శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీ విష్ణుసహస్రనామ వైభవం

>> Sunday, August 31, 2008


భారతీయ సంస్కృతికి ఇతిహాసాలు రెండు. శ్రీ వాల్మీకి మహర్షి ప్రణీతమయిన రామాయణం ,శ్రీ వేద వ్యాస భగవానులు అనుగ్రహించిన మహా భారతం. శ్రీ మద్భారతానికి రెంటివల్లే గౌరవమని పెద్దలు అంటారు. అందు మొదటిది,శ్రీకృష్ణ భగక్వానుడు అనుగ్రహించిన గీత, రెండవది భీష్మ పితామహుడు లోకానికి అందించిన శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం.

ఈ రెంటిలో మొదటిదానిని శ్రీ కృష్ణుడు అర్జునునకు ఉపదేశం చేసి సంజయునిద్వారా లోకానికి అందించారు. రెండవదానిని భారత సంగ్రామానంతరం అంపశయ్యపై పడివున్న భీష్మ పితామహుని ద్వారా పాండవులకు ఉపదేశం చేస్తూ లోకాన్ని తరింపజేశాడు. ఈ రెంటిలో భగవద్గీత కంటే సహస్రనామ స్తోత్రం ద్వారానే సులభంగా తరింపవచ్చునని శ్రీ కృష్ణుని అభిమతం. ఈ భావాన్ని ఆయనే స్వయంగా వ్యక్తం చేశాడు. శ్రీ కృష్ణులవారు పాండ్వులను తీసుకుని భారత సంగ్రామానంతరం అంపశయ్య పైనున్న భీష్ముని వద్దకు వస్తాడు.
ధర్మరాజుకు కలిగిన ధర్మ సంశయమ్లు తీర్చమని భీష్ముని కోరగా ,తనకు అవేవీ చెప్పే శక్తిలేదని, జ్ఞాపకం లేదనీ అంటాడాయన. అయితే ఇవిచెప్పడానికి పూర్వం తెలిసినవన్నీ జ్ఞప్తికి వచ్చేలా,పూర్వపు శక్తికలిగేలా వరమిస్తాడు ఆ లీలామానుష విగ్రహుడు. నోటనీరూరునట్లు, దేహబాధ తెలియకుండునట్లు ,చేస్తాడు. ఆశ్చర్యం ,ఆనందాలతో భీష్ముడు ,అన్నివరాలునాకిచ్చి చెప్పమనడమెందుకు కృష్ణా ! నీవే చెప్పవచ్చుకదా! అని ప్రశ్నిస్తాడు. భారత సంగ్రామమ్లో ఇరుసేనలను ఆపి మరీ చెప్పాను, భగవ్ద్గీతనంతా ,విన్న అర్జునునకు అది ఏమాత్రం పట్టలేదు. అప్పుడు నాకు ఆచార్య లక్షణాలులేవు,అతనికి శిష్యలక్షణాలు పూర్తిగా లేకపోవడ మే కారణం పైగా పరమాత్మను నేణే కనుక తనను గూర్చి తానే చెప్పుకోవడం అందరికీ అసూయ కలిగిస్తోంది. .ఒక తత్వాన్నిగురించి తత్వదర్శనం చేసినవారు చెప్పాలే తప్ప తనను గురించితాను చెప్పుకోరాదు.కదా! భగవద్గీతలో నాగురించి నేనే చెప్పుకోవడం వలన అర్జునునుకి ఏ మాత్రం ఎక్కలేదు.

పితామహానీవుతత్వదర్శనంచేసినఆచార్యుడవుగనుకపాండవులనీనుంచితెలుసుకోవాలని కోరుతున్నారు. వారికి తత్వము,హితము ఉపదేశం చేయమంటాడు కృష్ణుడు. దాహము కల్గిన వానికి సముద్రం తనలో నీరువున్నా ఇవ్వటానికి లేదు. ఇచ్చినా అది తాగటానికి పనికిరాదు ,ఆనీట్నే మేఘం గ్రహించి వర్షంగా కురిపించినప్పుడే అవిత్రాగటానికి పనికివస్తాయి. నేనుసముద్రమ్లాంటివాడిని ,నీవుమేఘములాంటివాడవు, కనుక పితామహా! నీవే వీరికి ఉపదేశించి ఆర్తిని తీర్చు అని ఆదేశిస్తాడాయన. భీష్ముడు
పాండవులకు ఉపదే శిస్తుంటే ,తానుకూడా చేతులుకట్టుకుని విని అది అట్లే అని ఆమోదిస్తాడుకూడా! అందుచేత దీనికి ప్రభావమధికము.
ముందుగా సామాన్యధర్మాలనుసమాధానాలను తెలుసుకున్న ధర్మరాజు, తాతా! ఆపైన జన్మ మెత్తిన జీవి ఈ సంసార చక్రమునుండి బయటపడాలంటే తెలియవలసిన తత్వమేది? ఈ జీవులపుడు ఎక్కడకు చేరతారు? ఆ చేరటానికి ఏమిచేయాలి? ఎవరిని స్తితిస్తే ,అర్చిస్తే మనవులు కోరిన సుఖాలన్నీ పొందుతారు? తాతా దానిని అనుగ్రహించు అని వేడుకుంటాడు. సర్వ జగత్కారణమైన సర్వ లోకేస్వరుడయిన శ్రీమన్నారాయణుని స్తువన్= స్తోత్రము చేయుచు, తమేవచ అర్చయన్= అతనినే ప్రేమతో పూజిస్తే సర్వ దు:ఖాతిగోభవేత్ = అన్ని దు:ఖములను దాటిపోవచ్చునయ్యా! ఆపుండరీకాక్షుని అర్చించడమేధర్మ: అధికతమోమత: =అన్నిధర్మములలో శ్రేష్టమయినది అని నా అభిప్రాయం. ఇంతేకాదు, అతని నామాలను కీర్తిస్తే సకలపాపాలూ పోతాయి.పవిత్రులవుతారు మీరుకోరినవన్నీ లభిస్తాయి దీనిని మించిన గొప్పమంత్రమింకొకటిలేదు. వేయినామాల మూలమంత్రమీస్తోత్రం.
ఈ వేయినామాలు ఎక్కడివో తెలుసా ? నేను కల్పించలేదు. " గూఒణాని విఖ్యాతాని ఋషిభి: పరిగీతాని,శ్రీమన్నారాయణుని గుణములననుభవించిన ఋషులు ఆ అనుభవ సారంగా ఒక్కొక్కనామాన్ని దర్శించి ఆనందించగా ,ఆక్కడక్కడ ఆఋషుల వాగామృతం కలిపి పరీవాహమయి లోకములో పొందగలిగేట్లు శ్రీవ్యాసభగవానులవారుసేకరించి కృపచేయగా నేనుదర్శించాను.
నీవు అడిగావుకనుక సర్వజీవులు ఉజ్జీవించడానికయిచెబుతున్నాను విను.అని భీష్ముడు ఉపదేసిస్తాడు. అట్టి మహాభారతసారము, ఋషులచేదర్శింపబడి,శ్రీభీష్మ పితామహుల అభిమతము,వేదవ్యాస వుపలబ్దము భగవ్ద్గీతకంటే శ్రేష్టతరము అయి ,ఆధునికిలచేత కూడా సకల శ్రేయోదాయకము గా కొనియాడబడుతున్న ఈ విష్ణుసహస్రనామాన్ని మనంగూడా నిత్యం పాడి పరమపదవిని పొందుదాం.

విష్ణుసహస్రనామం  ఇక్కడ  చదవండి, వినండి..

Read more...

ముంబాయి మహాలక్ష్మి ఆలయం




పురాతన దేవాలయాల్లో ముంబైలోని మహాలక్ష్మి దేవాలయం ఒకటి. ఈ దేవాలయం ముంబై నగరంలో బ్రీచ్ క్యాండీలోని బి.దేశాయ్ రోడ్‌లో నెలకొని ఉంది. అరేబియా సముద్రపు ఒడ్డున కొలువైవున్న మహాలక్ష్మి మాతను సందర్శించి ఆమె దీవెనలు పొందేందుకు లక్షలమంది భక్తులు వస్తుంటారు.

అష్టైశ్వర్యాలను ఒసగే మహాతల్లిగా హిందువులు మహాలక్ష్మిని కొలుస్తారు. ఈ దేవాలయాన్ని ఒకసారి పరికించి చూస్తే... ఆలయ ప్రధాన ద్వారం అద్భుతంగా తాపడం చేయబడి వుంటుంది. లక్ష్మీమాతకు పూజలు చేసేందుకు పూలు, ఇతర పూజ సామగ్రి ఆలయ ప్రాంగణంలోని షాపులలో లభ్యమవుతాయి.

స్వర్ణాభరణాలతో సంపదల తల్లిగా గోచరించే ఇక్కడి మహాలక్ష్మి రూపు హిందూ గృహాల్లో కనబడుతుంటుంది. సిరిసంపదలనొసగే ముంబై మహాలక్ష్మికి భక్తకోటి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. దేవాలయం చరిత్ర గురించి చూసినప్పుడు... ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర వుంది.

ఆలయ చరిత్ర ఆసక్తిని రేకిత్తించేదిగా వుంటుంది. బ్రిటిషువారి కాలంలో మహాలక్ష్మి ప్రాంతాన్ని వర్లికి కలిపేందుకు యత్నించటం జరిగింది. అయితే పెద్ద పెద్ద అలలు బీభత్సాన్ని సృష్టించటంతో వారు ఆ ప్రయత్నాన్ని మానుకున్నారట. అదే సమయంలో మాతా మహలక్ష్మి రామ్జీ అనే కాంట్రాక్టరు కలలో ప్రత్యక్షమైంది. సముద్ర గర్భంలో వున్న మూడు విగ్రహాలను వెలికి తీసి ఆలయంలో స్థాపించాల్సిందిగా ఆజ్ఞాపించింది. దేవి ఆన మేరకు రామ్జీ విగ్రహ ప్రతిష్టాపన చేశాడు.
WD


ఆలయంలో మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి విగ్రహాలున్నాయి. మూడు విగ్రహాలకు ముక్కు పుడకలతోపాటు, బంగారు గాజులు వజ్ర వైఢూర్యాలతో తయారుచేసిన నగలు వున్నాయి. ముగ్గురమ్మలను చూసిన భక్తులు భక్తి సాగరంలో మునిగిపోవాల్సిందే. ఎవరైతే త్రికరణశుద్ధితో అమ్మవార్లను పూజిస్తారో వారి కోర్కెలు తప్పక నెరవేరతాయని చెప్పబడింది. అమ్మవారిని వీక్షించేందుకు భక్తులు బారులు తీరి వుంటారు. సమయం ఎంతైనా... లక్ష్మీమాతను దర్శించి పూజలొనర్చిన తర్వాతే భక్తులు తిరుగుముఖం పడతారు.

ఎలా వెళ్లాలి: వాణిజ్య కేంద్రమైన ముంబైకు అన్ని ప్రధాన పట్టణాల నుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. ముంబై చేరుకున్నవారు స్థానిక బస్సులలో ప్రయాణించి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో వుంటాయి. ఈ టాక్సీలు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, విమానాశ్రయాలనుంచి కూడా వుంటాయి.

Read more...

కాల సర్పదోషం.. తస్మాత్ జాగ్రత్

>> Saturday, August 30, 2008


ఎందరో జాతకులను సర్పదోషం బాధిస్తుంటుంది. వివాహం, సంతానం వంటి తదితర శుభకార్యాలను తప్పించే ఇలాంటి సర్పదోషాలకు కాళహస్తి, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, నాగప్రతిష్ట చేయడమో లేదా కేతు-రాహు శాంతి పూజలు, పరిహారాలు వంటివి చేయడం పరిపాటే.

కేవలం... సర్పదోషానికే జాతకులు ఎన్నో ఇక్కట్లకు గురవుతుంటే... మరీ "కాలసర్పదోషం" సంగతేమిటి?.. గ్రహాలన్నీ రాహు-కేతువుల మధ్య సంచరించడం వల్లనే కాలసర్పదోషం ఏర్పడుతుందని జ్యోతిష్కులు అంటున్నారు. కాగా, భారతదేశానికి మాత్రమే కాకుండా, మొత్త ప్రపంచానికి కాలసర్పదోషం ఉందని ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి పీఏ రామన్ తెలిపారు. ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దేశంతో పాటు యావత్తు ప్రపంచానికి ఈ ఏడాది ఆగస్టు 1నుంచి డిసెంబర్ వరకు కాల సర్పదోషం ఉందని స్పష్టం చేశారు.

రామన్ వివరించిన సర్పదోషంతో సంభవించబోయే పరిణామాలను పరిశీలిస్తే... ఆగస్టు 1న సూర్య గ్రహణం కర్కాటక రాశిలోనూ, 16న చంద్రగ్రహణం మకర, కుంభ రాశుల్లో ఏర్పడుతున్నందున ఈ రాశుల వారు ఈ గ్రహణాలను వీక్షించడం మంచిది కాదని సూచించారు. ఇకపోతే ప్రజలు రక్తపోటు, మధుమేహం, నరాలు, మెడకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలోను లేదా నవగ్రహ ఆలయాల్లో ఉండే రాహుకేతువులకు శాంతి పూజలు చేయిస్తే కాలసర్పదోషం కొంతమేర తొలగి ఉపశమనం చేకూరుతుందని రామన్ చెప్పారు.

కాలసర్పదోష ప్రభావంతో ప్రజల్లో అశాంతి నెలకొనడం, నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరగడం, తుఫానులు సంభవించడం, రహదారి ప్రమాదాలు, అత్యధిక ప్రాణనష్టం, నదులు ఉధృతంగా ప్రవహించి వరదలు వంటి అసంభవాలు సంభవిస్తాయని రామన్ చెప్పారు. మహిళా, శిశుమరణాలు అధికసంఖ్యలో ఉండటం, రాజకీయ నాయకులకు, రక్షక భటులకు భద్రత కరువవడం వంటివి తటస్థిస్తాయని రామన్ వివరించారు.

Read more...

ఔరా....రామచిలకల భక్తి

>> Friday, August 29, 2008



రామచిలుకల మేత కోసం వేలాది కేజీల ఆహారధాన్యాలను వెదజల్లే దృశ్యాలను మీరెక్కడైనా, ఎపుడైనా చూశారా? అలా చల్లిన ధాన్యాలను వందాలది రామ చిలుకలు క్షణాల్లో హాయిగా ఆరగించడాన్ని మీరు కనులారా వీక్షించారా?. ఈ రెండు ప్రశ్నలకు మీ వద్ద నుంచి లేదనే సమాధానం వస్తుంది. అయితే.. ఇలాంటి అపురూప సుందర దృశ్యాలు మీకు చూడాలని ఉందా? .. మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఇండోర్‌ సమీపంలోని పంచకుయాన్ మందిరానికి మిమ్మలను తీసుకెళతాం రండి.

ఇక్కడ వెలసివున్న హనుమాన్ ఆలయం అత్యంత పురాతనమైంది. ఇక్కడకు రామచిలుకలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ ఆలయానికి 'పంచకుయాన్ హనుమాన్ మందిరం' అనే మరో పేరు ఉంది. ఈ ఆలయానికి వందలాది కాదండీ.. వేలాది రామచిలుకలు ప్రతిరోజూ వస్తుంటాయి.

ఈ ఆలయం ప్రాంగణంలోనే చిన్నపాటి శివుని ఆలయం కూడా ఉంది. ఈ సమాజంలో కేవలం మనుషులు మాత్రమే కాకుండా.. పక్షులు సైతం భగవంతునిపై నమ్మకం కలిగి వుంటాయని ఈ ఆలయాన్ని సందర్శించిన వారికే తెలుస్తుంది. ఈ ఆలయానికి కొన్ని సంవత్సరాలుగా రామచిలుకలు వస్తుంటాయని, ఇక్కడ నివశించే సిద్ధులు chebutumTaaru .

ఈ ఆలయంలో నాలుగు వేల కిలోల ఆహార ధాన్యాలను రామచిలుకల కోసం ప్రతిరోజు వినియోగిస్తారు. ఆలయ ప్రాంగణంలో వెదజల్లే ఆహార ధాన్యాలను చిలుకలు ఆరగించే ముందుగా.. గర్భగుడిలోని హనుమంతుని విగ్రహం వైపు ఒక సారి చూసి తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తాయి. ఆ తర్వాత పశ్చిమ దిశకు తిరిగి ధ్యానం చేస్తాయి. నోరులేని ఈ చిలుకల భక్తిని చూసి ఇక్కడకు వచ్చే భక్తులు ఔరా..! అని ఆశ్చర్యం చెందుతారు.

ఇక్కడకు వచ్చే చిలుకల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో పలువురి భక్తుల సహాయంతో మూడు వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో కాంక్రీట్ పైకప్పును ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య కాంక్రీట్ కప్పుమీద ధాన్యాలను వెదజల్లుతారు. ఇలా ధాన్యాలు వెదజల్లిన తర్వాత ఒక గంట కాలంలో వేలాది కేజీల ఆహార ధాన్యాలను రామచిలుకలు ఆరగిస్తాయని ఆలయ సిబ్బంది రమేష్

అగర్వాల్ తెలిపారు.

ఆలయానికి వచ్చే భక్తులు తమ ప్రార్థనలు పూర్తయిన తర్వాత ప్రసాదం ఆరగించే సమయంలోనే రామచిలుకలు కూడా ఆహారాన్ని ఆరగించడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడకు వచ్చే ప్రతి చిలుక, సాటి చిలుకలతో ఎదో సంబంధం కలిగి వున్నట్టుగా మెలగడం విశేషం. ఈ నోరులేని రామచిలుకల భక్తిని మీరు కూడా ప్రత్యక్షంగా చూసేందుకు ఈ ఆలయాన్ని సందర్శిస్తారని కోరుకుంటున్నాం. అలాగే.. ఈ రామచిలుకల భక్తిభావంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియజేయండి.

Read more...

>> Thursday, August 28, 2008



నవగ్రహ శాంతికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేసేవారు ఆయా ప్రత్యేక వస్తువులతో పూజని నిర్వహించాలి. పూజలో గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారకి దోష నివారణ జరిగి సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయి. సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురు గ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు. చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు బాధ తొలగుతుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చల ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.

శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. వజ్రం, పగడము ధరించిటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక దైవశక్తి పెరుగుతుంది. శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతరత్రా కష్టాలు తొలగిపోతాయి.
అయితే ఈపూజలు భక్తిశ్రద్ధలతో జరపాలే తప్ప తప్పనిసరి పనిలా భావించి తంతు ముగిస్తే అనుకున్న ఫలితాలు రావు. చాలామంది ఈపూజలు చాలా ఖర్చుచేసి చేపిస్తుంటారు, కానీ అదేసమయమ్లో వాళ్ళు పక్కవారితో ఇతరవిషయాలు చర్చిస్తూ గడుపుతారు. అలాచేయటమువలన ప్రయత్నం వృధా అవుతుంది. మీభావనను బట్టి ఫలితాలువుంటాయికనుక జాగ్రత్తవహించండి.

Read more...

మన ఆచార వ్యవహారాలు [తెలుగుదనం.నుండి]

మన ఆచార వ్యవహారాలు

ప్రపంచ సామాజిక చరిత్రలో భారతదేశానికున్న ప్రాముఖ్యత మరే ఇతర దేశానికీ లేదన్నది ప్రపంచ దేశాల ఉమ్మడి అభిప్రాయం. ఇందుకు కారణం ఇక్కడి ఆచార వ్యవహారాలే. ప్రతి దెశానికీ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. ఐతే భారతదేశంతో పోలిస్తే ఆయా సంప్రదాయాలు ఒక్కో ప్రాంతాన్నిబట్టి మారుతూ ఉంటాయి.ముఖ్యంగా సాంఘిక వ్యవస్థలో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాని భారతీయ సాంఘిక వ్యవస్థ మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా ఉంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ఇతర దేశాలకు ఓ సరికొత్త దిశను చూపుతున్నాయి.

భారతదేశంలో ఉన్నా, మరే ఇతర దేశంలో ఉన్నా స్వదేశీయుడైనా, విదేశీయుడైనా; చిన్నవాడైనా, పెద్దవాడైనా అందరి నోటా వినిపించే ఏకైక మాట "ఇండియన్ కల్చర్". వేరే ఏ ఇతర దేశమైనా తమ దేశం పేరుపెట్టి ఉచ్చరించడానికి సంశయించే కల్చర్ అన్న పదానికున్న గౌరవం ఒక్క భారతదేశానికి మాత్రమే దక్కడం వెనక ఉన్న భారతీయ సంస్ర్కుతి, చరిత్ర యొక్క ఘనత తేటతెల్లమవుతున్నాయి.ప్రక్రుతితో మనకున్న బంధంకానీ, వివాహ మరియు కుటుంబ వ్యవస్థ పట్ల మనకున్న గౌరవం వల్లకానీ మన సంప్రదాయాలకో ఘనమైన కీర్తి దక్కింది. భారతదేశ ఆవిర్భావం నాటినుండీ ఒక ప్రత్యేక క్రమశిక్షణ కోసం కొన్ని రూపొందించబడితే మరికొన్ని సంప్రదాయాలు మనలో అంతర్భాగంగా వాటంతటకవే స్రుష్టించబడ్డాయి. స్రుష్టి గతానుక్రమంలో ఇదో అద్భుతమై ఖండాంతరాలలో మనకంటూ ఓ ప్రత్యేక వ్యవస్థను చాటాయి. ఇతర దేశాలకు మార్గదర్శకాలయ్యాయి. మన వేద విజ్ఞానాన్ని పాశ్చాత్యులు అనుసరిస్తున్నారు. యోగ నేర్చుకునేందుకు మన దేశానికే తరచూ వస్తునారు. భారతీయుల్ని సెంటిమెంటల్ ఫూల్స్ అని గేలి చేసినా ఆ సెంటిమెంటే మనలోని భాషాపరమైన, మతపరమైన భిన్నత్వాన్ని ఏకత్వంగా చూపిస్తుంది.మనల్ని ఏకతాటిపై నిలుపుతోంది. నవీన తరానికి నేటి ఆచార వ్యవహారాలు చాందసంగా అనిపించినా ఆ చాందసత్వమే వారి పాలిట వరమని కొన్నాళ్ళకి వాళ్ళే తెలుసుకునేలా చేస్తుంది.

ఉదయం నిద్ర లేచినప్పటినుంచి రాత్రి నిద్ర పోయేవరకు మనం ఎన్నో నియమ నిబంధనలను అనుసరిస్తుంటాం. సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తాం. సూర్య నమస్కారాలు చేస్తాం. ఇది మన ఆచార వ్యవహారాలలోని ఓ అంకమైనా దాని వెనుక ఓ గొప్ప సాధన యోగం ఉంది. అదే ఆరోగ్యానికి మూల కారణంగా నిలుస్తుంది. ఆ చిన్న రహస్యం తెలుసుకుంటే చాలు ప్రతి ఆచారం మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఓ సంజీవనిగా మనకు బోధపడుతుంది. అలాగే ఇంటి ముందు ముగ్గులేయడం. మన పూర్వీకులు పెట్టిన ఈ సంప్రాదాయం శుభ మంగళానికి చిహ్నంగా కళ్ళకు కనబడుతున్నా, వీధిలోని బ్యాక్టీరియా ఇంటిలోకి రాకుండా నియంత్రించే ఒక ఔషధంగా ఇది ఉపయోగపడుతుంది.

కొన్ని ఆరోగ్యానికి సూత్రాలుగా నిలిస్తే, మరికొన్ని నడవడికకు మార్గదర్శిగా నిలుస్తాయి. అజ్ఞానాన్నీ, అహంకారాన్నీ కొన్ని తొలగిస్తే కొన్ని అరాచకం ప్రబలకుండా నియంత్రిస్తాయి. ఆరోగ్యం దేహానికి మాత్రమే కాదు, ఈ సమాజానికి కూడా ఎంత అవసరమో ఈ కట్టుబాట్లు తెలియజేస్తాయి. ఆరోగ్యకరమైన సమాజమంటే మిత్రభేదం లేని ఆహ్లాదకరమైన సమాజం. అశాంతులకి అవకాశమీయని నాగరిక సమాజం.అటువంటి సమాజం కావాలంటే కట్టుబాట్లనేవి ఇంటినుంచే ప్రారంభం కావాలి.

ఇంట్లో పాటించే అనేక కట్టుబాట్లు కట్టుదిట్టమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయి. మనం చేసే ఉపవాస దీక్షలు పరులకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఏ విధంగా అంటే ఉపవాసం ద్వారా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. దానివల్ల మనిషిలో మానసిక ఎదుగుదల వస్తుంది. మానసికంగా పరిపూర్ణుడైన వ్యక్తి లో ఇరుగు పొరుగు అనే భావన కలుగుతుంది. తన అనే భేద భావం పోయి మన అనే ఆలోచన కలుగుతుంది. అది అతని పొరుగువారికి ఎంతో శ్రేయోదాయకంగా ఉంటుంది. సమాజ నిర్మాణంలోపాలుపంచుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. అలాగే ప్రార్ధనా స్థలాలకు వెళ్ళడం, జాగరణలు చేయడం ఇవన్నీ మన సంస్ర్కుతిలో భాగాలు. వీటి వల్ల శాంతి ప్రవర్తన కలిగి, సౌభాగ్యం వెల్లివిరుస్తుంది.

ఈ సాంఘికాచారాలనే సంస్కారాలు అని కూడా అంటారు. వీటిలో కొన్ని ఆరోగ్యం కోసం చేసేవైతే, మరికొన్ని ఇంటిపై ఇతర చెడు ప్రభావాలు (దిష్టి) పడకూడదని చేసేవి. ఈ సంస్కారాల్లో ముఖ్యమైనవి పెళ్ళి, నామకరణము, అన్నప్రాశనము, పుట్టు వెంట్రుకలు తీయించుట, చెవులు కుట్టించుట, అక్షరాభ్యాసము, ఉపనయనం మొదలైనవి. స్త్రీలకు ప్రత్యేకంగా సీమంతము అనే ఆచారముంది. సీమంతమంటే గర్భిణి స్త్రీకి ఆరవ నెలలో చేసే శుభ సంస్కారం.

పెళ్ళిలో రెండు విధాలైన ఆచారాలు ఉంటాయి. అవి ఆర్యాచారాలు, దేశీయాచారాలు. పాణిగ్రహణము, సప్తపది ఆర్యాచారాలు. కాబట్టే వీటిని వైదిక మంత్రాల ద్వారా నిర్వహిస్తారు. మంగళసూత్రధారణ దేశీయాచారము. కాబట్టి దీన్ని మంత్రాలతో కాక శ్లోకాలతో నిర్వహిస్తారు. అనేక వేడుకల సంగమమే పెళ్ళి. కొత్త దంపతుల మధ్య అన్యోన్యత పెరగడానికి పెద్దలు అనేక వేడుకలు చేస్తారు. పూల చెండ్లతో బంతులాట ఒకటి. తరువాత అయిరేని కుండలలో బంగారం, వెండి ఉంగరాలు వేసి దంపతులచే తీయించడం మరోటి. వీటన్నింటిలోనూ తలంబ్రాలు పోసుకొనుటలో ఎంతో వినోదం ఉంటుంది. ఇటివంటి ఆచారాలు ప్రాచీన కాలం నుంచీ వస్తూ మన నిత్య జీవితంలో అంతర్భాగాలైపోయాయి. ఐతే ఈ సాంఘికాచారాలు చాలావరకు స్త్రీలకు సంబంధించినవే ఉంటాయి. ఉపనయనం మాత్రం కేవలం పురుషులకు సంబంధించినది. ఇంటి ఆడపిల్లను ఒక గ్రుహిణిగా తీర్చిదిద్దేందుకు చేసే పద్ధతులే ఈ ఆచారాలు. ఓర్పు, మితభాషిత్వం నేర్పేందుకు మౌనవ్రతము లేదా మూగ నోము అనే అచారము ఏర్పదింది. మూగనోము దీపావళి వెళ్ళిన మరునాటినుంచి కార్తీక శుద్ధ పూర్ణిమ వరకు పదిహేను రోజులపాటు చేస్తారు. ఇవికాక ఇంకా చిన్న చిన్న నోములు బాలికలకు అనేకం ఉంటాయి. శ్రావణ మాసంలో చేసె గౌరీ వ్రతము, వరలక్ష్మి వ్రతము, ఇంకా...అట్లతద్దె, నాగుల చవితి, బొమ్మల నోము మొదలైనవి. కొందరు మొక్క మొలిచిన కంద దుంపను తెచ్చి అలంకరించి పసుపు కుంకుమలతో పూజిస్తారు. దీనివల్ల కందపిలకలవలే సంతనాభివ్రుద్ధి జరుగుతుందని వీరి నమ్మకము.

అట్లతద్దె నాదు ప్రొద్దున్నే నిద్రలేచి, తలారా స్నానాలు చేసి, పెరుగన్నం తింటారు. ఆ తరువాత పెద్దలు అట్లు పోసి చుట్టుప్రక్కలవారికి పంచడం చేస్తుంటారు.అత్లతద్దె నాటి వేడుకలలో అత్యంత ముఖ్యమైనది ఊయలలు వేయడం. ఈ ఊయలలు ఇళ్ళలోనే కాకుండా ఊరంతా అనుకూలంగా ఉన్నచోటల్లా వేస్తారు. ముఖ్యంగా తాటి చెట్టు బోదెలతో వేసె అతి పెద్ద ఊయలలు ఊరంతా వినోదాన్ని నింపుతాయి. తెలంగాణ ప్రాంతంలో స్త్రీలు బతకమ్మ పండుగను ఎంతో ఘనంగా చేస్తారు. బతకమ్మను చెరువులో వాలారించి చల్దులు తిని ఇంటికొస్తారు. స్త్రీలు మిక్కిలి భక్తి శ్రద్ధలతో చేసే వ్రతం నాగులచవితి. పాము పుట్ట వద్దకు వెళ్ళి పుట్టలో పాలు పోసి, మొక్కుకుంటారు. నాగెంద్రునికి వేది వస్తువులు పెట్టరు. ప్రధానంగా చలిమిడి పెదతారు. ఇదే కాకుండా గ్రామ దేవతను సంత్రుప్తిపరిచేందుకు బోనాలు పెడతారు. బోనము అంటే అన్నం వండి పెరుగు, స్వీటు చేసి, ఒక గిన్నెను పసుపు కుంకుమలతో అలంకరించి బోనమును దానిలో పెట్టి గ్రామ దేవతకు సమర్పించడం.

ఇవేకాక స్త్రీలు చేసె మరో చక్కని వ్రతము బొమ్మల నోము. దీని కనుమ పండుగ నుండి 9 రోజులపాటు జరుపుకుంటారు. ఈ వ్రతము ఐదవతనమును పెంపొందిస్తుందని వారి నమ్మిక.

పురుషుల వినోదాలు మరో రకంగా ఉంటాయి. సంక్రాంతికి కోడి పందేలు, పొటేళ్ళ పందేలుతో సరదాగా గడుపుతారు. ఉపనయనం మాత్రం కేవలం పురుషులకు సంబంధించినది. దీని కనుమ పండుగ నుండి 9 రోజులపాటు జరుపుకుంటారు. ఈ వ్రతము ఐదవతనమును పెంపొందిస్తుందని వారి నమ్మిక. పురుషుల వినోదాలు మరో రకంగా ఉంటాయి. సంక్రాంతికి కోడి పందేలు, పొటేళ్ళ పందేలుతో సరదాగా గడుపుతారు. పట్టణాల్లోకంటే గ్రామాల్లోనే పురుషుల వినోదాలు ఎక్కువ.

ఏదేమైనా పురాతనకాలం నాటి ఆచార వ్యవహారాలను వీడకుండా వాటిని చెక్కుచెదరకుండా ఆ వారసత్వాన్ని మన పెద్దలు మనకు అందిస్తూనే ఉన్నారు. వాటి మనుగడకోసం క్రమశిక్షణతో క్రుషి చేస్తున్నారు. తమ తమ వారసులకు వాటి ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నారు. ఆ సంప్రదాయాలను కాపాడుకుంటూవస్తున్నారు. సంస్ర్కుతీ సంప్రదాయాల ద్వారా సమైక్యతను చాతుతున్న భారతదెశం ఇతర దేశాలతో పోలిస్తే ఎన్నో విధాలుగా ముందంజలో ఉందని చెప్పవచ్చు. అందుకు ఆధారం ప్రపంచ దేశాలు మన సంస్ర్కుతి పట్ల ఆకర్షితులవడమే. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే సంప్రదాయం ఒక్క భారతదేశంలోనే ఉంది. ఆ సమైక్యత వారసత్వంగా తరతరాలకూ అందుతూనే ఉంది.ఆ సంపదను కలసిమెలసి అనుభవించడం, ఆ ఆనందాన్ని నలుగురితోనూ పంచుకోవడంలోనే అసలైన ఆనందం ఉంది. ఆ ఆనందాలకు శాశ్వతత్వం చేకూర్చవలసిన బాధ్యత అందరిdi

Read more...

శ్రద్ధ లేనివారికి,అడగనివారికి మహా మంత్రాలు చెప్పరాదు.

>> Wednesday, August 27, 2008



లలితా సహస్రనామము మహిమలు మీరు వినివుంటారు. కానీ నాకు
అనుభవపూర్వకంగా నిరూపణలు వున్నాయి. దీనిని ఎవరికిబడితే
వారికి,శ్రద్దాభక్తి లేనివారికి చెప్పరాదు.
ఒక నవరాత్రులలో నాకు జరిగిన విషయాన్ని చెబుతాను వినండి.
లలితా సహస్రనామ మహిమలు ఇంత గొప్పవయి భక్తులకోరికలు నెరవేరుస్తున్నప్పుడు,
మరింతమందికి ఇవి అందించాలిగాని ,తెలిసీ మనవరకే వుపయోగించుకుంటే స్వార్ధం
కదా అనే అతితెలివి ఆలోచనవచ్చినది. కనుక లలితా సహస్రనామాలతో ఒక్కొక్క
నామంతో ఒక్కొక్కరకమయిన సమస్యను పరిష్కరించుకోవాలొ తెలియజేసి ,ఇక్కడపీ
ఠములో వారిచేత ఎలా సాధన చేయాలో నేర్పుతామని ,పాంప్లెట్ల ద్వారా ,మరిన్ని
పద్దతులద్వారా ప్రచారం చెయ్యాలని మధ్యాన్నం నిర్ణయించుకున్నాను.
సాయంత్రానికి ఊర్లోనుంచి కబురువచ్చినది. [మనపీఠం ఊరికి కొద్దిదూరంగా
వుంటుంది] విషయమేమిటంటే రోగగ్రస్తుడయిన ఒకవ్యక్తిని పూజకోసం పీఠమునకు
తీసుకువస్తున్నామని . అతనికి ఎయిడ్స్. ఎక్కడకూర్చుంటే అక్కడే మలమూత్ర
విసర్జనకూడా చేసే స్తితి. అన్ని ఆశలు వదులుకుని ,దేమునిదగ్గరకు పూజకోసం
తీసుకురావాలని నిర్ణయించి కబురుపంపారు. నాపరిస్తితి అయోమయమయిపోయింది.
వద్దందామా అంటే అతను అతని కుటుంబము వాళ్ళు మనమంటే అభిమానము కలవాళ్ళు ,
అబ్బో వీళ్ళుగాంగ గుడి కట్టారు, బాగలేదంటే రానివ్వరా అని విమర్షిస్తారు.
రమ్మందామా అంటే ,అతనిపరిస్తితి చూస్తే మిగతా భక్తులకు ఇబ్బంది, ఇక్కడ
భోజనాలుకూడా చెయ్యలేరు. ధర్మసంకటం. నాకయితే మనస్సు కకా వికలమయినది.
ఎప్పుడూరాని సంకటం . అర్ధరాత్రిదాకా ఆందోళనగా తిరుగుతున్న నన్ను నా
మేనత్త ఏమిజరిగినదిఅని అడిగింది. అందరూ నిద్రపోతున్నారు. నాపరిస్థితి
వివరించాను. అమ్మవారు తాతగారి కాలము నుండి మనకు ఎప్పుడూ సంకటాలు
కల్పించలేదు. ఏదో కారణముంటుంది. ఏమిటది నిజంచెప్పమన్నది. వేరే ఏమీ
లేదత్తా ! నేను ఇలా అనుకున్నాను అని చెప్పాను. అప్పుడు అయ్యో ! ఎంతపని
చేసావు. చదువుకున్నవాడివి . అడగనివాడికి పాపులకు చెప్పరాదు. అని
అగస్త్యులవారికి, హయగ్రీవస్వామి చెప్పారని అం టారు. నువ్వు ఇలా ప్రచారం
చేస్తే ఇక్కడ సిద్దపీఠములో కొంతమందికి తగ్గితే,
చచ్చేస్థితిలోవున్నవారినికూడా మోసుకువస్తారు అప్పుడు ఏమిచేస్తావు. నీవలన
అనర్హులు కూడా ప్రయత్నిస్తే కలిగే అనర్ధ ములకు బాద్యులెవరు. అని రెండవ
తరగతిమాత్రమేచదివిన ఆమె నోట్లోనుంచి ప్రవాహం గా సాగుతున్న బోధకు
నాతలతిరిగిపోయినది. చెంపలువేసుకున్నాను. అత్తా ఇప్పుడు ఈ గండము గడిచేదెలా
అని ఆందోళనగా అడిగాను. కల్పించిన తల్లే పరిస్కరిస్తుంది ఏమో వాడికూతురే
పెద్దమనిషయి,వాళ్ళే రాకూడదని మానుకోవచ్చుకదా? అని యధాలాపముగా అన్నది.
సరే అమ్మకు క్షమాపన చెప్పుకుని పనుకున్నాను. తెల్లవారగనే వూరిలోనుంచి
కబురు, రోగి కూతుఱు పెద్దమనిషి అయినందున మేము రావటములేదుఅని .
నాతలతిరిగిపోయినది. అందుకే అడగనివారికి చెప్పకూడదనుకుంటాను. కానీ
చంచలమయిన నాబుద్ది అప్పుడప్పుడూ ఎవరికో చెప్పాలని చూస్తుంది, కానీ అమ్మ
కు ఇస్టం లేకపోతే సాగనివ్వదు.

Read more...

పునాదిలేని తంజావూరు శివాలయము

శివలింగ గోపురంపై 14 రకాల నిర్మాణాలు కనిపిస్తాయి. శివలింగంపై 216 అడుగుల వరకు కూడా ఖాళీగానే ఉంది. చివరిదైన 14వ నిర్మాణంపై దాదాపుగా 88 టన్నుల బరువు కలిగిన రాతి గుండును నిలిపారు. దీని బరువు మొత్తం నిర్మాణంపై పడుతుంది. ఇది చోళుల శిల్పకళలకు నిదర్శనం. అన్నిటికంటే పైభాగాన 12 అడుగుల కుంభాన్ని ఏర్పాటు చేశారు.

లోపల ఉన్న ఖాళీ ప్రదేశమంతా శిల్ప, వాస్తు కళలతోనే కాకుండా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఈ ఆలయంలో గోపుర నిర్మాణంలోని మెళుకులనే చిదంబరంలోని తిల్లై నటరాజ లయ నిర్మాణంలో కూడా వినియోగించారు. ఈ నిర్మాణ విధానమే చిదంబర రహస్యంగా కీర్తి గాంచింది.

ఇది సాధ్యమా...? అని ఎవరైనా అడగొచ్చు. ఇది సాధ్యమేనని నిరూపణ అయ్యింది కూడా. ఇదే విధానాన్ని అనుసరించి తరువాత కన్యాకుమారిలో 133 అడుగుల ఎత్తుగల తిరువళ్ళువర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కూడా ఖాళీ స్థలంతో కూడి ఉంటుంది. నిర్మాణానికి పునాది ఉండదు. తిరువళ్ళువర్ విగ్రహాలు చెక్కిన రాళ్ళను ఈ నిర్మాణంపై పేర్చారు.

2004లో వచ్చిన సునామీ అలలు ఈ నిర్మాణాన్ని తాకినా చెక్కుచెదరలేదు. దక్షిణ భారత దేశంలోని చాలా దేలాయాలు పెద్ద పెద్ద రాజగోపురాలనే కలిగి ఉన్నాయి. అలాగే చివరలో డోమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బసవేశ్వర దేవాలయంపై నిర్మించినంతటి గోపురం మరెక్కడా లేదు.
కోటలు, దేవాలయాల నిర్మాణానికి భారతదేశం పెట్టింది పేరు. ఇందులోని శిల్ప,వాస్తు కళలను ఊహలకందనివిగా ఉంటాయి.ఇదే దేవాలయంలో పెద్ద నంది విగ్రహం కూడా ఉంది. దీని ఎత్తు దాదాపు 12 అడుగులు. 19.5 అడుగులు వెడల్పు కలిగి ఉంటుంది. యునేస్కో దీనిని ప్రపంచ వారసత్వ నిర్మాణంగా ప్రకటించింది. తంజావూర్ వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించాల్సిన నిర్మాణమని సూచించింది. భారత పురావస్తు శాఖ దీనిపై అత్యంత జాగురుకతతో వ్యవహరిస్తోంది.

Read more...

లక్ష్మీనివాసం ఎక్కడ?




లక్ష్మీ నివాసం ఎక్కడంటే...
పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం, శుభ్రపరిచిన వాకిలి, ద్వారం, గోవులు... ఇవన్నీ లక్ష్మీ రూపాలే. దేవతారాధన, శుచి, శుభ్రత ఉన్న ఇళ్లలో లక్ష్మీ నివాసముంటుంది
లక్ష్మిదేవి కరుణాకటాక్షాలు ఉన్న ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంది. అసలు లక్ష్మీ ఎటువంటి ఇంటిలో నివాసముంటుంది.. ఏఏ పనుల వల్ల భాగ్యలక్ష్మి ఆయా గృహాలను వీడి వెళ్లిపోతుందో తెలుసుకుందాం....

ప్రాతఃకాల సంధ్యలో, సాయంకాల సంధ్యలో నిద్రపోయే ఇళ్లలో లక్ష్మి ఉండదు.
పెద్దలను గౌరవించే గృహంలో, సహనం కల స్త్రీలు ఉండే ఇళ్లలో లక్ష్మి ఉంటుంది.
రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరిస్తే.. లక్ష్మి వెళ్లిపోతుంది.
ధనం, ధాన్యం, పూజా ద్రవ్యాలు, పెద్దలకు కాళ్లు తగిలితే లక్ష్మికి కోపం వస్తుంది.
ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లో లక్ష్మి ఉండదు.
సోమరితనం, ప్రయత్నం లేకపోవటం లక్ష్మికి వీడ్కోలు పలుకుతాయి. స్త్రీలను కష్టపెట్టేచోట లక్ష్మి ఉండదు.

Read more...

మహిమాన్విత హనుమత్ క్షేత్రం

>> Tuesday, August 26, 2008

మీకు ఓ ప్రత్యేకమైన ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని చూపించబోతున్నాము. ఈ ఆలయం చారిత్రక నగరమైన ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో సాన్వర్ సమీపాన ఉంది. ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ తలక్రిందులుగా ఉండటమే ఈ ఆలయం విశిష్టత. విగ్రహం తలక్రిందులుగా ఉంది కాబట్టే ఈ ఆలయానికి ఉల్టా ఆంజనేయస్వామి ఆలయం అనే పేరు స్థిరపడిపోయింది.

ఈ విగ్రహం ఆంజనేయస్వామి ముఖ భాగాన్ని మాత్రమే కలిగి ఉంది. సాన్వర్ గ్రామ వాసులు ఈ ఆలయం చాలా ప్రాచీనమైనదని, రామాయణ కాలనుంచి ఇది ఉనికిలో ఉంటోందని చెప్పారు. రామ లక్ష్మణులను అహిరావణుడు బంధించి పాతాళలోకానికి తీసుకుపోయినప్పుడు ఆంజనేయస్వామి పాతాళలోకం వరకు వెళ్లి వారి ప్రాణాలను కాపాడాడు. హనుమంతుడు పాతాళలోకానికి వెళ్లిన స్థలం ఇదేనని ఇక్కడి ప్రజల నమ్మకం.

ఈ ఆలయంలోని వీర హనుమాన్ విగ్రహం చాలా శక్తివంతమైనదని భావిస్తున్నారు. ఆలయం సమీపాన పలువురు మహర్షుల మందిరాలు ఉన్నాయి. దాదాపు 1200 సంవత్సరాల క్రితం నుంచి ఈ మందిరాలు ఉంటున్నట్లు చరిత్ర చెబుతోంది. ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మర్రి, రావి, వేప, పారిజాతం, తులసి చెట్లు ఉన్నాయి. ఇక్కడ రెండు పురాతన పారిజాత వృక్షాలు ఉన్నాయి.






పురాతన గాథల ప్రకారం ఈ చెట్టులో వీర హనుమాన్ కొలువై ఉన్నాడట. ఈ పారిజాత చెట్టుపై లెక్కలేనన్ని చిలుకలు కూర్చుని ఉంటాయి. ఒకానొక బ్రాహ్మణుడు రామచిలుకల రూపంలో అవతారం దాల్చాడని పురాణ గాథ చెబుతోంది. వీర హనుమాన్ చిలుక రూపంలోకి మారి, తులసీదాసు రాముడిని కలిసేందుకు వాహకంగా మారాడని పురాణ కథనం.

ఆలయం లోపల సీతారాములు, లక్ష్మణుడు, శివపార్వతి విగ్రహాలు ఉన్నాయి. ప్రతి మంగళవారం నారింజ రంగు పూతను ఆంజనేయస్వామి విగ్రహానికి పూస్తారు. ప్రతి మూడు లేదా నాలుగు వారాలకోసారి ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ కోరికలు నెరవేరుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఆంజనేయస్వామిపై ప్రగాఢ విశ్వాసం వల్ల ఈ ఉల్టా ఆలయానికి భక్తులు విశేషంగా ఆకర్షితులవుతుంటారు.

ఈ ఆలయానికి చేరుకోవడానికి మార్గాలు:
రోడ్డు మార్గంలో ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో, ఇండోర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ప్రాంతానికి మీరు బస్సు లేదా టాక్సీ ద్వారా చేరుకోవచ్చు.
గగన మార్గం : ఈ ఆలయానికి సమీప విమానాశ్రయం 30 కిలోమీటర్ల దూరంలో ఇండోర్‌లో ఉంది.

Read more...

జయతు జయతు కృష్ణా

>> Saturday, August 23, 2008

జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘ శ్యామలః
కోమలాంగో జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః...!

తాత్పర్యం :
ఓ దేవకినందనా...! ఓ వృష్ణివంశ మంగళ దీపమా...! సుకుమార శరీరుడా...! మేఘశ్యామ...! భూభారనాశ ముకుంద...! నీకు సర్వదా జయమగుగాక...! అని ఈ పద్యం యొక్క భావం.

Read more...

నీ పాదపద్మములకు

నీ పాద పద్మ వజ్రపంజరం
కృష్ణ! త్వదీయ పదపంకజ పంజర్తానం
అద్వైవమే విశతు మానసరాజహంసః
ప్రాణ ప్రయాణసమమే కఫవాత పిత్తై
కంఠావరోధనవిదే స్మరణం కుతస్తౌ...!

తాత్పర్యం :
ఓ కృష్ణా...! మరణసమయాన నిన్ను స్మరించుచూ... నీలో ఐక్యమవ్వాలని కోరిక ఉన్నది కాని...! ఆవేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను స్మరించగలనో, లేనో? అని తలచి ఇప్పుడే నా 'మానస రాజహంస'ను శతృఅభేద్యమైన "నీపాద పద్మ వజ్రపంజర"మందు ఉంచుతున్నాను తండ్రీ...! అ

Read more...

ఆదివారం కృష్ణాష్టమి పూజ ప్రత్యేకత

కృష్ణుని జన్మదినమైన కృష్ణాష్టమి ఆదివారం వేళ వస్తే ఎంతో శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ఏడాది కృష్ణాష్టమి ఆదివారం వేళ వస్తుండడం భక్తులకు చాలా ఆనందాన్ని కల్గిస్తోంది.

ఇలాంటి శుభప్రదమైన వేళ ప్రత్యేక పూజలతో కృష్ణుని సేవిస్తే ఆ లీలా మానస చోరుడు తప్పక అనుగ్రహిస్తాడు. కృష్ణాష్టమి వేళ మద్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక పూజ చేయడం మంచిది. ఈ సమయంలో కంచు దీపంలో కొబ్బరినూనె పోసి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఇలాంటి దీపాలు రెండింటిని పూజకు ఉపయోగించాలి.

పూజకు ఉపక్రమించే సమయంలో సింధూరాన్ని నుధుటిన ధరించి తులసి మాలను మెడయందు ధరించాలి. అటుపై తులసి మాలతో కూడిన శ్రీకృష్ణుని ప్రతిమ ముందు తూర్పు వైపుగా కూర్చుని ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని 108 సార్లు జపించాలి. అనంతరం ఆ దేవదేవును పంచామృతాలతో అభిషేకించాలి. ఇలా చేస్తే ఆ గోపికా లోలుడు మిమ్ములను సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు.



ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం కమలానాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుషవిగ్రహాయ నమః
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరయే నమః
ఓం చతుర్భుజాత్తచక్రాసిగదా శంఖాంభుజాయుధాయ నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోపప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగసంహారిణే నమః
ఓం బలభద్రప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవితహరణాయ నమః

ఓం శకటాసురభంజనాయ నమః
ఓం నందవ్రజజనానందినే నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం నవనీతవిలిప్తాంగాయ నమః
ఓం నవనీతనటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతనవాహారాయ నమః
ఓం ముచుకుందప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాంపతయే నమః
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ధేనుకసురభంజనాయ నమః
ఓం తృణీకృతతృణావర్తాయ నమః
ఓం యమళార్జునభంజనాయ నమ




ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః
ఓం తమాలశ్యామలాకృతాయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః
ఓం ఇళాపతయే నమః
ఓం పరంజ్యొతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యాదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాససే నమః
ఓం పారిజాతాపహరకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః


)

ఓం బృందావనాంతసంచారిణే నమః
ఓం తులసీదామభూషణాయ నమః
ఓం శ్యమంతమణిహర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపూరుషాయ నమః
ఓం ముష్టికాసురచాణూర మల్లయుద్ధ విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం మురారినే నమః
ఓం నరకాంతకాయ నమః
ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసనకర్మకాయ నమః
ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకృతే నమః
ఓం విదురాక్రూరవరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచయే నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః
ఓం సుభద్రాపూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాదవిశారదాయ నమః




ఓం వృషభాసురవిధ్వంసినే నమః
ఓం బాణాసురకరాంతకృతే నమః
ఓం యుధిష్ఠరప్రతిష్ఠాత్రే నమః
ఓం బర్హిబర్హవతంసకాయ నమః
ఓం పార్థసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం శ్రీహూదధయేగీతామృతమ నమః
ఓం కాళీయఫణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః
ఓం దానవేంద్రవినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నాగాశనవాహనాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నాగాశనవాహనాయ నమః
ఓం జలక్రీడాసమాసక్తగోపీ వస్త్రాపహారకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః

ఓం ఇతి శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళిః నమః ........!


శ్రీ కృష్ణ ప్రార్ధన



కృష్ణో రక్షతునోజగత్రయగురుః కృష్ణం నమస్యమ్యహం

కృష్ణేనామరశ్త్రవో వినిహతాః కృష్ణాయ తస్త్మైనమః

కృష్ణా దేవ సముత్ధితాం జగదిదం కృష్ణస్య దాసో స్మ్యహం

కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ! రక్షస్వమాం...!

Read more...

అయినవాడే అందరికి ..అయినా చిక్కడు ఎవ్వరికి

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత... అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ అంటూ గీతా సారాంశంలో అర్జునుడికి ప్రబోధించిన శ్రీకృష్ణుడు తన లీలా విన్యాసాన్ని అలా తన భక్తులకు అందించాడు. భూమి మీద అధర్మం పెరిగిపోయి ధర్మానికి సంకటం ఏర్పడిన సమయంలో తాను అవతరిస్తానని చెప్పిన ఆ కృష్ణ పరమాత్ముడు తనను శరణు వేడినవారి కోసం ఏదో రూపంలో కాపాడుతుంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

చెరసాలలో దేవకీ గర్భాన ప్రవేశించి కారణ జన్ముడిగా భూమి మీదకు వచ్చిన శ్రీకృష్ణుని లీలలు సామాన్య మానవునికి అంత సులభంగా అర్థం కావు. మనిషి రూపంలో జన్మించి మనిషికి చెందిన అన్ని గుణాలను పుణికి పుచ్చుకున్న ఆ నల్లనయ్య దుష్ట శిక్షణ కోసం ద్వాపర యుగమున అనుసరించిన మార్గం యావత్ ప్రపంచానికి ఆదర్శనీయం.

చిన్ననాడు గోపికల మానస చోరుడై వెన్న ముద్దలు దొంగలించిన ఆ చిన్ని కృష్ణుడు తన మేనమామ కంసుని వధించి తన అవతార విశిష్టతను లోకానికి చెప్పకనే చెప్పాడు. కామి కాని వాడు మోక్షగామి కాడన్న చందంగా దుష్ట శిక్షణ చేసిన చేతితోనే ఎనిమిది మంది భార్యల సమక్షంలో 16 వేల మంది గోపికల మనస్సులో ఏక కాలంలో గిలిగింతలు పెట్టగలిగాడు.

నమ్మినవారికి కొంగు బంగారంగా నమ్మనివారికి అర్థం కాని ఓ మహా ప్రళయంగా ఆ గోపాలకుడు చేసిన ఘన కార్యాలు సామాన్యుని మదికి ఏమాత్రం అర్థం కావంటే అందులో అతిశయోక్తి లేదేమో. పాండవ పక్షపాతిగా కౌరవ వంశాన్ని కూకటి వేళ్లతో సహా నాశనం చేసిన ఆ జగన్నాటక సూత్రధారి లోకంలోని సకల కార్యాలకు తాను సూత్రధారినంటూ గీతాసారాంశాన్ని కూడా అందించాడు.

నిండు కౌరవ సభలో విశ్వరూపాన్ని ప్రదర్శించి సకల లోకాలకు తానే అధిపతినంటూ గుర్తు చేశాడు. మన్ను తిన్న వేళ నోరు తెరవమని కోరిన యశోదకు మొత్తం విశ్వాన్నే తన నోటిలో చూపించి చరాచర సృష్టి మొత్తం తనలోనే అవతరించి తనలోనే అంతరించి పోతోందన్న విషయాన్ని లోకానికి చాటి చెప్పాడు.

యుద్ధం చేయలేనంటూ ధనుర్బాణాలను త్యజించిన తన ప్రియ మిత్రుడు అర్జునుడికి గీతా సారాంశాన్ని బోధించి మహాభారత యుద్ధానికి నాంది వాచకం పలికాడు. ఆయుధమన్నది పట్టకుండా 18 రోజుల యుద్ధంలో శత సోదరులైన కౌరవులనందరినీ సంహరింపజేసిన ఆ దేవదేవుని చరితం మానవజాతి మొత్తానికి ఆదర్శప్రాయం.

Read more...

నందనందనా రారా కన్నా !

జనావళికి ఆదర్శప్రాయం 'గీత
శ్రీముఖ నామసంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల దంపతులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. అనగా.. ఆయన భూమిపై పురుడు పోసుకున్నది క్రీస్తు పూర్వం 3228 సంవత్సరంలో.

జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘ శ్యామలః
కోమలాంగో జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః||

తాత్పర్యం|| ఓ దేవకినందనా! ఓ వృష్ణివంశ మంగళ దీపమా! సుకుమార శరీరుడా! మేఘశ్యామ! భూభారనాశ ముకుంద! నీకు సర్వదా జయమగుగాక!

అలా జన్మించిన ఆ బాలుడు దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ.. తన లీలావినోదాదులచే చిరు ప్రాయం నుంచే అడుగడుగనా భక్తులను జ్ఞానోపదేశం చేస్తూ, అపారప్రజ్ఞాపాఠవాలు కలిగిన దైవాంశ సంభూతుడిగా ఎదుగుతూ వచ్చాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగిలిస్తూ వెన్నదొంగగా ముద్ర వేసుకున్నాడు.

అలా వెన్నముద్దల దొంగతనములో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట! ఈ సంఘటన వెన్న జ్ఞానానికి సంకేతంగా చెపుతుంటారు మన పెద్దలు. పెరుగును మధించగా.. మధించగా కాని వెన్న లభ్యం కాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లటి కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా చెపుకుంటారు.

అలాగే.. మరో చిన్నారి చేష్టలలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుంచి తీసుకుని వెళుతూ ఉంటే, రాళ్లను విసిరి చిల్లు పెట్టేవాడు. అలా ఆ కుండ మానవ శరీరము అనుకుంటే ఆ కుండ లోని నీరు అహంకారం. ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని, ఇలా వారి లీలలోని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు పెద్దలు.

ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధిగా ఉంటాడు. ఆ పాత్రలో అర్జునుడిలో నెలకొన్న అజ్ఞాననాంధకారాన్ని తొలగించడం కోసం.. తన విశ్వరూపాన్ని ప్రదర్శించి, గీతను బోధించి, తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు. ఇలా కృష్ణతత్వాన్ని కొనియాడి చెప్పుటకు వేయి తలలు కలిగిన ఆదిశేషునకే సాధ్యంకాదని చెప్పగా, అట్టి శ్రీకృష్ణ భగవానుని జ్ఞానబోధతో అందించిన 'గీతామృతం' మనకు ఆదర్శప్రాయం

Read more...

హనుమాన్ చాలీసా ఎలాపుట్టింది? ఎందుకోసం?

>> Friday, August 22, 2008

ఆపదలుబాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమయిన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము.

వారణాసిలోనివసిస్తూవున్నసంత్ తులసీదాస్ రామనామగాననిరతుడయిబ్రహ్మానందములోతేలియాడుతుండేవారు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలువెల్లువలవుతుండేవి. వారిప్రభావమువలన ప్రభావితులయిన జనం వారిద్వరా రామనామ దీక్ష తీసుకుని రామనామరసోపాసన లో తేలియాడుతుండేవారు. ఎంతోమంది ఇతర మతాలకుచెందిన భక్తులుకూడా రామనామ భజనపరులుకావటం జరుగుతున్నది. ఐతే భగవంతుని పట్ల కాక తమ నమ్మకాలపట్లమాత్రమే మొండి పట్టుదలకల ఆ మతగురువులకు ఇది కంటగింపుగా వున్నది. వారు తులసీదాసు మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మనమతాన్ని కించపరుస్తున్నాడని లేనిపోని అభియోగాలు ఢిల్లీ పాదుషావారికి పంపుతుండేవారు.

ఇదిలాఉండగా వారణాసిలో వున్న ఒక సదాచారవంతుడయిన గృహస్తు తన ఏకైక కుమారునకు కుందనపు బొమ్మలాంటి అమ్మాయితో వివాహం చేసాడు. వారిద్దరూ చిలకా గోరింకలులా వారిద్దరూ అన్యోన్యతతో ఆనంద తీరాలు చవిచూస్తున్నారు. కానీ కాలానికి ఈ సుఖ దు:ఖాల తో పనిలేదు కదా ! విధివక్రించి హఠాత్తుగా ఆయువకుడు కన్ను మూసా డు. ఆ అమ్మాయి గుండెపగిలి ఘోరంగా విలపిస్తున్నది. తలబాదుకుంటూ విలపిస్తున్న ఆతల్లిశోకానికి అందరిగుండెలూ ద్రవించిపోతున్నాయి. ఎవరెంత బాధపడ్డా జరగవలసినవి ఆగవుకనుక బంధువులు శవయాత్రకు సన్నాహాలు చేశారు. శవ్వాన్ని పాడెమీద పనుకోబెట్టి మోసుకుని వెళుతుండగా ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకు వెళ్ళనీయకుండా అడ్డంపడి రోదిస్తుండటంతో స్త్రీలు ఆమెను బలవంతంగా పట్టుకుని వుండగా శవ యాత్రసాగిపోతున్నది. శ్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగనే సాగుతుంది. శవవాహకులు ఆశ్రమం దాటే సమాయానికి అక్కడ ఇంటివద్ద పట్టుకున్నవారిని విదిలించుకుని మృతుని భార్య పరుగుపరుగున వస్తూ ఆశ్రమం దగ్గరకు రాగానే మనసుకు కలిగిన ప్రేరణతో ఆశ్రమములోకి పరుగిడి, ధ్యానస్తులైవున్న తులసీదాసుగారి పాదాలపైన వాలివిలపించటం మొదలెట్టింది.
గాజులు , కాలి అందెల శబ్దం విన్న తులసీదాస్ గారు దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. దానితో ఆయువతి మరింత బిగ్గరగా ఏడుస్తుండటం తో కనులుతెరచిన సంత్ , అమ్మా ! నేను దీవించిన దానిలో తప్పేమున్నది తల్లీ ! ఎందుకిలా దు:ఖిస్తున్నావని అడిగారు. అప్పుడామె తండ్రీ ! నాలాంటి నిర్భాగ్యురాలిని దీవించి తమలాంటి మహాత్ముల వాక్కుకూడా వ్యర్ధమయినేదని బాధపడుతున్నాను అని దు:ఖిస్తూ పలికింది. అమ్మా నా నోట రాముడు అసత్యం పలికించడే ! ఏమయినదమ్మా ! అని అనునయించాడు. తండ్రీ ! ఇంకెక్కడి సౌభాగ్యం, అదిగో నాతలరాత నాపసుపుకుంకుమలను మంటలలో కలిపేందుకు వెళుతున్నదని విలపించుట తట్టుకోలేని ఆయన లేచి వెళ్ళీ శవవాహకులతో ఆ శవాన్ని ఆపించాడు. అయ్య కొద్దిగా ఆపండి ,అని ఆపి ఆశవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండల జలాన్ని చల్లాడు.

దానితో శవములో చైతన్యం వచ్చి ప్రాణం పోసుకున్నది. అదిచూసిన జనం జేజేలు పలుకుతూ వారికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. దీనితో ఆయనగురించి మరింత ప్రాచుర్యం జరిగి ,తండోపతండాలుగా జనం వారినిదర్శించి రామనామాన్ని స్వీకరించి జపించటం ఎక్కువయినది.
ఇదే అదనుగా భావించిన ఇతరమత గురువులు ఢీల్లీ పాదుషావారికి స్వయముగా వెళ్ళి ,తులసీదాస్ రామ నామము గొప్పదని చెబుతూ మన మతస్తులను ,అమాయకులను మోసంచేస్తున్నాడని, పలుఫిర్యాదులు చేసారు. దానితో ఢిల్లీ పాదుషా విచారణకోసం సంత్ గారిని ఢిల్లీ దర్భారుకు పిలిపించారు.
తులసీదాస్ గారూ మీరు రామనామము అన్నిటికన్నా గొప్పదని ప్రచారము చేస్తున్నారట. నిజమేనా ? అని పాదుషా ప్రశ్న.
అవునుప్రభూ ! సృష్టిలోని సకలానికీ ఆధారమయిన రామనామ మహిమను వర్ణించ నెవరితరము.?
అలాగా? రామనామముతో దేనినయినా సాధించగలమని చెబుతున్నారట నిజమేనా?
అవును ! రామనామము తో సాధించనిదేమున్నది.
మరణాన్ని సహితం జయించకలదని చెప్పారట?
అవును ప్రభూ ! రామనామానికి తిరుగేమున్నది.
సరే ! మేమిప్పుడొక శవాన్ని తెప్పిస్తాము ,దానిని మీ రామనామము ద్వారా బ్రతికించండి ,అప్పుడు నమ్ముతాము.
క్షమించాలి ప్రభూ! జననమరణాలు జగత్ప్రభువు ఇచ్చాను సారంగా జరుగుతాయి . మనకోరికలతో కాదు.
చూడు తులసీదాస్ జీ మీరు మీమాటను నిలుపుకోలేక మీరుచెప్పే అబద్దాలను నిరూపించుకో లేక ఇలాంటి మాటలు చెబుతున్నారు . మీరామనామము ,మీరుచెప్పినవి అబద్దాలని చెప్పండి వదలివేస్తాము అని పాదుషా ఆగ్రహించాడు.
రామనామము దాని మహిమ సత్యమని పలికిన తులసీదాస్ మోసగాడిగా భావించిన పాదు\షా చివరికి తులసీ నీకు చివరి అవకాశం ఇస్తున్నాను .రామనామము మహిమ అబద్దమని చెప్పి ప్రాణాలుదక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని మొండిగా ఆజ్ఞా పించాడు. అప్పుడు తులసీదాసు ఈ విపత్కర పరిస్తితిని కల్పించిన నువ్వే పరిష్క్రించుకోవాలని మనసులో రామునికి మనవి చేసుకుని ధ్యాన మగ్నుడయ్యాడు. అది తనను ధిక్కరించటమని భావించిన పాదుషా ,తులసీ దాసుని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు.
అంతే ! ఎక్కడనుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీ దాసును బంధించవచ్చే సైనికులవద్ద ,ఇతర సైనికులవద్ద ఆయుధాలు లాక్కుని వారికేగురిపెట్టి, అందరినీ కదలకుండా చేసాయి. సభికులు ,ఏకోతి మీదపడి కరుస్తుందోనని హడలిపోతూ వున్నారు. ఈ కలకలానికి కనులువిప్పిన తులసీదాస్ గారికి ఆశ్చర్యం కలిగింది . దీనికి కారణమేమిటాని చుట్టూ చూడగా , సిమ్హద్వారము మీద ఆసీనులై వున్న హనుమంతుడు దర్శనమిచ్చాడు. దానితో ఒడలు పులకించిన సంత్ ...... జయ హనుమాన జ్ఞాన గుణసాగర............ అంటూ 40 దోహాలతో ఆశువుగా వర్ణించాడు.
దానితో ప్రసన్నుడయిన పవనసుతుడు, తులసీ నీ స్తోత్రంతో మాకు ఆనందమయినది నీకేమ్ కావాలో కోరుకో అని అన్నారు.
అయితే మహాత్ములెప్పుడూ తమస్వార్ధంకోసం కాక లోకక్షేమం కోసము మాత్రమే ఆలోచిస్తారు కనుక , తండ్రీ ! ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయమివ్వాలని విన్నవించుకున్నాడు.
దానితో మరింతప్రియం కలిగిన స్వామి , తులసీ మాకు అత్యంత ప్రీతిపాత్రమయిన ఈస్తోత్రంతో మమ్మెవరు స్తుతించినా వారిరక్షణ భారం మేమే వహిస్తామని వాగ్దానం చేశారు.
అప్పటినుండి ఇప్పటివరకు హనుమంతుని చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనువై నెరవేరుస్తూనేవున్నది.


జయ హనుమంత మహా బలవంత.

Read more...

అదృష్ట - రేఖ

>> Thursday, August 21, 2008

( పూజ్య శ్రీ ఎక్కిరాల వేద వ్యాస్ గారి రచనలనుండి (3) )


భారత దేశంలో కీరో జాతక విద్యయేకాకా అతని, ఆధ్యాత్మిక అనుభవాలు కూడా పరిపూర్ణతకు చేరుకున్నాయి. మహారాష్ట్ర ప్రాంతం లోని పశ్ఛిన కనుమలలోని పురాతనమైన కొండ గుహలోవున్న ఒక శివాలయములో కూర్చుని మూడు రోజులపాటు ధ్యాన సమాధిలో మునిగిపోయి అన్నాహారాలు లేకుండా గడిపిన కీరో దివ్యదృష్టి, భవిష్యత్తును సినిమాలాగచూసే కాలజ్ఞాన దృష్టి ఆయనలో సంపూర్ణంగా మరింత విచ్చుకున్నాయి ఇలా మూడేళ్లున్నాడు ఇండియాలో

ఇంతలోనే కీరో ఇంగ్లండుకు తిరిగి వెళ్లే ప్రయాణంకోసం బొంబాయి చేరుకుని లండన్ లోని తన సంబంధీకులతో బోగట్టా చేయగా ఒక ఆశ్చర్యం జరిగింది. ఒక ధనవంతుడైన దూరపు బంధువు మరణిస్తూ తన యావదాస్తినీ కీరోపేర వ్రాసి, అతడు ప్రపంచంలో ఎక్కడవున్నా సరే అతనికి ఈ భోగట్టాతెలిపి ఆసొమ్మును అందజేసే ఏర్పాటుచేసి తాను మరణించాడు.

భారతదేశంలోని నీ విద్యాభ్యాసం పూర్తి అయింది ఇక నీయొక్క ధర్మం జ్యోతిషం గురించి విదేశాలలో ప్రచారం చెయ్యడమే త్వరలోనే నీయొక్క కర్మయే అదృష్టంలాగా విదేశాలలో నీకు పిలుపు నిస్తుంది వెళ్ళు అన్న తన గురువు మాటలే అక్షర సత్యాలై అతనికి ఇంగ్లండు వెళ్ళేందుకు డబ్బును కూడా సనకూర్చాయి. విధి విధానానికి ఆశ్చర్య పడుతూ ఒక ప్రయాణపు ఓడలో ఫస్ట్ క్లాస్ ప్రయాణీకుడుగా సగౌరవంగా ప్రయాణించి క్షేమంగా లండను చేరుకున్నాడు.

తన చిన్నతనంలో తండ్రికి కీరో ఒక ప్రమాణంచేశాడు. ఏమని అంటే జాతకాలు గాని , జ్యోతిషాలుగాని, మంత్రతంత్రాలుగాని మన క్రైస్తవ కుటుంబ సాంప్రదాయానికి విరుధ్ధాలైనవి , ఒక వేళ వాటిని తాను నేర్చుకున్నా ప్రాక్టీసు చేసినా సరే తన కుటుంబం పేరు ఇంటి పేర్లూ బైట ప్రపంచంలో ఏ మాత్రం తెలియకుండా తాను ఒక కొత్త పేరుతో, మారుపేరుతో జీవిస్తానని.

ఆ విషయమే ఆలోచిస్తూ ఎలా చెయ్యడమా అని ఆలోచిస్తూ ఆలాపనగా ఊహాలోకంలో పడ్డ కీరో మనస్సు తెరపై స్పష్టంగా కొన్ని అక్షరాలు కనపడ్డాయి. టి.వి.పై తెరపై అక్షరాలవలే “CHIERO”
అన్న పెద్ద అక్షరాలుగల పేరు చూసి దాన్ని వెంటనే నోట్ చేసుకుని ఆ పేరులోని అంకెలన్ని కూడితే ఆశ్చర్యం సంఖ్యా శాస్త్రం లోకల్లా అదృష్టకరమైన అంకె 23 వచ్చింది.

జంట సంఖ్యలలోకెల్లా అదృష్టమైన అంకెగా 23 కు ఆకాశంలో నక్షత్రంలాగా వెలిగే సింహం రాజుల మద్య రాజువలె మృగరాజు లేక The “ Royal Star of the Lion” the king of the Heavens
అని అర్ధం వచ్చింది. వెంటనే ఈపేరు, సంఖ్యా తనకు సరిపోతుందని తాను నవంబర్ 1 తేదీన పుట్టినందున సూర్యుడికీ సింహరాసికి రెంటికీకూడా ఈ పోలిక బాగా నప్పింది.

మరుక్షణమే లండన్ లో బోర్డు వ్రాసే ఓ పెయింటర్ వద్దకు వెళ్ళి ఒక చిన్న అందమైన నోటీస్ బోర్డు వంటిది చెక్క పలక మీద పై పేరును అందంగా చెక్కించి బంగారం రంగుతో పెయింట్ చేయించాడు. మంచి అధృష్ట గడియ సమయం చూసి, ఆబోర్డును తన గది బయట మేకులుకొట్టి బిగించాడు. అలా కీరో కొత్త జీవితం లండన్ మహానగరంలో ప్రారంభమైనది.

అలా కీరో అన్న తన పేరుతో బోర్డును ఇలా తగిలించాడో లేదో మెయిన్ రోడ్డువెంట విలాసంగా వెళుతూ ఒక మధ్యవయస్కుడు ఒక సూటూ, నల్ల కళ్ళద్దాలూ తగిలించి సరదాగా పచార్లుచేస్తూ కీరో అన్న పేరు బోర్డుపై మనుష్యుల భవిష్యత్తు అదృష్టము తెలుపబడును. అనిఉంటే చూసి ముచ్చటపడి లోపలికి వచ్చాడు.

కీరో ఎదురుగావున్న టేబుల్ ముందు కూర్చుంటూనే నాకీ మూఢవిశ్వాసాలు లేవు అయినా మీరేం చెబుతారో చెప్పండి అంటూ మీఫీజు ఎంత అని అడిగి తన చేతినిచాపి టేబుల్ పై వుంచాడు. ఆ వ్యక్తి చేతిలోని గీతలు రేఖలు చూసి కీరో త్రుళ్ళి పడ్డాడు. ఆయన ఒక అసాధరణ వ్యక్తిలా కనిపించాడు. క్రమంగా అతని బాల్యము , మంచితెలివితేటలుగల ఉన్నత మధ్యతరగతిలో పుట్టుక అక్కడనుండి యూనివర్సిటీదాకా చదువూ, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలమూ , అప్పుడప్పుడే రాజకీయాలలో ఉన్నత రాజకీయ వేత్తలతో పరిచయమూ....... ఇలా అన్నీ పూసగుచ్చినట్టు చేతిలోని రేఖల్లో చదేవేశాడు.

బాబోయ్ మీరేమన్నా మనిషా లేకపోతే ఏదోరకమైన స్పిరిట్ వంటిజీవుడా అదేమిటి అన్నీ చెప్పేస్తున్నారు. అంటూ భయపడ్డాడు. కీరో నవ్వుతూ మెడిసన్ లో ఒక సైన్సుప్రకారం రోగి శరీరంలోని కండలు, నరాలు , చర్మం, గోళ్ళు వాటిరంగు చూసి ఆ మనిషి ఆరోగ్యాన్ని డాక్టర్లు ఎలాగ చదివేస్తారో అలాంటిదే ఇదీ ఒక రకమైన శరీర శాస్త్రం మీద ఆధారపడ్డ సైన్సు అటూ హేతువాద ప్రకారం హస్తసాముద్రికం పునాదిని సైంటిఫిక్ గా వివరించాడు.

ఆయన స్థంభీభూతుడై మంత్రించినట్టు ఆలా వింటున్నాడు. చివరకు మీరు చెప్పిన ఈ చిన్న వివరణకైనా నేనిచ్చే ఈ ఫీజు నష్టంకాదు. మనిషి గతంలో చేసిన పని గీతలు అరచేతిలోని మనిషి అరుగుదలను బట్టి వ్రేళ్ళ మడతలను బట్టి గతంలోని సంఘటనల తాలూకు గుర్తులు అచ్చులు పడవచ్చు. ఆది సాధ్యమే ఒప్పుకుంటాను. కాని మహాశయా ఎపుడో దూరంగా భవిష్యత్తు లో ఉన్న సంఫటనలు వాటి మార్కులు లేకగుర్తులను మన అరచేతిలో ముందుగానే వేస్తాయంటే నాకెందుకో ఎంత ఆలోచించినా అదేలాగ సాధ్యమో బోధపడుటలేదు.ఆన్నాడు.

కీరో ఆయన పుట్టిన తేది, నెలా, సంవత్సరమూ, అన్నీ తీసుకొని సంఖ్యాశాస్త్రం ప్రకారం గణితం చేస్తూ ఒక్కొక్క అంకెనూ, ఆయన పుట్టిన సంవత్సరానికి కలిపితే జీవితంలో ఆ తరువాత వచ్చే మలుపూ లేక ముఖ్య సంఘటనలూ ఎలా వస్తున్నాయో లేఖ్ఖవ్రాసిమరీ చూపించాడు. ఆ అంకెలన్నీ లిష్టువేసి చూపిస్తూ ఆయన అరచేతిలోని రేఖలు దగ్గర పెన్సిలు గుర్తులు పెట్టి చూపుతూ భవిష్యత్తులో ఆయన రాజకీయాలలోకి ఎలా ప్రవేశిస్తాడో క్రంమంగా బ్రీటీషు పార్లమెంటు లోకి ఎన్నిక కావడం పార్లమెంటు మెంబరుగా ఉన్నత గౌరవం ఆధికారం అన్నీ, ఎలా సూచించబడ్డాయో కీరో తన మనస్సులో సినిమాలాగ కనిపించిన వన్నీ ఒక్కొక్కటే వర్ణించి చెప్పాడు.

ముఖ్యంగా ఆయన చేతిలోని అదృష్టరేఖ , చాకుతో గీసినట్టు నిటారుగా చూపుడు వ్రేలుక్రిందకు గీసినట్టు నిటారుగా చూపుడువ్రేలుక్రిందకు గీసినట్టుండి అక్కడ వున్న గురు స్ధానాన్ని చేరడంతో స్పష్టంగా ఆయనకు భవిష్యత్తులో మహోన్నతమైన పదవి, గౌరవం, కీర్తీ లభిస్తాయని ఆయన భవిష్యత్తునుగూడ చదివేశాడు.

తరువాత ఆయన బ్రీటీషు రాజకీయాలలో మహోన్నత పదవి చేరుకున్న లార్డ్ –బాల్ఫోర్ గా, రాజకీయాలలోనూ బ్రిటీషు పార్లమెంటులోనూ కూడా ఆయన పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది.

చివరకు ఆయన చేతిలోని రేఖలను ఇటు, అటు త్రిప్పిచూస్తూ ఇలా అన్నాడు కీరో.
మహాశయా మీ చేతిలో ఒక విచిత్రమున్నది. నాకు ఎంత వెతికినా మీ హస్తరేఖలలో పెండ్లి గురించిగాని, వివాహం, సంసారిక జీవితం వాసనలు గాని చూపించే రేఖ ఏదీ కనిపించడం లేదు. ఇదేదో విచిత్రంగా వుంది. అన్నాడు.

దానికి ఆయన నవ్వుతూ కీరో మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు సత్యం , నేను జీవితాంతం బ్రహ్మచారిగానే వుండాలని చాలా కాలం క్రిందటే నిశ్చయించుకున్నాను. నా సమాజ జీవితానికి నా సొంత జీవితం అడ్డు రాకూడదని అలా చేశాను . నా అదృష్టంలో కూడా అలానే వ్రాసి పెట్టివుందా చాలా ధాంక్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి సెలవు తీసుకున్నాడు.

చాలా సంవత్సరాల తరువాత అతడు పార్లమెంటులో సభానాయకుడై తనకు, ముందే జ్యోతిషం చెప్పిన కీరోకి చెప్పిన కీరోకి కృతజ్ఞతగా ఒక పెద్ద డిన్నర్ ను గౌరవ సభనూ ఏర్పాటు చేశాడు. దానితో కీరో పేరు ప్రఖ్యాతులు లండన్ నగరంలోనే కాకుండా యూరప్ లోని అన్ని దేశాలలోనూ మారు మ్రోగింది. వార్తలద్వారా మరియు న్యూస్ పేపర్లద్వారా.

అలా ఫ్రారంభమైంది కీరో అన్న పేరు తగిలించిన మరుక్షణంనుంచే తనకు కొత్తజీవితం. ఆరోజునుండి దాదాపు పాతికేళ్ళు ఉపిరి సలపకుండా సమాజంలో మహోన్నత వ్యక్తులు , ప్రధాన మంత్రులు, ప్రెసిడెంట్లు, యూరప్ లోని రాజులు హాలివుడ్ సినిమా స్టార్ లు , అమెరికా బిజినెస్ లోని కోటీశ్వరులు, పేరుమోసిన కొందరు గూఢచారులు, వీరూ వారూ అనే తేడాలేకుండా కీరో వద్దకు జాతకాలు చూపించుకునేందుకు వచ్చేవారు. ఐనా తమకు కీర్తి, ధనము, పలుకుబడి ఎంత పెరిగినా కీరో మాత్రము తన గురువు చెప్పిన ఒక ముఖ్యసూత్రమూ , మాత్రం మరచిపోకుండా పాటించాడు.

అదేమిటంటే కష్టాలలో వున్నవారూ , అనాధలూ, స్త్రీలూ, జైలులో శిక్షలనుభవించేవారూ కీరో సహాయం ఎవరు కోరినాసరే వారికి తన జ్యోతిషంతో సహాయము, సలహా, తన ప్రేమా అభిమానం అందించేవాడు ఫీజులేకుండా.

దరిద్రనారాయణుని సేవలోనే పరమాత్ముని సేవ వుందని చెప్పే ఇండియాలోని తనగురువు మాటను కీరో ఎన్నడూ మరువలేదు. ఫలితంగా ఒకానొక అదృశ్యమైన దైవిక శక్తి కీరో వెంట నిత్యమూ రక్షణగా వుండేది. ఎన్నోసార్లు ఆయనను గొప్ప కష్టాలలోనుండి కాపాడింది అదే.

అదే నేను నమ్మే దైవం నిష్కారణమైన ప్రేమా, సానుభూతీ అవే నా దైవం. అంటూడు కీరో. బాగా పండిపోయిన తన 80 వ ఏట గతించిన తన అనుభవాలను నెమరువేస్తూ గతాన్ని గుర్తుచేసుకుంటూ.

Read more...

దారిద్ర్యాలను దూరంచేసే కనకధారాస్తవం

>> Thursday, August 7, 2008

బ్రహ్మచారిగా విధ్యాభ్యాసం చేస్తున్న శంకరాచార్యులవారు ఒకరోజు భిక్షార్థియై ఒకరోజు ఒక నిరుపేద ఇంటిముందు నిలబడి, భవతీ భిక్షాందేహి అని అడిగారట. పాపం దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న ఆఇల్లాలు ఇంటిముందుకొచ్చి యాచించిన వారికి ఏమీ ఇవ్వటానికి లేక బాధపడుతూ అంతావెదుకుతున్నది. అర్ధిని రిక్తహస్తాలతో పంపితే అది దోషమవుతుంది. అదితెలియక మనం యాచించిన వారిని కసురుకుంటాము. కానీ ధర్మంతెలిసిన ఆఇల్లాలు, ఇల్లంతావెదకగా ఎండిపోయిన ఒక ఉసిరికాయ మాత్రమే దొరికినది. ఎంతో ఆవేదనతో కుమిలిపోతూ, ఆ కాయనేతెచ్చి శంకరుల భిక్షాపాత్రలో వేసి కళ్ళలో నీరుకుక్కుకుంటూ నమస్కరించినదట. సర్వజ్ఞులైన ఆచార్యులవారి మనస్సు ఆతల్లి ధర్మనిష్ఠకు, వారిపేదరికపు బాధకు కరగిపోయినది. వెంటనే సకలసంపదలనొసగే ఆ మహాలక్ష్మీదేవిని స్తుతిస్తూ స్తోత్రం చేసారట. అండుకు మిగుల సంతోషించిన ఆజగన్మాత ప్రత్యక్షమై ఏమికావాలినాయనా అని అడిగినదట. అప్పుడు తల్లీ ఈ ఇల్లాలి దారిద్ర్యాన్ని తొలగించమని వారువేడుకొనగా, ఈ గృహిణీ పూర్వజన్మమున ఏ పుణ్యకార్యము చేయనందున నా అనుగ్రహము కలుగలేదు ఈమెపై అని తల్లిసెలవిచ్చినది. అప్పుడాయన ఈమె నాకిపుడొసగిన ఉసిరికాయ వలన వచ్చిన పుణ్యమును పరిగణించి కనికరించమని వేడగా ,ఆఇంటిలో బంగారపు వుసిరికాయలను కురిపించినది అమ్మ. అందువలనే ఈ స్తోత్రమునకు కనకధారా స్తవమని పేరు. ఇప్పటికీ దారిద్ర్య బాధతో కుమిలిపోతున్న వారెందరో ఈ స్తోత్రాన్ని జపించి తమ దరిద్రాలను దూరంచేసుకుంటున్నారు. నేను కూడా ప్రత్యక్షప్రమాణంగా కొందరిచేత పారాయ\ణం చేపించగా వారికి ఎంతో మంచి ఫలితాలు వచ్చాయి. లక్ష్మీదేవికి ఇష్టమయిన ఈ శ్రావణమాసములో ఈస్తోత్రాన్ని పఠించి ఆతల్లి కరుణను అందరూ పొందాలని కోరుకుంటున్నాను.


కనకధారాస్తవం

అజ్గం హరేః పులక భూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభారణం తమాలం
అంగీకృతాఖిలవిభూతి రపాంగలీలా
మాంగల్య దాస్తు మమ మంగల దేవతాయః!


ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్జ్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని,
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలేయా
సామే శ్రియం దిశతు సాగర సంభవాయః !

విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్ష
మాననంద హేతు రధికం మురవిద్విషో పి
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్ధం
ఇందీవరోదర సహోదర మిందిరాయః !

ఆ మిలితాక్ష మధిగమ్య ముదాముకుంద
మానందకంద మనిమేష,మనంగ తంత్రం
ఆ కేకరస్థిత కనీనిక పద్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః !

కాలాంభుదాళి లలితో రసి కైటభారే
ర్దారాధరే స్పురతి యా తటి దంగనేవ
మాతు స్సమస్త జగతాం మహనీయమూర్తి
ర్భద్రాణి మే దిశతు భార్గవనందనాయః!

బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తు భేయా
హారావళీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతో పి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః !


ప్రాప్తం పదం ప్రధమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్య భాజి మధు మాధిని మన్మధేన
మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్ధం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః !

దద్యా ద్దయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిశౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంభువాహః !

ఇష్టా విశిష్టమతయో పి య యా దయార్ధ్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం భజంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః !

గీర్దేవ తేతి గరుడ ద్వజ సుందరీతి
శాకంబ రీతి శశిశేఖర వల్లభేతి
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యైనమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై !

శ్రుత్యై నమోస్తు శుభకర్మఫల ప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్త్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై !

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై !

నమోస్తు హేమాంబుజపీఠికాయై
నమోస్తు భూమండలనాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమొస్తు శార్జాయుధ వల్లభాయై !

నమోస్తు దేవ్యే భృగునందనాయై
నమోస్తు విష్ణో రురసిస్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై !

నమోస్తు కాన్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై!


సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మా మేవ మాత రనిశం కలయంతు మాన్యే !

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్ధ సంపదః
సంతనోతి వచనాంగమానసై
స్త్యాం మురారి హృదయేశ్వరీం భజే !

సరసిజనయనే! సరోజహస్తే!
ధవళతరాంశుక గంధమాల్యశోభే!
భగవతి!హరివల్లభే మనోజ్ఞే !
త్రిభువనభూతికరి! ప్రసీద మహ్యం !

దిగ్ఘ్నస్తిభి కనకకుంభముఖావసృష్ట
స్రగ్వాహినీ విమలచారు జలఫ్లుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీ మమృతాబ్ది పుత్రీం !

కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మామకీంచనానాం
ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః !

బిల్వాటవీ మధ్య లసత్సరోజే
సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్
సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీమ్ !

కమలాసన పాణినాలలాటే లిఖితా
మక్షరపంక్తి మస్య జంతోః
పరిమార్జయ మాత రంఘ్రిణా తే
ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్ద్రీమ్ !

అంబోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్థలం భర్తృ గృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలాగృహం మేహృదయారవిందమ్ !

స్తువంతి యే స్తుతిభి రమూభిరన్వహం
త్రయీమయీంత్రి భువనమాతరం రమాం
గుణాధిక గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధభావితాశయాః !


ఫలశృతి

సువర్ణధారాస్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితమ్
త్రిసంధ్యం యః పఠేనిత్యం స కుబేరసమోభవేత్

Read more...

కాలసర్ప యోగం పొంచివున్నది.

>> Monday, August 4, 2008

భూమి మీద ఈ సంవత్సరం సూర్య చంద్ర గ్రహణముల ప్రభావము వలన కాలసర్పయోగము వున్నదని ప్రముఖ జ్యోతిషశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనిని తేలికగా కొట్టిపారేయకుండా జాగ్రత్తగా గమనించి అనుభవ పూర్వకంగా నిర్ధారించుకోవచ్చు. దీనిప్రభావమువలన పలు ఉత్పాతాలు, ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈహెచ్చరికలు ఎవరినో భయపెట్టడానికో ,తమ పబ్బము గడుపుకోవడానికో చెప్పేవి కావు. మానవాళి క్షేమానికై మహర్షులు అందించిన మహావిజ్ఞానమిది. ఈసంవత్సరంకాలసర్పయోగము,మకరరాశి లో గురు,రాహువుల కలయికవలన ఆగష్టు పదిహేడునుండినవంబర్ ఇరవై ఎనిమిది వరకు అనేక నష్టములు, ప్రకృతి వైపరీత్యములు కలిగే అవకాశము వున్నది. అందువలన ఎవరికి వారు తగిన శాంతులు, దైవపూజలు జరుపుకొనటము మంచిదని సలహాలనిస్తున్నారు. కనుక తగిన జాగ్రత్తలు తీసుకొనుట, మంచిది.
ముఖ్యముగా భక్తరక్షకుడైన హనుమంతుని ధ్యానం, ఆయన కిష్టమయిన చాలీసా పారాయణం చేసుకొనుట శుభప్రదం. స్రీవెంకటేస్వర జగన్మాత పీఠములో క్షేత్రపాలకుడైన అభయాంజనేయ స్వామివారికి భక్తజన రక్షణార్ధమై ప్రత్యేకపూజలు జరుగుతున్నాయి. మీమీ గోత్రనామములను పంపితే మీపేరన కూడా అర్చనలు జరుపబడతాయి. ఇందుకుగాను మీరు ఇవ్వవలసిన ది రోజుకు ఒక అరగంట సమయం మాత్రమే .ఆసమయములో మీ ఇష్ట దేవతా రాధన, హనుమత్ చాలీసా పారాయణం జరపటమే మీనుండి కోరే దక్షిణ.
మెయిల్: durgeswara@gmail.com కు మీవివరాలు ,మీ అనుమానాలు వ్రాసి పంపండి.

Read more...

అమ్మచేతివంట.....ఆరోగ్యాల పంట.

>> Saturday, August 2, 2008

భారతీయులకు శుభ్రత , శుద్ధి వారిజీవిత విధానములో భాగాలు. విదేశీయులకు తాము తెలుసుకున్న విజ్ఞానమువలన పదార్ధాలను స్థూలముగా శుద్ధిపరచటమువరకే తెలుసు. కానీ ఆవస్తువును సూక్ష్మస్థాయిలో దానిప్రభావాన్నికూడా కనిపెట్టిన మహర్షులు ఎలాశుద్ధిపరచాలో మన ఆచారాలలో పొందుపరచారు. మామూలుగా ఆహారపదార్ధాలను సూక్ష్మజీవిరహితముచెయ్యటమువరకే మనము సుద్ధిపరచటము అనుకుంటాము. కానీ దానిస్తూలాంశము రక్తములోకలసి ధాతుపుష్టిని కలిగిస్తుంది. కానీ ఆహారములో భావనాపరమయిన సూక్ష్మాంశాలు మనసుమీదప్రభావాన్నిచూపుతాయి. అది కనిపెట్టిన మనపెద్దలు ఎక్కడపడితే అక్కడ తినొద్దుఅని చెప్పారు. దానిని నిరూపించిన యదార్ధ సంఘటన ఇది.

కర్ణాటకప్రాంతములో ఒకయోగి వుండేవాడు. ఆయన ఒక నదీతీరములో చిన్న కుటీరము నిర్మించుకుని, దానిలో తనజపధ్యానాదులను సాగించుకుంటూ ఒంటరిగా ,ఎక్కువగా మానవ సంబంధాలు పెంచుకోకుండా తనసాధన తానుచేసుకుంటూవుండేవాడు. అక్కడికిదగ్గరలోనే వున్న గ్రామస్తులకు ఆయనంటే గౌరవభావం పెరిగింది. ఎప్పుడన్నా కనపడితే నమస్కారం పెడితే ఆయన నవ్వి పొడిపొడిమాటలతో వారితో అంతవరకే పలకరింపువరకే పరిమితంచేసేవాడు. తనకు కావలసినవి నెలకొకసారి దగ్గరలోని పట్టణానికి పోయితెచ్చుకోవడం తనమానాన తానువుటుండటము ఎవరినీ ఏదీ యాచించకపోవడం గ్రామస్తులకు ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఆగ్రామములో ఒక గృహస్తు ,అచారవంతుడు సాధుసేవపట్ల ఆశక్తి కలిగినాయన ఒకరుండేవారు. ఆయనకు ఈ యోగిపట్ల చాలా గౌరవభావం. ఇటువంటి యోగికి బిక్షనివ్వటం గృ హస్తులకు పుణ్యప్రదం .ఆయనకు ఒకరోజన్నా బిక్షనివ్వాలన్న తలంపు మనసులో గాఢంగా కలిగింది. కానీ ఎవరితో పదినిమిషాలు మాట్లాడటానికికూడా ఇష్టపడని ఆయన తనకోరిక మన్నిస్తాడా? అన్న సందేహంతో చాలారోజులు వూరుకున్నాడు. కానీ ఒకరోజు సాహసించి ఆయన దగ్గరకెళ్ళి తన కోరికను వెళ్ళడించాడు. ఒక్కపూట తమయింట్లో భోజనముచేసి తన గృహాన్ని పావనం చేయమని అభ్యర్ధించాడు. ఆయన యేకళనున్నాడో గాని, ఈయన మాటకు అంగీకారాన్ని తెలిపి ఈరోజు మీయింట్ళో భోజనానికొస్తానని మాటిచ్చాడు.

ఆగృహస్తు ఆనందముతో ఇంటికి వెళ్ళి తనభార్యకీవిషయము చెప్పి ఏర్పా\ట్లుచూడమన్నాడు. అయితే ఆమె " అయ్యో ఎంతపనిచేసారు. ముందుగానాకుచెప్పవలసినది. ఈరోజే నాకు నెలసరి వచ్చినది. ఇప్పుడేలా చేయాలి అని నొచ్చుకున్నది. మరెలాచేయాలి అని భర్తబాధపడ్డాడు. రాకరాక ఈ అవకాశము వచ్చినది . ఇప్పుడు వద్దుఅని చెప్పటం భావ్యంకాదు. ఏమిచేయాలని భార్యాభర్తలిరివురూ మధనపడ్డారు. చివరకు భార్య ఒక సలహాచెప్పినది. మనవూరిలో వం|టలు చేసేఆవిడ వున్నదికదా! ఆవిడను పిలవండి నేను బయటవుండే అన్నీ చెప్పిచేపిస్తాను ,అని సలహా ఇచ్చినది. ఎలాగోలా ఈ కార్యం గట్టేక్కించాలని ఆయన వెళ్ళి ఆ వంటలకు వెళ్ళే ఆవిడను తీసుకువచ్చాడు . ఆవిడచేత భార్య సలహాలిస్తూ వంట పూర్తిచేపించగా, భర్త మధ్యాహ్నం వెళ్ళి ఆయోగిని పిలుచుకుని వచ్చి తానే స్వయముగా వడ్డించాడు. చివరలో ఒక చక్కని వెండిగిన్నెలో పాయసం ఇచ్చాడు. ఆయోగికూడా తృప్తిగా భోజనం చేసి. పాయసం తాగుతూ ఆగిన్నెను పరిశీలించాడు. చక్కని నగిషీలతో అది ఎంతో అందముగా వున్నది. ఇది పూజాపీఠమువద్ద చాలా వుపయోగకరముగా వుంటుంది. ఈ గృహస్తు కూడా ధనవంతుడు. ఈ చిన్న గిన్నెతీసుకున్నందువలన వీరికేమీ బాధవుండదు, ఇలా ఆలోచనలు మొదలయ్యాయి యోగిమనస్సులో. ఆయన ఎవరూగమనించకుండా దానిని తనవెంటతెచ్చుకున్న చిన్న చేసంచిలోకి నెట్టాడు. తరువాత గృహస్తుఇచ్చిన తాంబూలాది సత్కారాలను స్వీకరించి తన కుటీరానికి వెళ్ళి పోయాడు. ఇటు ఈయనకూడా ఒకమహాత్మునికి తనైంటభోజనం పెట్టగలిగాననే సంతోషంతో గిన్నెసంగతి గమనించలేదు.
ఇక వెళ్ళిన యోగి కి సాయంత్రం స్నానం చేసిన వద్దనుండీ మనసులో అపరాధభావన మొదలయినది.అయ్యో ఎంతపనిచేసాను. ఎప్పుడూ ఎవరి నుండి ఏదీ ఆసించని నాకు ఇలా దొంగతనం చేయాలనే బుద్ధి ఎలా పుట్టింది? అన్నం పెట్టి ఆదరించిన ఇంట్ళో దొంగలుకూడా చెయ్య ని పనిని నేనెలా చేసాను? నాజపం తపం ఎందుకు తగలెయ్యనా? అని పరిపరివిధాల బాధపడుతున్నాడు. ఆబాధ తీవ్రమయిన దు:ఖముగా మారి రాత్రంతా ఏడుస్తూ గడిపాడు. తెల్లవారుతుండగనే హృదయభారాన్ని ట్టూకోలేకత పరుగు పరుగున ఆ గ్రామము వె\ల్లి గృహస్తు కాళ్ళమీద పడి ఏడ్వసాగాడు. ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయిన ఇంటాయన తానేమి అపచారం చేసానోనని హడలిపోతూ. ఆయోగి కాళ్ళు పట్టుకుని తానూ ఏడ్వడము మొదలుపెట్టాడు. ఈ హడావుడికి అందరూ ప్రోగయ్యారు. ఏమిటంటే ఏమిటని వివరాలు ఆరాతీసారు. అప్పుడు ఆయోగి ఏడుస్తూనే తానెటువంటి నీచపుపనికి పాల్పడ్డాడో చెప్పాడు. అయ్యో దాని కేమిభాగ్యం అని ఇంటాయన ఓదార్చినా ఆయన దు:ఖము మానలేదు. అప్పూడు పెద్దలు అపరిగ్రహ నియమముతో వుండే యోగి దొంగతనానికి పాల్పడటాని కి మూలము ఏమిటా అని ఆలోచించి, అసలేమిజరిగినదీ చెప్పమన్నారు. అప్పుడు తనభార్య ఇంట్ళోకి రావటానికి వీలులేనందున వంటావిడ చేత వంటచేపించి తానువడ్డించిన విషయం అంతా వివరించాడు. అప్పుడు చెప్పారు శాస్త్రమెరిగిన పెద్దలు. ఆవంటావిడకు కాస్త చేతివాటం వుంది. అది వూర్లో అందరికీతెలుసు. తాను వంటకు వెళ్ళిన చోట ఏదోవొకటి నొక్కెయ్యడం ఆమె బుద్ధి. ఆబుద్ధితో వంటచేసిన కారణంగా అది ఆహారమును ఆశ్రయించుకుని తిన్న యోగిమనసును కూడా కలుషితం చేసినది అని వివరించి ఆయోగికి ప్రాయశ్చిత్త క్రియను సూచించి పంపివేశారు.
అందువలననే మన పెద్దలు ఎవరి దగ్గరపడితే వారివద్ద భుజించరాదు అని సూచించారు. అనాచారవంతులు, దుర్మార్గుల భోజనం స్వీకరిస్తే ఆభావాలు మనకు సంక్రమించేప్రమాదం ఉన్నది. తల్లి చేతిభోజనం బిడ్డకు బలాన్నిస్తుంది . కారణం, తనబిడ్డ కడుపునిండాతిని ఆరోగ్యంగావుండాలనుకునే తల్లి మనసులోని ప్రేమభావన ఆహారానికి ఆశక్తినిస్తుంది. దు;ఖముతో చేసేవంట తిన్న ఆఇంటివాళ్ళకు కూడా రుచి లేక తృప్తినీయకుండాఉంటుంది. తనపిల్లలూ ,తన భర్త చక్కగాతినాలనే భావనతో వంటచేస్తే పచ్చడిమెతుకులయినా పరమాద్భుతమయిన రుచినిస్తాయి. అలాకాక ఏ దిక్కుమాలిన టీవీ సీరియలో చూస్తూ ఆ హీరోయిన్ల బాధలు చూసి ఏడుస్తూనో, లేక పగప్రతీకారంవంటి పాత్రలస్వభావాలతో మమేకమవుతూ వంటచేస్తే అదితిన్న కుటుంబసభ్యులకు అనారోగ్యాలు కలగటం ఖాయం. కను క తల్లులందరూ తమ కు\తుంబానికి తాము వండిపెట్టాలని ప్రయత్నించాలి .హోటల్ కూడూ వంటవాల్ల తిండీ మీద అధారపడితే మనకు ఎంత ఖర్చుచేసి వండినా రుచీ పచీలేక, అనారోగ్యాలకు కారణమవుతాయి .

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP