ్డి [రెడ్డిపాలెం ] సుబ్బారావు [వినుకొండ] ] కొప్పురావూరి సుబ్బారావు[నూజండ్ల] తదితరులు



మంత్రజప నిర్వహణ విభాగం
------------------------------
చిలమమకూరు విజయమోహన్ [ సత్సంగబృందం ,తాడిపర్తి ] జ్యోతి వలబోజు [హైదరాబాద్] ఝాన్సీ లక్ష్మీబాయి [సికిందరాబాద్ ]
తెలగంశెట్టి పావని[ శంకర సత్స0గము,వినుకొఁడ ] రాయలు [సత్యసాయిసేవాసమితి,వినుకొండ ] శాంతమ్మగారు[రామాలయ సత్స0గ ,వినుకొండ] సుబ్రమణ్యం [ శివాలయ సత్సంగం ] ప్రకాష్ [ సరస్వతీ శిశుమందిర్ ,వినుకొండ ] బి. జయప్రద [హిందూ పబ్లిక్ స్కూల్ ,రవ్వవరం ] ప్రభాకర్ రెడ్డి ,వి. అప్పాపురఁ వివిధ గ్రామాల సత్సంగముల బృందములు . వ్యక్తిగతముగా జపము
చేయు భక్తులు
వస్తుసేకరణ విభాగం
------------
బి.కృష్ణ[రవ్వవరం] శ్రీనివాస్[కురిచేడు]కాశిరెడ్డి[వాస్తుసిద్దాంతి,నూజండ్ల]బి. మల్లిఖార్జున[గుంటూరు]
ప్రెస్ రిలేషన్విభాగం
---------

Read more...

అపమృత్యువును తొలగిఁచే అన్నా చెల్లెళ్ళ పండగ

>> Wednesday, October 29, 2008

కార్తీక మాసములో రెఁడవరోజయిన విదియ తిథి నాడు యమున తనసోదరుడయిన యముని సత్కరించినది. ఆరోజును భగినీ హస్త భోజనము, వ్యవహరిస్తారు. ఆరొజు సోదరులను తమయింటికి పిలచి ,భోజనము పెట్టి వారి ఆశీర్వాదము తీసుకొనుట భారతదేశములో మహిళలు పాటించే ఆచారము. ఆ సోదరులు కూడా తమ సోదరి లను కానుకలతో సత్కరిస్తారు. దీనివలన వారి మాంగల్యబలము మరింత శక్తివంతమవుతుందని. శాస్త్రవచనము. అలాగే తమచెల్లెళ్లను సత్కరించిన వారికి అపమృత్యువు లేకుఁడా వరమిచ్చాడు. యమధర్మరాజు.

ఇటువంటి పవిత్రమయిన ఆచారాన్ని పాటించటము వలన ఆధ్యాత్మిక లాభాలే కాక , సామాజిక బంధాలుకూడా మరింత దృఢపడి. సమాజములో శాంతిసౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి. మరెందుకాలస్యం మరచిపోయిన వారుంటే వెంటనే పిలవండి. రేపు అంటే అక్టోబర్ 30 గురువారం జరుగుతుంది. బ్లాగ్ లోకములో వున్న నాసోదరీమణులకందరికీ సకలశుభాలు కలగాలని కోరుకుంటున్నాను.

Read more...

రూపుమార్చకండి మన పండుగలను[దీపావళి శుభాకాంక్షలతో]

>> Monday, October 27, 2008




జ్యోతిర్మయ స్వరూపమయిన పరమాత్మ లోని దివ్యకాంతులను వెదజల్లుతున్న భవ్యదీపావళి శుభాకాంక్షలు తెలుగు బ్లాగర్లందరికి.

మన పండుగ ప్రతిదానిలోను ఆధ్యాత్మిక రహస్యాలేకాక ,మానవునికి శ్రేయస్సును కూర్చే ఆరోగ్య,సామాజిక లాభలన్నీ ఇమిడివుంటాయి. అయితే కాలానుగుణముగా కొన్ని అనవసరమయిన ఆచారాలు ఇందులోకి ప్రవేశించి స్థిరపడతాయి అవిగమనించి తొలగించాల్సిన బాధ్యత మనదే.

వాటిలో కొన్నిటిని మనవిచేసుకుంటాను. మనం ఈ సందర్భముగా కొవ్వొత్తులను వెలిగించటము అలవాటు చేసుకున్నాము. ఈ మధ్య కాలములో శాస్త్రవేత్తలు పరిశీలన జరిపి చెప్పిన విషయమేమిటంటే ఎక్కువగా కొవ్వొత్తులు వెలిగించిన చోట పెద్దమొత్తములో విషవాయువులు వెలువడతాయి అని . చాలాకాలం క్రితమే చేసిన పరిశోధనలలో మంచి నూనె,ఆవునెయ్యి తో వెలిగించిన దీపాలవలన ఆప్రాంతములో మానవునకునకు హానిచేసే క్రిములు నశించి పోతాయని తేల్చబడినది. కనుక దీపాలవరుసను అమర్చి ఆనందిద్దాము. కాలుష్యం కలిగించే పాదార్ధాలను తగలబెట్టటం ,భయంకరధ్వనులు చేసి ఆనందించటం తగ్గించుకుందాము క్రమేపి. అవి మన సాంప్రదాయాలకు,ఆరోగ్యాలకూ రెండిటికీ మంచివికావు కనుక. మీఅందరి జీవితాలు దీపావళి కాంతులలా వెలిగిపోవాలని కోరుతున్నాను.

Read more...

కోటి శివ పంచాక్షరీ మహాయజ్ఞము లో మీరూ పాల్గొనండి

>> Sunday, October 26, 2008


పరమదయాళువయిన పరమేశ్వరుని మెప్పించి పరమశుభాలు పొందటానికి పంచాక్షరి మహా మంత్రజపము సులభతరము ,శక్తివంతమయిన మార్గము. పరమ పవిత్రమయిన కార్తీకమాసములో ఆయనకు ప్రీతిపాత్రముగా ఈమంత్ర జపము చేసి ఆయన కరుణకు పాత్రమయిన వారి జీవితములో అశుభాలన్నీ తొలగి సకలశుభాలు సంప్రాప్తమవుతాయని శాస్త్రాలు సప్రమాణముగా నిరూపిస్తున్నాయి. వారి జీవితములో జాతకములో నున్న గ్రహదోషాలు తొలగుతాయి. బాధలు కష్టాలు తొలగించి కరుణతో పాలించు పరమేశ్వరుని కృపకు పాత్రులయ్యేలా భక్తుల కొరకు కోటి శివపంచాక్షరీ మహాయాగము పీఠములో నిర్వహించబడుతున్నది. దీనిలో మీరు ప్రత్యక్షముగను, పరోక్షముగను పాల్గొనవచ్చును. మీరు కార్తీకములో అంటె 29-11-08నుండి 26-11-08 [మాసశివరాత్రివరకు] మీమీశక్త్యానుసారం పంచాక్షరీ జపము చేసి ఆసంఖ్యను వారానికొకసరి తెలియచేయాలి. ఎన్నిరోజులు ,ఎంతజపం చేయాలో ,మీరు నిర్ణయించుకోవాలి . ముందుగా మీరు మీగోత్రనామాలను మెయిల్,లేదా ఫోన్ ద్వారా తెలియజేయాలి. ప్రతిరోజూ జరిగే రుద్రాభిషేకములో ను మృత్యుంజయహోమములోనూ మీపేర్లమీద పూజజరుగుతుంది. పాల్గొనేవాళ్ళు ఎప్పటినుండయినా మొదలుపెట్టవచ్చు. అనారోగ్యముతో జపంచేయటానికి , వీలుకాని వారు[నెలసరి ఇబ్బందులు తదితరం] వారితరపున తమకుటుంబములో ఎవరిచేతనయినా ఆరోజులలో జపంచేపించవచ్చు. రోజుకు 1008 సార్లకు తగ్గకుండా జపంచేయాలి. దానికి కొద్దినియమాలు పాటించవలసి ఉన్నది .1జపముచేసినంతకాలము . ఉదయాననే స్నానమాచరించి ఆచమనంచేసి తమ సంకల్పాన్ని భగవంతునికి తామకు చేతయిన రీతిలో చెప్పుకుని జపంచేయాలి.
2. మధ్యము ,మాంసము లను వాడరాదు.
ఇక ప్రత్యేక నియమాలను ఆచరించదలచుకున్నవారు కఠినతర సాధన చేయదలచుకున్నవారు వారి ఇష్టము. అది ఇంకామంచిది.
జపము పూర్తయిన తరువాత పూర్ణాహుతి జరుగుతుంది. దానిలో మీతరపున ఒక కొబ్బరకాయను ,ఆవునెయ్యి మీఖర్చు తోనే సమర్పించవలసివుంది. ప్రత్యక్షముగా పాల్గొనలేనివారు అందుకొరకు 15 రూ. పంపితే మీతరపున ఆద్రవ్యాలను కొనిపూర్ణాహుతిహోమములోసమర్పించటం జరుగుతుంది.
ఈకార్యక్రమానికి అనుబంధంగా పీఠములో 40 రోజులపాటు, అయ్యప్ప, శివ,భవానీ ,హనుమత్ దీక్షాదారులకు అన్నదానము జరుగుతున్నది. రామలింగేశ్వరునికి లక్ష బిల్వార్చన,,శ్రీవేంకటెశ్వరునకు లక్షతులసీదళార్చన ,అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి. మహాశక్తిదాయకమయిన ఈ యాగములో మీరూ పాల్గొని పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులై మీ ఇచ్చితాలను ప్రాప్తింపజేసుకోవాలని మా కోరిక . మీ మిత్రులకు బంధువులకు కూడా ఈ కార్యక్రమాన్ని తెలియజేసి వారిని సహితం పాల్గొనేలా చేయాలని ప్రార్ధన. సాధ్యమయినంత ఎక్కువమంది భగవద్భక్తుల కు మేలుకలగాలనేదే మా ప్రయత్నము. యాగానంతరం రక్ష, ప్రసాదములను పంపాలంటే మాత్రము పోస్ట్ ఖర్చులను మీరేభరించాలి. పెద్దసంఖ్యలోనున్న ఇందరుభక్తులకు పోస్ట్ ద్వారా ప్రాసాదాలుపంపేఖర్చును పీఠము భరించలేదు. మన్నించండి.
మెయిల్: durgeswara@gmail.com

Read more...

ఇలా విమర్శించి చూడండి రామాయణాన్ని ??

>> Saturday, October 25, 2008

ఈ మధ్యకాలములో రామాయణాన్ని అందులోని పాత్రల చర్యలని విమ్మర్శిస్తూ జరుగుతున్న చర్చలను చూస్తున్నాను. నాకు పనులవత్తిడివలన అందులోపాల్గొనటానికి సమయము దొరకలేదు. నా అభిప్రాయాలను మీతోపంచుకోవటానికి వీలుకాలేదు. నావుద్దేశాన్ని సరిగా అర్ధంచేసుకోగలరని ఇదివ్రాస్తున్నాను. నేను మీకంటే అధికంగా తెలిసిన వాడిననేగర్వముతోకాక రామాయణ ఔన్నత్యాన్ని విమర్శించడముద్వారా సంభవించేదుష్పరిమాణాల పట్ల భీతితోవ్రాస్తున్నాను.

ఏదైనా ఒక విషయాన్ని,లేదా వ్యక్తులచర్యలను మనం విమర్శించాలంటే మనం, ఒక విషయం గమనించాలి. ఆవిషయము పట్ల మనం సమగ్రమయిన అవగాహన కలిగి ఆవ్యక్తి కంటె వున్నత భావాలు .ఆచరణ కలిగి ఉండాలి. వారి చర్యలకంటె ఉన్నత చర్యలను సూచించగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. .మరి ఎదుటువారిలో.లేక వారి ప్రవర్తన తప్పుపట్టామంటే మనం వారికంటే ఉన్నతమయి ఉంటేనేకదా అర్హత. అర్హత లేకున్నా విమర్శించట మంటె ఆకాశం మీద ఉమ్మెయ్యటం లాంటిది. నాతోపాటు భారత సాంస్కృతీ సాంప్రదాయాలకు చెందిన వారిమంతా శ్రీరామున్ని భగవంతునిగా కొలుస్తాము. ఈదేశ ధార్మిక సామాజిక నీతులన్నీ రామాయణములాంటి మహా గ్రంథాలమీద ఆధార పడిసాగుతున్నాయని నమ్మేవాళ్ళము. కనుక మా మనోభావలను బధపెట్టె వారు మాకు కొన్ని అనుమానాలకు సమాధానాలివ్వాలు ఇవ్వ వలసిన బాధ్యత కలిగివుంటారు. అదే ఏ ఇతర మత గ్రంథాలనైనా విమర్శిస్తే ప్రతిస్పందనలు ఎలావుంటాయోమీకు అనుభవపూర్వకముగా తెలుసుగనుక మీ రెటూ వాటిజోలికి పోరు. వెళ్లమని మాఅర్థం కాదు. మాకు మా పెద్దలు సహనం ద్వారానే సమస్యలను ఎదుర్కొనటం అనేమార్గాన్ని బోధించి ఆచరించి చూపారుకనుక భారతధర్మానికి వారసులమని గర్వపడేమాకు మాపెద్దల మార్గములో నడవడమే చాతనవుతుంది. ఇప్పుడు ఈ రూపములోనయినా స్పందించకుంటే కలియుగములో అసత్య వాదనలకు మనుషులు లోనయి పక్కదారిపడతారనిచెప్పిన భవిష్య పురాణాది గ్రంధాలన్ని గుర్తుతెచ్చుకుని, ఈ అసత్యాల చే వంచించబడి కలిపురుషుని ప్రభావానికి లోనయి తమధర్మాన్ని తామేవిమర్శించుకుంటున్న కొందరు మాసోదరీసోదరులకు నిజం తెలుసుకునేఅవకాశం దూరం చేసినవారమవుతామనే ఉద్దేశ్యంతో ఇందులో పాల్గొంటున్నాము. శ్రీ రాముని తత్వాన్ని భగవంతునిగా కాకున్నా, ఒక వ్యక్తిగా విమర్శించాలన్నా ముందు ఈ క్రింది ప్రశ్నలకు మీమనసులో మీరే జవాబు చెప్పుకుని సాగండి.

1... ... రాముని వ్యక్తిత్వ మేమిటి. ఆయన సత్యవాక్పరిపాలకుడు. తానెప్పుడూ అసత్యమాడడు. పెద్దలఎడల గౌరవభావాన్ని ఏస్థితిలోనూ వదలడు. ఈ శరీరానికి కారణమయిన తండ్రి, తల్లి పట్ల ఎనలేని కృతజ్ఞతా భావాన్ని కలిగి వారిమాటెన్నడూ జవదాటడు. ఉదయాన్నే రాజయి రాజ్య మేలబోతున్నాడు. అపార సంపదలకు భోగభాగ్యాలకు అధిపతి కానున్నాడు. కానీ హఠాత్తుగా అడవులకు పొమ్మని తండ్రి ఆజ్ఞ . అదీ ఆయన చెప్పలేని స్థితిలో. ఇచ్చిన మాటకూ, ప్రేమకూ కట్టుపడి మతి చలించినంత పరిస్థితిలో అయినా సరే ఏమాత్రం చలించలేదు. మనసులో ఏ కల్లోలమూ లేదు. చిరునవ్వుతో సమాధానంగా ప్రయాణమయ్యాడు.

మీతండ్రి భాగపంపకాలలో మీ సోదరీ సోదరులకంటె కొంచెం తక్కువగా మీకు పంచినా లేక మీకు భాగం లేదు పొమ్మాన్నా. మీరుఇలానేస్పందించగలరా? త,డ్రినిర్ణయాన్ని తప్పుబట్టకుండా ఆయనను విమర్శించకుండా , ఎన్ని కష్టాలకోర్చయినా బ్రతకటానికి మీరు వెళ్ళగలరా? అంతటి స్వతంత్రవ్యక్తిత్వ సామర్ధ్యం మీకున్నదా?

2....... ... రాముడు అడవికి వెళుతుంటే ఎండకన్నెరగని ధనవంతుల బిడ్ద .ఎంత కష్టమో వనవాసం. అయినా తనను వారించిన భర్తను ఎత్తిపొడిచి, నేను ఇల్లాలిననుకున్నావా మరొకటా? భర్త సుఖాలలోవున్నప్పుడు పక్కనుండి ,కష్టాలలో పుట్టినింటికి వెళ్లటానికి ?అని వాదించి ఆయన వెంట వెళ్ళిన సీతామాత వంటి సంస్కారబలం కలవారు?గదా మీరు, ఆ .స్థిలో భాగం సరిగా పంచుకురాకపోతే మీరేమ్ మగాళ్ళు మనభాగమతా వెళ్ళి పంచుకువచ్చినదాకా నేను అన్నమ్ముట్టను. నీళ్ళుతాగని వేధించి అత్తమామలను సాధించే వైఖరి కలవారా?. [ మొగుడు తాగుబోతయినా. తిరుగుబోతయినా అతనిని వీడక కాపుఅరం సరిచేసుకుని భారత స్త్రీఔన్నత్యాన్ని లోకానికి చాటి చూపుతున్న తల్లులందరకూ పాదాభివందనం చేస్తూ క్షమించమని వేడుకుంటున్నాను] భారత స్త్రీల ఔన్నత్యానికి సీతమ్మను ఆదర్శంగా తీసుకోవటమే కారణమని భారతీయులందరి అభిప్రాయం. రావణుడు అపహరించిన తరువాత తన భర్త ఎక్కడున్నాడొ తెలియదు. వస్తాడొ రాడో తెలియదు. వాడు తనకు లొంగితేసర్వ సంపదలకు అధిపతినిచేస్తానన్నా, వాడిని చీకొట్టి గడ్దిపరకగా చూసి నట్లు చూసి, చావటానికయినా సిద్ధపడినదేకాని మానమును కోల్పోక కోట్లాది భారతీయనారీమణుల మనసులను పవిత్రభావముతో వుంచుతున్న ఆతల్లి ప్రభావం కాదనగలవారున్నారా? తనను అనుమానించినట్లుగా భావన తెలిసినా భార్యగా , ఆయన ఆజ్ఞను తలదాల్చిన ఆతల్లి మనోబలం మరొకరికున్నదా?? లోకానికి ఆదర్శపురుషునిగావుందవలసిన వ్యక్తికిసహచరిత్వం ఎంతకష్టమయినదయినా సార్ధకత చేకూర్చిన ఆతల్లి అడుగుజాడలను మించిన ఆదర్శం ఇంకొకటున్నదా?

3................తనకు అడవులకు పోవలసిన అవసరం లేదు. అయినా అన్నగారిసేవ కొరకు బయలుదేరినవాడు లక్ష్మణుడు. రాజ్యంనిరాటంకంచేసిపెట్టినది తల్లి. ఇద్దరు భాగస్తులు అడవులు పట్టిపోయారు. అయినా తన అన్నకు లేని రాజ్యభోగాలు తనకెందుకని కోపించి,త్యజించి ,అన్నదగ్గరకు వెళ్ళి రమ్మనిబ్రతిమాలి, ఆయన రాకుంటే నందిగ్రామములోనే నివసిస్తూ కఠినముగా తనశరీరాన్ని దీక్షలకు గురిచేసి బాధ్యతలను అన్నతరపున నిర్వహించిన భరతుడు అన్నదమ్ముల ప్రేమకు నిలువెత్తు నిదర్శనము. మీకు మీ స్వార్ధాన్ని త్యాగం చేసి అన్నదమ్ములకోసం పరితపించే మనసువున్నదా? అన్నదమ్ములకోసం అవసరమయితే మీ ధనాదులను కూడా వదలుకోగల సౌజన్యము త్యాగనిరతి మీకున్నదా? అప్పుడు మీరు రామాయణాన్ని విమర్శించ్టానికి ప్రయత్నం చెయ్యొచ్చు. ఇంకొంచెమ్ముందుకు పోదాము.

4....................... తండ్రి చనిపోయినా, తమ్ముడువచ్చి పిలచినా పెద్దలు సర్దుబాటు పద్దతులు చెప్పినా, జాబాలి లాంటివారు నాస్తిక వాదన చేసి మనసును మల్లించటానికి చూసినా చలించలేదు తన సత్యవాక్పాలననుండి. రాముడు. అవకాశము వచ్చినా ఋజుమార్గమునుండి పక్కకు మల్లని ఆత్మధైర్యం మీకున్నదా?

5......................అడవిలో వున్నప్పుడు అందగత్తెగా సూర్పణక వచ్చి వలచినది, ఎగతాళి చేసి పంపినాడెకాని పరస్త్రీని తప్పుభావనతో చూదలెదు. పెల్లాం పక్కనేవున్నా, చక్కగా వున్న పక్కవారిని దొంగచూపులు చూసే బుద్ధి మీకులేదుకదా? అది సినిమా హీరోఇన్లనయినాసరె. పరస్త్రీలను కాముకదృష్టితో చూడని గొప్ప ,చలించని మనోనిగ్రహం కలవారు రామాయణాన్ని విమర్శించేందుకు ఒక అర్హతకలవారు కావచ్చనుకుంటా?

6.. ......... భార్యను ఎవడో దుర్మార్గుడపహరిస్తే దు\:ఖాతిశయముతో మతిని కోల్పోయినవాలివలెనయి. ప్రతి చెట్టునూ పుట్టనూ నాసీత ఎక్కడ అంటూ విలపించిన ఆస్వామి ప్రేమకంటే మీ భార్యపట్ల ఇంకా ఎక్కువ ప్రేమ కలవారు ఐతే మీరు ముందుకు సాగవచ్చు. తన కు భార్య లేకుంటే యాగానికి అనర్హుడనైనప్పుడు బంగారు బొమ్మను పెట్టుకున్న ఆతండ్రి ఏకపత్నీ వ్రతమెక్కడ? సందుదొరికితే సెకండ్ సెటప్ పెట్టటానికి వెనుకాడని ఈ నాటి మాయ ప్రేమలెక్కడ. రాముని వంటి ప్రేమ మీకున్నదా? పరిశీలించండి. మీమనసులో మీ భార్యపట్ల.

6..... సహాయము కోరిన సుగ్రీవునికంటే వాలి బలవంతుడు.తనపని సులభముగా చేసి పెట్టగలడు. ఐ నా సరే నమ్మిన వారిని కాపాడెందుకే మొగ్గుచూపాడా కాని తనపనిజరుగుతుందికదా అని అవినీతిపరుడిని ఆశ్రయించలేదాయన. మన జీవితాలలో అవసరానికనుగుణంగా అభిప్రాయాలు మార్చుకునేవారము, అవసరమయితే లంచాలిచ్చి పనిచేసుకునేవారు , నమ్మిన వారిని అవకాశమొస్తే వదలివేయనివారు గావున్నవారు విమర్శకులవవచ్చు.

7....శరణని వచ్చిన విభీషణునే కాదు ,అవసరమయితే అభయమడిగితే రావణునయినా రక్షిస్తానని పలికాడు రాముడు. అంతటి క్షమాగుణసంపన్నులు. వున్నారా మనలో?

8.... యుద్ధములో మూర్చిల్లిన లక్ష్మణునికోసం చిన్నపిల్లవానిలా ఏడ్చిన సోదరప్రేమ ,సూర్యుని ఉదయాన్ని సహితమాపటానికి ప్రయత్నించిన పరాక్రమ శక్తి కలవారమా మనము?

9.... ...... యుద్ధము ముగిసిన తరువాత తన ప్రాణాధిదేవత ఎదురొస్తుంటే ,తనలో ప్రేమోద్వేగాన్ని అణచుకుని ధర్మానికి కట్టుబడి ధర్మ రక్షకునిగా తన అచరణ లో ఏలోపము లేకుండా వుడేందుకు కఠినంగా వ్యవహరించవలసివచ్చ్నప్పుడు ఎంతవేదనననుభవించాడో ఎవరికెరుక. ఆతల్లి పరమ పవిత్రురాలని తెలుసు. లేకుంటే అసలు యుద్ధప్రయత్నమే చేసేవాడుకాడు. కానీ లోకం సత్యాన్ని ప్రత్యక్షప్రమాణముతోగాని నిర్ధారించదు. రేపురాజుగా పరిపాలనసాగించేటప్పుడు., తాను శిక్షలు విధించినప్పుడు ఎవరూ తమ మనసులోకూడా రాముని గురించి సీతగురించి తక్కువగా మాట్లాడకూడదు. కనుకనే సీత పవిత్రత ఇక్కడే నిరూపించి చూపాలి .ఆశక్తి ఆపతివ్రతామతల్లికి వున్నదని పూర్ణముగావిశ్వాసం రామునికి .అందుకే అగ్ని పరీక్షకు ఆదేశించాడు. వాస్తవానికి ఆయన తప్ప మరోప్రయోజనముండదు కాలక్షేపము ,తప్ప మరొకటికాదు కల్పిమ్చుకున్నది,తనశక్తి చూపి భవిష్యత్ తరాలకు పాతివ్రత్యమహిమ తెలిపేందుకు.

అంతేకాక ఇక్కడొక సూక్ష్మామ్శమున్నది. అదిధర్మానికి సంబంధించినది . ఏపాపం ఎరుగని లక్ష్మనుని నానా మాటలు అన్న పాపఖర్మ కొంత అనుభవించవలసి వున్నది. ఆరోజు లక్ష్మణుడు ఎంత దు:ఖానికి లోనయ్యాడో ఆతల్లికికూడా అనుభవపూర్వకంగా తెలియవలసి ఉన్నందున ధర్మ రక్షకునిగా తనమన చూడకుండా ఆ శిక్ష విధించాడు రాముడు

.తమవద్దకొచ్చేసరికి. ధర్మాన్ని తప్పే న్యాయమూర్తి కాదాయన. అలా జరగకున్నట్లయితే ఈ నాడుసీతామాత గురించి మాట్లాడిన చాకలిని అనుసరించి మాట్లాడెదేమో ఈ లోకం . భార్య లేకుంటే బంగారపు బొమ్మను ప్రతిగా పెట్టుకుని యాగం సాగించాడే కాని ఎకపత్ని వ్రతాన్ని విడనాడలేదు. తుచ్చమయిన శారిరికసౌఖ్యాలకోసం తనమనసులోని ప్రేమమూర్తిని తొలగించి మరొకరికి ఆవకాశం ఇవ్వలేదు . భార్య పోగానే నాలుగురోజులకు ఆ ప్రేమను మరచి కొత్తభార్యకోరకు ఎదురుచూసే ఇప్పటి వారికి రాముని ప్రేమను అనుమానించే ఆవకాశం ఎలా వుంటుంది.?

లోకానికి ధర్మాన్ని చెప్పవలసిన రాజు తానూ మనసా వాచా కర్మణా సత్యాన్ని పాతిమ్చగాలిగితేనే ఆపదవికి న్యాయం చేసినవాడవుతాడు. లేకుంటే ప్రజలపాపాలకు ఆటను కారణమవుతాడు. అడినిరూపిమ్చి, మానవుఅలలో పాలకులు ఎలా నడవాలో చూపించాడు. తానుఎన్నిబాధలు సాహిమ్చయినా? అది తెలిసిన పూర్వపు నాయకులు సర్వస్వాన్ని వదులుకుని నిజమయిన ప్రజాసేవకులుగా చరిత్రలోకేక్కారు. తమస్వార్ధమేతప్ప ధర్మంతెలియని వారు నాడూ నేడూ ప్రజలను దోచుకుని లోకకంటకులయిన పాలకులుగా మారుతున్నారు. కులం మతం పార్టీలు తప్ప అతను dharmaatmuDaa? కాదా అనే విచక్షణ చేయకుండా వాళ్ళను ఎన్నుకుంటున్న మనం మన మనోస్తితితో రాముని లాంటి నాయకుని ప్రవర్తనను తప్పులెన్నటానికి ప్రయత్నిస్తున్నాము.

బిడ్డగా,అన్నగా, భర్తగా స్నేహితునిగా, రాజుగా ,ధర్మరక్షకునిగా,ప్రేమమూర్తిగా ఆయన లోకం గుండెలలో నిలచిపోయాడు. ఆయన ప్రేమతత్వాన్ని తట్టుకోలేని అసూయాగ్రస్తహృదయాలు ఆయన చరితకే కళంకం తేవాలని ప్రయత్నించి విఫలమవుతున్నాయి. కొన్ని ప్రక్షిప్తాలను చేర్చి అందుకు ప్రయత్నించిన సంఘటనలున్నాయి. వాటిలో ఒకటి విన్నవిస్తాను.

రాముడు సంభూకుని వధించాడు అని.ఒక ప్రక్షిప్తాన్ని చొప్పించారు. మధ్యలో ఎవరో మూర్ఖులు. వాల్మికి గాయత్రి మంత్రాక్షరాల సంఖ్యలో 24000 శ్లోకాల తో గ్రంథ రచన సాగించినట్లు తెలుస్తున్నది. కాని ఉత్తరరామాయణములో దిఇన్ని ప్రక్షిప్తము చేసారని చరిత్రకారుల అభిప్రాయము. గుహుడు,శబరి,వానరులు పక్షులను సహితము ఆదరించి వారి తపస్సులను ఫలిమ్పజేసిన స్వామి తపోదీక్షలో వున్న శంభూకుని ఎందుకు చంపుతాడు. కాలప్రవాహములో రాగిచెంబుకు చిలుము పట్టినట్లు మహాగ్రంతాలలో కూడా కొందరు ఆనాడున్న స్వార్ధపరులు తమచర్యలకు ప్రమాణము చూపిమ్చుకోవటానికి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లున్నది. దీనిమీద సమగ్రపరిసోధన చేసిన వారు చెబుతున్న మాటయిది. , విషజంతువులు విషవృక్షాలు రామాయణ కల్పతరువును ఏమీ చేయలేక అలా మరుగునపడి పోతూనే వున్నాయి. కానీ అవికక్కిన కొన్ని విశబిమ్దువులు మాత్రం మానవ మనస్సులను కల్లోలపరుస్తున్నాయి.


సముద్రములో రత్నాలను ఎన్నిఏరినా ఇంకా దొరుకుతూనే ఉంటాయి .రామాయణాన్ని దాని ప్రభావాన్ని వర్ణించటం చుక్కలు లెక్కపెట్టటం లాంటిదికనుక . నాఅసమర్ధతను చెప్పుకుంటున్నాను.

లోకానికి రీతి,నీతి బోధించటానికి అవతరించిన సీతారాముల ప్రేమలో లోపాలెంచకండి. సత్గ్రంథాలను ,సత్పురుషులను విమర్శిమ్చటము పాపమయి చుట్టుకుని వేధిస్తుంది.

ఇక దేవుని నమ్మక పోయినా ఫరవాలేదు. సత్య ధర్మాలను నమ్మే వారుగా ,లోకహితిభిలాశులుగా వున్న మిగతావారుకూడా రాముని మమ్చిగుణాలను ఎన్నింటిని మనం ఆచరించ గలుగుతున్నామో వాటివలన లోకానికి కలిగే మేలును పరిసిలిమ్చుకుని సాగండి విమర్సించటమే గొప్పకాదు,మనవున్నతికి పనికిరాదని గమనించి అందులోని మంచిని మన భవిష్యత్తరాలకు అందించే ప్రయత్నం చేయండి . మనజాతి మరికొన్ని యుగాలు మహోన్నతంగా బ్రతకటానికి. ఆచరణ లేకుండా వాదులాటే ప్రధానంగా సాగే వివరణలకు నేను జవాబు చెప్పినా మీకు నాకు సమయము వ్రుధా తప్పమరొకటికాదు, కనుక మనపిల్లలకు రామాయణం నేర్పుదాము వాళ్ళు
అన్నదమ్ములెలావుండాలో నేర్చుకోవడానికి ,రేపుమనలనెలా గౌరవించాలో తెలుకోవడానికి .
మన ఆడపిల్లలకు నేర్పుదాము సీతవంటి సాద్వీమతత్వం, ధైర్య ము సహనతలను ఎలా పెంచుకోవాలో తెలుసుకోవడానికి . ముందుమనం చదువుదాము, అందులో అసలు విశేషాలేమితో తెలుసుకోవడానికి ,ఎవరో విమర్శించినట్లుగా మనము మానవధర్మాన్ని మరచిపోకుండా వుండటానికి.
సర్వేజనా స్సుఖినోభవంతు.

Read more...

క్షేపము మధ్యకాలములో రామాయణాన్ని అందులోని పాత్రల చర్యలని విమ్మర్శిస్తూ జరుగుతున్న చర్చలను చూస్తున్నాను. నాకు పనులవత్తిడివలన అందులోపాల్గొనటానికి సమయము దొరకలేదు. నా అభిప్రాయాలను మీతోపంచుకోవటానికి వీలుకాలేదు. నావుద్దేశాన్ని సరిగా అర్ధంచేసుకోగలరని ఇదివ్రాస్తున్నాను. నేను మీకంటే అధికంగా తెలిసిన వాడిననేగర్వముతోకాక రామాయణ ఔన్నత్యాన్ని విమర్శించడముద్వారా సంభవించేదుష్పరిమాణాల పట్ల భీతితోవ్రాస్తున్నాను.

ఏదైనా ఒక విషయాన్ని,లేదా వ్యక్తులచర్యలను మనం విమర్శించాలంటే మనం, ఒక విషయం గమనించాలి. ఆవిషయము పట్ల మనం సమగ్రమయిన అవగాహన కలిగి ఆవ్యక్తి కంటె వున్నత భావాలు .ఆచరణ కలిగి ఉండాలి. వారి చర్యలకంటె ఉన్నత చర్యలను సూచించగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. .మరి ఎదుటువారిలో.లేక వారి ప్రవర్తన తప్పుపట్టామంటే మనం వారికంటే ఉన్నతమయి ఉంటేనేకదా అర్హత. అర్హత లేకున్నా విమర్శించట మంటె ఆకాశం మీద ఉమ్మెయ్యటం లాంటిది. నాతోపాటు భారత సాంస్కృతీ సాంప్రదాయాలకు చెందిన వారిమంతా శ్రీరామున్ని భగవంతునిగా కొలుస్తాము. ఈదేశ ధార్మిక సామాజిక నీతులన్నీ రామాయణములాంటి మహా గ్రంథాలమీద ఆధార పడిసాగుతున్నాయని నమ్మేవాళ్ళము. కనుక మా మనోభావలను బధపెట్టె వారు మాకు కొన్ని అనుమానాలకు సమాధానాలివ్వాలు ఇవ్వ వలసిన బాధ్యత కలిగివుంటారు. అదే ఏ ఇతర మత గ్రంథాలనైనా విమర్శిస్తే ప్రతిస్పందనలు ఎలావుంటాయోమీకు అనుభవపూర్వకముగా తెలుసుగనుక మీ రెటూ వాటిజోలికి పోరు. వెళ్లమని మాఅర్థం కాదు. మాకు మా పెద్దలు సహనం ద్వారానే సమస్యలను ఎదుర్కొనటం అనేమార్గాన్ని బోధించి ఆచరించి చూపారుకనుక భారతధర్మానికి వారసులమని గర్వపడేమాకు మాపెద్దల మార్గములో నడవడమే చాతనవుతుంది. ఇప్పుడు ఈ రూపములోనయినా స్పందించకుంటే కలియుగములో అసత్య వాదనలకు మనుషులు లోనయి పక్కదారిపడతారనిచెప్పిన భవిష్య పురాణాది గ్రంధాలన్ని గుర్తుతెచ్చుకుని, ఈ అసత్యాల చే వంచించబడి కలిపురుషుని ప్రభావానికి లోనయి తమధర్మాన్ని తామేవిమర్శించుకుంటున్న కొందరు మాసోదరీసోదరులకు నిజం తెలుసుకునేఅవకాశం దూరం చేసినవారమవుతామనే ఉద్దేశ్యంతో ఇందులో పాల్గొంటున్నాము. శ్రీ రాముని తత్వాన్ని భగవంతునిగా కాకున్నా, ఒక వ్యక్తిగా విమర్శించాలన్నా ముందు ఈ క్రింది ప్రశ్నలకు మీమనసులో మీరే జవాబు చెప్పుకుని సాగండి.

1... ... రాముని వ్యక్తిత్వ మేమిటి. ఆయన సత్యవాక్పరిపాలకుడు. తానెప్పుడూ అసత్యమాడడు. పెద్దలఎడల గౌరవభావాన్ని ఏస్థితిలోనూ వదలడు. ఈ శరీరానికి కారణమయిన తండ్రి, తల్లి పట్ల ఎనలేని కృతజ్ఞతా భావాన్ని కలిగి వారిమాటెన్నడూ జవదాటడు. ఉదయాన్నే రాజయి రాజ్య మేలబోతున్నాడు. అపార సంపదలకు భోగభాగ్యాలకు అధిపతి కానున్నాడు. కానీ హఠాత్తుగా అడవులకు పొమ్మని తండ్రి ఆజ్ఞ . అదీ ఆయన చెప్పలేని స్థితిలో. ఇచ్చిన మాటకూ, ప్రేమకూ కట్టుపడి మతి చలించినంత పరిస్థితిలో అయినా సరే ఏమాత్రం చలించలేదు. మనసులో ఏ కల్లోలమూ లేదు. చిరునవ్వుతో సమాధానంగా ప్రయాణమయ్యాడు.

మీతండ్రి భాగపంపకాలలో మీ సోదరీ సోదరులకంటె కొంచెం తక్కువగా మీకు పంచినా లేక మీకు భాగం లేదు పొమ్మాన్నా. మీరుఇలానేస్పందించగలరా? ,డ్రినిర్ణయాన్ని తప్పుబట్టకుండా ఆయనను విమర్శించకుండా , ఎన్ని కష్టాలకోర్చయినా బ్రతకటానికి మీరు వెళ్ళగలరా? అంతటి స్వతంత్రవ్యక్తిత్వ సామర్ధ్యం మీకున్నదా?

2....... ... రాముడు అడవికి వెళుతుంటే ఎండకన్నెరగని ధనవంతుల బిడ్ద .ఎంత కష్టమో వనవాసం. అయినా తనను వారించిన భర్తను ఎత్తిపొడిచి, నేను ఇల్లాలిననుకున్నావా మరొకటా? భర్త సుఖాలలోవున్నప్పుడు పక్కనుండి ,కష్టాలలో పుట్టినింటికి వెళ్లటానికి ?అని వాదించి ఆయన వెంట వెళ్ళిన సీతామాత వంటి సంస్కారబలం కలవారు?గదా మీరు, ఆ .స్థిలో భాగం సరిగా పంచుకురాకపోతే మీరేమ్ మగాళ్ళు మనభాగమతా వెళ్ళి పంచుకువచ్చినదాకా నేను అన్నమ్ముట్టను. నీళ్ళుతాగని వేధించి అత్తమామలను సాధించే వైఖరి కలవారా?. [ మొగుడు తాగుబోతయినా. తిరుగుబోతయినా అతనిని వీడక కాపుఅరం సరిచేసుకుని భారత స్త్రీఔన్నత్యాన్ని లోకానికి చాటి చూపుతున్న తల్లులందరకూ పాదాభివందనం చేస్తూ క్షమించమని వేడుకుంటున్నాను] భారత స్త్రీల ఔన్నత్యానికి సీతమ్మను ఆదర్శంగా తీసుకోవటమే కారణమని భారతీయులందరి అభిప్రాయం. రావణుడు అపహరించిన తరువాత తన భర్త ఎక్కడున్నాడొ తెలియదు. వస్తాడొ రాడో తెలియదు. వాడు తనకు లొంగితేసర్వ సంపదలకు అధిపతినిచేస్తానన్నా, వాడిని చీకొట్టి గడ్దిపరకగా చూసి నట్లు చూసి, చావటానికయినా సిద్ధపడినదేకాని మానమును కోల్పోక కోట్లాది భారతీయనారీమణుల మనసులను పవిత్రభావముతో వుంచుతున్న ఆతల్లి ప్రభావం కాదనగలవారున్నారా? తనను అనుమానించినట్లుగా భావన తెలిసినా భార్యగా , ఆయన ఆజ్ఞను తలదాల్చిన ఆతల్లి మనోబలం మరొకరికున్నదా?? లోకానికి ఆదర్శపురుషునిగావుందవలసిన వ్యక్తికిసహచరిత్వం ఎంతకష్టమయినదయినా సార్ధకత చేకూర్చిన ఆతల్లి అడుగుజాడలను మించిన ఆదర్శం ఇంకొకటున్నదా?

3................తనకు అడవులకు పోవలసిన అవసరం లేదు. అయినా అన్నగారిసేవ కొరకు బయలుదేరినవాడు లక్ష్మణుడు. రాజ్యంనిరాటంకంచేసిపెట్టినది తల్లి. ఇద్దరు భాగస్తులు అడవులు పట్టిపోయారు. అయినా తన అన్నకు లేని రాజ్యభోగాలు తనకెందుకని కోపించి,త్యజించి ,అన్నదగ్గరకు వెళ్ళి రమ్మనిబ్రతిమాలి, ఆయన రాకుంటే నందిగ్రామములోనే నివసిస్తూ కఠినముగా తనశరీరాన్ని దీక్షలకు గురిచేసి బాధ్యతలను అన్నతరపున నిర్వహించిన భరతుడు అన్నదమ్ముల ప్రేమకు నిలువెత్తు నిదర్శనము. మీకు మీ స్వార్ధాన్ని త్యాగం చేసి అన్నదమ్ములకోసం పరితపించే మనసువున్నదా? అన్నదమ్ములకోసం అవసరమయితే మీ ధనాదులను కూడా వదలుకోగల సౌజన్యము త్యాగనిరతి మీకున్నదా? అప్పుడు మీరు రామాయణాన్ని విమర్శించ్టానికి ప్రయత్నం చెయ్యొచ్చు. ఇంకొంచెమ్ముందుకు పోదాము.

4....................... తండ్రి చనిపోయినా, తమ్ముడువచ్చి పిలచినా పెద్దలు సర్దుబాటు పద్దతులు చెప్పినా, జాబాలి లాంటివారు నాస్తిక వాదన చేసి మనసును మల్లించటానికి చూసినా చలించలేదు తన సత్యవాక్పాలననుండి. రాముడు. అవకాశము వచ్చినా ఋజుమార్గమునుండి పక్కకు మల్లని ఆత్మధైర్యం మీకున్నదా?

5......................అడవిలో వున్నప్పుడు అందగత్తెగా సూర్పణక వచ్చి వలచినది, ఎగతాళి చేసి పంపినాడెకాని పరస్త్రీని తప్పుభావనతో చూదలెదు. పెల్లాం పక్కనేవున్నా, చక్కగా వున్న పక్కవారిని దొంగచూపులు చూసే బుద్ధి మీకులేదుకదా? అది సినిమా హీరోఇన్లనయినాసరె. పరస్త్రీలను కాముకదృష్టితో చూడని గొప్ప ,చలించని మనోనిగ్రహం కలవారు రామాయణాన్ని విమర్శించేందుకు ఒక అర్హతకలవారు కావచ్చనుకుంటా?

6.. ......... భార్యను ఎవడో దుర్మార్గుడపహరిస్తే దు\:ఖాతిశయముతో మతిని కోల్పోయినవాలివలెనయి. ప్రతి చెట్టునూ పుట్టనూ నాసీత ఎక్కడ అంటూ విలపించిన ఆస్వామి ప్రేమకంటే మీ భార్యపట్ల ఇంకా ఎక్కువ ప్రేమ కలవారు ఐతే మీరు ముందుకు సాగవచ్చు. తన కు భార్య లేకుంటే యాగానికి అనర్హుడనైనప్పుడు బంగారు బొమ్మను పెట్టుకున్న ఆతండ్రి ఏకపత్నీ వ్రతమెక్కడ? సందుదొరికితే సెకండ్ సెటప్ పెట్టటానికి వెనుకాడని ఈ నాటి మాయ ప్రేమలెక్కడ. రాముని వంటి ప్రేమ మీకున్నదా? పరిశీలించండి. మీమనసులో మీ భార్యపట్ల.

6..... సహాయము కోరిన సుగ్రీవునికంటే వాలి బలవంతుడు.తనపని సులభముగా చేసి పెట్టగలడు. ఐ నా సరే నమ్మిన వారిని కాపాడెందుకే మొగ్గుచూపాడా కాని తనపనిజరుగుతుందికదా అని అవినీతిపరుడిని ఆశ్రయించలేదాయన. మన జీవితాలలో అవసరానికనుగుణంగా అభిప్రాయాలు మార్చుకునేవారము, అవసరమయితే లంచాలిచ్చి పనిచేసుకునేవారు , నమ్మిన వారిని అవకాశమొస్తే వదలివేయనివారు గావున్నవారు విమర్శకులవవచ్చు.

7....శరణని వచ్చిన విభీషణునే కాదు ,అవసరమయితే అభయమడిగితే రావణునయినా రక్షిస్తానని పలికాడు రాముడు. అంతటి క్షమాగుణసంపన్నులు. వున్నారా మనలో?

8.... యుద్ధములో మూర్చిల్లిన లక్ష్మణునికోసం చిన్నపిల్లవానిలా ఏడ్చిన సోదరప్రేమ ,సూర్యుని ఉదయాన్ని సహితమాపటానికి ప్రయత్నించిన పరాక్రమ శక్తి కలవారమా మనము?

9.... ...... యుద్ధము ముగిసిన తరువాత తన ప్రాణాధిదేవత ఎదురొస్తుంటే ,తనలో ప్రేమోద్వేగాన్ని అణచుకుని ధర్మానికి కట్టుబడి ధర్మ రక్షకునిగా తన అచరణ లో ఏలోపము లేకుండా వుడేందుకు కఠినంగా వ్యవహరించవలసివచ్చ్నప్పుడు ఎంతవేదనననుభవించాడో ఎవరికెరుక. ఆతల్లి పరమ పవిత్రురాలని తెలుసు. లేకుంటే అసలు యుద్ధప్రయత్నమే చేసేవాడుకాడు. కానీ లోకం సత్యాన్ని ప్రత్యక్షప్రమాణముతోగాని నిర్ధారించదు. రేపురాజుగా పరిపాలనసాగించేటప్పుడు., తాను శిక్షలు విధించినప్పుడు ఎవరూ తమ మనసులోకూడా రాముని గురించి సీతగురించి తక్కువగా మాట్లాడకూడదు. కనుకనే సీత పవిత్రత ఇక్కడే నిరూపించి చూపాలి .ఆశక్తి ఆపతివ్రతామతల్లికి వున్నదని పూర్ణముగావిశ్వాసం రామునికి .అందుకే అగ్ని పరీక్షకు ఆదేశించాడు. వాస్తవానికి ఆయన వాళ్లు అన్నదమ్ములేలా కాలక్షేపము ,తప్ప మరొకటికాదు కల్పిమ్చుకున్నది,తనశక్తి చూపి భవిష్యత్ తరాలకు పాతివ్రత్యమహిమ తెలిపేందుకు.

అంతేకాక ఇక్కడొక సూక్ష్మామ్శమున్నది. అదిధర్మానికి సంబంధించినది . ఏపాపం ఎరుగని లక్ష్మనుని నానా మాటలు అన్న పాపఖర్మ కొంత అనుభవించవలసి వున్నది. ఆరోజు లక్ష్మణుడు ఎంత దు:ఖానికి లోనయ్యాడో ఆతల్లికికూడా అనుభవపూర్వకంగా తెలియవలసి ఉన్నందున ధర్మ రక్షకునిగా తనమన చూడకుండా శిక్ష విధించాడు రాముడు

.తమవద్దకొచ్చేసరికి. ధర్మాన్ని తప్పే న్యాయమూర్తి కాదాయన. అలా జరగకున్నట్లయితే నాడుసీతామాత గురించి మాట్లాడిన చాకలిని అనుసరించి మాట్లాడెదేమో లోకం . భార్య లేకుంటే బంగారపు బొమ్మను ప్రతిగా పెట్టుకుని యాగం సాగించాడే కాని ఎకపత్ని వ్రతాన్ని విడనాడలేదు. తుచ్చమయిన శారిరికసౌఖ్యాలకోసం తనమనసులోని ప్రేమమూర్తిని తొలగించి మరొకరికి ఆవకాశం ఇవ్వలేదు . భార్య పోగానే నాలుగురోజులకు ప్రేమను మరచి కొత్తభార్యకోరకు ఎదురుచూసే ఇప్పటి వారికి రాముని ప్రేమను అనుమానించే ఆవకాశం ఎలా వుంటుంది.?

లోకానికి ధర్మాన్ని చెప్పవలసిన రాజు తానూ మనసా వాచా కర్మణా సత్యాన్ని పాతిమ్చగాలిగితేనే ఆపదవికి న్యాయం చేసినవాడవుతాడు. లేకుంటే ప్రజలపాపాలకు ఆటను కారణమవుతాడు. అడినిరూపిమ్చి, మానవుఅలలో పాలకులు ఎలా నడవాలో చూపించాడు. తానుఎన్నిబాధలు సాహిమ్చయినా? అది తెలిసిన పూర్వపు నాయకులు సర్వస్వాన్ని వదులుకుని నిజమయిన ప్రజాసేవకులుగా చరిత్రలోకేక్కారు. తమస్వార్ధమేతప్ప ధర్మంతెలియని వారు నాడూ నేడూ ప్రజలను దోచుకుని లోకకంటకులయిన పాలకులుగా మారుతున్నారు. కులం మతం పార్టీలు తప్ప అతను dharmaatmuDaa? కాదా అనే విచక్షణ చేయకుండా వాళ్ళను ఎన్నుకుంటున్న మనం మన మనోస్తితితో రాముని లాంటి నాయకుని ప్రవర్తనను తప్పులెన్నటానికి ప్రయత్నిస్తున్నాము.

బిడ్డగా,అన్నగా, భర్తగా స్నేహితునిగా, రాజుగా ,ధర్మరక్షకునిగా,ప్రేమమూర్తిగా ఆయన లోకం గుండెలలో నిలచిపోయాడు. ఆయన ప్రేమతత్వాన్ని తట్టుకోలేని అసూయాగ్రస్తహృదయాలు ఆయన చరితకే కళంకం తేవాలని ప్రయత్నించి విఫలమవుతున్నాయి. కొన్ని ప్రక్షిప్తాలను చేర్చి అందుకు ప్రయత్నించిన సంఘటనలున్నాయి. వాటిలో ఒకటి విన్నవిస్తాను.

రాముడు సంభూకుని వధించాడు అని.ఒక ప్రక్షిప్తాన్ని చొప్పించారు. మధ్యలో ఎవరో మూర్ఖులు. వాల్మికి గాయత్రి మంత్రాక్షరాల సంఖ్యలో 24000 శ్లోకాల తో గ్రంథ రచన సాగించినట్లు తెలుస్తున్నది. కాని ఉత్తరరామాయణములో దిఇన్ని ప్రక్షిప్తము చేసారని చరిత్రకారుల అభిప్రాయము. గుహుడు,శబరి,వానరులు పక్షులను సహితము ఆదరించి వారి తపస్సులను ఫలిమ్పజేసిన స్వామి తపోదీక్షలో వున్న శంభూకుని ఎందుకు చంపుతాడు. కాలప్రవాహములో రాగిచెంబుకు చిలుము పట్టినట్లు మహాగ్రంతాలలో కూడా కొందరు ఆనాడున్న స్వార్ధపరులు తమచర్యలకు ప్రమాణము చూపిమ్చుకోవటానికి ఘాతుకానికి ఒడిగట్టినట్లున్నది. దీనిమీద సమగ్రపరిసోధన చేసిన వారు చెబుతున్న మాటయిది. , విషజంతువులు విషవృక్షాలు రామాయణ కల్పతరువును ఏమీ చేయలేక అలా మరుగునపడి పోతూనే వున్నాయి. కానీ అవికక్కిన కొన్ని విశబిమ్దువులు మాత్రం మానవ మనస్సులను కల్లోలపరుస్తున్నాయి.


సముద్రములో రత్నాలను ఎన్నిఏరినా ఇంకా దొరుకుతూనే ఉంటాయి .రామాయణాన్ని దాని ప్రభావాన్ని వర్ణించటం చుక్కలు లెక్కపెట్టటం లాంటిదికనుక . నాఅసమర్ధతను చెప్పుకుంటున్నాను.

లోకానికి రీతి,నీతి బోధించటానికి అవతరించిన సీతారాముల ప్రేమలో లోపాలెంచకండి. సత్గ్రంథాలను ,సత్పురుషులను విమర్శిమ్చటము పాపమయి చుట్టుకుని వేధిస్తుంది.

ఇక దేవుని నమ్మక పోయినా ఫరవాలేదు. సత్య ధర్మాలను నమ్మే వారుగా ,లోకహితిభిలాశులుగా వున్న మిగతావారుకూడా రాముని మమ్చిగుణాలను ఎన్నింటిని మనం ఆచరించ గలుగుతున్నామో వాటివలన లోకానికి కలిగే మేలును పరిసిలిమ్చుకుని సాగండి విమర్సించటమే గొప్పకాదు,మనవున్నతికి పనికిరాదని గమనించి అందులోని మంచిని మన భవిష్యత్తరాలకు అందించే ప్రయత్నం చేయండి . మనజాతి మరికొన్ని యుగాలు మహోన్నతంగా బ్రతకటానికి. ఆచరణ లేకుండా వాదులాటే ప్రధానంగా సాగే వివరణలకు నేను జవాబు చెప్పినా మీకు నాకు సమయము వ్రుధా తప్పమరొకటికాదు, కనుక మనపిల్లలకు రామాయణం నేర్పుదాము vaaLLu annadammulelaa



Read more...

>> Friday, October 24, 2008


Read more...

రాక్షసులు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు ?

>> Wednesday, October 22, 2008


రాక్షసులు అనేపదం వినపడగానే మనమనస్సులో ఒకరకమయిన భయం, వారి దోషపూరిత ప్రవర్తన ,వారిపట్ల అసహ్యం కలుగుతాయి. ఎందుకంటే వారిగురించి వారి మనోభావాలగురించి మనం విన్న కథలు అలా మనమనస్సులో ముద్రలువేశాయి. ఇక పూర్వం వారి ఆకారములు ,ప్రవర్తనలు ఎలావున్నా ఉగాలననుసరించినా వారిబుద్ధులు మాత్రం మారలేదు. అటువంతి బుద్ధికలవాడు రాక్షసునిగానే వర్ణింపబడుతున్నాడు.

మొదటిలో అంటే కృతయుగములో రాక్షసులు జలములలోనివసించేవారట. అక్కడనుండే లోకానికి ఉపకారం చేసే వేదాలను దొంగిలించటం లాంటివి చేయటమువలన భగవంతుడు మత్స్యావతారమెత్తి.,వరాహావతారములెత్తి వారిని సంహరించాడు. ఇలాకాదు అని వాళ్ళు నీళ్ళమధ్యలో దీవులలోచేరి లోకములో దుర్మార్గలుచేయటముమాత్రమేకాక,ఆభావాలను వ్యాపింపచేయాలని ప్రయత్నించారు. అయితే అప్పుడుకూడా ఆయన రామాది అవతారాలను దాల్చి వాళ్లను నిర్మూలించాడు. ఇలాకూడా లాభమ్లేదు మనకార్యం నెరవేరాలంటే మనం మానవుల బంధువర్గంగా మారాలని సంకల్పించి , కంస,దుర్యోదన,జరసంధ,శిశుపాలాది రూపాలలోమానవులకు మరింత దగ్గరగా బంధువర్గంగా మారి భూమిపై తమ ధర్మాన్ని విస్తృతం చెయ్యాలని తీవ్రంగా ప్రయత్నించి చాలావరకు మానవజాతిని తమకనుకూలముగా మార్చగలిగారు. ఆయనకూడా ఊరుకోకుండా కృష్ణావతారమెత్తి. ,సద్బుద్ధికలిగిన మానవులద్వారానే వారిని ఊచకోత కోపించి ,మానవుల కర్తవ్యాన్ని తెలియపరచాడు.
ఇక మనం బయటవుంటే వాసుదేవునినుండి మనం తప్పించుకోలేము .ఆయనకుదొరకకుండా వుండేందుకు ఎక్కడచేరి మనప్రయత్నాలు సాగించాలా అని బాగా ఆలోచించి ఈ కలియుగములో మానవమనస్సులలో నివాసము ఏర్పరచుకున్నారు. అక్కడనుండి తమపనులు కొనసాగిస్తున్నారు. అందుకే మనలో కోపాలు,ఈర్ష్య ,అసూయాది గుణాలు ,ధర్మవిరుద్ధమయిన ప్రవర్తన ,భగవంతుని ఉనికిని వ్యతిరేకించటం ,సాటిజీవులపట్ల జాలిలేకపోవటం లాంటి లక్షణాలు పొడసూపుతున్నాయి. మనలోనే నివాసమున్న ఈ రాక్షసజాతి మనమాదమరచివున్న సందర్భములో మనమనస్సును అరిషడ్వర్గాలవైపు మల్లించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఆదమరచామో మనలో వారిగుణాలు ప్రజ్వరిల్లుతుంటాయి. భగవన్నామమనే కవచాన్ని ధరించి ప్రేమ,శమదమాదులనే ఆయుధాలులు ధరించి జాగురూకులమై ఉండాలి .వాళ్ళు తలెత్తిన ప్రతిసారీ చావుదెబ్బతీయాలి. ఇది చాలా కష్టతరమయిన పోరాటం. ఎదుటవున్న శత్రువునయితే కనిపెట్టి వుండవచ్చు. లోపలున్న ఈ రాక్షసులను కనిపెట్టిఉండటమే పెద్ద కస్టం .ఇక యుద్ధమెంత కఠినమో ఆలోచించాలిమనం. ఏమాత్రం అజాగ్రత్తగావున్నా మనపతనం ఖాయం. తస్మాత్..జాగ్రత్...జాగ్రత్...

Read more...

రాక్షసులు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు ?

రాక్షసులు అనేపదం వినపడగానే మనమనస్సులో ఒకరకమయిన భయం, వారి దోషపూరిత ప్రవర్తన ,వారిపట్ల అసహ్యం కలుగుతాయి. ఎందుకంటే వారిగురించి వారి మనోభావాలగురించి మనం విన్న కథలు అలా మనమనస్సులో ముద్రలువేశాయి. ఇక పూర్వం వారి ఆకారములు ,ప్రవర్తనలు ఎలావున్నా ఉగాలననుసరించినా వారిబుద్ధులు మాత్రం మారలేదు. అటువంతి బుద్ధికలవాడు రాక్షసునిగానే వర్ణింపబడుతున్నాడు.

మొదటిలో అంటే కృతయుగములో రాక్షసులు జలములలోనివసించేవారట. అక్కడనుండే లోకానికి ఉపకారం చేసే వేదాలను దొంగిలించటం లాంటివి చేయటమువలన భగవంతుడు మత్స్యావతారమెత్తి.,వరాహావతారములెత్తి వారిని సంహరించాడు. ఇలాకాదు అని వాళ్ళు నీళ్ళమధ్యలో దీవులలోచేరి లోకములో దుర్మార్గలుచేయటముమాత్రమేకాక,ఆభావాలను వ్యాపింపచేయాలని ప్రయత్నించారు. అయితే అప్పుడుకూడా ఆయన రామాది అవతారాలను దాల్చి వాళ్లను నిర్మూలించాడు. ఇలాకూడా లాభమ్లేదు మనకార్యం నెరవేరాలంటే మనం మానవుల బంధువర్గంగా మారాలని సంకల్పించి , కంస,దుర్యోదన,జరసంధ,శిశుపాలాది రూపాలలోమానవులకు మరింత దగ్గరగా బంధువర్గంగా మారి భూమిపై తమ ధర్మాన్ని విస్తృతం చెయ్యాలని తీవ్రంగా ప్రయత్నించి చాలావరకు మానవజాతిని తమకనుకూలముగా మార్చగలిగారు. ఆయనకూడా ఊరుకోకుండా కృష్ణావతారమెత్తి. ,సద్బుద్ధికలిగిన మానవులద్వారానే వారిని ఊచకోత కోపించి ,మానవుల కర్తవ్యాన్ని తెలియపరచాడు.
ఇక మనం బయటవుంటే వాసుదేవునినుండి మనం తప్పించుకోలేము .ఆయనకుదొరకకుండా వుండేందుకు ఎక్కడచేరి మనప్రయత్నాలు సాగించాలా అని బాగా ఆలోచించి ఈ కలియుగములో మానవమనస్సులలో నివాసము ఏర్పరచుకున్నారు. అక్కడనుండి తమపనులు కొనసాగిస్తున్నారు. అందుకే మనలో కోపాలు,ఈర్ష్య ,అసూయాది గుణాలు ,ధర్మవిరుద్ధమయిన ప్రవర్తన ,భగవంతుని ఉనికిని వ్యతిరేకించటం ,సాటిజీవులపట్ల జాలిలేకపోవటం లాంటి లక్షణాలు పొడసూపుతున్నాయి. మనలోనే నివాసమున్న ఈ రాక్షసజాతి మనమాదమరచివున్న సందర్భములో మనమనస్సును అరిషడ్వర్గాలవైపు మల్లించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఆదమరచామో మనలో వారిగుణాలు ప్రజ్వరిల్లుతుంటాయి. భగవన్నామమనే కవచాన్ని ధరించి ప్రేమ,శమదమాదులనే ఆయుధాలులు ధరించి జాగురూకులమై ఉండాలి .వాళ్ళు తలెత్తిన ప్రతిసారీ చావుదెబ్బతీయాలి. ఇది చాలా కష్టతరమయిన పోరాటం. ఎదుటవున్న శత్రువునయితే కనిపెట్టి వుండవచ్చు. లోపలున్న ఈ రాక్షసులను కనిపెట్టిఉండటమే పెద్ద కస్టం .ఇక యుద్ధమెంత కఠినమో ఆలోచించాలిమనం. ఏమాత్రం అజాగ్రత్తగావున్నా మనపతనం ఖాయం. తస్మాత్..జాగ్రత్...జాగ్రత్...

Read more...

కుంకుమార్చన[ వీడియో]

>> Tuesday, October 21, 2008


Read more...

నిను నమ్మినవారికెన్నడు నాశములేదుకదమ్మ ఈశ్వరీ !


అమ్మను నమ్మినవారికెన్నడు నాశములేదు సకల పురాణాలు .భక్తుల జీవిత గాథలు ఎలుగెత్తి చాటుతున్నాయి . ఇలాంటి ఒక అనుభవం నాకుతెలిసినది మీకు వివరిస్తాను. నాకు పెల్లయిన కొత్తలో గుంటూరుదగ్గర కోవెలమూడిలో ట్యూషన్స్ చెప్పుకుని జీవిస్తున్న నాభార్యతరపుబంధువు వీరనారాయణ గారింటికి వెల్లాము. వాల్లుచాలా కష్టములలొవున్నారు. ఆయన చిన్నతనమునుంచి గుంటూరులో పలుపనులను చెస్తూ చదువుకుని పెల్లయాక కూడా ఏపనిలొ స్తిరత్వముదొరకక కాలం వెల్లదీస్తున్నారు. కోవిలమూడివాసులు కొందరిసహాయం చేసి ఆయన చేత ట్యూషంస్ పెట్టించారు. మమ్మల్నెంతో ఆదరించారు. తరువాత నాతో త్వరగా కలసిపోయి తనమనసులోబాధలన్నీ నాతోపంచుకున్నాడు. తమస్వగ్రామమయిన గంగదొనకొండలో పొలాలువున్నా నీటివసతిలేక ఇక్కడకు వలసవచ్చామని ,తమముగ్గురుఅన్నదమ్ములలో ఇద్దరు స్థిరపడ్డా తనపరిస్థితే ఇలావున్నదని,దేనిలోనూ స్థిరత్వం దొరకటం లేదని బాధపడ్డాడు. తన అన్నగారు అతనిమిత్రుడు రాజకీయనాయకుడైనకన్నాలక్ష్మీనారాయణ[ప్రస్తుతము మంత్రివర్యులు] దగ్గరవుంచి జీతం ఏర్పాటుచేసినా తానే నిలబడలేక పోయానని వాపోయాడు. ఒకసారి పీఠందగ్గరకొచ్చి అమ్మను దర్శించుకొమ్మని చెప్పివచ్చాను. తరువాత అతనువచ్చి పోవటం జరుగుతూవున్నప్పుడు, నాతోపాటు ఒకసారి భవానీ మాలను ధరించమని ,ఆతల్లి కరుణవుంటే ఎటువంటి దరిద్రాలూ తొలగుతాయని చెప్పాను. ఆయనకూడా అంగీకరించి మాలాధారణచేసాడు. అప్పటినుండి ఆయనకు ఏపనిచేసినా కలసిరావటము, తానుకూడా ఏదయినా సాధించ గలుగుతాననే నమ్మకముకలిగినది. రెండుమూడుసంవత్సరాలలో అతని అత్తగారివూరయిన లేమల్లెపాడుచేరి అక్కడ కూడా ట్యూషన్ లు చెప్పుకుంటూ ,ఇతర చిన్నచిన్న బిజనెస్ చేస్తూ సంతోషముగా కాలం గడుపుతున్నాడు. ఇలావుండగా ఒకసారి వ్యాపారం పనుమీద విజయవాడవెళ్ళినప్పుడు అతని స్నేహితుడు కనపడి, ఒక కొత్త స్వామీజీ ఆశ్రమానికి తీసుకువెళ్ళాడట. అక్కడ ఇతనికి ఏమితీవ్రంగా తలకెక్కినదో గాని ఇంటికొచ్చాక ఇంటిలోపటాలన్నీ వాళ్ళ ఆవిడ వారిస్తున్నా వినకుండా తీసివేసి ,ఇప్పుడు వీళ్ళందరూ అవతారాలు చాలించిన దేవుళ్లు, ఇడిగో ఈకొత్తస్వామీజీయే దేవుడు అంటూ ,కొత్తాదేవుడండీ... అనేపాటలు పాడుతూ అపర కల్కి ఈభగవానులు అంటూ తెలిసినవారికందరికీ బోధించటం చెయ్యసాగాడు. తాజెడ్డకోతి వనమెల్లా చెరిచిందన్నట్లు ,ఆవూర్లోవున్న తన బంధువులకు కూడా ఈ పిచ్చి ఎక్కించాడు. తరువాత ఒకసారి నేను వెళ్ళినప్పుడు నాకు కూడా వివరించటం మొదలుపెట్టాడు. నేను అనేకరకాలుగా ప్రస్నించట తో సమాధానాలు చెప్పలేక మౌనం వహించాడు. వాలావిడ మాత్రం ఏమిటొనయ్యా ఈయన చాదస్తం చక్కగా చేసుకుంటున్న అమ్మవారి పూజను ఆపుచేసాడు. నేనెంతచెప్పినా వినటం లేదు. అనిబాధపడింది. దరిద్రం తలకెక్కినప్పుడు క్షేమకరమయిన మాటలు రుచించవు నువ్వన్నాపూజచేసుకోమ్మా అనిచెప్పి నేను వచ్చేశాను. ఆతరువాత రెండుసంవత్సరాలు నేను అతనిదగ్గరకు పోవటం కుదరలేదు .

ఈమధ్యకాలములో అతనికి అతనితోడల్లునికి పెద్ద ఆలోచనవచ్చినది. ఇక్కడ ఎంతకష్టపడితే ఏముంది ,మనస్వగ్రామములో పొలంవున్నదికదా? అక్కడకు వెళ్ళి బోర్లేపించి , పల్లతోటలు ,మధ్యలో కూరగాయలు ఇలా ఏడా పెడా పంటలు పండించేస్తే మనం హైదరాబాద్ కుకూడా కూరగాయలు సరఫరాచేసి నాలుగేళ్లలో తీరిపోవచ్చుఅని చిటికెల పందిర్లు అల్లుకుని ఒకమంచి ముహూర్తమ్లో తట్టాబుట్టా సర్దుకుని ప్రకాశం జిల్లా గంగదొనకొండకు బయలుదేరారు. వెళ్ళేటప్పుడే దారిలో ఇతని బట్టలు పెట్టిన బ్యాగ్ జీపుమీదనుంచి ఎక్కడో జారిపడిపోయినది. వంటిమీదబట్టలు ,వేరేవాటిలోపెట్టిన లుంగీలు ఎర్రవి[అమ్మవారిమాలకు వుపయోగించినవి] మాత్రమేమిగిలాయి. ఇక వెల్లాక తమదగ్గరున్న డబ్బుఖర్చుచేసి బోర్లు ప్రయత్నించారు , బీడు భూములయిన వాటిలో చుక్కనీరు పడలేదు .బ్యాంకులోలోనుకూడా తెచ్చి పత్తి పంటను వేశారు. అదికాస్తా తెగుల్లతో హరీమన్నది. మరుసటి సంవత్సరం తన తోదల్లుడు పీఛేమూడ్ అంటూ ఇతన్ని వదలి తనకాపరం తరలించుకువెల్లాడు. మొండిగా ఇతను మరల పత్తి,ఆముదాలు వేశాడు, ఆరెండుసంవత్సరాలు సరిగా వర్షాలు లేవు. ఆప్రాంతమ్లో వున్న పెద్దరైతులే తరలివెళ్ళిపోతున్న సమయమది.
దీనికి తోడు ఈయన తన కల్కి భగవానులు ప్రార్ధిస్తే చాలు కనపడతారు రమ్మని బోధించటం వచ్చిన జనం ఇతనిని ఎగతాళి చేయటం ,ఇత నిని పిచ్చివానిక్రింద పరిగణించే స్టేజీకొచ్చినది పరిస్థితి. పాపం ఆఇల్లాలు మానవతి. ఎప్పుడూ ఇంతకష్టమెరగకపోయినా ఎర్రనిఎండలో కష్టపడుతున్నా ఈయనను పల్లెత్తి మాట అనకుండా , పరమ దరిద్రాన్ననుభవిస్తూకూడా భర్తకు. అండగానిలిచిఉన్నది.

ఆసంవత్సరం పంటదెబ్బతిన్నది .అదీకాకఅన్నదమ్ములకు డబ్బుచెల్లించి వాళ్ల భాగం పొలంకూడా ఇతనేకొనుక్కుని వున్నడబ్బుకూడా కాగొట్టుకున్నాడు. ఇంటిలో గడవటం కూడా కష్టముగావున్నది. ఈసమయం లో దరిశివెళ్ళిన నేను అటునుంచి వారి వూరువెళ్లాను. మిట్టమధ్యాన్నం నేను వెళ్ళెసరికి ఆయన ఎర్ర లుంగీ కట్టుకుని ఆముదపుకాయలు ఎండలోపోసి నలగగొట్టుకుంటున్నాడు. చూడగనే మనస్సు చివుక్కుమన్నది. పాపం ఇద్దరు పిల్లలు ఆవిడ సరయిన బట్టలుకూడాలేక పరిస్థితి దయనీయంగావుంది. నన్ను ఆదరించి పలకరించినా అన్నానికి రమ్మనటానికి కూడా సందేహిస్తున్నారు. నాకు పరిస్థితి అర్ధమయినది. ఎందుకొచ్చిన బాధలయ్యా బావగారూ ,హాయిగాబ్రతికేవానివి నీకేమిటీస్థితి అని అంటే ఆయనేదో చెప్పుకొస్తున్నాడు. ఆతల్లి మాత్రం నువ్వుచెప్పాక అమ్మవారిపూజ మొదలు పెట్టాక బాగున్నస్థితి ఈయన పటాలుతీపించి నతరువాత దిగజారి ఈస్థితికి తెచ్చినది అని బాధపడినది. నీవన్నా చేయవచ్చుగదమ్మా పూజ అని చెబితే ,ఆయన కిష్టం లెకుండా ఏమిచెయ్యను అని కళ్లవెంట నీరుపెట్టుకున్నది. సరేనని నేను బయలుదేరగా అక్కడికి 2 కిమీ దూరమ్లోగల పొట్లపాడు రైల్వేస్టేషన్ కు నన్నెక్కించటానికి వచ్చాడు. అక్కడ బండిరావటం 2గంతలు లేటవటంతో కూర్చోబెట్టి. మనపెద్దలు చెప్పిన మార్గాన నడవాలి. కలియుగమ్లో వీధికొకదేవుడు పూటకొక దైవం గాప్రకటించుకునేవారువస్తారని భవిష్యపురాణం ,భాగవతం, బ్రహ్మంగారి కాలజ్ఞానాదులు హెచ్చరిస్తున్నాయి ,అని నాకు చేతనయినన్ని రీతులలో చెప్పినా ,ఆయనదొకటే మాట ,ప్రస్తుతము భూమిమీద మా కల్కేదేవుడు. ఇతరదేవతలనుకొల్చేవారు తెలివితక్కువవారుఅని. బుద్ధికర్మానుసారణి అనుకుని రైలెక్కి వచ్చేశాను. అమ్మా మహామాయవు నీవు జీవులను నీమాయలోనుండి బయటపడవేయడం నీకుతప్ప అన్యులకు సాధ్యం కాదు. నిన్ను నమ్మిన జీవులకెపుడు నాశము లేదని చెప్పే శాస్త్ర వాఖ్యానికి లోటురానీయకు అని మనసులో చెప్పుకున్నాను.
ఆతరువాత వచ్చిన శుక్రవారం జరిగినదొక చిత్రం . అప్పటివరకూ మౌనంగా బాధలు భరిస్తూవచ్చిన ఇల్లాలు, ఆవేశంతో నీనుండే మనకిన్ని కష్టాలు ,అమ్మను వదలిన నాటినుండి మనకుబాధలే అని ఎదురుతిరిగి ఆశుక్రవారము అమ్మవారి పటం శుద్ధిచేసుకుని పూజ జరుపుకున్నది. ఆతరువాత వారి పుట్టినవూరు లేమల్లెపాడు వెల్లిన వీరనారాయణగారిని ఆగ్రామస్తులు మందలించి. నిన్నెవరు వెళ్ళమన్నారయ్యా ! ఎందుకు పడుతున్నావీ బాధలు వెంటనే వచ్చెయ్ .మేము పిల్లలను నీవద్దకే చదువుకోవటానికి పంపుతామని ఆత్మీయంగా చెప్పారట. ఆయన తిరిగివచ్చి తనభార్యాబిడ్దలను తీసుకుని అక్కడ పొలాలు ఆగ్రామమ్లో నే కౌలుకు అప్పగించి లేమల్లెపాడుచేరాడు. అక్కడనుండి ఆయన పరిస్థితి మరలా చిన్నగా గాడిలోపడింది. తరువాత గుంటూరుచేరి అబ్బాయిని పాలిటెక్నిక్ చేపించుకుని అమ్మాయినికూడా ఇంటర్ పూర్తిచేపించి ప్రస్తుతం హైదరాబాద్ లో ఇంజనీరిగ్ చేపిస్తున్నాడు. తానుకూడా హైదరాబాద్ ,బాలానగర్ లోగల లయన్స్ క్లబ్ వారి కంటిఆసుపత్రిలో వుద్యోగములోచేరి చక్కగా జీవితంస్థిరపరచుకునేదారిలోవున్నాడు. అడిగినవారందరికీ అమ్మ తనను రక్షించిన విధానాన్ని ఆర్తితో చెబుతుంటారాయన. అందుకే అన్నారు తల్లీ నిన్నునమ్మిన వారిని ఎన్నడూ నీవు చేయివదలక నడిపిస్తావని. యాదేవీసర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా..నమస్తస్యై ,నమస్తస్యై .నమస్తస్యై నమోనమ:

Read more...

అధ్యాత్మిక దివ్యజ్యోతి అవధూత చివటం అమ్మ.

>> Saturday, October 18, 2008

సూర్యుడు చంద్రుడు,నక్షత్రాలు ప్రకృతిలో వివిధరూపాలలో ఎంత శోభాయమానంగా మనదృష్టినాకట్టుకుంటాయి. . ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతతతో మనలనాకర్శిస్తాయి. కానీ ఇవన్నీ ఏ ఆకాశములోనయితేవున్నాయో అదివాస్తవానికి వీటన్నిటికంటేఅద్భుతమైనదయినా మనలను ఆకట్టుకోదు. పరిపూర్ణ అవధూతస్తితిలోవున్న మహాత్ములుకూడా ,మనలను చిల్లర మహిమలను మంత్రశక్తులను ప్రదర్శించేవారిలా ఆకర్శించరు. అటువంటి మహాత్ముల కోవకు చెందినదే అవధూత చివటం అమ్మ.


సాధుఅమ్మగా ప్రసిద్ధమయిన దిగంబరయోగిని చివటం అమ్మ అసలుపేరు అచ్చమ్మ. తణుకు సమీపాన గల చివటం గ్రామములో సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించిన ఈ తల్లి భర్తబాధ్యతారాహిత్యంగాతిరిగినా ఇరుగు పొరిగిండ్లలో పనిచేసి భర్తకు బిడ్డకు వండిపెట్టేవారు. భర్త దుర్మార్గుడయి కొట్టినా పల్లెత్తి మాట అనేదికాదు. ఆమెకు రామనామమంటే ప్రీతి. గ్రామస్థులదగ్గర అడిగితెచ్చిన బియ్యం పప్పు వండి పిల్లలందరికీ తినిపించటం ఆమెకు ఇస్టమయిన పని. కాలాన్ని వ్యర్ధంగా గడపక ,పనిచేసే సమయములోకూడా రామనామాన్ని స్మరిస్తూవుండేవారట. ఖాళీదొరికితే ధ్యానానికి కూర్చొనేవారు. అటువంటి అచ్చమ్మ ఒకరీజు కొడుకును తనతల్లికి అప్పజెప్పి ఇల్లువిడిచివెళ్ళిపోయారు. కొన్నాల్లు ఆమె చిన్నాయిగూడెమ్లో వున్నారు. ఆరోజులలో ఆతల్లి నోటివెంట కృష్ణా,రామా అనేపదాలుతప్ప మరేమీవచ్చేవికావు. తరువాత మన్నెం జగన్నాధపురం వెళ్ళి ఆప్రాతమ్లో 12సం. మౌనంగా కఠిన దీక్షలు చేసారట. అక్కడ ఎన్నోలీలలు ప్రదర్శించేవారని ఇప్పటికీ చెప్పుకుంటారు అక్కడ. రాజమండ్రి స్త్రీల మఠములో కొంతకాలముండి,చివటం చేరారు.
చివటం లో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడక తన్మయస్థితిలో బట్టలుకూడా జారిపోతున్నా తెలియని స్తితిలో వుండేవారు. ఒకరోజు జారిపోతున్న తనచీరను తీసి ఒకబాలునిపైవేసి అప్పటినుండి దిగంబరంగావుండిపోయారు. అమ్మ చివటం సమీపములో జమ్మిచెట్టుక్రింద ధ్యానం చేసుకుంటుండేవారు. ఎవరయినా అడిగితే కాయలు కాయని చెట్టుక్రింద కూర్చోవాలి అనేవారు.
ఎక్కువకాలం అమ్మ స్మశానములో గడిపేవారు. అప్పుడప్పుడూ మూడు ఇల్లకుమాత్రమే బిక్షకువెళ్ళేవారు. బిక్షచేతిలోవుంచుకుని పరుగులు తీసేవారు. తనగురించి,శరీరసృహేలేకుండా చిదానందస్థితిలోవుండేఆమెకు గ్రామమ్లోనివారే మంచిచెడ్దలు చూసేవారు. శేషమ్మగారని ఒకావిడ బలవంతంగాతీసుకెళ్ళి స్నానము చేపించేవారు. చివటములో అలా 12 సంవత్సరాలు ధ్యానం లో గడిపారు.

మహాత్ములుకూడా ఆమెదర్శనం కోసంవచ్చేవారు. అయితే వచ్చనవారిపాదాలను తాకినమస్కరించేవారు అమ్మ. ఎదగటమ్లో ఎలావొదగాలో సాధకులకు చేసిచూపించారు అమ్మ. సాధూరాం బాబాజీ శిష్యులయిన హఠయోగి అప్పారావుగారికి కూడా అమ్మ అలానమస్కరించబోగా ఆయన బాధపడి, అమ్మా నువ్వుపండిపోయావు నేనింకా పండవలసినవాడిని అనిఅన్నారు.
ధ్యానం ఎలాచెయ్యాలి అని అడిగిన భక్తులతో, మొదట ఓమ్ కారంచెయ్యాలి ,ఆతర్వాత రామరామ అనుకుంటూ మౌనంగా కూర్చోవాలి.ధ్యానమ్లోంచి లేచేటప్పుడుకూడా, ఓంకారం చేయాలి. చీపురుపెట్టితుడిస్తే వాకిట్లో ఎంతశుభ్రంగావుంటుందో ,అలాగే ఓంకారముచేసినప్పుడుకూడా మనసులో మాలిన్యము తొలగిపోతుంది అనిచెప్పారు. ఆధ్యాత్మికోపన్యాసాలు వినడం కూర అంతవినాలి,ధ్యానం అన్నమన్నమంత చేయాలి అనేవారు. ధ్యానం బంగారుముద్దవంటిది,దానికి మించినదిలేదు. అనిచెప్పేవారు,అండుకొరకు ఎటువంటి నిబంధనలు అక్ఖరలేదనేవారు. కాలు కడుక్కోక పోయినా పరవ్లేదే ,రామరామా అనుకోండే అనేవారు. నాలుగురూపాయలు సంపాదించుకోవడానికి ఎంత తాపయత్ర పడతామో అంతకన్నా ఎక్కువ ఆత్రుత పడాలి దైవంకోసం అనేవారు అమ్మ. రామాలయమ్లోనివసిస్తూ స్వయంగావంటచేసి అందరికీ తల్లిలా తినిపిస్తుండేవారు ఆమహాత్మురాలు.
తన సమాధిని ముందుగానేసూచించారు అమ్మ. మహాసమాధికి వారం రోజులముందు తనపంటినిని పీకించి సూరమ్మ అనే భక్తురాలికిచ్చి దాచుకోమన్నారు. 1981 జూన్ 8 వతేదీ అర్ధరాత్రి కావస్తుండగా తన భక్తులను కూచోబెట్టుకుని .. ఎవరైనా ఏదన్నా అంటే పది అనకూడదు. ఎప్పుడూదృఢంగావుండాలి , గుమ్మమ్లోకి వచ్చినవారికి ఒకముద్దచేతిలోపెట్టి నీరివ్వాలి..అని చెప్పారు. తరువాత గీత చదివించుకుని విన్నారు. తరువాత కొబ్బరికాయకొట్టించి హారతి ఇప్పించుకుని ప్రశాంతంగా దేహత్యాగం చేశారు అమ్మ. సమాధిఅయిన వెంటనే వచ్చిన వాడపల్లి బాబుగారు శిరస్శు చూసి అమ్మ కపాలభాగం చిట్లి రక్తం గడ్డకట్టిఉన్నదని. అమ్మ బ్రహ్మరంధ్రంగుండా శరీరాన్ని విడిచారని చెప్పారు.

ఇక్కడకెందుకువచ్చామే పిడకలెరుకోవటానికా ,? రామరామ అనుకోండే అని త్నచుటుపక్కలవారికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరణద్వారా చూపిన ఆసద్గురువు పాద పద్మాలకు మనసారా నమస్కరించి ముగిస్తున్నాను.

Read more...

సత్యనారాయణస్వామి వ్రతానికి, పిల్లినికట్టెయాడానికి సంబంధం ఏమిటి?

>> Friday, October 17, 2008

మనదేశములో పాటించే ప్రతిఆచారం వెనుక ఒక కారణము శాస్త్రీయదృక్పథం ఇమిడివుంటాయి. అయితే అవి అర్ధం చేసుకోవాలంటే కొంచెం లోతుగా విశ్లేషించిచూడగలగాలి. అంతఓపికలేని ఆఫ్ నాలెడ్జి మేధావులు ఇక్కడంతా మూఢనమ్మకాలు, విజ్ఞానదృష్టి లేని ఆచారాలని విమర్శిస్తుండటము మామూలే. ఆవిషయాన్ని పక్కన పెడదాము. మన మహర్షులు ప్రతిపాదించిన ప్రతిఅచారము మానవజీవితాన్ని సంపూర్ణముగా ఆనందదాయకము కావటానికి ఉద్దేశించి నిర్దేసించినవే. అయితే కాలప్రవాహములో కొన్ని అర్ధం పర్ధం లేని అచారాలు సమజములోకి వచ్చి చేరుతుంటాయి. ఇటువంటివాటిని వెంటనే తొలిగించటానికి ప్రయత్నించక పోవటమువలన అవి కూడా ఆచారాలుగా చలామణి అవుతూ మనసంస్కృతిని విమర్శించటమే మేధస్సుగా భావించే కుత్సితపు బుద్దులు కలవారికి అవకాశముగా మారుతుంటాయి. అటువంటి ఒకహాస్యసన్నివేశాన్ని నేను విన్నదానిని మీముందుంచుతున్నాను.

ఒక గ్రామములో ధనవంతురాలయిన ఒక గృహస్తు తన పిల్లవానికి పెళ్ళి చేసాడు. తదనంతరం సత్యన్నారాయణ స్వామి వ్రతం చేయాలని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆకార్యక్రమము రోజు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయింటి ఇల్లాలు ప్రేమ పూర్వకంగా పెంచుకునే పిల్లి ఆవిడవెంట బడి తిరుగుతూ అరుస్తూ గోలచేస్తున్నది. తనపనులకు అడ్దమవుతుందని,పాలు పెరుగులలో మూతి పెడుతుందని ఆవిడ దానిని మెడకు ఒక పట్టీ బిగించి ఒక స్థంబానికి కట్టి వేసినది ఒరండాలో. కార్యక్రమానికి వచ్చినవారందరూ దానిని చూస్తున్నారు. కొత్తగా వచ్చిన కోడలికి ఈ ఇంటి ఆచారాలేవో తెలియదు .కనుక మా అత్తగారింటిలో వ్రతం చేసేటప్పుడు పిల్లిని కట్టివేసే ఆచారం వున్నదికాబోలు అనుకున్నది, వ్రతానంతరం తమఅత్తగారు పిల్లిని విడిచిపెట్టడాన్ని చూసి.

తరువాత కాలములో ఆవిడకు కూడా పిల్లవాడుకలిగిపెద్దయ్యాక వివాహానంతరం సత్యన్నారాయణ స్వామి వ్రతం చేయ సంకల్పించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతము ఈవిడదే పెత్తనం ,కనుక పిల్లిని కట్టేయ్యాలనే విషయం గుర్తుకువచ్చి చూస్తే ఇంటిలో పిల్లి లేదు. పక్కింటిలోనుండి పిల్లిని తెచ్చి వరండాలో కట్టివేసినది. అది భయంతో కొంచెంసేపు అరచినా పెరుగన్నం పెట్టడంతో తిని మెదలకుండా వున్నది. వచ్చిన చుట్టాలు ఇదీ గమనించారు. ఈవిషయాన్ని వచ్చిన కొత్తకోడలు కూడా గమనించింది.
తరువాత కాలములో పెత్తనం ఈవిడకు బదలాయించబడినందున ఒకసారి వ్రతంచేపించాలనే సంకల్పముతో ఆవిడకూడా అన్నిఏర్పాట్లను చేసుకుని చుట్టుపక్కల ఇల్లలో పిల్లి లేకపోవటముతో పనివాల్లను పంపి ఒక పిల్లిని తెప్పించి కట్టి వేసినది .అది మరీకొత్తయి గోలగోల చేయటముతో వచ్చిన వారిలో కొందరు పెద్దవారికి అనుమానం కలిగింది. వీళ్ళ ఇంట్లో ఎప్పుడు వ్రతం జరిగినా పిల్లిని కట్టివేస్తున్నారు, కారణము ఏమయ్యుంటుందని ఆలోచించి,అమ్మాయి మీయింట్లో ఎప్పుడుచూసినా వ్రతానికి ఇలా ఎందుకు చేస్తున్నారు చెప్పమని అడిగారు. ఆవిడ అమాయకంగా ,ఏమోనండీ ఇదిమాయింటి ఆచారం మా అత్తగారు నేను వచ్చిన కొత్తలో చేయటం చూసిచేస్తున్నానన్నది. కొంచెం సుస్తీ చేసి గదిలో వున్న వాళ్ళ అత్తగారి దగ్గరకెళ్ళి వివరమడిగారు. నాకూ తెలియదు మా అత్తగారు చేస్తుంటే చూసాను చేసాను అన్నది. బాగా వయసు మీదపడి ఆరోగ్యం సరిగాలేక ప్రత్యేక పాకలో వుంచిన వారి అత్తగారిదగ్గరకెల్లిన చుట్టాలు అమ్మమ్మా ! మీ ఇంట్లో సత్యన్నారాయణ స్వామి వ్రతానికి పిల్లిని కట్టేసే ఆచారం ఎలావచ్చినదో తెలుసుకోవచ్చా? అని అడిగారు. అచారం లేదు పాడులేదు, పాలూ పెరుగూ పాడుచేస్తుందని నేను అలాకట్టేస్తే చూసి వీల్లు కూడా ఆచరిస్తున్నారా? హవ్వ .. ఏమిటీ తెలివితక్కువతనం అని కేకలు వేసినదట.
అలాగే మనం అర్ధము పర్ధము లేని పనులను ఆచారాలుగా జరుగుతున్నచోట ఉపేక్షిస్తే అవే అనాచారాలు స్థిరపడిపోయే ప్రమాదమున్నది. నేనొక గ్రామములో చూసాను .స్వామి మాల వేసుకుని తన ఇంట దీక్షాదారులకు బిక్ష ఇచ్చిన గృహస్తును ఎంగిలి విస్తర్లమీద దొర్లించి తరువాత ఆవిస్తరలను అతని నెత్తిపై కెత్తి వూరేగింపుగావెల్లి వాటిని బావిలో కలుపుతున్నవారిని. అయ్యా ఇది చాలా తప్పు. పవిత్రమయిన మాల కు ఎంగిలి అంటుకుంటున్నది. అన్నం పెట్టటము పుణ్యం కానీ ,ఇలా ఎంగిలాకులమీదదొర్లించటం లాంటి పనులు ఎక్కడా శాస్త్రాలలో చెప్పబడలెదు, గురుస్వాములయినా దీనిని ఖండించవద్దా?అని వారి చర్యను ఖండించాను. నేనా గ్రామము మరలా వెల్లలేదు, వారు ఆ ఆచారాన్ని మానవేసారో కొనసాగిస్తున్నారో తెలుసుకోవటానికి .
కనుక మన పూర్వీకులయిన మునులు చూపిన రహదారిలాంటి బాటవున్నది .దానిమీద నడుద్దాము. అంతేగాని అనాచారాలను ఆచారాలుగా పాటించవద్దని, ఏది ఆచారమో ,ఏది అనాచారమో సందిగ్దత ఏర్పడప్పుడు. పెద్దలు పదిమందిని విచారించటం మంచిదని నావిన్నపము.

Read more...

నవరాత్రి సేవ

>> Monday, October 13, 2008


Read more...

మంచి చెడు గాను చెడుమంచిగాను కనపడే కలి కాలమిది.

యుగధర్మాన్ననుసరించి జీవుల ఆలోచనలు ,బుద్ధులు కొనసాగుతుంటాయి. ప్రస్తుతమున్న కలికాలం కలిపురుషుని ఆధీనములో సాగుతున్నది. కలి ప్రభావము వలన మానవుల ఆలోచనా తరంగాలు ఎక్కువగా చెడు వైపునకే మల్లు తుంటాయి. ప్రతిదానిలోనూ మంచిని కాక చెడుభావాలను గ్రహించటానికే మొగ్గుచూపుతుంటాయి. కనుకనే భగవంతుని గూర్చిన పవిత్ర గ్రంథాలపట్ల, పవిత్ర వ్యక్తులపట్ల కూడా చెడును ఆపాదించాలనే తహతహ మొదలై అది మేధావులుగా తమకు గుర్తింపురావాలనే తపనతో తమకు తెలియకుండానే పాపపు రాసిని పెంపొందించుకునేలా చేసే విధంగా సాగుతుంటాయి.

ఈ మధ్య నేను విన్న ఒక సంఘటన మీకు తెలియ జేస్తాను. ఒక ధనవంతులదంపతులకు ఒకే అబ్బాయి. వాడూమంచి సంస్కారం ,ఉన్నత భావాలు కలవాడు. ఈ మధ్య వానికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ఒక ఊరిలో ఒక సంబంధం చూడటానికి వెళ్ళారు. అమ్మాయి చూడ చక్కగా వుంది. చదువు సంస్కారం గలకుటుంబమని తెలిసింది. కాకుంటే ఆర్ధికంగా తక్కు వస్థాయిలో వున్నారు. ఈ పిల్లవానిని అమాయి నచ్చిందా అని అడిగారు. మనవాడు అప్పటికే ఊహలలో విహరిస్తున్నాడు. ఈ అమ్మాయిని నేను చేసుకుంటే తనతల్లి దండ్రులను వదలి ,తనవారందరిని విడచి నాయిటికి రావాలి. నాకు జీవితాంతము సేవలు చెయ్యాలి, నాకోసం నాకుటుంబము కోసం శ్రమించి పనిచేయాలి, అటువంటి స్త్రీని కట్నమడగటమంటే నిజంగా పాపము. దుర్మార్గము. దురాచారం ....ఇలాసాగుతున్నాయి అబ్బాయి ఆలోచనలు. ఏమ్ బాబూ... అమ్మాయి నచ్చిందాలేదా ? ఏమన్నా అడగాలా అని అమ్మాయి తండ్రి ప్రశ్ని0చాడు మల్లీ . అప్పుడు అబ్బాయి లేచి ,ఈ అమ్మాయి నాకు చాలా నచ్చింది. కాకుంటే ఒక్కషరతు. ఒక్క పైసా కూడా కట్నము నా కివ్వ కూడదు. అది నన్ను అవమాన పరచినట్లే అని కుర్రతనపు వుద్రేకంతో చెప్పేశాడుఅంతానిశ్శబ్దమయిపోయారు.
వెంటనే అమ్మాయి తరపు ఆడవారు చుట్టాలు అమ్మాయి తండ్రిని లోనకు పిలచారు. అబ్బాయిని చూస్తే చక్కగానే వున్నాడు. ఆస్థిపరుడు. ఒక్కగా నొక్కబిడ్డ. అన్నీ వున్నాకూడా కట్నం వద్దనాడంటే ? ఇదేదో తేడాగావుంది. అసలు వాడు మగతనంవున్నవాడో లేదో ? లేకుంటే ఊరికనే చేసుకుంటానని ఎందుకు తొందరపడతాడు. మనకెందుకొచ్చిన తంటా .ఈ సంబంధం ఒప్పుకోమాకు అని బోధించారు.
ఇక్కడ మనుషుల ఆలోచనలు మంచిని చెడు అని, చెడును మంచని భ్రమింపచేస్తున్నాయి . ఇది కలి పురుషుని లక్షణం . కనుక మనకు తెలిసిన ,మనమనసులో గూడుకట్టుకున్న భావాలతో కాక ఉన్నత స్తాయి కెదిగి ఆలోచనలు సాగించినప్పుడు గాని మనకు ప్రతిదానిలోనున్న మంచిబోధపడదు.

Read more...

నవరాత్రి శోభలు

>> Saturday, October 11, 2008














అమ్మ అనుగ్రహంతో నవరాత్రి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా దూరప్రాంతాలనుండి పూజచేయమని కోరుతూ మెయిల్ చేసిన వారి పెర్లమీదకూడా పూజలు జరిపారు. అమ్మ అనుగ్రహం అందరిపై అనుగ్రహం చూపాలని కోరుతూ పూజలు జరిగాయి

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP